Followers

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు ఖాయం

 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు ఖాయం

చిన్నగూడూరు,పెన్ పవర్

చిన్న గూడూరు మండల కేంద్రంలోని గురువారం నాడు వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ సన్నాహక సమావేశం ఏర్పాటు చేసినారు. ముఖ్యఅతిథిగా డోర్నకల్ శాసనసభ్యులు డీఎస్ రెడ్యానాయక్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎన్నికలలో పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు ఖాయం అన్నారు. పట్టభద్రులు వారి మొదటి ప్రాధాన్యత(1)  ఓటు పల్లా రాజేశ్వర్ రెడ్డికి వేయాలి అని వారు అన్నారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో జరుగుతున్న అభివృద్ధి పనులను వారు వివరించారు. మిషన్ భగీరథ ,వృద్ధాప్య పింఛన్ ,ఒంటరి మహిళ పింఛన్, కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్,రైతుబంధు, ఉచిత కరెంట్, రైతు బీమా, దేశానికి తలమానికంగా నిలిచినా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి రాష్ట్రంలోని ప్రతి ఎకరాలకు నీరు అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. రానున్న రోజులలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ని అందించే దిశగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వల్లూరు పద్మ వెంక రెడ్డి, జెడ్ పి టి సి మూల సునీత మురళీధర్ రెడ్డి, వైస్ ఎంపీపీ పిల్లి వీరన్న, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామ్ సింగ్ నాయక్, మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మండల యూత్ అధ్యక్షులు దుండి మురళి, సర్పంచులు, ఎంపీటీసీలు, పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...