టిడిపి 5,7 కార్పొరేటర్ లకు ఘనసన్మానం
జిల్లాతెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మధురవాడ 5,7 వార్డుల నుండి టి.డి.పి నుండి కార్పొరేటర్లుగా పోటీ చేసి గెలిచిన మొల్లి హేమలత, పిళ్ళా మంగమ్మ, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు,టిడిపి సీనియర్ నాయకులు పిళ్ళా వెంకటరావులను బుధవారం విశాఖలోగల యన్.టి.ఆర్ భవనంలో విశాఖ తెలుగుదేశం పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు,మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ,తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులువెలగపూడి రామకృష్ణబాబు చేతుల మీదుగా ఉత్తరాంధ్ర ఇలవేల్పు అయిన సింహాద్రిఅప్పన్న స్వామి చిత్ర పటాన్ని అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమానికి టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment