Followers

మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలి

 మహిళలు అన్ని రంగాల్లో ముందు  ఉండాలి.....

మండల విద్యాధికారి రవీందర్

లక్షెట్టిపెట్, పెన్ పవర్

మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలి అని ఎంఈఓ రవీందర్ అన్నారు. శనివారం పట్టణంలో న్యూ లైఫ్ ప్రేయర్ సొసైటి ఆధ్వర్యంలో ఇండియా బైబిల్ లిట్రేచర్ సహకారంతో నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా ఎంఈఓ రవీందర్ పాల్గొని మాట్లాడుతూ న్యూలైఫ్ సొసైటీ చేస్తున్న సేవ కార్యక్రమలను అభినందించారు.నిరుపేద మహిళలకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన చాలా గొప్పదన్నారు.రానున్న రోజుల్లో మరిన్ని సేవ కార్యక్రమలు అందిచి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. అనంతరం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు బొడ్డు రవిజోషాప్, సభ్యులు తగారపు సత్తయ్య, సంజీవ్, గంధం సత్యనారాయణ, పుష్ప, స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు.

విద్యాసంస్థలను పునఃప్రారంభిచాలి

 విద్యాసంస్థలను పునఃప్రారంభిచాలి

--విద్యార్థి జన సమితి


మందమర్రి,  పెన్ పవర్ 

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పేరుతో అన్ని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోని, అన్ని విద్యాసంస్థలను పునఃప్రారంభిచాలని విద్యార్థి జన సమితి జిల్లా కో కన్వీనర్ బచ్చలి ప్రవీణ్ డిమాండ్ చేశారు. శనివారం మందమర్రి పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు విద్యాసంస్థలు ప్రారంభించి, ఎన్నికలు ముగిసిన తర్వాత కరోనా ను సాకుగా చూపి రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేసిందని  ఆరోపించారు. రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు, సమావేశాలు,మద్యం షాపులు, షాపింగ్ కాంప్లెక్స్ లు, దేవాలయాల పై ప్రభావం చూపని కరోనా పాఠశాలలపై చూపెడుతుందా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శ్రీ చైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్ విద్యాసంస్థలు పూర్తిస్థాయిలో ఫీజులు వసూలు చేసి ఉపాధ్యాయులను పట్టించుకోవడంలేదని, రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రత్యేక భృతి కల్పించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థల ద్వారా ఆదాయం రావడం లేదని మూసివేశారని, విద్యాసంస్థలను ఆర్థిక వనరుల కాకుండా విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని విద్యాసంస్థలను పునః ప్రారంభించాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విజేఎస్ ఆద్వర్యంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏ శివ కుమార్, రవిచరణ్, కే సమ్మయ్య, తేజ, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు చదరంగం క్రీడ పై అభిరుచి కలిగేలా చూడాలి

 విద్యార్థులకు చదరంగం క్రీడ పై అభిరుచి కలిగేలా చూడాలి


మందమర్రి,  పెన్ పవర్

కరోనా నేపథ్యంలో మైదానంలో ఆడే ఆటల కన్నా ఇంట్లో ఉండి ఆడుకొన్ని, మేధస్సును పెంపొందించే చదరంగం క్రీడ పై పిల్లలకు అభిరుచి కలిగేలా చూడాలని తెలంగాణ రాష్ట్ర చెస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సిరాజ్ ఉర్ రెహమాన్ పేర్కొన్నారు. శనివారం మందమర్రి ప్రెస్ క్లబ్ లో, మంచిర్యాల జిల్లా చెస్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక టిఆర్ఎస్ నాయకులు, ప్రెస్ క్లబ్ సభ్యులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా చదరంగం ఆటకు మంచి గుర్తింపు ఉందని, చెస్ క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించవచ్చునని ఆయన తెలిపారు. చెస్ క్రీడకు రాష్ట్రప్రభుత్వం ఎంతో గుర్తింపు ఇస్తుందని క్రీడాకారులకు సరైన శిక్షణ, వసతులు కల్పించడంతోపాటు క్రీడల్లో రాణించిన వారికి ఉపాధి అవకాశం కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. కారోనా నేపథ్యంలో ఇంటిల్లపాదీ సురక్షితంగా ఇంట్లో కూర్చొని చదరంగం ఆడవచ్చునని, విద్యార్థులకు చదరంగం ఆట పై మక్కువ కలిగేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. చెస్ క్రీడాకారులకు మంచిర్యాల జిల్లా చెస్ అసోసియేషన్, తెలంగాణ రాష్ట్ర చెస్ అసోసియేషన్ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు ఈగ కనకయ్య, మండల మాజీ ఉపాధ్యక్షులు వజీర్ సుల్తాన్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు ఎస్ రాజారెడ్డి లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ కరస్పాండెంట్ దామెరా సిద్దయ్య, అసోసియేషన్ జిల్లా కోశాధికారి ఈ సమ్మిరెడ్డి, స్థానిక టిఆర్ఎస్ నాయకులు జే రవీందర్, బట్టు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

టిప్పర్ బీభత్సం.. కార్మికుడు దుర్మరణం

టిప్పర్ బీభత్సం.. కార్మికుడు దుర్మరణం...


పెన్ పవర్, మేడ్చల్

మేడ్చల్ పట్టణంలో శనివారం ఉదయం ఒక టిప్పర్ బీభత్సం సృష్టించింది. పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్న సమయంలో పట్టణంలోని ఎస్ఆర్ వైన్స్ ముందు డివైడర్ ని ఢీ కొట్టి అవతలి వైపుకు దూసుకొచ్చింది. ఒక్కసారిగా టిప్పర్ దూసుకురావడంతో అక్కడున్నవారికి తప్పించుకునే అవకాశమే లేకుండా పోయింది. ఈ ఘటనలో పారిశుద్ధ్య కార్మికుడు పూడూరు గ్రామానికి చెందిన దశరథ(48) అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అక్కడే వీధులను నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలు కిష్టాపూర్ కు చెందిన డబిల్ పురం లక్ష్మీ(46) కి తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్

 సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్



పెన్ పవర్, బయ్యారం

 మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు జరిగిన మండల ప్రజా పరిషత్ సాధారణ సర్వ సభ్య సమావేశం లో పాల్గొన్న కుమారి అంగోత్ బిందు, గౌరవ చైర్ పర్సన్, జిల్లా ప్రజా పరిషత్, మహబూబాబాద సమావేశంలో భాగంగా మండలంలోని శాఖల వారీగా సమీక్ష నిర్వహించినారు. గౌరవ చైర్ పర్సన్ కోరిక మేరకు జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీ సూర్యనారాయణ  మండలంలో పామయిల్ తోటలు పెంచడానికి గల అవకాశాలు, ఆర్ధిక లాభాలు పై సభ్యులకు అవగాహన కల్పించారు. మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీ రామ్  ప్రస్తుత కరోనా సమయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు,40 సంవత్సరముల పైబడిన ప్రతి ఒక్కరికి వాక్సినేషన్ చేయించుకోవలసిన అవశ్యకత పై అవగాహన కల్పించారు,  చైర్ పర్సన్,   మాట్లాడుతూ  అధికారులు ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు జవాబుదారీగా ఉండాలని ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరేలా చూడడంతో పాటు వాటి ఫలితాలను ఎప్పటికప్పుడు  ప్రజా ప్రతినిధులకు తెలియజేయాలని, తధ్వారా ప్రజలకు మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వీలవుతుందని ప్రజలకు ప్రజా ప్రతినిధులకు మధ్య  వారధిలా పనిచేయాలని అలాగే బయ్యారం మండల అభివృద్ధికి ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకువస్తే తన పరిధిలో పరిష్కారానికి కృషి చేస్తానని అలాగే జిల్లా మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్  సహాయ సహకారాలు, అందదండలతో సమస్యలు పరీష్కరించుకుందామని అంతేగాని సమస్యలు తెలియజేయకుండా మరియు సమస్యలు పరిష్కారం చేయకుండా ఇంకోక్కసారి ఏ మండల అధికారి కూడా సమావేశాలకు రావొద్దని దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిపారు. అలాంటి వారిని ఉపేక్షించబోమని వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని అధికారులను హెచ్చరించారు ఈ కార్యక్రమం లో ఎంపీపీ కుమారి చేపూరి మౌనిక, వైస్ ఎంపీపీ తాత గణేష్, సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, ఎంపీడీఓ చలపతి రావు, తహసీల్దార్, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, మండల స్థాయి అధికారులు  పాల్గొన్నారు.

చిన్నారులను హింసించిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలి

చిన్నారులను హింసించిన  మానవ మృగాలను కఠినంగా శిక్షించాలి

గౌడ సంక్షేమ సంఘం మహబూబాద్ జిల్లా కన్వీనర్ బూరుగు శ్రీకాంత్ గౌడ్

తొర్రూర్, పెన్ పవర్

తెలిసి తెలియక మామిడి కాయలను తెంపిన, చిన్నారులను హింసించిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని, గౌడ సంక్షేమ సంఘం మహబూబాద్ జిల్లా కన్వీనర్ బూరుగు శ్రీకాంత్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భముగా శనివారం మహుబూబాబాద్ జిల్లా తొర్రూర్ డివిజన్ కేంద్రంలో ముఖ్య నాయకుల సమావేశములో ఆయన  మాట్లాడుతూతెలిసీ తెలియక చేసిన చిన్నపాటి పొరపాటుకు చిన్నారులకు పెద్ద శిక్ష విధించడం సరైందికాదన్నారు. ఉద్దేశ పూర్వకం గానే మామిడి తోట కాపలాదారులు చిన్నారులపై దాడులకు తెగబడ్డారన్నారు. నేర స్వభావం కలిగి ఉండటం వల్లే చేతులు విరిచి, నోట్లో పశువుల పేడ కుక్కి, పాశవికంగా హింసించారన్నారు. అమాయక పిల్లలు దెబ్బలకు తాళలేక వదిలేయమని, కాళ్ళమీద పడి వేడుకున్నా వదలకుండా కర్రలతో బాదారన్నారు. దాడికి పాల్పడిన బానోతు యాకూబ్, బానోతు రాములు తోపాటు దాడికి ఉసిగొల్పిన మరో ఇద్దరిని సైతం అరెస్టు చేయాలన్నారు.చిన్నారుల పై దాడి పై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, నిందితులందరికీ కఠిన శిక్ష పడేలా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు మరల పునరావృతం కాకుండా, చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు పోలీసు అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు గట్టు రాజు కుమార్ గౌడ్,వడ్లకొండ కర్ణాకర్ గౌడ్, లింగాల మురళి కృష్ణ గౌడ్, బూరుగు వీరభద్రయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 

ఓయూ జాగ్రఫీ హెడ్ ను అభినందించిన విద్యార్థులు

 ఓయూ జాగ్రఫీ హెడ్ ను అభినందించిన విద్యార్థులు 

తార్నాక, పెన్ పవర్ 

ఉస్మానియా యూనివర్సిటీ జాగ్రఫీ డిపార్ట్మెంట్ హెడ్ గా నూతన బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ డాక్టర్  నగేష్  మర్యాద పూర్వకంగా పలువురు విద్యార్థి సంఘం నాయకులు ,పరిశోధన విద్యార్థులు కలసి అభినందనించారు.   ఈ కార్యక్రమంలో  మందల భాస్కర్, తెరాస  యూవజన సంఘ నాయకులు వల్లమల్ల కృష్ణా, ఉల్వల కాశప్ప, డా,సదానందం,అంబేద్కర్, డా,సుదర్శన్,రమేష్ శ్రీకాంత్ జంగయ్య, వెంకట్, అశోక్, రాజు, విద్యార్ధి సంఘ నాయకులు, జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...