Followers

కరోనా పట్ల అందరూ జాగ్రత్తలు పాటించాలి

 కరోనా పట్ల అందరూ జాగ్రత్తలు పాటించాలి

వైద్య అధికారి  డాక్టర్ రవి

చిన్నగూడూరు,  పెన్ పవర్

చిన్నగూడూరు మండల కేంద్రంలోని శనివారం నాడు ఉగ్గంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ రోజున కరోనా వ్యాక్సిన్ వేయడం జరిగింది అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ... ప్రతిరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కరోనా వ్యాక్సిన్ వేస్తారని తెలిపారు. ఆదివారం మరియు సెలవు దినాలలో కూడా కరోనా టీకా వేస్తారని అన్నారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా టీకా అందరూ వేసుకోవాలిఅన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్తులు అయినా వారు తప్పనిసరిగా వాక్సిన్  తీసుకోవాలని కోరారు. అందరూ భౌతిక దూరం శానిటైజర్ మాస్కులు రోగ నిరోధక శక్తిని పించే ఆహార పదార్థాలు తీసుకోవాలి అన్నారు . ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ జయశ్రీ, స్టాప్ నర్స్ నసీమ, ఏఎన్ఎం నర్సు బాయి, హెల్త్ అసిస్టెంట్ వీరయ్య, ఆశజ్యోతి పాల్గొన్నారు.

.

కరోనా వ్యాక్సిన్ పై ఇంటింటికి అవగాహన ప్రచార కార్యక్రమము

 కరోనా వ్యాక్సిన్ పై  ఇంటింటికి అవగాహన ప్రచార కార్యక్రమము 

మహారాణి పేట, పెన్ పవర్

భారతీయ జనతా  పార్టీ వైద్య విభాగం ఆధ్వర్యంలో 29వ వార్డు మహారాణి పేట లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ వైద్య విభాగం కన్వీనర్ రూపాకుల రవికుమార్ ఇంటింటికి వెళ్లి కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు వేసు కొనాలని  మహిళలకు,వృద్ధులకు తెలియజేశారు.ప్రధాని మోడీ ఆదేశానుసారం భారతావనిలో నేటి వరకు రెండు కోట్ల మందికి పైగా ఈ టీకాను వేయించుకున్నారు అని అన్నారు.ఈ టీకాను అతి తక్కువ సమయంలో  కనుగొన శాస్త్రవేత్తలను ప్రధాని మోడీ అభినందించారు.ప్రధాని ఢిల్లీలోని ఏ.ఐ.ఎమ్.ఏస్.లో టీకా వేసుకొని,ప్రజలకు మార్గ దర్శకం చేశారని,భారతావనిని కరోనా రహిత దేశముగా తీర్చిదిద్దాలని ప్రధాని కోరారు.


భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా,కార్యకర్తలు, సేవ హి సంఘటస ,ఇదే మన నిరంతర నినాదం అని అన్నారని,ఆరోగ్య సమస్యలు ఉన్నవారు,లేనివారు, 45సంవత్సరములు పైబడిన వారు వ్యాక్సిన్ తీసుకునేలాగా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలను చైతన్య పరచాలని నడ్డా  కోరారు.భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు పల్లా చలపతిరావు మాట్లాడుతూ  వృద్ధులను ,మహిళలను వ్యాక్సిన్ వేసుకొనుట కు  తీసుకు వెళ్లడానికి వాహనములను రెడీ చేశామని కార్యకర్తలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ఎస్.సి మోర్చా నాయకుడు  చొక్కాకుల.రాంబాబు,సిహెచ్ రాజబాబు, వెంకటఅప్పారావు,గేదెల శ్రీహరి,శ్రీను,పల్లా నారాయణ రావు, ఏస్.సి.లీడర్ లీలా ప్రసాద్, పల్లా.లక్ష్మి తదితరులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని దండు బజార్ ,రామ జోగిపేట,అంగటి దిబ్బ,మొదలగు ప్రాంతములు ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ యొక్క ఆవశ్యకతను గురించి ప్రచారం చేశారు.

చరిత్ర మరువని మహనీయుడు శివాజీ మహరాజ్

 చరిత్ర మరువని మహనీయుడు శివాజీ మహరాజ్

కూకట్ పల్లి, పెన్ పవర్

మహానుభావుల జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో కె.పి.హెచ్.బి కాలని మూడో ఫేస్ కట్టా వారి సేవా కేంద్రం వద్ద హిందూ సామ్రాజ్య వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 341వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ పోలీస్ అధికారి నారే గూడెం బుచ్చిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి చత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భముగా బుచ్చిరెడ్డి  మాట్లాడుతూ పదహారు సంవత్సరాల వయసులో కత్తి పట్టి యుద్ధం చేసిన మహావీరుడు చత్రపతి శివాజీ అని, యుద్ధములో శత్రువుల ఎత్తులకు పైఎత్తులు వేయగల ధీరుడు అని, తన రాజ్యములో ప్రజలకు కష్టాలు రాకుండా చూసేవారని కొనియాడారు. అలాగే సతీసహగమనాన్ని కూకటివేళ్లతో పెకిలించి ఆడవాళ్ళ చేత అన్నయ్యా అని పిలిపించుకున్న మహానుభావుడని, ధైర్యసాహసాలకు పరాక్రమాలకు నిలువెత్తు నిదర్శనం చత్రపతి శివాజీ మహారాజ్ అని, పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి లెక్కలేనన్ని యుద్ధాలు చేసినా ఎన్నడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదని అన్నారు. యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల రాజ్యంలో యుద్ధం చేయలేని వారికి, స్త్రీలకు, పసివారికి సహాయం చేసే వారని, యుద్ధ తంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ మహారాజ్ భారత దేశ రాజులలో అగ్రగణ్యుడని, పటిష్టమైన గూడాచారి వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ప్రజలకోసమే ప్రభువు అన్న సూత్రం పాటిస్తూ వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజల సంక్షేమం కోసం ఎనలేని పాటుపడ్డా మహావీరుడు శివాజీ అని తెలిపారు. ఈకార్యక్రమములో మహానుభావుల జయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షులు కట్టా నరసింగరావు, కొల్లా శంకర్, సరిపెల్ల బలరామరాజు, మాజీ పోలీస్ ఆఫీసర్లు కాముని నరసింహారెడ్డి, బండారి మల్లారెడ్డి, పి. మొగలయ్య, స్థానిక నాయకులు వాసిరెడ్డి లక్ష్మినారాయణ, గౌరవరపు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

చిన్నబాబు కి స్పీకర్ తమ్మినేని పరామర్శ

 చిన్నబాబు కి  స్పీకర్ తమ్మినేని పరామర్శ

సంతబొమ్మాళి, పెన్ పవర్

సంతబొమ్మాళి పీఏసీఎస్ చైర్మన్, ఉమిలాడ  మాజీ సర్పంచ్,సీనియర్ వైసీపీ నాయకులు కిల్లి చిన్నబాబు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం కోసం శనివారం ఉదయం రాష్ట్ర వైఎస్ఆర్ సీపీ నాయకులు రాష్ట్ర స్పీకర్ తమ్మినేని సీతారాం ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.చిన్నబాబు మరణంజీర్ణించుకోలేకపోతున్నామని, మండల స్థాయిలో ఆయన పార్టీకి చేసిన సేవలు మరువలేమని స్పీకర్ అన్నారు. 

ఆయన కుటుంబీకులకు ఓదా ర్చారు. స్వగ్రామమైనఉమిలాడ పంచాయతీ డోకి కామన్నపేటకి చేరుకునిశనివారం ఆయన చిన్నబాబు చిత్రపటానికి పూల మాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నబాబు గత 1988 నుంచి 1996 వరకు సర్పంచ్, సంతబొమ్మాళి మండల రైతు నాయకుడుగా, 1997 నుంచి 2001 వరకు మేఘవరం డీసీ కమిటీ చైర్మన్ గా, 2019 నుంచి 2021వరకు కో-ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ గాను, నాలుగు సార్లు ఉమిలాడ సర్పంచ్ గాను వ్యవహరించారన్నారు. ఈయనతో పాటు సంతబొమ్మాలి మండల వైసీపీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు.

రావాడ లో టిడిపి అభ్యర్థులు ప్రచారం

 రావాడ లో టిడిపి అభ్యర్థులు ప్రచారం


పరవాడ,పెన్ పవర్

 రావాడ పంచాయతీ లో  సోమునాయుడు పాలెం గ్రామంలో ఎంపిటిసి అభ్యర్థి వియ్యపు లక్ష్మీ ,జెడ్పిటిసి అభ్యర్థి అట్టా సన్యాసి అప్పారావు  ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు పయిల జగన్నాధ రావు, వియ్యపు చిన్న,గ్రామ పెద్దలు మాజీ సర్పంచులు ఎంపీటీసీ లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

నిరుపేద కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సహాయం..

 నిరుపేద కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సహాయం.. 

ఎమ్మెల్యే తన వేతనం నుండి1 లక్ష ఆర్థిక సాయం..

 ముగ్గురు పిల్లల చదువుకు భరోసా ఇచ్చారు.. 

కుత్బుల్లాపూర్,పెన్ పవర్ 

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 126 జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని మక్దుంనగర్ లో నివాసం ఉంటున్న సత్యలక్ష్మీ...తల్లి తండ్రులను కోల్పోయిన తన అన్న పిల్లలు సాయి తేజ(15), చరణ్ తేజ(12), వరుణ్ తేజ(10)లను అన్ని తానై చూసుకుంటుంది. ఈ ముగ్గురు పిల్లల తల్లి అనారోగ్యంతో, తండ్రి హార్ట్ ఎటాక్ తో చనిపోవడం వల్ల ఈ పిల్లల పోషణను సత్యలక్ష్మీ చూసుకుంటుంది. నిరుపేద కుటుంబం కావడంతో వారి చదువుల నిమిత్తం సత్యలక్ష్మీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్  మానవతా దృక్పథంతో బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.1 లక్ష విలువ చేసే చెక్కును తన గౌరవ వేతనం నుండి ఆమెకు శనివారం తన నివాసం వద్ద అందజేశారు. అలాగే ముగ్గురు పిల్లలకు గురుకుల పాఠశాలలో విద్యనభ్యసించే విధంగా ఏర్పాటు చేస్తానని భరోసానిచ్చారు. ఈ మేరకు తమకు అండగా నిలిచిన సందర్భంగా సత్యలక్ష్మీ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్ తదితరులు పాల్గొన్నారు.

మంచి నీటి సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి

 మంచి నీటి సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి

పరవాడ,పెన్ పవర్

79 వ వార్డు పరిధిలో గల అన్ని ప్రాంతాల్లో ఘత రేడు సంవచ్చరాల క్రింద అమృత పధకం క్రింద ఇచ్చిన త్రాగునీటి ఇంటింటి కనెక్షలకు నీటి సరఫరా జరిగేలా సత్వరమే చర్యలు తీసుకోవాలి అని జివిఎంసి కమిషనర్ సృజ నాకు 79 వార్డు కౌన్సిలర్ రౌతు శ్రీనివాస్ వినతిపత్రం అందించారు.లంకెలపాలెం పరిధిలోని గొల్లపేట,శ్రీరామ్ నగర్,శ్రీరంగం కాలనీ,లంకెలపాలెం జక్షన్,శ్రీ మరిడిమాంబ కాలనీ,అప్పీకొండ వారి విధి,గెంజి పేట,జాజులవాని పాలెం ప్రాంతాల్లో వారికి 2 సంవత్సరాల క్రిందట అమృత త్రాగు నీటి పధకం క్రింద కనెక్షన్లు ఇచ్చినా వారికి సక్రమంగా నీటిసరఫరా కావడం లేదు అని ప్రస్తుత ఎండాకాలం లో ప్రజలు త్రాగునీటి కోసం అనేక కష్టాలు పడుతున్నారు అని శ్రీను తెలియజేసారు. ట్యాంకర్లతో నీటిసరఫరా అనేది ఖర్చుతో కూడుకున్న పనే కాకుండా అందరికి నీరు సక్రమంగా సరఫరా కావడం లేదు అని తెలియజేసారు.సత్వరమే కుళాయిల ద్వారా త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని రౌతు శ్రీను కోరారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...