Followers

15వ ఫైనాన్స్ నిధుల వినియోగంపై సమావేశం.

 15వ ఫైనాన్స్ నిధుల వినియోగంపై సమావేశం.

వెల్దుర్తి,  పెన్ పవర్

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం 15వ ఫైనాన్స్ నిధుల వినియోగంపై శనివారం మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఎంపీపీ స్వరూప, జడ్పిటిసిరమేష్ గౌడ్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 15వఫైనాన్స్ నిధులతో గ్రామాల్లో ప్రజలకు అవసరమయ్యే మౌళిక వసతుల కల్పనకు వినియోగించుకోవాలని ప్రజా ప్రతినిధులకు అధికారులు సూచించారు. అలాగే నిధుల వినియోగంపై  అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జగదీశ్వరాచారి, ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు.

ఎంపీటీసీ, జెడీపీటీసీ ఎన్నికల వివరాలను శనివారం వెల్లడించిన జిల్లా కలెక్టర్

  ఎంపీటీసీ, జెడీపీటీసీ ఎన్నికల వివరాలను శనివారం వెల్లడించిన జిల్లా కలెక్టర్ 

విజయనగరం,పెన్ పవర్

జిల్లాలో 34 జడ్పీటీసీ స్థానాలకి గాను 3 స్థానాలు ఏకగ్రీవం కాగా, 31 స్థానాలకి ఈనెల 8 న ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాలకి 129 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వైసీపీ నుంచి 31మంది, టీడీపీ నుంచి 28, కాంగ్రెస్ నుంచి 25, బీజేపీ నుంచి 14, బీఎస్పీ నుంచి 4, జనసేన 10 మంది, సీపీఎం నుంచి 3, స్వతంత్రులు 14 మంది పోటీలో ఉన్నారు.జిల్లాలో 549 ఎంపీటీసీ స్థానాలకు గాను, 55 స్థానాలు ఏకగ్రీవం కాగా, 494 స్థానాలకి ఎన్నికలకి జరగనున్నాయి. ఇందులో ఒక స్థానానికి ఏక గ్రీవంగా ఎన్నికైన అభ్యర్థి మరణించి నందున ఆ స్థానంలో కూడా  ఎన్నిక జరగనుంది. ఈ మొత్తం స్థానాలకి 1189 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వైసీపీ నుంచి 491మంది, టీడీపీ నుంచి 453, కాంగ్రెస్ నుంచి 29, బీజేపీ నుంచి 34, బీఎస్పీ నుంచి 12, జనసేన 24 మంది, సీపీఎం నుంచి 20, సీపీఐ నుంచి ఇద్దరు, స్వతంత్రులు 123 మంది పోటీలో ఉన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు మృతి చెందిన కారణంగా 8 స్థానాలకు ఎన్నికల వాయిదా వేయడం జరిగింది.ఈ ఎన్నికల కోసం 1879 పోలింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేసాం. ఈ నెల 8 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 10 వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమౌతుంది. భద్రతా దృష్ట్యా 213 సెన్సిటివ్, 183 హైపర్ సెన్సిటివ్, 99 troublesome కేంద్రాలను గుర్తించారు. మండల కేంద్రాల్లోనే ఓట్లు లెక్కింపు జరుగుతాయి. జిల్లాలో సాధారణ ఎన్నికల పరిశీలికులుగా సీనియర్ ఐఏఎస్ అధికారి కాంతి లాల్ దండే వ్యవహరించనున్నారు. ఎన్నికల సామగ్రి, సిబ్బందిని తరలించడానికి 218 బస్ లు, 214 క్యాబ్ లు, 161 కార్లు వినియోస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు సజావుగా జరగడానికి ప్రజలు, రాజకీయ పార్టీలు ఎలా సహకారం అందించారో అలాగే ఈ ఎన్నికలకి కూడా సహకరించాలని విజ్ఞప్తి. శాంతి భద్రతలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసాం.

సునీల్ నాయక్ ది పక్కా ప్రభుత్వ హత్యే..!

 సునీల్ నాయక్ ది పక్కా ప్రభుత్వ హత్యే..!

తెలంగాణ ఉధ్యమకారుడు బధావత్ సారయ్య నాయక్


రామగుండం, పెన్ పవర్ 

తెరాస రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటునటువంటి తప్పులు నిర్ణయాలు తప్పులు ప్రకటనల వల్ల ఈ రోజు నిరూధ్యోగ యువత ఆత్మహత్యకు పాల్పడుతున్నారని గత రోజూ శుక్రవారం నాడు ఆత్మహత్యకు పాల్పడి అకాల మరణం చెందిన కెయూ విధ్యార్థి సునీల్ నాయక్ మరణం ప్రభుత్వం హత్యగానే మేము భావిస్తున్నామని పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ ఎస్టీ బిడ్డ అలనాటి తెలంగాణ ఉధ్యమకారుడు తెలంగాణ ఉధ్యమ సమయంలో ప్రత్యేక్షంగా తెరాస పార్టీలోనే ప్రత్యేక పాత్ర పోషించి అలుపెరగని పోరాటం చేసిన యువ విధ్యార్థి నాయకుడు బధావత్ సారయ్య నాయక్ మనస్తాపంతో తెరాస ప్రభుత్వం పై తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో బహుజనులందరూ ముఖ్తకంటంతో అలుపెరగని పోరాటం చేసిన యావత్ తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం సిద్దిస్తే మన నీళ్ళు మన నిధులు మన నియిమకాలు మనకే వస్తాయని కొండంత ఆశతో కోటి కళ్ళతో ఎదురు చూస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 2014 ఎన్నికల్లో విజయం సాదించి ఆధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలంతా తమ కోసమే వెలిసిన పార్టీ అని తన బాగోగులు తెలిసిన పార్టీ అని నాయకులని తనకు ఉధ్యోగాలు వచ్చినట్టేనని రాష్ట్రం సుబిక్షంగా మారబోతుందని  రొమ్ము విసిరి ముందుకు వచ్చిన తెలంగాణ యువత నోట్లో గత ఏడేళ్ళుగా మన్ను (మట్టి) కొడుతున్నారని తెలిసిపోయాక ఎటు వెళ్ళే దారి లేక తమ బాధ చెప్పుకుందామన్న వినే వారూ లేక తెలంగాణ యువత ఆత్మహత్యలకు పాల్పడుతూ నేల రాలుతుంటే మన కుటుంబమే మనల్ని పీడిస్తూ చంపుకు తింటుంటే ఆకలి చావు తప్పా తెలంగాణలో ఏముందని మా తోటి మిత్రుడు సునీల్ నాయక్ లాంటి వారు ఆత్మహత్యలతో నేల కొరుగుతుంటే ఈ సమాజం మన రాష్ట్రం ఏమైపోతుందోనని భయంగా ఉందని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. దయచేసి తెలంగాణ యువత ఎవరూ కూడ ఇలాంటి ఆత్మహత్యలకు పాల్పడవద్దని బాబా సాహెబ్ డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగ ద్వారా మనకు కల్పించిన ఇచ్చిన ఓటు హక్కును ఆయుధంగా మార్చుకుని మనకు అణువైన నాయకులను ఎన్నుకుని ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాలని రాబోవు రోజుల్లో తెరాస ప్రభుత్వం కుప్పకూలడం కాయమని ఎంతో దూరంలో లేదని ఇకనైన తెలంగాణ యువత ఆలోచించి అనువైన నిర్ణయాలు తీసుకుని నాయకులకు బుద్ది చెప్పాలని బధావత్ సారయ్య నాయక్ తెలంగాణ యువతకు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.

సకాలంలో స్పందించిన ట్రాఫిక్ పోలీసులకు ప్రశంసా పత్రాలు

 సకాలంలో స్పందించిన ట్రాఫిక్ పోలీసులకు ప్రశంసా పత్రాలు

విజయనగరం,పెన్ పవర్

విజయనగరం జిల్లా, విజయనగరం పట్టణం సమీపంలో జె.ఎన్.టి.యు ఇంజినీరింగ్ కాలేజి జంక్షన్ వద్ద శుక్రవారం రాత్రి సమయంలో గజపతినగరం వైపు నుండి విజయనగరం వైపుగా వస్తున్న బోర్‌వెల్ లారీ ప్రమాదవశాత్తు తిరిగబడి పోయినట్లు సమాచారం అందుకొన్న వెంటనే తక్షణం స్పందించిన విజయనగరం ట్రాఫిక్ సిఐ ఎర్రంనాయుడు, ఎఎస్ఏ దాలినాయుడు, కానిస్టేబుల్ సింహాచలంలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని, బోరింగ్ వేసే డ్రిల్ బిట్స్ ను తొలగించి, జేసిబి సహాయంతో లారీని ఎత్తి లారీ క్రింద చిక్కుకుని, గాయపడిన ముగ్గిరిని రక్షించి, గోల్డెన్ అవర్ లో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి సకాలంలో చికిత్స అందేటట్లు చర్యలు తీసుకొని, ముగ్గరు ప్రాణాలు కాపాడారు. విషయం తెలసుకొన్న జిల్లా ఎస్పీ సకాలంలో స్పందించి సంఘటనా స్థలంకు చేరుకొని, క్షతగాత్రులను సకాలంలో ఆసుపత్రికి చేర్చిన ట్రాఫిక్ పోలీసు అధికారులను శనివారం నాడు జిల్లా పోలీసు కార్యాలయంకు రప్పించి ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలు మరియు ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేశారు. 

ప్రశంసా పత్రాలు పొందిన వారిలో 1) వై.వి.సి. యం. ఎర్రంనాయుడు, సిఐ, ట్రాఫిక్ పి.ఎస్., విజయనగరం, 2) దాలినాయుడు, ఎఎస్ఏ, ట్రాఫిక్ పి.ఎస్, విజయనగరం వి.ఎస్., 3) సంహాచలం, పోలీసు కాని స్టేబుల్, ట్రాఫిక్ పి.ఎస్, విజయనగరంలు ఉన్నారు. ఎస్ బి అదనపు ఎస్పీ కుమారి. ఎన్.శ్రీదేవీరావు, అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణ రావు, ఒఎస్టీ ఎన్. సూర్యచంద్ర రావు, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావులు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది సకాలంలో స్పందించి రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారి ప్రాణాలను కాపాడిన ట్రాఫిక్ పోలీసు అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

ఎవరక్కడ? ఎవరూ లేరిక్కడ...

 ఎవరక్కడ? ఎవరూ లేరిక్కడ... 

సంతబొమ్మాళి, పెన్ పవర్

డాక్టర్ గారు ఉన్నారా! లేరు డిప్యూటేషన్ పై వెళ్లారు, మేడం గారు ఉన్నారా! లేరు డిప్యూటేషన్ పై వెళ్లారు. పోని స్టాఫ్ నర్స్.. చెప్పాం కదండీ అందరూ డిప్యూటేషన్ పై వెళ్లారని.ఇది సంతబొమ్మాళి మండలంలో దండుగోపాల పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిస్థితి. పల్లెసీమలే దేశానికి పట్టుకొమ్మలు.. అలాంటి పల్లెల్లో జీవనం సాగిస్తున్న ప్రజలు అనారోగ్యానికి గురైతే వైద్యం చేసి సరైన మందులు అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. మండల కేంద్రాలతో పాటు పలు మేజర్‌ పంచాయతీల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ మండలంలో దండుగోపాలపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు, సిబ్బంది లేక ప్రజలకు ఎలాంటి సేవలు అందడం లేదు. 

ఉన్నవారికి డిప్యూటేషన్ పై  పంపించడంతో వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తుంది.  దీంతో నర్సులు, ఎఎన్‌ఎంలే సేవలందిస్తున్నారు.  దీంతో గ్రామంలో ఆసుపత్రి ఉన్నా వైద్యం కోసం సమీపంలోని పట్టణానికి పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది.  ఇక్కడ పనిచేసే వైధ్యాధికారిని ఆర్ స్వాతి   డిప్యూటేషన్ పై వైజాగ్ వెళ్లగా, హరికృష్ణ ఎల్ డి కంప్యూటర్ డిఎంహెచ్‌ఓ కార్యాలయంలో డిప్యూటేషన్‌పై పని చేస్తున్నాడు. ఎంపిహెచ్ఈఓ శేషుబాబు డిప్యుటేషన్ లో మురపాక ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. స్టాఫ్ నర్స్ సావిత్రి డిప్యూటేషన్ లో నౌపడా పీహెచ్సీలో విధులు నిర్వహిస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరు డిప్యూటేషన్ లో విధులు నిర్వహించడం తో ఇక్కడ వైద్య సేవలు కరువు అవుతున్నాయని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ ఆస్పత్రికి రోజు ఎంతో మంది రోగులు వస్తుంటారు. వైద్యులు సిబ్బంది కనబడక తీవ్ర నిరాశతో వెనుతీరుగతున్నారు.  ఈ ఆస్పత్రిలో ఒక పి హెచ్ ఎన్, ఒక ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ లు ఖాళీగానే ఉన్నాయి. ఈ ఆరోగ్య కేంద్రానికి డ్రాయింగ్ ఆఫీసర్ గా డాక్టర్ సిహెచ్ కోదండరావు విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు కోవిడ్ వ్యాక్సిన్ కేవలం 270 మందికి మాత్రమే వేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. కోవిడ్ వాక్సినేషన్ లో ఈ ఆరోగ్య కేంద్రం చాలా వెనుకంజలో ఉందని చెప్పవచ్చు. కేవలం కోవిడ్ వ్యాక్సినేషన్ కు ప్రత్యేకంగా జలుమూరు పిహెచ్సి వైద్యాధికారి వంశీకృష్ణ ను నియమించారు. ప్రస్తుతానికి ఆ వైద్యాధికారి కూడా సెలవు లో ఉన్నట్లు తెలుస్తోంది. దండుగోపాలపురం పీహెచ్సీ లో సిబ్బంది కొరత, వైద్యులు లేకపోవడంతో,  డిప్యుటేషన్ లో ఇబ్బంది ఎక్కువగా ఉండటంతో మండల ప్రత్యేక అధికారి పివీ శ్రీనివాస్ ను వివరణ కోరగా జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ సమస్యలను తీసుకు వెళ్తానని తక్షణమే సిబ్బందిని వెనక్కి రప్పించేలా చర్యలు చేపడతానని అన్నారు.

ఏబీవీపీ ఆద్వర్యంలో

 ఏబీవీపీ ఆద్వర్యంలో....

 బేల, పెన్ పవర్

కాకతీయ విశ్వవిద్యాలయం కు చెందిన నిరుద్యోగి బోడ సునీల్ మృతికి నిరసనాగా బేల మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సునీల్ మృతికి  కారణం తెలంగాణ ప్రభుత్వమే అని సునీల్ మృతికి బాధ్యత వహిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సునీల్ కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకోన్నారు. ఈ సందర్భంగా  ఏబీవీపీ జిల్లా  ఎస్ ఎఫ్ డి  కన్వీనర్ మడవార్ హరీష్ మాట్లాడుతూ కెసిఆర్ నీచపు రాజకీయాలో  ఒక నిరుద్యోగి  బలి ఆవ్వడం జరిగిందన్నారు.తెలంగాణ సాధించుకుంది ఉద్యోగాల కోసం నిరుద్యోగం పోవాలని ఆ రోజు ప్రాణ త్యాగాలు చేస్తే ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత అదే నిరుద్యోగులు మళ్ళీ ప్రాణాలు త్యాగం చేయాల్సి వస్తుందన్నారు.  దీనికి కారణం కేసీఆర్ ప్రభుత్వం ఇకనైనా సిగ్గు తెచ్చుకొని నిరుద్యోగులని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అలాగే సునీల్ కుటుబం లో ఒక్కరికీ  గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి ఆ కుటుబంనీ ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  ఏబీవీపీ మండల అద్యక్షుడు ఓం ప్రకాష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజన్లవార్ సునీల్ , మనోజ్, అజయ్, సాయి, ప్రీతం, వికాస్, అభిషేక్, పవన్, తదితరులు పాల్గొన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలి

 మహిళలు అన్ని రంగాల్లో ముందు  ఉండాలి.....

మండల విద్యాధికారి రవీందర్

లక్షెట్టిపెట్, పెన్ పవర్

మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలి అని ఎంఈఓ రవీందర్ అన్నారు. శనివారం పట్టణంలో న్యూ లైఫ్ ప్రేయర్ సొసైటి ఆధ్వర్యంలో ఇండియా బైబిల్ లిట్రేచర్ సహకారంతో నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా ఎంఈఓ రవీందర్ పాల్గొని మాట్లాడుతూ న్యూలైఫ్ సొసైటీ చేస్తున్న సేవ కార్యక్రమలను అభినందించారు.నిరుపేద మహిళలకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన చాలా గొప్పదన్నారు.రానున్న రోజుల్లో మరిన్ని సేవ కార్యక్రమలు అందిచి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. అనంతరం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు బొడ్డు రవిజోషాప్, సభ్యులు తగారపు సత్తయ్య, సంజీవ్, గంధం సత్యనారాయణ, పుష్ప, స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...