Followers

ఓయూ జాగ్రఫీ హెడ్ ను అభినందించిన విద్యార్థులు

 ఓయూ జాగ్రఫీ హెడ్ ను అభినందించిన విద్యార్థులు 

తార్నాక, పెన్ పవర్ 

ఉస్మానియా యూనివర్సిటీ జాగ్రఫీ డిపార్ట్మెంట్ హెడ్ గా నూతన బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ డాక్టర్  నగేష్  మర్యాద పూర్వకంగా పలువురు విద్యార్థి సంఘం నాయకులు ,పరిశోధన విద్యార్థులు కలసి అభినందనించారు.   ఈ కార్యక్రమంలో  మందల భాస్కర్, తెరాస  యూవజన సంఘ నాయకులు వల్లమల్ల కృష్ణా, ఉల్వల కాశప్ప, డా,సదానందం,అంబేద్కర్, డా,సుదర్శన్,రమేష్ శ్రీకాంత్ జంగయ్య, వెంకట్, అశోక్, రాజు, విద్యార్ధి సంఘ నాయకులు, జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అపదలో అదుకున్న ఎంఎస్ఎస్ఓ చైర్మన్ మైనంపల్లి రోహిత్ బాబు

 అపదలో అదుకున్న ఎంఎస్ఎస్ఓ చైర్మన్ మైనంపల్లి రోహిత్ బాబు

గుండెపోటుతో చనిపోయిన కుటుంబ సభ్యులకు ఆర్దిక సహాయం

నిరుపేద ప్రజలకు అండగా రోహిత్ బాబు



పెన్ పవర్,  మల్కాజిగిరి 

గౌతంనగర్ డివిజన్ లోని ఐఎన్ నగర్ లో నివాసిస్తున్న విజయ్ భాస్కర్ 27సంవత్సరాలు గుండెపోటుతో చనిపోవడంతో ఆకుటుంబ సభ్యులకు ఆర్దిక పరిస్ధితులతో ఇబ్బందులు ఎదురుకుంటున్నా విషయం పై స్ధానిక కార్పొరేటర్ సునీత రాముయాదవ్ ఎంఎస్ఎస్ఓ చైర్మన్ మైనంపల్లి రోహిత్ దృష్టికి తీసుకెళ్లారు. విజయ్ భాస్కర్ కుటుంబాని అదుకొవలని కొరడంతో వెంటేనే స్పందించారు. గౌతంనగర్ వెళ్లి మైనంపల్లి రోహిత్ బాబు చేతుల మీదుగా విజయ్ భాస్కర్ కుటుంబ సభ్యులకు 50,000రూ వేలు  ఆర్థిక సాయం అందజేశారు. ఇక ముందు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని అన్ని విధాలుగా ఆదుకుంటామని మైనంపల్లి రోహిత్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సునీత రాముయదవ్, నాయకులు రాముయదవ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

నేరాల నియంత్రణలో సిసి కెమెరాలు కీలకం

 నేరాల నియంత్రణలో సిసి కెమెరాలు కీలకం: డిసిపి వెంకటేశ్వర్లు

కూకట్ పల్లి, పెన్ పవర్

కూకట్ పల్లి నియోజకవర్గం బాలాజీనగర్ డివిజన్ లోని ఆంజనేయనగర్ లో తొమ్మిది లక్షల ఇరవై వేల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన అరవైనాలుగు సీసీ కెమెరాలను శనివారం డిసిపి వెంకటేశ్వర్లు, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. ఈసందర్భంగా డీసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాలనీలోని భద్రత కోసం కాలనీ వాసులు అందరూ కలిపి సీసీ కెమెరాలు పెట్టుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయమని, అదేవిధంగా పోలీసు సిబ్బందికి కూడా నేరల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహధపడతాయని అన్నారు. కిడ్నప్ కేసులు, దొంగతనాల కేసుల విచారణలో సిసి కెమెరాలు ప్రముఖ పాత్రను పోషిస్తాయని, అలాగే కాలనిలో ఎవరైన అనుమానాస్పదంగా కనిపించిన సరే సిసి కెమెరాల సహాయంతో అలాంటి వారిని ముందుగానే గుర్తించి నేరాలు జరగకుండా అడ్డుకట్ట వేయొచ్చని అన్నారు. ఈకార్యక్రమంలో కూకట్ పల్లి ఏసీపి సురేందర్ రావు, కూకట్ పల్లి సిఐ నర్సింగ్ రావు, సెక్టర్ ఎస్.ఐ బాను ప్రసాద్, డివిజన్ కార్పొరేటర్ శిరీష బాబురావు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

గో మహా గర్జనలో అన్నదాన సేవలు

 గో మహా గర్జనలో అన్నదాన సేవలు 

అన్నదాన సేవలను గుర్తించి వారిని సత్కరించిన 

శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి

పెన్ పవర్, మల్కాజిగిరి 

యుగతులసి ఫౌండేషన్ చైర్మన్ మరియు టీటీడీ బోర్డు మెంబర్ శివకుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన  గో మహా గర్జనలో ముఖ్య  అతిథిగా పాల్గొన్న శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి.  ఈ కార్యక్రమంలో యుగతులసి ఫౌండేషన్ ద్వారా నందనంపాటి విరాంజనేయులు, రామాంజనేయులు, (రాము) ఆధ్వర్యంలో డా.ఏ.ఎస్.రావు నగర్ పద్మశాలి భవన్ లో గో మహా గర్జనలో అన్నదాన సేవ కార్యక్రమం ఏర్పాటు భాగంగ, వంటలు చేసి ఎన్టీఆర్ స్టేడియంకు తీసుకెళ్ళి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. యుగతులసి పౌండేషన్ నందనంపాటి విరాంజనేయులు, రామాంజనేయులు చేస్తున్నా అన్నదాన సేవా కార్యక్రమాలను గుర్తించిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి నందనంపాటి రాము మరియు కుషాయిగూడ లైన్స్ హాస్పిటల్ చైర్మన్ మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు  జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీ కుషాయిగూడ (హెచ్.పీ ) వరప్రసాద్, శ్రీను, మరియు శంకర్ బాబు, సోలిస్ హాస్పిటల్ ఇంచార్జి విజేందర్ రెడ్డి, డాక్టర్. కోటేశ్వరరావు, సుబ్బారావు, రాజగోపాల నాయుడు మరియు  సోలీస్ కంటి ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగులకు ఉద్యోగ నియామకాలు చేపట్టాలి.

 నిరుద్యోగులకు ఉద్యోగ నియామకాలు చేపట్టాలి.. 

దళితులకు మూడేకరాల భూమి పంపిణీ చేయాలి.. 

నిదులు నియామకాలకు ఆశపడ్డ దళిత నిరుద్యోగులు దినసరి కూలీలుగా అవతారం.. 

కుటుంబాలను పోషించుకోవడానికి వేరేమార్గం లేక కూలీలుగా మారిన నిరుద్యోగులు.. 

డిహెచ్ పిఎస్ రాష్ట్ర కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం.. 

సత్తుపల్లి, పెన్ పవర్ 

తెలంగాణలో నియంత పరిపాలన కొనసాగుతుందని, కేసీఆర్ ప్రభుత్వం మాటల గారడితో నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల పునాదులపై అధికార అహంకారంతో ఏడున్నర సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ప్రజలకు దళితులకు ఇచ్చిన వాగ్దానాలు ఏమయాయని, తెలంగాణ రాష్ట్ర దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్ పిఎస్ రాష్ట్ర కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. శనివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఏప్రిల్ 7వ తేదీన జరిగే డిహెచ్ పిఎస్ ఖమ్మం జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహణపై శనివారం సత్తుపల్లి గాంధీ నగర్ లో డిహెచ్ పిఎస్ ముఖ్యుల సమావేశం జరిగింది.. ఈ సందర్భంగా మందా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే మొదటి ముఖ్యమంత్రిగా దళితున్ని చేస్తానని మోసం చేసిన కేసిఆర్,, దళితులకు మూడెకరాల వ్యవసాయ భూమి పంపిణీ చెస్తామని చెప్పి మొక్కు బడిగా కొందరికి మాత్రమే భూపంపిణీ చేసి చేతులు దులుపుకున్నారని తీవ్రంగా విమర్శించారు.. ఇవాళ తెలంగాణలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులుగా మారిన పరిస్థితి ఏర్పడిందని, అందులో ఎక్కువ శాతం మంది దళితులు ఉన్నారు. కేజీ టూ పీజి ఉచి విద్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని చెప్పిన వాగ్ధానం ఊసే లేదని యద్దేవా చేశారు. రాష్ట్రం వస్తే మన నిధులు, నియామకాలు వస్తాయని ఆశపడ్డ దళిత నిరుద్యోగ బిడ్డలు రోడ్ల వెంట దినసరి కూలిఅవతారం మేత్తి కుటుంబాలను పోషించుకుంటున్నారని,మందా ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు లేవు, దళితులకు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోక అరిగోస పడుతున్నా కేసీఆర్ ప్రభుత్వం విస్మరించడం సరైంది కాదని వెంటనే కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో తలేత్తిన నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, పూర్తి స్థాయిలో దళితులకు మూడెకరాల వ్యవసాయ భూపంపిణీ చెపట్టాలని, దళిత సంక్షేమానికి నిధులు కేటాయించి ప్రతి దళిత కుటుంబానికి ఎటువంటి ఆంక్షలు లేకుండా జీవనోపాధికి రుణ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. దళితులకు ఇచ్చిన హామీలు అమలుకై రానున్న రోజుల్లో దశలవారి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.  ఈ సమావేశంలో డిహెచ్ పిఎస్ డివిజన్ కార్యదర్శి తడికమల్ల యోబు, నాయకులు గరికపాటి కిరణ్ కుమార్, కిన్నెర నాగలక్ష్మి, కొత్తపల్లి కుమార్, అరుణ, బాలు,జీవన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల కోడ్ ఉల్లంఘన

ఎన్నికల కోడ్ ఉల్లంఘన

సంతబొమ్మాళి,పెన్ పవర్

మళ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది.ఎవరి హడావుడి వాళ్లదే కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని తెలిసిన పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. వివరాల్లోకి వెళితే జెడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో, ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ మండల కేంద్రం సంతబొమ్మాళి లో అధికారులు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. సచివాలయాల బోర్డులపై, 108 వాహనం, రేషన్ పంపిణీ వాహనంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉన్నప్పటికీ వాటిని మూయలేదు. వీటిని అధికారులు చూస్తున్నా పట్టించుకోవడంలేదని విమర్శలు ఉన్నాయి. వడ్డితాండ్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఫోటోతో కూడిన బోర్డు దర్శనమిస్తుంది. 

అలాగే అనేక గ్రామాలలో వైయస్సార్ ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు సంబంధించిన వివరాలతో కూడిన పోస్టర్లు వెలిశాయి. సంతబొమ్మాళి బస్టాండ్ లో టిడిపి అచ్చెన్నాయుడు ఫోటోలతో కూడిన పోస్టర్లు వెలిశాయి. వీటిని కూడా అధికారులు చూస్తున్న తొలగించే ప్రయత్నం చేయలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎన్నికల  కోడ్ ఉల్లంఘించే పోస్టర్లను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. వీటిపై మండల ప్రత్యేకాధికారి జెడి శ్రీనివాస్ ను  వివరణ కోరగా తక్షణమే తొలగించేలా సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. ఎవరైనా ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

38వ వార్డు లో బోదిలపాటి ఉమామహేశ్వర రావు చేతుల మీదుగా దోమతెరలు పంపిణీ

38వ వార్డు లో బోదిలపాటి ఉమామహేశ్వర రావు చేతుల మీదుగా దోమతెరలు పంపిణీ

మహారాణి పేట, పెన్ పవర్

కరోనానివారణకు మాస్కులు ధరించిన విధంగా జ్వరాల నివారణకు దోమతెరలు వాడాలని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 38వ వార్డు వై.ఎస్.ఆర్.పార్టీ నాయకులు మాజీ కార్పొరేటర్  బోదిలపాటి ఉమామహేశ్వర రావు వారి సతీమణి సత్య రూపవాణి, వార్డు అధ్యక్షులు ఎస్.సన్యాసి రావు కలసి ప్రజలకు దోమతెరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న కాలం ఒకవైపు కరోనాతో పాటు మరోవైపు అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, దీనీ నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టిందన్నారు.డెంగీ,మలేరియా లాంటి వ్యాధులు ప్రబలకుండా దోమతెరలు ఎంతగానో దోహదపడుతుందన్నారు ఈ దోమ తెరలను ప్రత్యేకమైన రసాయనాలతో తయారు చేశారని, దోమలు వీటిపై వాలిన వెంటనే చనిపోతాయిని తెలిపారు.రెండో దశ కరోనా ప్రభావం అధికమవుతుందని, కనుక ప్రజలందరూ భౌతిక దూరం  పాటిస్తూ,మాస్కులు,శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలని బోదిలపాటి ఉమామహేశ్వర రావు ప్రజలకు సూచించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆర్ పి కోట కాత్యాయని సీనియర్ నాయకులు పోలవరపు సత్యనారాయణ మరియు వెంకటగిరి నాగరాజు,కోట రమేష్, పెదగాడి బాబ్జి,పాటోజు ప్రసాదు గా,పిల్లా అప్పారావు, చినబాబు, పాటోజు నాని,సిటీ మోటర్ వెంకటేశ్వరరావు,శ్యామల,గోర్స నానాజీ,బిళ్ళకుర్తి రాము,అయ్యప్ప శర్మ,కోసూరు సురేష్, కోసూరు శ్రీను,పాటోజు అర్జున్ ప్రసాద్,గోర్స గణేష్,వార్డు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...