Followers

అమ్మవారి పండుగల వల్ల గ్రామాలు సుభిక్షం..

 అమ్మవారి పండుగల వల్ల గ్రామాలు సుభిక్షం..

వి.మాడుగుల,పెన్ పవర్

 అమ్మవారి పండగలు చేయడంవల్ల గ్రామం సుభిక్షంగా ఉంటుందని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు అన్నారు. మంగళవారం మాడుగుల మొదమాంబ కాలనీ వాసులు చేసిన మోదకొండమ్మ పండగలో  ఆయన అమ్మవారి ఘట్టాలను మోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రతి గ్రామంలో అమ్మవారు కొలువై ఉండటం ఆనవాయితీగా వస్తుందని  గ్రామస్తులు ప్రతియేటా అమ్మవారికి  తీర్థ మహోత్సవాలు  పండగలు జాతరలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు బంధువులు స్నేహితులు ఇతరులను ఆహ్వానించడం వల్ల పల్లెల్లో సమైక్యతా భావం పెరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం సాహసోపేత పథకాలు అమలు చేస్తున్నారు. పేద ప్రజల వైద్యం కోసం  సీఎం సంక్షేమ నిధి నుంచి చెక్కుల ను అందజేయడం జరుగుతుందన్నారు. మాడుగుల కు చెందిన నలుగురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను ఆంద చేశారు. మొదమాంబ కాలనీలో  డ్రైనేజీ లను పరిశీలించారు. గ్రామంలో సిమెంట్ రోడ్ల నిర్మాణం జోరుగా సాగుతుందని   వాటిని నెలాఖరులోగా పూర్తి చేయాలని అన్నారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను కూడా మార్పులు చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...