ప్రజాస్వామ్య పద్దతిలోనే ఓట్లు వేసేటట్లు సహకరించాలి
కుత్బుల్లాపూర్,పెన్ పవర్
పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రజాస్వామ్య పద్దతిలోనే ఓట్ల ప్రక్రియ కొనసాగేటట్లు ప్రతిఒక్కరు సహకరించాలని బిజెపి నాయకులు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్ నగర్ డివిజన్, రంగా రెడ్డి నగర్ డివిజన్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల డివిజన్లలో పోలింగ్ బూత్ల వద్ద పర్యటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ పట్టభద్రులు అందరూ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఓట్లు వేసేటట్టు మన నాయకులు అందరు కూడా సహకరించాలని సూచించారు.

No comments:
Post a Comment