Followers

ఘనంగా శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి14వ వార్షికోత్సవం

 ఘనంగా  శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి14వ వార్షికోత్సవం..

పెన్ పవర్, కాప్రా

కాప్రా డివిజన్ లోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో 14వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు వార్షికోత్సవం సందర్భంగా హోమము ధ్వజారోహణం నిర్వహించారు. అభిరాం శర్మ  రుత్వికులు. అర్చకులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తామని ఈ సంవత్సరం కోవిడ్  నిబంధనలు పాటిస్తూ పూజా కార్యక్రమం చేసామని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ కరోన మహమ్మారి దేశం నుండి తరిమి కొట్టే విధంగా అందరూ జాగ్రత్తలు పాటించాలని లక్ష్మీ చెన్నకేశవ స్వామి దయా భక్తులపై ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో  రవి మూర్తి శర్మ ,కే కిరణ్ చార్యులు.పీ హరినాథ్ శర్మ , ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ఎర్ర అశోక్ కుమార్ గౌడ్ చైర్మన్ మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి జె కృష్ణమాచార్యులు, ధర్మకర్త లు చిన్నమ్మ రాజు వెంకటరమణ, మండల , నవీన్ కుమార్ గౌడ్ శ్రీమతి  బచ్చు అరుణ జ్యోతి, కొప్పుల కుమార్ , గోగికర్ నవీన్ కుమార్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

అక్రమంగా మద్యం అమ్మినా, తయారుచేసిన కఠిన చర్యలు

అక్రమంగా మద్యం అమ్మినా, తయారుచేసిన కఠిన చర్యలు

పోలవరం, పెన్ పవర్

పోలవరం ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ మరియు తమ సిబ్బంది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏలూరు వారి అదేశాలమేరకు తనిఖీల్లో భాగంగా మంగళవారం ఎర్లీ మార్నింగ్ గోపాలపురం మండలం వెంకటాయపాలెంలో 35 లీటర్ల నాటుసారా పట్టుకోవడం జరిగింది. సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ రైడింగ్ లో భాగంగా ఒక గ్లామర్ బైక్ పట్టుబడినట్లు, మరియు ఒక వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇతను దేవరపల్లి మండలం కృష్ణంపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి గా గుర్తించడం జరిగిందని అన్నారు. మరియు కృష్ణంపాలెం నుండి వెంకటాయపాలెం కు నాటుసారా తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలియజేశారు.

రంజాన్ తోఫా అందజేసిన మంత్రి

 రంజాన్ తోఫా అందజేసిన మంత్రి

వనపర్తి, పెన్ పవర్

వనపర్తి పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో రంజాన్ తోఫా (కిట్టు) మంత్రి నిరంజన్ రెడ్డి ముస్లింలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమానికి  తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. పవిత్ర రంజాన్ మాసం భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని రంజాన్ పండుగను అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మంత్రి కోరారు. పేద ప్రజలముఖంలో చిరునవ్వులు ఇవ్వడానికి కెసిఆర్  రంజాన్ తోఫా  రంజాన్ పండుగను అత్యంత ప్రతిష్టాత్మక జరుపుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని  మంత్రి  చెప్పారు. తెలంగాణ ప్రజలందరూ కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని రంజాన్ పండుగను అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మంత్రి  కోరారు. దాదాపు అక్కడికి వచ్చిన 120 మంది లబ్ధిదారులకు  మంత్రి తన చేతుల మీదుగా అందజేశారు. ఈ వివరాలు టిఆర్ఎస్ నేత షేక్ జహంగీర్ విలేకరులకు తెలిపారు.

అను అక్షయ కార్యక్రమాన్ని స్థాపించి నేటి రెండు సంవత్సరాలు

 అను అక్షయ కార్యక్రమాన్ని స్థాపించి నేటి రెండు సంవత్సరాలు

పెన్ పవర్, ఆత్రేయపురం 

 ర్యాలీ  గ్రామంలో  అనుష్  స్వచ్ఛంద  సంస్థ ఆధ్వర్యంలో పేదవారి ఆకలి తీర్చాలని ఉద్దేశంతో       అను అక్షయ కార్యక్రమాన్ని  ప్రారంభించి నేటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు మోహిత్ మాట్లాడుతూ  కరోనా అరికట్టాలంటే అందరూ దూరం పాటించాలని ఇది సులువుగా పాటించాలంటే గొడుగులు ఉపయోగించడం ద్వారా  సాధ్యమవుతుందని కాబట్టి హరీష్ జీవన్ లక్ష్మి ల  సమకూర్చిన గొడుగులు చాపలు పేదలకు పారిశుద్ధ్య కార్మికులకు పంపిణీ చేశామని అలాగే అరుణ్ కుమార్ సమకూర్చిన భోజనం పొట్లాలు ఎనర్జీ డ్రింకులను కరోనా ప్రజలకు సోకాకుండా నిత్యం పోరాడుతున్న ర్యాలీ  16 మంది పారిశుద్ధ్య కార్మికులకు 30మంది పేద ప్రజలకు ప్రభుత్వ ఆదేశాలను కరోనా  నిబంధనలు పాటిస్తూ పంపిణీ చేశారు.

సెక్రెటరీ రఫీ ఆధ్వర్యంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం

 సెక్రెటరీ రఫీ ఆధ్వర్యంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడి మండలం పోచవరం పంచాయతీ పరిధిలో జగనన్న స్వచ్ఛ సంకల్పం 100 రోజుల సన్నాహక కార్యక్రమాలలో భాగంగా సచివాలయ కార్యదర్శి ఎస్. ఎం.రఫీ వూల్లా ఆధ్వర్యంలో మే 1 నుండి 14 వరకు గ్రామంలో పారిశుద్ధ్యం పై ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు చేపట్టారు. దానితోపాటు కోవిడ్ 19 భద్రత, నివారణ అవగాహనా కార్యక్రమాలు జరిపిస్తున్నారు. నీటి సరఫరా, పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పోచవరం పంచాయతీ కార్యదర్శి రఫీ కోవిడ్ నియంత్రణ నిబంధనలు అన్ని విధాలుగా అమలు చేయడం జరుగుతుంది.

తాడిపూడిలో కోవిడ్ దృష్ట్యా పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం

 తాడిపూడిలో కోవిడ్ దృష్ట్యా పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామంలో సర్పంచ్ నామా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కోవిడ్  దృష్ట్యా గత నెల రోజుల నుండి గ్రామంలో అనేక పనులు చేపట్టారు. గ్రామములో బ్లీచింగ్ చల్లించడం, ఇంటింటికి హైపో క్లోరైడ్ స్ప్రే చేయించడం జరిగింది. మంగళవారం నాడు గ్రామమంతా మరోసారి హైపో క్లోరైడ్ స్ప్రే చేయించారు. మరియు మంచినీటి ట్యాoకులను శుభ్రం చేయించడం, డ్రైనేజీల్లో పూడికతీత  వంటి పనులు ముమ్మరం చేశారు. ఎప్పటికప్పుడు కోవిడ్ పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  పంచాయతీ సెక్రెటరీలు దగ్గు చంద్రశేఖర్, బదిరెడ్డి భీమేశ్వరరావు, విఆర్వో ఎం.ప్రకాష్ ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

సర్పంచ్ గారికి గ్రామ ప్రజల మనవి..

 సర్పంచ్ గారికి గ్రామ ప్రజల మనవి..

గతం లో మాజీ సర్పంచ్ లు చేసిన పొరపాట్లు మీరు చెయ్యద్దు
మీ పై పెట్టుకున్న ఆశలు నిజం చేయండి,
పంచాయితి ని అబివృద్ది పదం లో నడిపించండి
కురుపాం,  పెన్ పవర్ 

మండలం లోని అన్ని పంచాయితి లలో పెద్ద పంచాయితి కురుపాం పేరుకే మేజర్ పంచాయితి అబివృద్ది లో మాత్రం చిన్న పంచాయితి,అయితే  జరిగిన పంచాయితి ఎన్నికల్లో సర్పంచ్ గా డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి బలపరిచిన అబ్యర్ది గార్ల సుజాత గెలుపొందారు, ఆమె చదువుకున్న వ్యక్తి యువ వయస్సు కలవారు కావడం తో పంచాయితి ప్రజలు ఆమె పై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు, కాగా గతం లో కురుపాం మేజర్ పంచాయితి మాజీ సర్పంచ్ లు తీవ్ర నిరాశ కు గురిచేశారు,దీనితో అభిమానులు కార్యకర్తలు ఇమే పై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు,గెలిచిన తరవాత ఇమే ఇంత వరుకు ప్రజల్లోకి కానీ కోవిడ్ కష్టకాలం లో పంచాయితి పారిశుద్ధ్య పనులు పర్యవేక్షన గాని , లాక్ డౌన్ లాంటి నిర్ణయాల్లో భాగస్వామ్యం కానీ లేదు,ఎలాంటి కారణాలతో ఆమె చురుగ్గా లేరో తెలియదు కాని ఇక ముందు చురుగ్గా ఉండాలని ఆమె పంచాయితి కి ఫలానా సమస్య లేదా ఫలానా నిధులు కావాలి అంటే క్షణాల్లో తగిన చర్యలు తీసుకునే డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ఉన్నారు కావున, వినియోగించుకోవాలని పంచాయితి అబివృద్ది తమతోనే సాధ్యం అయ్యేలా చూడాలని పంచాయితి ప్రజలు కోరుతున్నారు,గ్రామానికి ప్రధమ  పౌరరాలు కావున కోవిడ్ కష్ట కాలం లో పక్కా ప్రణాళిక ఏర్పరచుకొని అధికారులు తో కలిసి చురుగ్గా పంచాయితి లో కోవిడ్ కేసులు పెరగకుండా చర్యలు ప్రారంభించాలని ,హైపోక్లోరైట్  లాంటివి గ్రామంలో పిచికారీ చేయించి పారాశుద్య పనులు చురుగ్గా సాగెలా ఆదేశాలు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...