Followers

Showing posts with label NATIONAL. Show all posts
Showing posts with label NATIONAL. Show all posts

నిరసన వ్యక్తం చేసిన బి.జె.పి, ఓ.బి.సి, మోర్చా

 నిరసన వ్యక్తం చేసిన బి.జె.పి, ఓ.బి.సి, మోర్చా


                                                                   మహారాణి పేట ,పెన్ పవర్


పశ్చిమ బెంగాల్ లో తృనమూలు కాంగ్రెస్ బీజేపీ పార్టీ కార్యకర్తలు, ఆఫీస్ ల పైన జరుపుతున్న దాడులు, మహిళలపైన చేస్తున్న  అరాచకాలను ప్రజాస్వామ్య వాదులు ముక్త కంఠంతో ఖండించాలని, ఇదే విధంగా మేము కూడా దాడులకు తెగబడితే మమతా బెనర్జీ పార్టీ ఈ రోజు విజయం సాధించి ఉండేదా అని బీజేపీ జాతీయ అధ్యక్షులు ఏ.పి.నడ్డా అన్నారు. ఈ అరాచకాలను ప్రజాస్వామ్య వాదులంతా వ్యతిరేకించాలని, దీనిలో భాగంగా బీజేపీ కార్యకర్తలంతా తమ ఇండ్లలోనే కోవిడ్ కారణంగా ఈ రోజు ఉదయం 11గంటల నుండి 12 గంటల వరకు నిరసన కార్యక్రమం చేయాలనీ జాతీయ అధ్యక్షులు పిలుపు మేరకు, రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మమతా బెనర్జీ ఇది వరకు కమ్యూనిస్ట్ పార్టీ లను భయ, భ్రాంతులకు గురి చేసి నిర్ములించారని, బీజేపీ ని కూడా అదేవిదంగా చేద్దామనుకోవడం అవివేకం అని అన్నారు. బీజేపీ కార్యకర్తలు దేశభక్తి తో కూడిన త్యాగమయులని ఎట్టి పరిస్థితులు లోను తృణముల్ ఆటలు సాగవని అన్నారు. ఇటువంటి దురాగతాలను ప్రజాస్వామ్యవాదులంతా ముక్త కంఠంతో ఖండించాలని అన్నారు. దేశావ్యాప్తంగా ఈ రోజు ఉదయం 11 గంటలనుండి 12 గంటలవరకు ఈ నిరసన కార్యక్రమం లో పాల్గొన్న బీజేపీ కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదములు, అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో తమ ఇంటి వద్దనే ఓబీసీ మోర్చా పార్లమెంట్ అధ్యక్షులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఆయన మాట్లాడుతూ వెస్ట్ బెంగాల్ లో బిజెపి కార్యకర్తలకు బిజెపి నాయకులకు కేంద్ర ప్రభుత్వం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం నుంచి రక్షణ కల్పించాలి అని కోరుతూ  తృణమూల్ కాంగ్రెసు కార్యకర్తలు నాయకులు చేసిన దుశ్చర్యలను బిజెపి ఓబీసీ మోర్చా తీవ్రంగా ఖండిస్తోంది ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి ఓబీసీ  రాష్ట్ర కోశాధికారి శ్రీకంఠ భక్త శ్రీనివాస్ రావు, బిజెపి ఓబిసి సెక్రెటరీస్ ఎడ్ల రమణ రాజు,  ఎల్లాజీ యాదవ్, ట్రెజరర్ శ్రీనివాస్ రెడ్డి మరియు ఇతర నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఇట్లు బేసి బిజెపి విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు  పల్లి శ్రీనివాసులు నాయుడు అన్నారు

జాతీయ స్థాయి అవార్డులు దక్కిన పచ్చని పల్లెలు

జాతీయ స్థాయి అవార్డులు దక్కిన పచ్చని పల్లెలు

రాజన్న సిరిసిల్ల, పెన్ పవర్

కేంద్ర ప్రభుత్వం దీన్ దయాల్ స్వశక్తి కరణ్ పేరిట 2021 సంవత్సరానికి  మూడు విభాగాల్లో ఆవార్డులు ప్రకటించాయి. వివిధ విభాగాల్లో తెలంగాణ కు 13 అవార్డులు వరించగా జిల్లా పరిషత్, మండల పరిషత్ గ్రామ పంచాయతీలకు అవార్డులను కేంద్రం ప్రకటించింది.ఉత్తమ గ్రామ పంచాయతీ లకు గాను ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని మోయినికుంట ,ఎల్లారెడ్డిపేట లోని హరిదాస్ నగర్ గ్రామాలకు ఉత్తమ జాతీయ పంచాయతీ రాజ్  2021  అవార్డు  లభించింది. కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలో ప్రధాన మంత్రి ఇవ్వవలసిన అవార్డుని కరోనా కారణంగా ఆ కార్యక్రమం రద్దు కావడం వల్ల పోస్ట్ లో సిరిసిల్ల జిల్లాకి పంపించగా, జిల్లా కలెక్టర్, కృష్ణ భాస్కర్, జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ ల చేతుల మీదుగా హరిదాస్ నగర్ సర్పంచ్ తెడ్డు అమృత 2021 అవార్డు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో  ఎల్లారెడ్డి పేట్ జెడ్ పి టి సి చీటి లక్ష్మణ్ రావు , ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ , పంచాయతీ కార్యదర్శి లిదియ , ఎంపీడీఓ  బింగి చిరంజీవి ,ఎంపీఓ వజీర్ అహ్మద్ ఎంపీటీసీ ఉప్పుల మల్లేశం  పాల్గొన్నారు.

అర్ధరాత్రి ఇంట్లో చొరబడ్డ చిరుత ముగ్గురిపై దాడి

 అర్ధరాత్రి ఇంట్లో చొరబడ్డ చిరుత ముగ్గురిపై దాడి



చిరుతను ఇంట్లో పెట్టి తాళం 
చిరుత దాడిలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు
ఇంట్లో చిరుతపులి ని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు యత్నం




తమిళనాడు  గుడియాత్తం, పెన్ పవర్  

వేసవి తాపానికి ఇంటి తలుపులు తెరచి నిద్రిస్తున్న ఓ కుటుంబంపై అర్థరాత్రి చిరుత దాడి చేసి ముగురిని గాయపరచగా, చిరుతను ఇంట్లో పెట్టి తాళం వేసిన ఘటన తమిళనాడు రాష్ట్రం గుడియాత్తం సమీపంలో చోటుచేసుకుంది. గుడియాత్తం సమీపంలోని కలపాళ్యం గ్రామంలో బుధవారం రాత్రి వేలాయుధం భార్య ప్రేమ ఇద్దరు పిల్లలు మనోహర్, మహాలక్ష్మిలు నిద్రిస్తుండగా వేసవి తాపం అధికంగా ఉండటంతో ఇంటి తలుపులు తీసి పడుకున్నారు. అయితే, అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన చిరుత పులి ప్రేమ(40), పిల్లలు మనోహరన్ (20), మహాలక్ష్మి (14)లపై దాడిచేసింది. అర్ధరాత్రి చిరుత దాడితో భయభ్రాంతులకు గురైన వేలాయుధం కుటుంబం ఇంటి బయట పరుగులు తీయడంతో పాటు ఇంటి తలుపులు మూసేసి తాళం వేశారు. దీంతో ఇంట్లో నక్కిన చిరుతను పట్టుకునేందుకు అటవీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. చిరుత దాడిలో గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం గుడియాత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పున:ఆవిష్కరణల కారణంగానే కరోనాపై పోరాటాన్ని భారత్ ముందుండి నడిపిస్తోంది: ఉపరాష్ట్రపతి

 మూలాల్లోకి తిరిగి వెళ్లడం, పరిశోధన, పున:ఆవిష్కరణల కారణంగానే కరోనాపై పోరాటాన్ని భారత్ ముందుండి నడిపిస్తోంది: ఉపరాష్ట్రపతి 




మానవాళి గౌరవించుకునే ఉత్తమ వృత్తుల్లో వైద్యవృత్తి ఒకటి

వైద్య ఖర్చులు పెరుగుతుండటంపై ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆందోళన

దేశంలో అతిపెద్ద సామాజిక భద్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఈఎస్ఐసీపై ప్రశంసలు

విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఈఎస్ఐసీ వైద్య కళాశాల, ఫరీదాబాద్ తొలి స్నాతకోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రసంగం

బాధితులను పరీక్షీస్తున్నప్పుడు మానవత్వంతో వ్యవహరించాలని వైద్యులకు సూచన

  న్యూఢిల్లీ,  పెన్ పవర్ 

సంప్రదాయ మూలాల్లోకి వెళ్లడం, పరిశోధనలు, పున:ఆవిష్కరణల కారణంగానే ప్రపంచాన్ని కుదిపేసిన కరోనాపై పోరాటాన్ని భారతదేశం ముందుండి నడిపిస్తోందని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భారతీయ శాస్త్రవేత్తల నిరంతర పరిశోధనల కారణంగానే కరోనా సవాలును ఎదిరించి సమస్యకు సాంకేతిక పరిష్కారం కనుగొన్నామని ఉపరాష్ట్రపతి అన్నారు.

ఆదివారం విజ్ఞాన్ భవన్‌లో  ఈఎస్ఐసీ వైద్య కళాశాల (ఫరీదాబాద్) తొలి స్నాతకోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలోఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా విచ్చేసి, ప్రసంగించారు. భారతీయ వైద్యులు, శాస్త్రవేత్తలతోపాటు విధాన నిర్ణేతలు సరైన సమయంలో తీసుకున్న సరైన  నిర్ణయాల కారణంగానే కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో మనం విజయం సాధించామని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. ‘వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, సాంకేతిక నిపుణులు, ఆశా వర్కర్లు ఇలా కరోనాపై పోరాటంలో ‘టీమ్ ఇండియా’ స్ఫూర్తితో కృషిచేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు’ అని ఆయన పేర్కొన్నారు. పీపీఈ కిట్లు, సర్జికల్ గ్లవ్స్, మాస్కులు, వెంటిలేటర్లు, చివరకు టీకాను కూడా తక్కువ సమయంలో ఉత్పత్తిచేసిన భారతీయ పరిశ్రమను ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు.

ప్రతి విద్యార్థి జీవితంతో గ్రాడ్యుయేషన్ డే ఎంతో ప్రత్యేకమన్న ఉపరాష్ట్రపతి, జీవితంలో తర్వాతి దశలో సేవ చేసేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ‘స్వార్థం లేకుండా చిత్తశుద్ధితో మానవాళికి సేవకోసం మీరు చేసే సేవ ద్వారా అనంతరమైన మానసిక తృప్తిని పొందుతారని నేను బలంగా విశ్వసిస్తాను’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. వైద్యవృత్తి అత్యంత పవిత్రమైన వృత్తి అన్న ఉపరాష్ట్రపతి, వృత్తి నిర్వహణలో చిత్తశుద్ధితోపాటు నైతికతను, విలువలను పాటించాలని యువ వైద్యులకు సూచించారు. విలువలను పాటించే విషయంలో ఎప్పుడూ రాజీ పడకూడదన్న ఆయన, కరోనా అనంతర పరిస్థితుల నేపథ్యంలో వైద్యవృత్తి మరిన్ని సవాళ్లతో కూడుకున్నదని, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కరోనాపై పోరాటంలో ముందు వరస పోరాటయోధులుగా పాటుపడాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

కార్యక్రమంలో భాగంగా విశిష్ట ప్రతిభను కనబరచిన విద్యార్థులకు పతకాలను ప్రదానం చేసిన ఉపరాష్ట్రపతి, వారంతా అమ్మాయిలే కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మహిళలకు అవకాశం ఇస్తే, ఎలాంటి అద్భుతమైన ఫలితాలు వస్తాయనే దానికి ఇదో ఉదాహరణ అని, సోమవారం అందరికీ మహిళా దినోత్సవం కాగా, ఈఎస్ఐసీ వైద్య కళాశాల ఒక రోజు ముందే జరుపుకుందని తెలిపారు. కరోనా టీకాకరణ కార్యక్రమం దేశవ్యాప్తంగా ముందుకు సాగుతున్న పరిస్థితులను ప్రస్తావిస్తూ.. కరోనా కారణంగానెలకొన్న పరిస్థితులు మెల్లిమెల్లిగా సర్దుకుంటున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే కరోనా పూర్తిగా నిర్మూలించబడేంతవరకు ఎట్టిపరిస్థితుల్లోనూ అలసత్వాన్ని వహించవద్దని దేశప్రజలకు ఉపరాష్ట్రపతి సూచించారు. ప్రస్తుత కరోనా మహమ్మారి పట్టణాలతో పోల్చి చూస్తే, గ్రామాల్లో తన ప్రభావాన్ని చూపించలేకపోయిందని, దీనికి కారణం గ్రామీణ వాతావరణమే అని తెలిపారు.  పట్టణాల్లో ఇళ్ళు మొదలుకుని, ఆఫీసుల వరకూ ప్రతి ఒక్కటీ అన్నివైపుల పూర్తిగా మూసి ఉంచిన కారణంగా గాలి, వెలుతురు, సహజమైన వాతావరణానికి దూరం అవుతున్నారని, ఈ పరిస్థితులో మార్పు రావాలని, ఈ దిశగా నిర్మాణ రంగ నిపుణులు దృష్టి పెట్టాలని సూచించారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న అసంక్రమిత వ్యాధుల కేసులపై ఆవేదన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, భారతదేశంలో 65శాతం మరణాలకు అసంక్రమిత వ్యాధులే కారణమన్న ఈ ఏడాది ఆర్థిక సర్వేను సైతం ఆయన ప్రస్తావించారు. పెరుగుతున్న ఈ ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు పట్టణ ప్రాంతాల్లో ఈఎస్ఐసీ ఆధ్వర్యంలో ప్రత్యేక క్లీనిక్‌లను ఏర్పాటుచేయాలని ఆయన సూచించారు. యువ వైద్యులు సమీపంలోని పాఠశాలలు, కళాశాలలు, సామాజిక కేంద్రాలను సందర్శించి, అసంక్రమిత వ్యాధుల పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. జీవనశైలిలో మార్పు, పౌష్టికాహార అవసరం తదితర అంశాలను వారికి అర్థమయ్యేలా తెలియజేయాలని తద్వారా అసంక్రమిత వ్యాధులకు వీలైనంత వరకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. దీంతోపాటు వైద్యులు-రోగుల నిష్పత్తి, సరైన సంఖ్యలో వైద్య కళాశాలలు లేకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో కనీస వైద్య వసతుల లేమి, ఆరోగ్య బీమా విషయంలో సరైన అవగాహన లేకపోవడం కారణంగా తలెత్తుతున్న అంశాలను కూడా ఉపరాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు.  దీంతోపాటుగా వైద్య ఖర్చులు ఏటేటా పెరగడంపైనా ఉపరాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యులకు అందుబాటులో మంచి వైద్య వసతులను కల్పించే దిశగా భాగస్వామ్య పక్షాలన్నీ కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

భారతదేశంలోని 10శాతానికిపైగా జనాభాకు సరైన వైద్యవసతులు అందించేందుకు సామాజిక భద్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఈఎస్ఐసీని ఉపరాష్ట్రపతి అభినందించారు. అయితే, సమస్యల పరిష్కారం, వైద్య వసతుల అభివృద్ధి తదితర అంశాల్లో మరింత పురోగతి జరిగేందుకు ఆస్కారం ఉందన్నారు. జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్‌హెచ్ఏ)తో ఒప్పందం కుదుర్చుకుని, ఈఎస్ఐ పథకం లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్‌ జాబితా ఆసుపత్రుల్లో చికిత్సను అందించే విషయంపై నిర్ణయం తీసుకోవడంతోపాటు పలు ఇతర సంస్కరణల ద్వారా కార్మికులకు ఆరోగ్య భద్రత కోసం సంస్కరణలు తీసుకొస్తున్న కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖను ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభినందించారు.

అంతర్జాతీయ వైద్య పర్యాటక కేంద్రంగా భారతదేశం సాధిస్తున్న ప్రగతిని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. ఈ దిశగా మరింత పురోగతి సాధించేందుకు యువ వైద్యులు మరింత కృషిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి (ఇండిపెంటెండ్ చార్జ్) శ్రీ సంతోష్ కుమార్ గంగ్వార్, కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర, ఈ.ఎస్.ఐ.సి. డైరక్టర్ జనరల్ శ్రీమతి అనురాధ ప్రసాద్, డీన్ డా.అసిమ్ దాస్ సహా అధ్యాపకులు, విద్యార్థులు  పాల్గొన్నారు.

బాలాకోట్​పై భారత్ వైమానిక దాడులకు రెండేళ్లు

 బాలాకోట్​ పై భారత్ వైమానిక దాడులకు రెండేళ్లు

 పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రస్థావరాలపై దాడి

వందలాది మంది ఉగ్రవాదుల హతం..

బలగాల ధైర్య సాహసాలకు సెల్యూట్ చేస్తున్నానన్నరాజ్ నాథ్

ఉగ్రవాదంపై భారత్ దృక్పథానికి నిదర్శనమన్న అమిత్ షా

 న్యూస్ డెస్క్, పెన్ పవర్

అందరూ హాయిగా నిద్రపోతున్న టైం అది. నిశీధి పరిచేసిన గగన వీధుల్లో ఝమ్మంటూ దూసుకెళ్తున్న యుద్ధ విమానాల నుంచి జారిన జ్వాలా క్షిపణులు.. క్షణాల్లో ఉగ్ర స్థావరాలను అగ్ని కీలల్లో ముంచెత్తాయి. వందలాది మంది ఉగ్రమూకలను ఆహుతి చేశాయి.2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సైనికులను బలిగొన్న ఉగ్రదాడులకు ప్రతీకారంగా.. వారం రోజులు తిరగకముందే ఫిబ్రవరి 26న పాక్ ఆక్రమిత భూభాగంలో ఉన్న బాలాకోట్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ చేసిన వైమానిక దాడులివి. గుండెల్లో నివురుగప్పిన ఆ ప్రతీకారాన్ని తీర్చుకుని నేటికి రెండేళ్లు.ఈ సందర్భంగా వైమానిక దళ సైనికుల ధైర్య సాహసాలను కొనియాడుతూ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా బాలాకోట్ దాడులను గుర్తు చేసుకున్నారు. ‘‘బాలాకోట్ పై వైమానిక దాడులకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా భారత వైమానిక దళ ధైర్య సాహసాలకు సెల్యూట్ చేస్తున్నా. ఉగ్రవాదంపై తమ పోరాటం సాగుతుందని చెప్పడానికి ఈ దాడులే నిదర్శనం. దేశాన్ని ఎల్లప్పుడూ భద్రంగా, సురక్షితంగా ఉంచుతున్న సాయుధ బలగాలు మాకు గర్వకారణం’’ అని రాజ్ నాథ్ ట్వీట్ చేశారు.బాలాకోట్ పై దాడులతో ఉగ్రవాదంపై భారత్ దృక్పథం ఏంటో మరోసారి రుజువు చేసిందని అమిత్ షా అన్నారు. ‘‘పుల్వామాలో అమరుల త్యాగాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. బాలాకోట్ దాడుల సందర్భంగా వైమానిక దళాలు చూపించిన తెగువకు సెల్యూట్ చేస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ, సైనికుల భద్రతే మాకు ప్రధానం’’ అని ట్వీట్ చేశారు.
కాగా, బాలాకోట్ ఎయిర్ స్ట్రయిక్స్ తర్వాత జరిగిన ఘర్షణల్లో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్థాన్ ఎఫ్16 విమానాన్ని కూల్చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో పాక్ భూభాగంలో ఆయన విమానం కూలిపోయింది. అక్కడి వారికీ అభినందన్ బందీగా చిక్కాడు. పాక్ సైనికులు ఆయన్ను అదుపులోకి తీసుకుని, కొన్ని రోజులు విచారించిన తర్వాత, అంతర్జాతీయ ఒత్తిడి మేరకు తిరిగి భారత్ కు అప్పగించారు.

సామాన్యుడికి మ‌రిన్ని క‌ష్టాలు..

సామాన్యుడికి మ‌రిన్ని క‌ష్టాలు..

పాల ధ‌ర‌లూ భారీగా పెంచాల‌ని నిర్ణ‌యం

 ఇప్ప‌టికే పెట్రోలు, డీజిల్వంటగ్యాస్, ఉల్లి ధరల పెంపు

మధ్యప్రదేశ్ లోని రాట్లం సిటీలో పాల ధరల పెరుగుద‌ల‌

మార్చి 1 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చే అవ‌కాశం

దేశ వ్యాప్తంగా ప్ర‌భావం

 న్యూస్ డెస్క్ , పెన్ పవర్ 

 సామాన్యుడి మీద పాల ధ‌ర‌ల పెరుగుద‌ల రూపంలో మ‌రో పిడుగు ప‌డ‌నుంది. ఇప్ప‌టికే పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్, ఉల్లి ధరల‌తో పాటు ప‌లు వ‌స్తువుల ధ‌ర‌లు పెర‌గ‌డంతో సామాన్యులు ఇబ్బందులు ప‌డుతున్న విష‌యం తెలిసిందే. మధ్యప్రదేశ్ లోని రాట్లం సిటీలో పాల ధరల పెరగనున్న నేపథ్యంలో దాని ప్ర‌భావంతో  దేశంలో కూడా  పాల ధరలు భారీగా పెర‌గ‌నున్నాయి. జాతీయ మీడియా క‌థ‌నాల ప్ర‌కారం..  రాట్లంలో పాల ధరలు పెంచాల‌ని అక్క‌డి ప‌లు సంఘాలు నిర్ణ‌యం తీసుకున్నాయి. ఈ నెల 23న ఆయా సంఘాలు స‌మావేశం నిర్వహించి పాలు లీటరుపై రూ.12 పెంచాల‌ని నిర్ణ‌యించాయి. ఈ మేర‌కు అధికారుల అనుమతితో వ‌చ్చేనెల 1 నుంచే ఈ ధరల‌ పెంపును అమలు చేయనున్నారు. ఇప్ప‌టికే అధికంగా ఉన్న పాల దొర కొత్త ధ‌ర‌లు అమ‌ల్లోకి వ‌స్తే లీటరుకు రూ .55కు చేర‌నుంది.  ప్రస్తుతం లీటర్ పాల ధర రూ.43గా ఉంది. నిజానికి గత ఏడాదిలోనే పాల ధరలు పెంచాల‌ని ఉత్పత్తిదారులు డిమాండ్ చేసిన‌ప్ప‌టికీ, కరోనా వైరస్ సంక్షోభం కారణంగా వారి నిర్ణ‌యం వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో పాల ర‌వాణాకూ అధిక ఖ‌ర్చు అవుతోంది. దీంతో పాల‌ ధరలను కూడా పెంచాలనే నిర్ణయానికి వచ్చినట్టు అక్క‌డి ఉత్పత్తిదారుల అసోసియేషన్ ప్ర‌క‌టించింది.

సరిహద్దు సమస్యల పరిష్కారానికి హాట్​ లైన్​ - భారత్​ కు చైనా ప్రతిపాదన

 సరిహద్దు సమస్యల పరిష్కారానికి హాట్​ లైన్​ - భారత్​ కు చైనా ప్రతిపాదన

 దాని ద్వారా ఎప్పటికప్పుడు చర్చలు కొనసాగిద్దామని సూచన

బలగాల ఉపసంహరణపై సంతృప్తి వ్యక్తం చేసిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ

మాస్కో ఒప్పందానికి కట్టుబడి ఉండాల్సిందేనన్న భారత విదేశాంగ మంత్రి జైశంకర్

హింస ద్వారా శాంతికి భంగం కలిగిస్తే ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరిక

చైనా దుందుడుకు వైఖరితోనే రెండు దేశాల బంధాలు దెబ్బతిన్నాయని స్పష్టీకరణ

75 నిమిషాల పాటు ఫోన్ లో మాట్లాడుకున్న ఇరు దేశాల మంత్రులు

 న్యూస్ డెస్క్ , పెన్ పవర్ 

తూర్పు లడఖ్ లోని వాస్తవాధీన రేఖ వెంబడి మిగిలి ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని చైనాకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తేల్చి చెప్పారు. ఘర్షణ వాతావరణం నెలకొన్న అన్ని ప్రాంతాల్లోనూ బలగాల ఉపసంహరణ పూర్తయిన తర్వాత సరిహద్దు ప్రాంతాల్లోనూ ఇరుపక్షాలూ బలగాలను తగ్గించుకోవాలని, శాంతి సామరస్యాల పునరుద్ధరణ కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ స్పందిస్తూ.. సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరిపేందుకు ఓ హాట్ లైన్ ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు. గురువారం రెండు దేశాల విదేశాంగ మంత్రులు దాదాపు 75 నిమిషాల పాటు ఫోన్ లో మాట్లాడుకున్నారు. చర్చలకు సంబంధించిన వివరాలను శుక్రవారం విదేశాంగ శాఖ వెల్లడించింది.మాస్కో ఒప్పందానికి కట్టుబడాలి : రష్యా రాజధాని మాస్కోలో జరిగిన షాంఘై కో ఆపరేషన్ సదస్సు సందర్భంగా గత ఏడాది సెప్టెంబర్ లో ఇరు దేశాల మధ్య కుదిరిన (మాస్కో) ఒప్పందానికి కట్టుబడి ఉండాల్సిందిగా చైనాకు జైశంకర్ తేల్చి చెప్పారు. సరిహద్దుల వద్ద చైనా దుందుడుకు వైఖరి వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.సరిహద్దు సమస్య తీరేందుకు సమయం పట్టొచ్చని, కానీ, దాని కోసం హింస ద్వారా శాంతి సామరస్యాలను పాడు చేస్తే ద్వైపాక్షిక సంబంధాలు మరింత దెబ్బతినే ప్రమాదముందని అన్నారు. సరిహద్దుల్లో బలగాలను ఉపసంహరించుకోవాలన్న మాస్కో ఒప్పందాన్ని ఆయన గుర్తు చేశారు. చర్చలు కొనసాగిస్తూనే ఉండాలని సూచించారు. కాగా, ప్రస్తుతం బలగాల ఉపసంహరణపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సంతృప్తి వ్యక్తం చేశారు. శాంతి సామరస్య పునరుద్ధరణలో ఇది ముఖ్యమైన అడుగు అని ఆయన చెప్పారు. ప్రస్తుత ఫలితాలను ఇరుపక్షాలూ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. సరిహద్దు నిర్వహణ, నియంత్రణను మరింత మెరుగు పరచాల్సిన అవసరముందన్నారు. అప్పట్లో భారత్ మూడు పరస్పర సహకార సూత్రాలను ప్రతిపాదించిందని గుర్తు చేశారు. పరస్పర గౌరవం, పరస్సర ప్రయోజనాలు, పరస్పర సున్నితాంశాలకు రెండు దేశాలూ కట్టుబడాలన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడాలని, సమస్యల పరిష్కారంపై ఎప్పటికప్పుడు చర్చల కోసం ఓ ‘హాట్ లైన్’ను ఏర్పాటు చేసుకుందామని చెప్పారు.


గర్భిణిని దహనం చేసిన బూడిదలో బంగారం కోసం..

 గర్భిణిని దహనం చేసిన బూడిదలో బంగారం కోసం..

 న్యూస్ డెస్క్ , పెన్ పవర్ 

గర్భిణిని దహనం చేసిన బూడిదలోని నగల అవశేషాలను దొంగిలించటానికి ప్రయత్నించి నలుగురు అడ్డంగా బుక్కయ్యారు. గ్రామస్తుల చేతిలో దెబ్బలు తిని జైలు పాలయ్యారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఆలస్యంగావెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సోలాపూర్‌ జిల్లా బర్లోని గ్రామానికి చెందిన దాదాసాహెబ్‌ హన్వంతే, రుక్మిణి, రామచంద్ర కస్బే, స్వాతిలు తమ ఉద్యోగాలు కోల్పోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 22వ తేదీన మరణించిన ఓ గర్భిణి అంత్యక్రియలు బంగారు నగలు మృతదేహంపై ఉంచి చేస్తారని వారికి తెలిసింది.  గర్భిణి అంత్యక్రియలు అయిపోయిన తర్వాత బూడిదలో కరిగిన బంగారాన్ని దొంగిలించాలని వారు నిశ్చయించుకున్నారు. బుధవారం అంత్యక్రియలు అయిపోయిన తర్వాత బూడిదలో నగల అవశేషాల కోసం వెతకుతూ.. గ్రామస్తుల కంట బడ్డారు. దీంతో గ్రామస్తులు వారిని పట్టుకుని చితకబాది, పోలీసులకు అప్పగించారు. ఓ గ్రామస్తుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...