Followers

ప్రజాస్వామ్యం లో ఓటుహక్కు వజ్రాయుధం

 ప్రజాస్వామ్యం లో ఓటుహక్కు వజ్రాయుధం

పెన్ పవర్,ఆలమూరు 

ప్రజాస్వామ్యం లో ఓటుహక్కు ప్రజలకు వజ్రాయుధమని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. మండపేట లో బుధవారం జిల్లా కలెక్టర్ పర్యటించారు. మునిసిపల్ ఎన్నికల సందర్భంగా మండపేట వేగుళ్ళ సూర్యారావు ప్రభుత్వ జూనియర్ కాలేజి లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ లను ఆయన తనిఖీ చేశారు. 23,24,25వార్డుల కు సంబంధించిన ఆరు గదుల్లో పోలింగ్ స్టేషన్ లు పరిశీలించారు. అలాగే రాజీవ్ గృహ కల్ప ఏరియా ఓటర్ల కు 30 వ వార్డు పరిధి లో ఇక్కడ ఓ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయగా ఆ కేంద్రాన్ని తనిఖీ చేశారు.ఈ సందర్భంగా అక్కడ క్యూ లైన్ లో ఉన్న ఓటర్ల తో కలెక్టర్ నేరుగా మాట్లాడారు. ఓటర్ స్లిప్ ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఉంటున్న వారు ఎవరైనా వచ్చారా అని అడగ్గా తాము స్థానికులమని ఓటర్లు సమాధానం ఇచ్చారు. అలాగే ఎన్నికల ఏర్పాట్లు పై సంతృప్తి వ్యక్తం చేశారు. కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ ను అభినందించారు. కలెక్టర్ వెంట పలువురు అధికారులు ఉన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...