Followers

క్రీడల్లో ఉన్నత శిఖరాలకు ఎదగాలి

 క్రీడల్లో ఉన్నత శిఖరాలకు ఎదగాలి

కాంగ్రేస్ పార్టీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ




లక్షెట్టిపెట్, పెన్ పవర్

క్రీడల్లో ఉన్నత శిఖరాలకు ఎదగాలని కాంగ్రెస్ పార్టీ డిసిసి అద్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు.పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం కొక్కిరాల రఘుపతిరావు మెమోరియల్ చారిటేబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ యువతను క్రీడల్లో ప్రోత్సహించాలని మండలాల వారిగా ఈ టోర్నమెంట్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.లక్షెట్టిపెట్ మండలంలో మొత్తం ముపైఅరు టీంలు పోటీలో పాల్గొంటున్నారని ప్రతిభ కనబర్చిన వాళ్లలో మొదటి బహుమతి డెభై ఐదువేలు, ద్వితీయ బహుమతి నలభై వేలు, మూడవ బహుమతి ఇరవై వేల రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు.పట్టుదలతో తారతమ్యాలు లేకుండా స్నేహపూర్వకంగా ఆడి విజయం సాదించాలని కోరారు.అనంతరం టాస్ వేసి పావురాలను గాలిలోకి వదిలి క్రికెట్ పోటీని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి అన్నంమంగ,జడ్పీటిసి ముత్తె సత్తయ్య,మున్సిపల్ ఫ్లోర్ మెంబర్ చెల్ల నాగభూషణం, కౌన్సిలర్లు చింత సువర్ణ,రాందేని వెంకటేష్,అరిఫ్, సత్తవ్వ,నాయకులు,చింత అశోక్,ఆయిల్లా విజయ్ కుమార్,పెండం శ్రీలత,ముజ్జు,నవాబ్, శ్రీదర్,శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...