Followers

గొడ్డిపుట్టు ఉపాధి కూలీలకు మాస్క్ లు పంచిన వి.ఆర్పీ

 గొడ్డిపుట్టు ఉపాధి కూలీలకు మాస్క్ లు పంచిన వి.ఆర్పీ

ముంచంగిపుట్టు ,పెన్ పవర్

కరోనా  బారిన పడకుండా ఉపాధి కూలీలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని  భౌతిక దూరం పాటించాలని  ఎన్ఆర్ఈజీఎస్  వి ఆర్ పి వెంగడ  చంద్ర  అన్నారు.శుక్రవారం సుజన కోట పంచాయితీ గొడ్డి పుట్టు గ్రామంలో ఉపాధి కూలీలకు మాస్క్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రెండవ దశ కరోనా విలయ తాండవం ఆడుతుందని  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  సూచించారు. మొదటి విడత కరోనా మాదిరి నిర్లక్ష్యం చేయవద్దని  ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరారు. ఉపాధి కూలీలు పనులు చేసే సమయంలో  మాస్కులు  ధరించాలి అని  గుంపులు గుంపులుగా  ఉండకుండా  భౌతిక దూరం పాటించక తప్పదు అన్నారు. పనులు పూర్తి అయ్యాక కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలన్మారు. గ్రామం విడిచి వెళ్లవద్దని ఇల్ల కే పరిమితం కావాలని అన్నారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకుని ఎటువంటి అనారోగ్యం వచ్చినా ఆశ కార్యకర్త ఏఎన్ఎం లను సంప్రదించాలని సూచించారు. నిత్యం ఉపాధి పనులు చేసే కూలీలు  మాస్కులు భౌతిక దూరం  తప్పనిసరిగా ఆచరించాలని వీ ఆర్ పి చంద్ర కోరారు. అతని వెంట టి ఏ కూడా పాల్గొన్నారు.

కె.జి.హెచ్ కోవిడ్ ప్రత్యేక అధికారిగా ఐటిడిఏ పిఓ నియామకం రద్దు చేయాలి.

కె.జి.హెచ్ కోవిడ్ ప్రత్యేక అధికారిగా ఐటిడిఏ పిఓ నియామకం రద్దు చేయాలి.

చింతపల్లి, ముంచింగ్ పుట్ లో కోవిడ్ సెంటర్ ప్రారంభించాలి

గిరిజన సంఘం డిమాండ్‌

పెన్ పవర్ బ్యూరో, విశాఖపట్నం

గిరిజన ప్రాంతాల్లో కోవిడ్ మహమ్మారి వ్యాప్తి తో రోగులు పెరుగుతుంటే సమర్థవంతంగా వైద్యం అందించేందుకు సమన్వయం చేసే ఐ. టి.డి.ఏ పిఓ ను కె.జి.హెచ్ కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ గా ప్రభుత్వం జారీ చేసిన నియామక ఆదేశాలను వెంటనే రద్దు చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స శుక్రవారం  డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పాడేరు ఐ.టి.డి.ఏ పరిధిలో సుమారు ఆరున్నర లక్షల మంది ప్రజలు ఉన్నారని, గిరిజన ప్రాంతాల్లో  రోజు రోజుకు కోవిడ్ సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాప్తి చెందిందని,భౌగోళికంగా విస్తారంగా ఎక్కువ గ్రామాలు, రహదారి నిర్మాణం కూడ సక్రమంగా లేని,అంబులెన్స్ వేళ్ళని గ్రామాలు ఉన్నాయన్నారు.సీజనల్ జ్వరాలకే మెరుగైన వైద్యం అందని ద్రాక్షగా గిరిజన గ్రామాలు ఉన్నాయన్నారు.పాడేరు జిల్లా ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేసిన నేటికి మెరుగైన వైద్యం కోసం రోగులను విశాఖపట్నం తరలిస్తున్నరన్నారు.కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రోగులకు వైద్యం కోసం పాడేరు జిల్లా ఆసుపత్రి లో వెంటిలేటర్ ఆపరేటర్ లేక రోజులు తరబడి నిరుపయోగంగా ఉందన్నారు.అధికారుల అసమర్థత వల్ల10 వెంటిలేటర్ ను విశాఖపట్నం తరలించారన్నారు. పాడేరు,అరకులోయ కోవిడ్ క్వారెంట్ సెంటర్ల ఏర్పాటు చేసిన మౌలిక వసతులు సమకూర్చాలని వారు డిమాండ్ చేశారు. చింతపల్లి, ముంచంగిపుట్టు ఏరియాల్లో కోవిడ్ విస్తరించిన నేటికి కోవిడ్ క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటు చేయలేదన్నారు.అరకొరగా ఉన్న వైద్య సేవలు, ఆసుపత్రిలో,క్వారంటైన్ సెంటర్ల కొరవాడిన మౌలిక వసతులు, విస్తరిస్తున్న కోవిడ్ నుండి గిరిజనుల ప్రాణాలు కాపడవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో కోవిడ్ మరణాల పెరుగుతుంన్నా కోవిడ్ టెస్టు రిపోర్ట్ రాక రోగులు అయోమయంలో  ఉన్నారన్నారు.పాడేరు కేంద్రగా ల్యాబ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఇన్ని సమస్యలు ఉంటే గిరిజన ప్రాంతాల  కోసం ప్రత్యేకంగా నియమించిన అధికారి పిఓను కె.జి.హెచ్  కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ గా నియమించి  గిరిజన ప్రాంత ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారన్నారు.గిరిజన ప్రాంతాల్లో ప్రజల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్షత, నిర్లక్ష్యం తగదన్నారు.

గడువు దాటినా అందని వ్యాక్సిన్,,,, అందేనా !?

గడువు దాటినా అందని వ్యాక్సిన్,,,, అందేనా !?

ఆరిలోవ, పెన్ పవర్

కో వ్యాక్సిన్. టీకాల పై ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు. తొలివిడత వ్యాక్సిన్ దేవుడెరుగు రెండోవిడత వ్యాక్సిన్ పై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం వార్డు కార్పొరేటర్, సచివాలయం సిబ్బంది గాని పి హెచ్ సి సిబ్బంది ఈ విషయంపై ఎటువంటి సమాధానం ఇవ్వలేకపోతున్నారు ప్రజలు అడిగిన ప్రశ్నలకు వారి వద్ద సమాధానం లేదు. తొలి విడత  వ్యాక్సిన్ వేయించుకున్న ప్రజలు రెండో దఫా వ్యాక్సిన్ వేయించుకోవడం లో ప్రభుత్వం చేస్తున్న జాప్యానికి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  విమ్స్ ఆసుపత్రి పూర్తిగా కోవిద్ ఆసుపత్రి గా ఉంచడం వలన  వ్యాక్సిన్ విషయంలో ఆరిలోవ హెల్త్ సెంటర్ పై భారం పడింది   హాస్పిటల్ లో సిబ్బంది కొరత,  వేతనాలు జాప్యం వెరసి ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై పని భారం పెరగడంతో వ్యాక్సిన్ కోసం వచ్చేవారిని నియంత్రించడం పై పూర్తిగా చేతులెత్తేసారు. సిబ్బంది వారి ప్రయత్నాలు ఎంత చేసినా ప్రజలు సహకరించకపోవడంతో  చేతులెత్తేసారు.

నగరంలో పలు ప్రాంతాల నుండి కరోనా వ్యాక్సిన్ కొరకు ఆరిలోవ హెల్త్ సెంటర్ కు రావడంతో స్థానికులకు వ్యాక్సిన్ దొరకటం లేదని మరియు అధిక సంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి హాస్పిటల్ కి తరలిరావడంతో వారిద్వారా కరోనా మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని స్థానికప్రజలు భయపడుతున్నారు. వార్డు కార్పొరేటర్ ఆధ్వర్యనా  సచివాలయంలో వాక్సీన్ అందజేసే చర్యలు చేపట్టక పోవడం వలన ప్రజలు  ఇబ్బందులు  పడుచున్నారు. ఆరిలోవ హెల్త్ సెంటర్ లో కొంతమంది చోటా నాయకులు తమవారికి వ్యాక్సిన్ అందజేసే విషయంలో తమ హవా కొనసాగిస్తూన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరితగతిన వ్యాక్సిన్ విషయంలో సచివాలయాల ద్వారా స్థానిక ప్రజలకు వ్యాక్సిన్అందజేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఫార్మా కంపెనీలు పరవాడలో ఆక్సిజన్ తో కూడిన కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయండి

 ఫార్మా కంపెనీలు పరవాడలో ఆక్సిజన్ తో కూడిన కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయండి

 

పరవాడ, పెన్ పవర్

ప్రస్తుత పరిసితుల్లో మడలంలో కరోనా విలయ తాండవం చేస్తున్న కారణంగా    జవహర్ లాల్ నెహ్రు ఫార్మాసిటీ(జె.ఎన్.పి.సి) లో గల ఫార్మా కంపెనీ యాజమాన్యాలను పరవాడ మండల ప్రజల ప్రాణ రక్షణ కొరకు కనీసం 50 ఆక్సిజన్ సదుపాయం కలిగి బెడ్ల తో కూడిన కేర్ సెంటర్ ని ఏర్పాటు చేయాలి అని వైసీపీ జెడ్పిటిసి అభ్యర్థి పి ఎస్. రాజు  విన్నపం చేశారు. గత సంవత్సరం కరోనా కాలంలో ఫార్మా కంపెనీలు రాస్ట్ర ప్రజలకు,సమీప నిర్వాసిత గ్రామ ప్రజలకు మీరు చేసిన సహాయములు,సేవలు,మరువలేనివి అని యాజమాన్యాలకు ధన్యవాదములు తెలియ జేశారు.ఇప్పుడున్న పరిస్తితులలో ఘతం లో కంటే అధిక జనాభా కరోనా తో ప్రతిఘటిస్తున్నారు అని కొందరు ఆక్సిజన్ అందక మృత్యు వాత పడుతున్న కారణంగా ప్రజల ప్రాణాలు కాపాడటానికి సహృదంతో సత్వరమే కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి అని యజమాన్యాను శుక్రవారంనాడు పత్రికా ముఖంగా వినయపూర్వక అభ్యర్దన చేస్తున్నాను అని రాజు తెలియజేసారు.మీరు చేసే ఈ సేవ ద్వారా సమీప నిర్వాసిత గ్రామ ప్రజలకు మాత్రమే కాకుండా,కంపెనీలలో పనిచేసే కార్మికులకు,మీరు చాలా మేలు చేసిన వారు కాగలరని పి ఎస్.రాజు ఫార్మా యజమాన్యాను అభ్యర్ధించారు.

సి.ఎమ్, రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ద్రోణంరాజు శ్రీవత్సవ్

 సి.ఎమ్, రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ద్రోణంరాజు శ్రీవత్సవ్

మహారాణి పేట, పెన్ పవర్

విశాఖ దక్షిణ నియోజకవర్గం,33వ వార్డు, అమ్మవారివీధి, అల్లిపురం, బొర్రా వేలంకిణి కి స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాసరావు వి.ఎమ్.ఆర్.డి.ఏ, ఛైర్మన్గా ఉన్న సమయంలో చేసిన విజ్ఞప్తి మేరకు ఆయన తదనంతరం వారి కుమారుడు వైఎస్సార్సీపీ యువనాయకులు ద్రోణంరాజు శ్రీవత్సవ్  ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారులతో మాట్లాడి తనవంతు కృషి చేసి దక్షిణ నియోజకవర్గం లో కొన్ని  సి.ఎమ్, రిలీఫ్ ఫండ్ చెక్కులను విడుదల చేయించగా ఇందులో భాగంగా ముఖ్యమంత్రివర్యులు వై.యెస్ జగన్మోహనరెడ్డి తన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి(సి.ఎమ్.ఆర్.ఎఫ్) రూ 60,000/-(అరవై వేల రూపాయలు) మంజూరు చేసిన సి.ఎం,రిలీఫ్ ఫండ్ చెక్కును ద్రోణంరాజు శ్రీనివాసరావు తనయుడు ద్రోణంరాజు శ్రీవత్సవ్ చేతుల మీదుగా వేలంకిని కి అందచేయడం జరిగింది.చెక్కును అందుకున్న వారు ఇలాంటి కష్ట కాలంలో డబ్బులు అందించడం అనేది చాలా సంతోషంగా ఉందని  తండ్రి లాగానే మీరు కూడా అతి తక్కువ సమయంలోనే ప్రజలందరికి సూపరిచితులు ఐయ్యారని తండ్రి ద్రోణంరాజు శ్రీనివాసరావు లాగనే ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సుశీల, పచ్చరపల్లి రాము తదితరులు పాల్గొన్నారు.

విక్టోరియా హాస్పిటల్ నందు బిజెపి ఓబీసీ మోర్చా సహాయ కార్యక్రమాలు

 విక్టోరియా హాస్పిటల్ నందు బిజెపి ఓబీసీ మోర్చా

 సహాయ కార్యక్రమాలు

మహారాణి పేట, పెన్ పవర్

బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బిట్ర.వెంకట శ్రీమన్నారాయణ పిలుపు మేరకు మరియు భారతీయ జనతా పార్టీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు మేడపాటి రవీందర్ రెడ్డి సూచన మేరకు శుక్రవారం విక్టోరియా గవర్నమెంట్ హాస్పిటల్ నందు వాటర్ బాటిల్స మరియు  క్రీమ్ బన్,పండ్లు 300 మందికి పంచడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కంటిబుక్త శ్రీనివాస్ రావు రాష్ట్ర కోశాధికారి మరియు బిజెపి ఓబిసి విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లి శ్రీనివాసులు నాయుడు, జె.శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి ఈ ముగ్గురి ఆర్థిక సాయం తో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎడ్ల రమణ రాజు జిల్లా కార్యదర్శి,చిత్రాడ రామకృష్ణ ప్రధాన కార్యదర్శి జిల్లా, ఓ.బి.సి కమిటీ, బీసీ నాయకులు మరియు మున్నా  36 వ వార్డు అధ్యక్షులు,సౌత్ కోఆర్డినేటర్ కొప్పుల రామ్ కుమార్ బిజెపి ఓబీసీ పార్లమెంట్ కమిటీ నాయకులు  పాల్గొన్నారు.

అల్లూరి స్పూర్తి తో ప్రభుత్వరంగాన్ని రక్షంచుకుంటాం సి.ఐ.టి.యు

 అల్లూరి స్పూర్తి తో ప్రభుత్వరంగాన్ని రక్షంచుకుంటాం 

 సి.ఐ.టి.యు

మహారాణి పేట, పెన్ పవర్

వై.రాజు నగర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ అల్లూరి స్పూర్తితో ప్రభుత్వ రంగాన్ని రక్షించుకునే వరకు పోరాడుతాం. ఈరోజు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని సందర్భంగా దీక్ష శిబిరం వద్ద ఆయన ఫోటో కి పూలమాలవేసి దీక్షను ప్రారంభించారు అల్లూరి సీతారామరాజు స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రజలందరినీ చైతన్యం చేసి మన దేశానికి స్వతంత్రం కోసం ఆనాటి అదే స్ఫూర్తితో దేశ భక్తి ముసుగులో దేశాన్ని విదేశీలకు తాకట్టు పెట్టె విదంగా మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయాలనుకుంటున్నా విధానాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రభుత్వ రంగాన్ని రక్షించుకుందాం. భారతదేశం అభివృద్ధి రావడానికి కారణం లేదా విశాఖపట్నం అభివృద్ధి అవ్వడానికి కారణం ప్రభుత్వ సంస్థలే. అటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతుంటే మోడీకి ఎప్పటికి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బుద్ధి చెప్పారు అయినా మోడీకి బీజేపీకి సిగ్గు రావట్లేదు. మనకు కరోన ఇబ్బంది పెడుతున్న సరే  సరే మన పోరాటం కొనసాగుతుంది ఇదే మన విజయానికి నిదర్శనం. దీక్ష శిబిరంలో అనేక తరగతులకు సంబంధించిన ప్రజలు పాల్గొంటు, ఉద్యమం రోజురోజుకు ఉద్భతం అవుతున్నదన్నారు. స్టీల్ ప్లాంట్, ప్రభుత్వరంగ పరిరక్షణ కోసం జరుగుతున్న ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.ఈ రోజు సి. ఐ.టి.యు,నగర కార్యదర్శలు యమ్.సుబ్బారావు, బి.జగన్, డిఅప్పలరాజు చంద్రమౌళి, నర్సింగరావు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి కోటేశ్వరావు  78 వ వార్డు కార్పొరేటర్  డాక్టర్ బి గంగారావు జగదాంబ జోన్  నాయకులు, ఎం.జగ్గునాయుడు కమిటీ ఛైర్మన్ పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...