ఆదిత్యలో ఇంటర్న్ షిప్ అవకాశాలపై అవగాహనా సదస్సు
గండేపల్లి,పెన్ పవర్
గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో బి.టెక్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు ఎ.ఐ.సి.టి.ఇ అధీకృత సంస్థ ఇంటర్న్ శాల వారు నిర్వహించే ఇంటర్న్ షిప్ అవకాశాలపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు కళాశాల ప్రిన్సిపాల్ డా. ఆదిరెడ్డి రమేష్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ ఇంటర్న్ షిప్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం,మరియు వాటి లాభాలను గురించి సోదాహరణలతో వివరించారు. ఈ సదస్సులో పాల్గొన్న జె.బాలరాజు,మేరీ జ్యోతి విద్యార్థులకు ఇంటర్న్ షిప్ లకు ఎలా ధరఖాస్తు చేయాలి, ఎలాంటి ఇంటర్న్ షిప్ లు ఎంచుకోవాలి వంటి విషయాలపై అవగహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్లేస్ మెంట్ ఆఫీసర్ మధు మాణిక్యం పాల్గొనగా సుమారు 500మంది విద్యార్థులు ఈ సదస్సుకు హాజరయ్యారు.

No comments:
Post a Comment