Followers

దళితకులాల సంక్షేమ సేవా సంఘం సేవలు అబినందనీయం


     


పాయకరావుపేట,  పెన్ పవర్ 


 

 

లాక్ డౌన్ దృష్ట్యా బుదవారం పట్టణంలో బిచ్చగాళ్ళకు,నిరుపేదలకు దళితకులాల సంక్షేమ సేవా సంఘం  ఆహార పొట్లాలను పంపిణిచేసారు.మండల కన్వినర్ నెలపర్తి అర్జున రావు,పట్టణ అద్యక్షులు పల్లా విలియంకేరి ఆద్వర్యంలో సంఘ సభ్యులు రోడ్డు పై స్థావరాలు ఏర్పరుచుకున్న 300మంది బిచ్చగాళ్ళకు ,పేదలకు పులిహోర పొట్లాలను,మజ్జిగ ప్యాకెట్ ,వాటర్ ప్యాకెట్టులను అందజేసారు.ఈసందర్ఫంగా వారు మాట్లాడుతూ  కరోనా మహ్మారిని తరిమి కొట్టుటకు ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ లో ప్రజలు స్వచ్చందంగా అమలు చేయాలని కోరారు..అదేవిదంగా సామాజిక దూరంను పాటించి వైధ్యనిపుణుల సూచనలు సలహాలు పాటించి మానవ జాతి మనుగడను కాపాడుకుందామని అన్నారు దళిత కులాల సంక్షేమ సేవా సంఘం ఆద్వర్యంలో మండలంలో ఇంకా మరెన్నో సేవా కార్యక్రమంలను నిర్వహింస్తామని అన్నారు..ఈకార్యక్రమంలో చిరుకూరి పేర్రాజు,తాటిపాక లోవరాజు,నెలపర్తి నాగరాజు,ఏనుగుపల్లి అప్పారావు,జక్కల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

ద్విచక్ర వాహనదారులకు జరిమానా


కొత్తపేట పెన్ పవర్....


కొత్తకోట గ్రామం లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొత్తకోట ఎస్సై దామోదర్ ఆద్వర్యం లో  అపరాధ రుసుము విధించారు సుమారు బుదవారం ఒక్కరోజే  20 ద్విచక్ర వాహనాలు నుంచి  30 వేల రూపాయలు ఫైన్ వేశారు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రోడ్లపైకి వస్తుండడంతో జరిమానా విధించారు.

వాలెంటీర్ల పై విమర్శలేలా 








--- ఉద్యోగ భద్రత కరువైనా

--- కరోనా సేవలు గణనీయమైనవి 

--- వారొక పార్టీ కాదు ఓ వ్యవస్థ 

--- ఇన్సూరెన్స్  ప్రకటిస్తే మేలంటున్న విశ్లేషకులు 

 

అనకాపల్లి , పెన్ పవర్ 

 

వాలంటీర్లుపై విమర్శలేలా. ఉద్యోగ భద్రత లేని వారి సేవలు గణనీయమైనవి. ప్రత్యేకించి కరోనా వ్యాధి  నియంత్రణలో అవిశ్రాంతంగా చేస్తున్న కృషి అభినందనీయమైనది అనేది క్షేత్రస్థాయిలో మాట. అయితే రాష్ట్రంలో రాజకీయం వాలెంటీర్ల చుట్టూనే తిరుగుతోందంటే ఆశ్చర్యం లేదు. ప్రభుత్వ పథకాల అమలు లొో  వాలంటీర్లె  కీలకం కావడంతో ఏ లోపం జరిగినా వాలెంటరీ వ్యవస్థనే ప్రత్యర్థులు టార్గెట్ చేస్తున్నారు.   దీంతో వారెంతగా సేవలందిస్తున్నా చేయలేదనే భావనను ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు.   నిజానికి  వాలెంటరీ అనేది ప్రస్తుతం ఓ వ్యవస్థగా రాష్ట్ర సేవల్లో నిలుస్తుంది. రాజకీయ పార్టీకి సంబంధించినది కాదు అనేది స్పష్టం. వాలెంటరీ నియామకాల్లో రాజకీయ సంబంధం  లేని విద్యావంతులు ఉన్నారన్నది స్పష్టం. భర్తీలో అక్కడక్కడ వైకాపా నాయకుల పెత్తనం కనిపించినా అన్ని పార్టీలకు చెందిన వారు వాలంటరీగా ఉన్నారన్నది తెలిసిందే.

      నిజానికి వాలంటీర్లు క్షేత్ర స్థాయిలో చేస్తున్న పని అంతా ఇంతా కాదు. ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులు ఎంపిక అనర్హులకు  గుర్తించడంలో నిత్యం  నిమగ్నం అవుతూనే ఉన్నారు. పింఛన్ల పంపిణీని ఇంటింటికి వెళ్లి చేపడుతూనే ఉన్నారు. అన్నింటికీ మించి కరోనా వంటి భయంకర  పరిస్థితుల్లో ఇంటింటికి సర్వేకి వెళ్లడమనేది వెలకట్టలేనిది. ఇదంతా భద్రత కానీ ఉద్యోగాలు చేస్తూ ఇలాంటి సేవలు అభినందనీయమినదిగా పలువురు పేర్కొంటున్నారు. ఆ   డాక్టర్లు ఉద్యోగులు పోలీసులు ప్రభుత్వ ప్రతినిధులు. ఉద్యోగ భద్రత కలిగిన విధులు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉద్యోగ భద్రత కానీ వలంటీర్లు సాహసాన్ని మించి చేయడం గొప్పదిగా చెబుతున్నారు.  ఈ క్రమంలో వలంటీర్లపై విమర్శలు ఎక్కుపెట్టడం సరికాదన్నది క్షేత్రస్థాయి మాట. చాలీచాలని జీతాలు ఆపై ప్రభుత్వం మారితే ఉంటారో లేదో అన్న మీమాంస. అయినా ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్న వాలంటీర్లలను ప్రభుత్వ వ్యవస్థగా చూడాలే తప్ప రాజకీయ పార్టీకి ప్రతినిధులుగా చూడకూడదనే వారు అధికమే. కేంద్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు  ఇన్స్యూరెన్స్  ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో వాలంటీర్లకు ముఖ్యమంత్రి ఇన్సూరెన్స్ ప్రకటిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


 

 




 



 

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ 

.


అనకాపల్లి, పెన్ పవర్ 

 

కరోనా వ్యాధి నియంత్రణలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు  అధికారులు చేస్తున్న కృషి వెలకట్టలేనిదని మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ , ఎంపీ  సత్యవతి లతో కలిసి బుధవారం వివిధ శాఖల  అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధి నియంత్రణకు అధికారులు పూర్తిస్థాయిలో కృషి చేయాలని కోరారు. నిత్యావసర సరుకులు ధరలు ఎక్కువ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.  ధరల పర్యవేక్షణకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్డీవో, తహసీల్దార్ ,వ్యవసాయ శాఖ అధికారులు ఈ  కమిటీలో ఉంటారన్నారు.   ఎంపీ సత్యవతి మాట్లాడుతూ ఈ 14 రోజులు సామాజిక దూరాన్ని పాటించి వ్యాధి సంక్రమించే అవకాశాలు ఇవ్వకూడదన్నారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వ్యాధి నియంత్రణకు నిత్యం కృషి చేస్తూనే ఉన్నారన్నారు. అధికారుల సేవలు మరువలేనివిగా చెప్పారు. ఎమ్మెల్యే అమర్ మాట్లాడుతూ గ్రామాల్లో వార్డుల్లో ఇప్పటికే పారిశుధ్య పనులు పూర్తిగా నిర్వహించినట్లు వెల్లడించారు.   వ్యాధి ప్రబలకుండా క్షేత్ర స్థాయిలో అన్ని జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలకు వివరించామన్నారు. నిత్యావసర సరుకుల ధరలను వ్యాపారులు పెంచి ప్రజలను ఇబ్బంది పెట్టకూడదన్నారు. అనకాపల్లిలో  108 వాహనాలు మూడు ఉన్నాయని అదనంగా ఇంకా వాహనాలు కావాలని మంత్రిని కోరారు.  సమావేశంలో అధికారులు  ఆర్డీవో సీతారాం, తహశీల్దార్ ప్రసాద్, డిసిహెచ్ నాయక్, గోవిందరావు, ఎంపిడిఒ, నాయకులు మందపాటి జానకిరామరాజు ,జాజుల రమేష్ ,దంతులూరి దిలీప్ కుమార్  , గొర్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన విడుధల చేసిన ముస్లిం మైనారిటీనాయకులు


విజయనగరం, పెన్ పవర్ 


ఢిల్లీలోని నిజాముద్దీన్ప్రాంతానికి మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన విజయనగరం జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులను గుర్తించి ,వారిలో ఇద్దరిని కేంద్ర ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. ఒక వ్యక్తి హైదరాబాదులో వైద్యులు తీసుకుంటున్నట్లు సమాచారం ఉంది. వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా కరెంట్ టైం లో ఉంటూ వైద్యం తీసుకుంటున్నట్లు సమాచారం ఉంది. ఇంకా ఎవరైనా ముస్లిం సోదరులు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు ఉంటే వెంటనే దయచేసి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు జరిపించుకొని ఉండవలసిన అవసరం ఉంది .మీరు వైద్య పరీక్షలు చేయించుకొని మీరు ఎవరెవరితో కలిశారో ఆ వివరాలు పోలీసువారికి గాని ,వైద్యులు కానీతెలియపరిచిన వారు మీకు తగిన వైద్య సలహాలు కూడా ఇస్తారు. ఆరోగ్యంగా ఉన్న వారికి కరోనా లక్షణాలు బయటపడటానికి కాస్త ఎక్కువ సమయం తీసుకోవచ్చుఅలా అని మాకు ఏమీ లేదుఅని అశ్రద్ధ చేయకుండా కరెంట్ టైం లో ఉంటూ ఎటువంటి సూచనలు బయటపడినవెంటనే పరీక్షలు చేయించుకోవలసిన దిగా రెండు చేతులు జోడించి ముస్లిం సోదరులకు మనవి చేస్తున్నాను. మీరు అనవసర భయాలు పోయి చెప్పకుండా ఉన్నట్లయితేవ్యాధి సోకితే మీ దేహాన్ని చూడటానికి మీ తండ్రి కానితండ్రి గానిబిడ్డ గాని ,స్నేహితులే కానీఎవరు రాలేని పరిస్థితి .చివరకు నీ కర్మకాండ ఎలా జరుగుతుందో తెలియదు .ఇంత నికృష్టపు చావు మనకు అవసరమాఈ సమాజం కోసందేశం కోసంప్రజలను  రక్షించడానికి కోసం 24 గంటలు శ్రమిస్తున్నటువంటి వైద్యులకుఎండనకావాననకాతమ కుటుంబాన్ని వదిలి మన కోసం శ్రమిస్తున్న పోలీసు వ్యవస్థకురెండు చేతులెత్తి నమస్కరిస్తూవారికి సహకరిద్దాం రండి. దయచేసి మీ వద్ద ఏదైనా సమాచారం ఉన్న ఎడల ఈ క్రింది  టోల్ ఫ్రీ నెంబర్ కు డయల్ చేసి సమాచారం అందించవలసినదిగా మనవి. నిజాముద్దీన్ మత  ప్రార్థనలకు హాజరైన వారి కొందరు వివరాలను నిజాముద్దీన్ ప్రార్థనకు హాజరు వచ్చిన వారి వివరాలు  వక్ఫ్ బోర్డు ద్వారా సేకరించి వారు విడుదల చేసినటువంటి  వివరాలను జిల్లా మైనారిటీ అధికారి శ్రీమతి అన్నపూర్ణమ్మ గారికి అందించడం జరిగిందని తెలిపారు.


 


మూతపడ్డ ఫిషింగ్ హార్బర్.



స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం(పెన్ పవర్) 


 


నిత్యం రద్దీగా  ఉండే   ఫిషింగ్ హార్బర్  మూసి వేసినట్లు  ఫిషింగ్ హార్బర్   అసోసియేషన్   ప్రకటించింది. కరొనా వైరస్ లాక్ డౌన్ వల్ల   నగరం   జన సంచారం లేక బోసి పోతుందని  ఈ తరుణంలో   చాపల మార్కెట్  వ్యాపారం  స్తంభించిపోయింది. ఈ పరిస్థితుల్లో   చాపల వేట  కూడా  నిలిపి వేయడం జరిగింది. మర పడవలు  లంగర్ కే పరిమితం కావడంతో  షిప్పింగ్ హార్బర్   నిలిచి పోయింది.  పడవలు  నిలిపి వేయడం  వేట ఆగిపోవడంతో  మార్కెట్  వెల వెల బోతుంది. మత్స్యకారులు  వేట లేకపోవడంతో   విలవిలలాడుతున్నరు.  కరోనా మహమ్మరి  ప్రభావంతో  ఫిషింగ్ హార్బర్  మూతపడింది. ఫలితంగా  మత్స్యకారులు, వ్యాపారులు,కూలీలతో పాటు  రవాణా  మొత్తం స్తంభించిపోయింది.


విశాఖ సెంట్రల్ జైలు నుండి 74 మంది ఖైదీల విడుదల.


 


విశాఖ సెంట్రల్ జైలు నుండి 74 మంది ఖైదీల విడుదల.

స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం(పెన్ పవర్)


విశాఖ  కేంద్ర కారాగారం నుంచి  74  మంది  ఖైదీలను  విడుదల చేశా మని  కేంద్ర కారాగారం  పర్యవేక్షణాధికారి  ఎస్ . రాహుల్  తెలిపారు. బుధవారం ఆయన  మాట్లాడుతూ  కరోనా వైరస్  ప్రభావం  కారణంగా లాక్ డౌన్  అమలు జరుగుతున్న   సందర్భంగా  కారాగారంలో ఉన్న  ఖైదీలను  మధ్యంతర బెయిల్  పిటిషన్ పై   విడుదల చేయాలని  సుప్రీం కోర్ట్  మరియు  ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు  ఆదేశాల మేరకు  కారాగారంలో ఉన్న   53 మంది రిమాండ్ ఖైదీలు 21 మంది శిక్ష ఖైదీలు  మొత్తం 74 మందిని  మార్చి 31న విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. ఈ సందర్భంగా  కారాగారంలో ఉన్న  ఏడుగురు మహిళలతో 74 మంది ఖైదీలను  విడుదల చేయడం జరిగిందన్నారు. విశాఖ  ఏడవ  అడిషనల్ మెట్రోపాలిటన్  మేజిస్ట్రేట్  జగదీష్ కుమార్ ఆధ్వర్యంలో మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఖైదీలను ఇళ్లకు  పంపించామని  తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా  ఖైదీలు  సామాజిక దూరం  వ్యక్తిగతవ శుభ్రత  పాటించాలని  ఎల్ల కే పరిమితం కావాలని   రాహుల్  సూచనలు  ఇచ్చారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...