చింతపల్లి హాస్టల్ లో బాలికల వెట్టిచాకిరి పై విచారణ
పెన్ పవర్,విశాఖపట్నంజిల్లాలోని చింతపల్లి మండలం గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో జరిగిన సంఘటనపై గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జి విజయ్ కుమార్ విచారణ చేపట్టారు. చింతపల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో గత బుధవారం రాత్రి విద్యార్థినిలా చేత వార్డెన్ ప్రధానోపాధ్యాయుడు సెక్స్ క్లీనింగ్ చేయించిన విషయం విధితమే. ఈ సంఘటనపై పత్రికలో వెలువడిన కథనాలకు స్పందించిన పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి వెంకటేశ్వర్ సలిజామల చింతపల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమం పాఠశాలలో విద్యార్థినిల చేత వెట్టిచాకిరి వేయించి న సంఘటనపై సమగ్రమైన విచారణ జరపాలని పాడేరు గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జి విజయ్ కుమార్ ని ఆదేశించారు. ఆ మేరకు డి డి చింతపల్లి గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. మొదట వసతి గృహం పరిసరాలను పరిశీలించారు. తర్వాత అర్ధరాత్రి వరకు డ్రైనేజీ క్లీనింగ్ చేసిన బాలికలతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం వసతి గృహంలో సిబ్బందిని ఉపాధ్యాయులను ఒకరొకరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థినిలు భయపడవలసిన అవసరం లేదని తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదన్నారు. చింతపల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో జరిగిన సంఘటనపై విచారణ జరిపి నివేదికను ఐటీడీఏ పీవో సమర్పిస్తామని బీడీ తెలిపారు.

No comments:
Post a Comment