చిన్న గూడూరు లో కానరాని పారిశుధ్య పనులు..
పంచాయితీ సెక్రటరీ తీరుపై పలు విమర్శలు..
ప్రజలతో వ్యవహారశైలి సరిగా లేదని సెక్రెటరీపై స్థానికుల ఆరోపణలు..
కలెక్టర్ ఆదేశాలను లెక్క చేయని మండల పంచాయితీ అధికారులు..
చిన్నగూడూరు, పెన్ పవర్స్థానిక మండల కేంద్రంలోనీ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాలను చెత్తరహిత గ్రామాలుగా మార్చాలని ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం చిన్న గూడూరు పంచాయతీ అధికారుల మరియూ పాలకవర్గం నిర్లక్ష్యంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. డంపింగ్ యార్డ్ ఉన్నా పంచాయితీ అధికారుల నిర్లక్ష్యంతో చెత్త తరలించి కృతిమ ఎరువు తయారీ లేదని గ్రామాల్లోని వీధులలో ఎక్కడపడితే అక్కడ చెత్త కనిపిస్తూ అపరిశుభ్ర వాతావరణం నెలకొంటుందనీ. డంపింగ్ యార్డ్ నిర్మాణం పూర్తయిన చెత్త తరలింపు లో నిర్లక్ష్యం వహిస్తూ పారిశుధ్యం పై దృష్టి సారించాల్సిన సర్పంచ్ మరియూ పాలకవర్గం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామంలోని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
దుర్వాసనతో ప్రజల ఇబ్బందులు..
డంపింగ్ యార్డులను ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించినా గాని సిబ్బంది గ్రామంలో సేకరించిన చెత్తను సరిగా డంపింగ్ యార్థుకు తరలించక పోవడంతో నామ మాత్రపు చెత్త సేకరణతో గ్రామంలోని వీధుల్లో చెత్త పేరుకుపోయి దుర్వాసనతో దుర్గంధం వెదజల్లుతూ చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. అని మండల కేంద్ర ప్రజలు వాపోతున్నారు. సేకరించిన చెత్తను తడి పొడి చెత్త విడిగా కంపోస్ట్ గా మార్చుకోవాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు కనిపించడం లేదు ఫలితంగా పరిసర ప్రాంత ప్రజలు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన డంపింగ్ యార్డ్ అలంకారప్రాయంగా మిగిలిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలోని రామాలయం వెనకాల రోడ్డు కనీసం నడవలేని పరిస్థితిలో పిచ్చి మొక్కలు ముళ్ల పొదలు పెరిగి అధ్వాన్నంగా ఉన్నయని ప్రజలు వాపోతున్నారు
నిరుపయోగంగా చెత్త రిక్షాలు..
గ్రామాల్లో చెత్తను తరలించేందుకు ఏర్పాటుచేసిన చెత్త రిక్షాలు నిరుపయోగంగా పాడై పోతున్నాయి గత ఏడాది పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి పంచాయతీ కి ట్రాక్టర్లను చెత్త తరలించేందుకు పంపిణీ చేసింది. ప్రభుత్వం అయినా గాని పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చెత్త తరలింపులో నిర్లక్ష్యం చేస్తున్నారనీ మండల కేంద్ర ప్రజలు వాపోతున్నారు అంతేకాకుండా వివిధ కాలనీల్లో చెత్తను పంచాయతీ సిబ్బంది తగలబెట్టడంతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇది ఇలా ఉండగా అకేరు ఒడ్డునే మన ఊరు మన నర్సరీ నిర్మాణం చేపట్టారు గత సంవత్సరం ఆకేరు వాగు ఉప్పొంగి నర్సరీ మొత్తం వరద నీటిలో కొట్టుకుపోయింది ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ చిన్న గూడూరు పర్యటనకు వచ్చినప్పుడు పలువురు గ్రామ ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్ళటంతో అక్కడ నుంచి నర్శరిని వెంటనే తరలించాలని ఎంపీడీవో గారికి పంచాయితీ అధికారులను ఆదేశించారు కానీ కలెక్టర్ ఆదేశాల ను సైతం లెక్క చేయకుండా అంతా ఇష్టారాజ్యంగా వ్యవహరించే తీరు పలువురిని ఇబ్బందులకు గురి చేస్తున్న సంగతి ప్రజలు బహాటంగే చర్చిచుకుంటున్నరు. కొంత మంది ప్రజలు సదరు పంచాయితీ సెక్రటరీ పై మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో కి పిర్యాదు చేసినప్పటికీ చర్యలు శూన్యమని గ్రామ పంచాయితీ కార్యాలయానికి వచ్చిన వారితో సదరు పంచాయితీ సెక్రటరీ తన నోటి దురుసు తనంతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి పారిశుధ్యం పై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు