Followers

నూతనంగా ఎన్నికైన మేయర్ గోలగాని హరి వెంకట కుమారికి పర్వీవ్ బాబీ సన్మానం

 నూతనంగా ఎన్నికైన మేయర్ గోలగాని హరి వెంకట కుమారికి పర్వీవ్ బాబీ సన్మానం

విశాఖ,పెన్ పవర్

విశాఖ ఇస్లామిక్ ఉమెన్స్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షురాలు పర్వీన్ బాబీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికై  ప్రమాణ స్వీకారం చేసిన మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ని   మర్యాదపూర్వకంగా ఆమె నివాసంలో కలిసి మెమొంటో ఇచ్చి సన్మానించడం జరిగింది.

నగర అభివృద్ధి సేవా సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా సిహెచ్ రాజు బాబు నియామకం

 నగర అభివృద్ధి సేవా సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా సిహెచ్ రాజు బాబు నియామకం

మహారాణి పేట, పెన్ పవర్

ఆంధ్ర ప్రదేశ్ నగర అభివృద్ధి సేవా సంఘం (ఎన్.ఏ.ఏస్.ఏస్) రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గా విశాఖపట్నం నుంచి సిహెచ్ రాజు బాబు ఎన్నికైనట్లు రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖలీఫాతుల్ల భాషా ప్రకటించి ఒంగోలులో నియామక పత్రం అందజేసినారు.ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి ఎంతో కీలకమైన బాధ్యతలు అప్పజెప్పి నందుకు సిహెచ్ రాజబాబు అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో అభివృద్ధే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మరియు ముఖ్యంగా విశాఖపట్నం నగర అభివృద్ధికి కృషి చేస్తానని ఒక ప్రకటన ద్వారా తెలియజేసినారు.

జర్రెల సర్పంచ్ లలిత గుండె పోటుతో మృతి

 జర్రెల సర్పంచ్ లలిత గుండె పోటుతో మృతి

సకాలంలో అంబులెన్స్ రాక ఆమె మృతి చెందిందని బంధువుల ఆరోపణ..

సర్పంచైన నెలరోజులకే లలిత మృతితో శోకసంద్రంలో జర్రెల గ్రామం..

ముంచంగిపుట్టు, పెన్ పవర్

ముంచంగిపుట్టు మండలంలోని జర్రెల  పంచాయతీకి చెందిన నూతన సర్పంచ్ వంతాల లలిత (37) గుండె పోటుతో మృతి చెందారు.గురువారం రాత్రి పది గంటల సమయంలో ఆకస్మికంగా  గుండె పోటు రావడంతో ఆమె మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల అందించిన వివరా లు ఇలా ఉన్నాయి...గురువారం రాత్రి 10గంటల సమయంలో వంతాల లలిత(37)కు ఆకస్మికంగా గుండె పోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు వెెెెెెె వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. అయితే సమాచారం ఇచ్చినప్పటికీ అంబులెన్స్ సకాలంలో రాలేదు. దీంతో గమనించిన కొంతమంది బంధువులు ఆగమేఘాలతో మండల కేంద్రానికి వెళ్లి ప్రైవేట్ ఆటో బుక్ చేసుకొని జర్రెల గ్రామానికి వెళ్లి సర్పంచ్ వంతాల లలితను హుటాహుటిన మండల కేంద్రంలో గల సిహెచ్ సి కు తరలించారు. అయితే అప్పటికి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.  అంబులెన్స్ అందుబాటులో లేకపోవడమే లలిత మృతికి కారణమని, సకాలంలో అంబులెన్స్ అందుబాటులో ఉంటే లలిత ప్రాణాలు కాపాడుకో గలవారని కుటుంబ సభ్యులు బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల 17న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సిపిఎం పార్టీ తరఫున పోటీ చేసి అఖండ విజయాన్ని సాధించింది. జర్రెల సర్పంచిగా పదవి చేపట్టి కనీసం ఏడాది కాకుండానే అనంతలోకాలకు వెళ్లడం ఆ పంచాయతీ ప్రజలు జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. సిపిఎం పార్టీ నుంచి ఎన్నో పోరాటాలు చేసి పంచాయతీ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడి రెండు పర్యాయాలు సిపిఎం పార్టి నుంచి సర్పంచ్ గా గెలిచిన ఘనత ఆమెకె సొంతం.  నూతన సర్పంచ్ అకాల మరణంతో జర్రెల గ్రామం శోకసంద్రంలో మునిగి పోయింది.

శ్రీ వివేకానంద సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద వృద్ధులకు.. ఉచితంగా కరోనా వ్యాక్సిన్

 శ్రీ వివేకానంద సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద వృద్ధులకు.. ఉచితంగా కరోనా వ్యాక్సిన్

మహారాణి పేట, పెన్ పవర్

విశాఖ, వన్టౌన్లో ఉన్న శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ 50 మంది నిరుపేద వయోవృద్ధులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయించింది.వీరితో పాటు వివేకానంద అనాధ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు కూడా ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయించింది.మరో 200 మంది నిరుపేద వయోవృద్ధులకు కరోనా వ్యాక్సిన్ ఉచితంగా వేయనున్నట్లు సంస్థ కార్యదర్శి వాసుపల్లి ఉమాదేవి మీడియా సమావేశంలో వెల్లడించారు.కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వృద్ధులందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు ఆమె తెలియజేశారు.

కరోనా వ్యాక్సిన్ పై ఎటువంటి అపోహలు వద్దని, ఎటువంటి వద్ధతులను నమ్మవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.పలువురు దాతల సహకారంతో ఈ సేవా కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ప్రముఖ సంఘసేవకులు జహీర్ అహ్మద్ ఆసుపత్రిలో వీరికి వ్యాక్సిన్ వేయించడం జరిగిందన్నారు.మనసున్న దాతలు మరికొంతమంది ముందుకు వస్తే..నిరుపేద వృద్ధులకు ఉచితంగా వ్యాక్సిన్ వేయించడం జరుగుతుందని దాతలు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.ఒక్కో వృద్ధుడికి రెండు దఫాలుగా వ్యాక్సిన్ వేయించడానికి కేవలం 500 రూపాయలు ఖర్చు అవుతుందని అందుకు దాతలు సహకరించాలని కోరారు.ఈ సమావేశంలో భవాని, నాగమణి, సుజాత, రాణి తదితరులు పాల్గొన్నారు.

నాన్ షేడ్యూల్డ్ ఏరియాలో గిరిజన గ్రామాలకు మోక్షం లేదా..

 నాన్ షేడ్యూల్డ్ ఏరియాలో గిరిజన గ్రామాలకు మోక్షం లేదా..

పెన్ పవర్ బ్యూరో,విశాఖపట్నం

నాన్ షేడ్యూల్డ్ ఏరియాలో గిరిజన గ్రామాల్లో గిరిజనుల సమస్యలుకు ప్రభుత్వ పూర్తిగా మోక్షం కలిగించాలని  ఆంధ్రప్రదేశ్ వ్వవసాకార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి,వెంకన్న డిమాండ్ చేసారు  అయిన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు జిల్లా లోని నాన్ షేడ్యూల్డ్ ఏరియాలో పోడు  పారేస్టు భూములకు పట్టాలు ఇవ్వకుండా గిరిజనులను ఆధికారులు ఆపీసులు చుట్టుతీప్పుతున్నారని తెలిపారు,మొదట  2020 ఆగస్టు తొమ్మిదో తేదీన  ఆదివాసుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఏజెన్సీ 11 మండలాలు తో పాటు నాన్ షేడ్యూల్డ్ఏరియా మండలాల్లో కూడా ఆదివాసులకు  అటవీ హక్కుల చట్టం ప్రకారం ఫారెస్ట్ భూములు సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు,

వీరితోపాటు నాన్ షెడ్యూల్ ఏరియా మండలాలు అయిన  దేవరాపల్లి చీడికాడ వి ,మాడుగుల రావికమతం రోలుగుంట గోలుగోండ నాతవరం కోటవురట్ల నర్సిపట్నం  మండలాల్లో వేలాది ఎకరాల్లో గిరిజనులు అటవీ ఫారెస్ట్ భూములు సాగు చేస్తున్నారని తెలిపారు విరికి అందరికీ సర్వే పూర్తి చేసిన పట్టాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని తెలిపారు దీని వలన ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు స్కీములు అందడం లేదన్నారు దీంతో అనేక గ్రామాలకు రోడ్లు సౌకర్యాలు లేక ఆనారోగ్యంతో బాధపడుతున్నవారికి డోలి మోతలు తప్పడం లేదన్నారు,ఇప్పటికి పూరీగుడిసెల్లో మగ్గిపోతున్నారని తెలిపారు,ఐదవషేడ్యూల్ చేరుస్తామి గ్రామసభలు పెట్టి నీరుగార్చారని అన్నారు దీని వలన 1/70 చట్టం వర్థించక పోవడం గిరిజన భూములుకు రక్షణ లేకుండా పోవడం ఉద్యోగాల్లోను ఉపాధి అవకాశాలుకు దూరమోతున్నారని అన్నారు వెంటనే నాన్ షేడ్యూల్డ్ గిరిజన గ్రామాల్లో సమస్యలుకు వెంటనే మోక్షం కలించాలని వెంకన్న డిమాండ్ చేసారు.

మాడుగుల మండల టిడిపి అధ్యక్ష పదవీ యువకులకే కేటాయించాలి

 మాడుగుల మండల టిడిపి అధ్యక్ష పదవీ యువకులకే కేటాయించాలి

పాత వారికి ఇస్తే రాజీనామాలకు సిద్ధం పార్టీ శ్రేణులు

వి.మాడుగుల, పెన్ పవర్

 తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన మాడుగుల మండలం పార్టీ అధ్యక్ష పదవి ఎంపికలో  సందిగ్ధత కొనసాగుతుంది. పార్టీ బలోపేతానికి సమర్థవంతమైన నాయకత్వాన్ని  తీసుకు రావాల్సి ఉంది. కానీ స్థానిక పార్టీలో  నెలకొన్న అనిశ్ఛితి కారణంగా అధ్యక్ష పదవి  ఎన్నిక ప్రశ్నార్థకంగా మారింది. మారుతున్న రాజకీయ పరిస్థితుల కారణంగా యువతకు అవకాశం ఇస్తే చతికిలపడిన పార్టీలో  ఉత్తేజం వస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. కానీ టిడిపి మండల అధ్యక్ష పదవికి  పాత పేర్లు  తెరపైకి రావడంతో యువకుల్లో అసహనం వ్యక్తం అవుతుంది. పార్టీ భవిష్యత్ దృశ్య కొత్తవారికి అవకాశం ఇస్తే ప్రయోజనం ఉంటుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. నియోజకవర్గంలోని కే కోటపాడు దేవరపల్లి చీడికాడ మండలాల్లో  టిడిపి అధ్యక్షుల ఎన్నికలు జరిగాయి. మాడుగుల మండలంలో టిడిపి  అధ్యక్ష పదవికి  గాది రాయి  మాజీ సర్పంచ్ అద్దెపల్లి జగ్గారావు  మాజీ ఎంపీపీ పుప్పాల అప్పలరాజు పేర్లు తెరపైకి వచ్చాయి. ఇద్దరు గతంలో మండల పార్టీ అధ్యక్షులుగా  చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో  వీరిరువురి పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవల పార్థసారథి ఆలయం వద్ద  టిడిపి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో  పార్టీకి చెందిన పలువురు యువకులు  మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అడ్డు తగిలారని  యువకులు ఆరోపిస్తున్నరు. ఎంతో కాలంగా పార్టీలో ఉన్నప్పటికీ  అవకాశం ఇవ్వకుండా  నాయకులు మోకాలడ్డు తున్నారని  మండలానికి చెందిన ఒక వ్యక్తి బాహటంగా ఆరోపించారు. 29 పంచాయతీల్లో సమర్థవంతమైన యువకుడిని ఎంపిక చేస్తే పార్టీలో నూతన ఉత్తేజం వస్తుందని అంటున్నారు. మాడుగుల పట్టణంలో  అధ్యక్ష పదవి ఇవ్వాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. రెండో వ్యక్తికి పార్టీ అధ్యక్ష పదవి అప్పగిస్తే పార్టీకి దూరం కావాలని  పలువురు భావిస్తున్నారు. 

ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో  మాడుగుల లో సర్పంచ్ గా టీడీపీ అభ్యర్థి  పోటీ చేయడానికి ఇష్టపడని ఆ వ్యక్తి కి పార్టీ సంక్షేమం పడుతుందా?  గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా  రామానాయుడు ఓటమికి ఈ వ్యక్తే కారణమని  పార్టీ వర్గాలు  ఆ వ్యక్తిని  దూరంగా ఉంచిన  విషయం తెలిసిందే. టీడీపీ నుంచి ప్రజారాజ్యం లోకి వెళ్లి మళ్లీ టీడీపీ లోకి వచ్చిన వ్యక్తి  పార్టీ శ్రేయస్సుకోసం ఏ మేర ఆలోచిస్తారని పార్టీ వర్గాలు సంకోచిస్తున్నాయి.ఈ విషయంలో నియోజకవర్గ ఇంచార్జ్ రామానాయుడు కూడా తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు  అన్నా సామెత  ఇక్కడ ప్రత్యక్షమైంది. నాడు తన ఓటమికి కారకుడైన వ్యక్తికి మండల పార్టీ పదవి అప్పగిస్తారా? అని చర్చ సాగుతోంది. ఇప్పటికే ఈవిషయం  జిల్లా అధిష్టానం దృష్టికి కొందరు తీసుకు వెళ్లినట్లు సమాచారం. నియోజకవర్గ ఇన్చార్జికి కూడా ఆ వ్యక్తికీ  పదవి ఇవ్వద్దని  సంకేతాలు వెళ్ళినట్లు తెలుస్తుంది. కొందరు నాయకుల కారణంగా అసమ్మతి తో పార్టీకి దూరంగా ఉన్న వ్యక్తులు  ఈ వ్యక్తి నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తప్పనిసరి  ఆ వ్యక్తికి అధ్యక్ష పదవి కేటాయిస్తే  తాము పార్టీ వీడుక తప్పదని  వారు స్పష్టం చేస్తున్నారు. మండలంలో నెలకొన్న పార్టీ పరిస్థితుల దృష్ట్యా   జిల్లా నాయకత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని  టిడిపి యువత కోరుతున్నారు.

ప్రతి ఇంటా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయండి

 ప్రతి ఇంటా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయండి 

నీటిని పొదుపు చేసి సంరక్షించండి...రూపాకుల రవికుమార్ 

మహారాణి పేట, పెన్ పవర్

శ్రీ గాయత్రీ వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ ఆధ్వర్యంలో మహారాణిపేట ప్రకృతి చికిత్సాలయం   ఆవరణలో  కొత్తగా నిర్మించిన  3వ ఇంకుడు గుంతను ప్రారంభించారు.ఈ సందర్భంగా రవి కుమార్ మాట్లాడుతూ రానున్న రోజులలో నీటిని పొదుపు చేయటమే లక్ష్యంగా మహిళలు ముందుకు సాగాలని నీటి కోసం పక్క రాష్ట్రముల వారితో విభేదాలు రాకుండా ,నీటి యుద్ధాలు జరగకుండా నీటిని పొదుపు చేసుకోవాలని అన్నారు.ఇంకుడు గుంతల లోకి  నిత్యము వాడుకునే నీరు మరియు వానల ద్వారా వచ్చిన నీరు చేరే లాగా నిర్మించాలని  అన్నారు.  

ఆరు అడుగుల లోతు లో సుమారు మూడడుగుల  వెడల్పుతో  ,ఇంకుడు గుంతను తవ్వించి ,40ఎమ్.ఎమ్.మెటల్, 20ఎమ్.ఎమ్.మెటల్ , ఇసుక మరియు 10ఎమ్.ఎమ్ మెటల్ తోటి ఇంకుడు గుంతను మూడు వంతుల వరకు నింపాలని అన్నారు.సుమారు  ఒక్కొక్క ఇంకుడు గుంత కు 12  వేల నుంచి 15 వేల వరకు ఖర్చు అవుతుందని అన్నారు.దుబారా నీటి వాడకం తగ్గించాలని ,బహుళ అంతస్తుల్లో కనీసం ఆరు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని అన్నారు.నీటి ఎద్దడి నుంచి ఆనాడే మనకు రక్షణ కలుగుతుందని సూచించారు.

ముఖ్యముగా విశాఖ నగరంలో ఎండాకాలంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంటుందని ఈ సమస్యకు పరిష్కారము  ప్రతి ఇంటా ఇంకుడు గుంతల ఏర్పాటు చేయాలని  అన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ శ్రీలక్ష్మి ,ఎస్ మహేష్ ,ఎస్ చాతుర్య ,గేదెల శ్రీహరి,హిమబిందు, డాక్టర్ వైలక్ష్మణరావు,శంకర్రావు,మాధవి మొదలగువారు పాల్గొన్నారు .

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...