Followers

పిల్లలు పుస్తకాలు చదవడం అలవర్చుకోవాలి

పిల్లలు పుస్తకాలు చదవడం అలవర్చుకోవాలి





పెన్ పవర్,మద్దిపాడు 

 చిన్న పిల్లలు కూడా గ్రంధాలయంలోని కథలు పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని గ్రంథపాలకులు గర్నెపూడి శాంసన్ పేర్కొన్నారు.మద్దిపాడు శాఖ గ్రంధాలయం నందు చదవటం మా కిష్టం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 22 విద్యార్థులు పాల్గొన్నారు ఉదయం 10 గంటలకు ప్రారంభమై 12 గంటలకు ముగిసే ఈ కార్యక్రమంలో ముందుగా పిల్లలకు నీతి కథలలోని ఎవరు మాట వినాలి కథను చదివిన తర్వాత వారిలో దాగివున్న జ్ఞాపకశక్తి వెలికి తీసేందుకు కథలోని ముఖ్యమైన పాయింట్లు గ్రంథపాలకులు అడిగి తెలుసుకున్నారు. గ్రంథపాలకులు గర్నెపూడి సాంసన్ మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక పఠనం పట్లా ఆసేక్తి పెంచుకోవలన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక  మంది  పాల్గొని ప్రతి ఆదివారం జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.



No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...