Followers

ఓ వ్యక్తిని ఏప్రియల్ పూల్ చేస్తే ఏమొస్తుంది-అదే ఓ మొక్క నాటితే ఏప్రియల్ కూల్ అవుతుంది

 ఓ వ్యక్తిని ఏప్రియల్ పూల్ చేస్తే ఏమొస్తుంది-అదే ఓ మొక్క నాటితే ఏప్రియల్ కూల్ అవుతుంది

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడి రెవెన్యూ కార్యాలయంలో ఏయస్ఓ జోడాల వెంకటేశ్వరరావు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటువుంటారు. వారి కుటుంబంలో పెళ్లి రోజులు, పుట్టినరోజులు వచ్చినప్పుడు అర్భాటాలకు, హంగులకు ధనం వెచ్చించకుండా తమకు ఉన్నంతలో, స్తోమతను బట్టి వృద్ధులకు బట్టలు పంపిణీ, స్కూల్ పిల్లలకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ, వృద్దాశ్రమాలకు ధనం, ఆహారం, నిత్యావసరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు ఇలాఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం అలవర్చుకున్నారు. అదేక్రమలో గురువారం వినూత్నంగా, సేవాకార్యక్రమాల్లో భాగంగా తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో తహశీల్దార్ ఎం.నరసింహమూర్తి కి మొక్కలు అందించి, నాటించారు. అదేవిధంగా తోటి ఉద్యోగుల కు మొక్కలు అంధించి, నాటించారు. ఈయన కూడా మొక్కలు నాటారు. జోడాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విభిన్నంగా ఆలోచించి, పలు సేవా కార్యక్రమాలు చేయడం తన లక్ష్యమని తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నరసింహమూర్తి మాట్లాడుతూ అందరూ సమాజహితమైన కార్యక్రమాలు చేయుట కు ఏయస్ఓ జోడాల వెంకటేశ్వరరావు ని స్ఫూర్తి గా తీసుకోవాలని తెలిపి, ఆయనను అభినందించారు. ఈ కార్యక్రమంలో డిటి ఏ.రాజబాబు, సీనియర్ అసిస్టెంట్ సత్యేంద్ర కుమార్, ఆర్ఐ క్రాంతిరేఖ, జూనియర్ అసిస్టెంట్ ప్రభు కుమార్, విఆర్వో లు ప్రకాష్, కమల్, సాయి, విఆర్ఏ లు సురేష్, ఉమారాణి, భాగ్యలక్ష్మి, శ్రీలక్ష్మి, అబ్బులు, అటెండర్ నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

శ్రీరామకృష్ణకు రసాయన శాస్త్రంలో డాక్టరేట్

 శ్రీరామకృష్ణకు రసాయన శాస్త్రంలో డాక్టరేట్

పెన్ పవర్,ఆలమూరు

     కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం సందిపూడి గ్రామానికి చెందిన సూరపరెడ్డి శ్రీరామకృష్ణ  రసాయన శాస్త్రంలో డాక్టరేట్ పొందారు. ఆచార్య డాక్టర్ రవీంద్రనాథ్ కుంట పర్యవేక్షణలో "అరుదైన చక్కెర వాటి ప్రోసెసింగ్ సంబంధిత మలినాల విశ్లేషణ కోసం నోవెల్ క్యాపిల్లరీ ఎలక్ట్రో ఫోరెసిస్ పద్ధతి అభివృద్ధి" అనే అంశంపై సమర్పించిన సిద్ధాంత గ్రంథానికి  కేఎల్ యూనివర్శిటీ రిజిస్టార్ ఆచార్య వై వి ఎస్ ఎస్ వి ప్రసాద్ రసాయన శాస్త్రంలో ఆయనకు డాక్టరేట్ ప్రకటించారు. ఆలమూరు మండలానికి చెందిన సూరపురెడ్డి శ్రీరామకృష్ణకు ఈ అరుదైన డాక్టరేట్ సాధించడంతో పినపల్ల సర్పంచ్ సంగీత సుభాష్, సంధిపూడి సర్పంచ్ తోట భవానీ వెంకటేశ్వర్లు, పెదపల్ల సర్పంచ్ యేడిద సత్యశ్రీ మెహర్ ప్రసాద్, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వైవీవీ రమణ పలువురు ప్రజాప్రతినిధులు అభినందించారు.

అన్నదేవరపేటలో కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం

అన్నదేవరపేటలో కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామ ఎలిమెంటరీ స్కూల్లో తహశీల్దార్ ఎం.నరసింహమూర్తి ఆధ్వర్యంలో గురువారం 45 సంవత్సరాలు దాటిన ప్రతీ ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ వేసే కార్యక్రమం ప్రారంభం జరిగింది. కార్యక్రమంలో భాగంగా 45 సంవత్సరాలు దాటిన వారికి వైద్యులు కోవిడ్ వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నదేవరపేట  పిహెచ్సి డాక్టర్ మైఖేల్, డాక్టర్ కరిష్మా, పంచాయతీ  సర్పంచ్ ఎలిపే సుధారాణి, పంచాయతీ సెక్రటరీ అనురాధ, విఆర్వో లు నాగేశ్వరరావు, బోస్, ఆశావర్కర్లు, ఏయన్ఎం లు, తదితరులు పాల్గొన్నారు.

కార్మిక లేబర్ కోడ్స్ తక్షణం రద్దు చేయాలి వామపక్ష కార్మిక సంఘాలు డిమాండ్

 కార్మిక లేబర్ కోడ్స్ తక్షణం రద్దు చేయాలి వామపక్ష కార్మిక సంఘాలు డిమాండ్

మహారాణి పేట, పెన్ పవర్

కార్మిక లేబర్ కోడ్స్ తక్షణం రద్దు చేయాలి వామపక్ష కార్మిక సంఘాలు డిమాండ్ లేబర్ కోడ్స్ జీవోలు దగ్దం. బిజెపి ప్రభుత్వం కార్మికులకు నష్ట దాయకమైన నాలుగు లేబర్ కోళ్ళు తక్షణమే రద్దు చేయాలని సిఐటియు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఆర్ కె యస్ వి కుమార్,  పడాల రమణ డిమాండ్ చేశారు.నేడు జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు కార్మిక చట్టాల సవరణ జీవో కాపీలను  జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద 4 కార్మిక లేబర్ కోడ్స్ కాపీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నరేంద్రమోదీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను యజమానులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్స్ గా మార్చడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే కార్మిక చట్టాలు ఉన్న వాటిని సక్రమంగా అమలు చేయడం లేదని అన్నారు. ఇప్పుడు యజమాని దయా దాక్షిణ్యాల మీద కార్మికుడు ఆధార పడాల్సి వస్తుందన్నారు. ఇది కార్మికుల ఉపాధికి తీవ్ర విఘాతం అన్నారు. పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దుచేసి హక్కు మోడీకి లేదన్నారు. తక్షణమే లేబర్ కోడ్స్ రద్దు చేయక పోతే పెద్ద ఎత్తున పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జగన్, సుబ్బారావు,చంద్రమౌళి,ఎఐటియుసి నాయకులు వామనమూర్తి,ఆనంద్,రాము తదితరులు పాల్గొన్నారు.

చిరస్మరణీయుడు పింగళి వెంకయ్య

చిరస్మరణీయుడు పింగళి వెంకయ్య

అరకు, పెన్ పవర్

చిరస్మరణీయుడు పింగళి వెంకయ్య అని పీసీసీ ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి  అన్నారు జాతీయ పతాకం రూపకల్పన చేసి  100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం అరకు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా శాంత కుమారి మాట్లాడుతూ మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్రాలు నాటి నాయకుల త్యాగాలే అని అన్నారు ఆ తరం వారిని నేటితరం భవిష్యత్తు తరం కూడా మరువకూడదని అన్నారు స్వాతంత్ర్యం సాధించడానికి కి ఒక్కొక్కరూ ఒక్కొక్క స్థాయిలో ఉద్యమాలు చేశారని వారి ఉద్యమ స్ఫూర్తినీ తీసుకుని ప్రతి ఒక్కరూ పని చేసిన నాడే వారి త్యాగాలకు సార్థకత ఏర్పడుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఎండపల్లి వలస కస్తూర్బా స్కూల్ విద్యార్థులు జాతీయ గీతం పాడగా జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించడం జరిగింది.


 అక్కడ పాల్గొన్న విద్యార్థులకు మిఠాయిలు పంచిపెడుతూ వారికి నోట్సులు పెన్నలు పెన్సిలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాచిపెంట చిన్నస్వామి అరకువేలి మండలం కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి శెట్టి భగత్ రామ్ డుంబ్రిగూడ కండ్రుమ్ పంచాయతీ ఎం పి టి సి కె లోలిత్ మహిళా మండలి అధ్యక్షురాలు లోగిలి చంద్రకళ మహిళా మండల ప్రధాన కార్యదర్శి పాచిపెంట ధనలక్ష్మి మహిళా మండల వైస్ ప్రెసిడెంట్ ఉల్లి నీలవేణి హుకుంపేట మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు గంజాయి భాగ్యరాజు అరకువేలి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మొస్య ప్రేమ్ కుమార్ హ్యూమన్ రైట్స్ మండల అధ్యక్షుడు చట్టు మోహన్ గుంజిడి సుబ్బారావు స్కూల్ విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళలు యువత తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణ ప్రాంతాల జీవన వైవిధ్యం మరింత మెరుగు

 గ్రామీణ ప్రాంతాల జీవన వైవిధ్యం మరింత మెరుగు

విశాఖ ద్వారకానగర్,పెన్ పవర్ 

 ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో కొత్త వెలుగులతో కలకళలాడలని అవసరమైన ప్రతి చోట వీధి లైట్ లు ఏర్పాటు చేయడంకోసం  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న పల్లె వెలుగు కార్యక్రమాన్ని బుధవారం చోడవరం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా విచ్చేసిన చోడవరం శాసనసభ్యులు శ్రీ కరణం ధర్మశ్రీ చేతుల మీదుగా సంబంధిత ఉత్తర్వుల కాపీలను విడుదల చేయడమైనది.

ఈ సందర్బంగా ధర్మశ్రీ మాట్లాడుతూ ఈ జగనన్న పల్లె వెలుగు కార్యక్రమం వలన గ్రామీణ ప్రాంతాల జీవన వైవిధ్యం మరింత మెరుగు పడుతుందని , కొత్తగా ఎన్నికయిన సర్పంచ్ లకు చెక్ పవర్ ఉంటుందని వాటిని ఉపయోగించుకుని గ్రామాభివృద్ధికి తోడ్పడటంలో విశేశంగా కృష్జి చేయాలని  సూచించారు. మరియు సర్పంచ్ ల  యొక్క విది విధానాలను తెలిపారు. గ్రామాలలో కొత్తగా ఎల్.ఈ.డి. లైట్ లు అమర్చాలని దానికి సంబంధించిన డెమో ను వారికి చూపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎం. డి.ఓ. శ్యామ్ సుందర్ కొత్తగా ఎన్నికయిన 4 మండలాల సర్పంచ్ లు , పంచాయితీ ఈ.ఓ.లు, సంబంది అధికారులు పాల్గొన్నారు.

ఎల్లారెడ్డిపేట మండలంలో విచ్చలవిడిగా పగలు రాత్రి ఆక్రమంగా ఇసుక రావాణా

 ఎల్లారెడ్డిపేట మండలంలో విచ్చలవిడిగా పగలు రాత్రి ఆక్రమంగా ఇసుక రావాణా

ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న ఇసుక మాఫియా

అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోని అధికారులు...




ఎల్లారెడ్డిపేట,  పెన్ పవర్

  ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ ఇసుక రీచ్ నుండి ఇసుక మాఫీయా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి  అదికారుల కనుసన్నల్లో పగలు-రాత్రి తేడా లేకుండా విచ్చలవిడిగా ఆక్రమంగా  ఇసుక రవాణా చేస్తున్నారు. వెంకటాపూర్  ఇసుక రీచ్ నుంచి ఇసుక అవసరమున్న వారు  ఓక ట్రాక్టర్ ట్రిప్పుకు 300  రూపాయల  చొప్పున  చాలన్ కట్టి ప్రభుత్వ ఆదాయానికి జమ చేయవలసి ఉంటుంది. ఇసుక మాఫియా అలా కట్టకుండ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి  ఇసుకను క్రమంగా రవాణా  చేస్తూ లక్షలాది రూపాయలు సొమ్ముచేసుకుంటున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని  అదికారులకు లిఖితపూర్వకంగా .వాట్సాప్ ల ద్వారా సాక్షాధారాలతో పలువురు పిర్యాదులు చేసినా ఏనాడూ పట్టించుకున్న పాపనా పోలేదు. " ఎక్కడి దొంగలు అక్కడనే  గఫ్ చుఫ్ " అన్న చందంగా మండల స్థాయి  అదికారుల నుంచి జిల్లా స్థాయి  అదికారుల తీరు  ఉందని పలువురు విమర్షిస్తున్నామన్నారు . ఇసుక మాఫియా, అదికారులు కలిసి దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్న చందంగా వ్యవహారిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పిర్యాదులు చేస్తే ఆక్రమంగా ఇసుక ను  తరలిస్తున్న ఇసుక మాఫియా ను అరికట్టవలసిన అదికారులు అరికట్టలేక పోతున్నారు. అంతేకాదు  పిర్యాదు దారుల పేర్లను ఎంతో గోప్యంగా ఉంచవలసిన అదికారులు పిర్యాదు దారుల పేర్లను  భయట పెట్టి ఇసుక మాఫియా ఎదుట భధనామ్ చేస్తున్నారు. ఇసుక మాఫియా ట్రాక్టర్ ట్రాలీలో ఇసుక ను నింపి భయటకు ఇసుక కనభడకుండా గడ్డిని కప్పి ఆక్రమంగా ఇసుక ను రావాణా చేస్తున్నారు. అంతేకాకుండా ఇసుక మాఫియా  ట్రాక్టర్ ఇంజన్ బాడీల కు ట్రాలీ బాడీలకు నెంబర్ ప్లేట్స్ వాడడం లేదు. ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు.  ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ ఇసుక రీచ్  నుంచి ఎల్లారెడ్డిపేట. గంబీరావుపేట మండలాలో  ఇసుక ను డంపింగ్ చేసి  కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం మీదుగా  కామారెడ్డి .నిజామాబాద్. హైదరాబాద్ కు ఇసుక ను ఆక్రమంగా తరలించి లక్షలాధి రూపాయలను దండుకుంటున్నారు.  స్థానికంగా ఇళ్ళు కట్టుకునే వారు ఏవరైనా  ఇసుక కావాలనీ  అధికారుల దగ్గరకు వెళితే సవలక్ష కారణాలు వెతుకుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు.  ప్రజలను ఇబ్బందులకు గురిచేయడానికేనా మీకు  ప్రభుత్వం ఉద్యోగం కల్పించి వేతనాలు పెంచింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్. జిల్లా ఎస్పీ. వెంకటాపూర్ ఇసుక రీచ్ పై సమగ్రవిచారణ జరిపి ఇసుక మాఫియా ను అరికట్టి ఆక్రమాలకు పాల్పడుతున్నా రెవెన్యూ. పోలీస్  అదికారులను .సిబ్బంది నీ గుర్తించి వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...