32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజుకు అభినందనలు తెలిపిన వార్డు వాలంటీర్లు,సచివాలయ సిబ్బంది
మహారాణి పేట, పెన్ పవర్
వార్డు ప్రజలకు ఎటువంటి సమస్యలు ఎదురైనా సహనంతో సేవా భావంతో పనిచేయాలని తనను కలసిన వాలంటీర్లకు 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు కోరారు.కార్పొరేటర్ గా గెలిచిన నాగరాజును వార్డు వాలంటీర్లు,సచివాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛమిచ్చి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ వార్డుకు సంబదించిన ఈ సమస్యనైనా తన దృష్టికి తీసుకురావాలని కోరారు.వార్డు పరిధిలో అర్హులందరికీ రేషన్ కార్డులు,పించేన్లు,ఇంటి ఇంటికీ రేషన్ వంటి కార్యక్రమంలో నిరంతరం కొనసాగేలా చేరాలని కోరారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా చూడాలని తన సహాయ సహకారాలు ఎల్లపుడు ఉంటాయని నాగరాజు తెలిపారు.
No comments:
Post a Comment