జాతీయ యోగా పోటీలకు ఎంపికైన శ్రీ బాలాజీ విద్యా మందిర్ విద్యార్థులు
ఆదిలాబాద్ , పెన్ పవర్
తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ద మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్ అండ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 13 నుండి 16 వరకు ఆన్లైన్లో రాష్ట్ర స్థాయి యోగా పోటీలను నిర్వహించగా ఈ పోటీల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శ్రీ బాలాజీ విద్యా మందిర్ విద్యార్థులు జూనియర్ గర్ల్స్ విభాగంలో వాడ్కర్ వైష్ణవి నాలుగో స్థానంలో, జూనియర్ బాయ్స్ విభాగంలో వాడ్కర్ శ్రీనివాస్ మొదటి స్థానంలో విజయం సాధించారు. వీరు ఈనెల 24 నుండి 26 వరకు జరిగే ఆన్లైన్ జాతీయ స్థాయి యోగా పోటీలకు హాజరుకానున్నారు. అని గురువారం స్కూల్ డైరెక్టర్ రంగినేని పవన్ రావు, ప్రిన్సిపాల్ కే. సచింద్రనాథ్,యోగా శిక్షకుడు సిహెచ్ చేతన్ వారిని అభినందిస్తూ తెలిపారు.
No comments:
Post a Comment