నేటి అఖిలపక్షం బందును విజయవంతం చేయాలి...
కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్
ఆదిలాబాద్ , పెన్ పవర్
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక చుట్టాలకు నిరసనగా నేడు నిర్వహించే అఖిలపక్షం బందును జిల్లా రైతులు, ప్రజలు విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంద్ కార్యక్రమనికి అన్ని వర్గాల ప్రజలు,వ్యాపారస్తులు మద్దతు నివ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నగేష్,ఎం ఏ షకీల్,షేక్ కలీమ్,రాజు యాదవ్,అర్ఫాత్,గఫ్ఫార్,రహీం,వామపక్షాల నాయకులు బండి దత్తత్రి,ప్రభాకర్ రెడ్డి,లంక రాఘవులు,మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment