పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం
తాళ్లపూడి, పెన్ పవర్గురువారం జరిగిన జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల్లో వైయస్సార్ పార్టీ కి ఓటేసిన ప్రతి ఓటర్ కి వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసిన పెద్దేవం ప్రెసిడెంట్ తిగిపల్లి వెంకటరావు, వైఎస్ఆర్సిపి జిల్లా కార్యదర్శి మరియు వైస్ ప్రెసిడెంట్ తోట రామకృష్ణ. అలాగే తోట రామకృష్ణ మాట్లాడుతూ పెద్దేవం గ్రామ పంచాయతీలో పోటీచేసిన ఇద్దరు ఎంపీటీసీ అభ్యర్థులు విజయం సాధిస్తారని తెలియజేశారు. అలాగే మొన్న కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు ధైర్యం ఇస్తూ నష్టపోయిన ప్రతీ రైతు పంట నమోదు చేసుకోవాలని తెలియజేశారు. రైతు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పొలం పాస్ బుక్ మరియు కౌలు కార్డు తీసుకుని విఆర్వో సుజాత ని, అగ్రికల్చర్ అసిస్టెంట్ శ్రీరామ్ ని కలవాలని తెలియజేశారు.

No comments:
Post a Comment