Followers

కుటుంబ సభ్యులను నమ్మించేందుకే కాళ్ళు, చేతులు కట్టేసినట్లుగా కట్టు కథ

 కుటుంబ సభ్యులను నమ్మించేందుకే కాళ్ళు, చేతులు కట్టేసినట్లుగా కట్టు కథ

విజయనగరం జిల్లా ఎస్పీ బి.రాజకుమారి, ఐపిఎస్

పెన్ పవర్,విజయనగరం

విజయనగరం జిల్లా గుర్లలో రోడ్డు ప్రక్కనే ఉన్న తుప్పల్లో ఒక అమ్మాయిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాళ్ళు, చేతులను కట్టేసి ఉన్నట్లుగా మార్చి 1, ఉదయం గుర్ల పోలీసులకు వచ్చిన సమాచారం పై గుర్ల ఎస్ఐ నీలావతి మరియు ఇతర పోలీసు సిబ్బంది సంఘటనా స్థలంకు వెళ్ళి కాళ్ళు, చేతులు బంధించి ఉన్న సుమారు 24 సంవత్సరాల అమ్మాయిని అపస్మారక స్థితిలో గుర్తించారు. వెంటనే, ఆమెకు స్థానికుల సహకారంతో గుర్ల పోలీసులు సపర్యలు చేసి,చికిత్స నిమిత్తం గుర్ల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, అక్కడి నుండి విజయనగరం ఘోషాసుపత్రికి పంపడం జరిగింది.చికిత్స తరువాత కోలుకున్న అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుర్ల పోలీసులు క్రైం నంబరు 45/2021 గా కేసు నమోదు చేసారు.మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ ఈ కేసు దర్యాప్తును దిశ మహిళా పోలీసు స్టేషనుకు అప్పగించి, డిఎస్పీ శ్రీ టి.త్రినాధ్ గార్ని దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించారు. మహిళా పిఎస్ డిఎస్పీ త్రినాథ్ తో పాటు విజయనగరం డిఎస్పీ అనిల్ కుమార్, విజయనగరం రూరల్ మంగవేణి, గుర్ల ఎఱ నీలావతి, పి.నారాయణరావులు వివిధ బృందాలుగా ఏర్పడి జిల్లా ఎస్పీగారి స్వీయ పర్యవేక్షణలో ఫిర్యాది చెప్పిన వివరాల ప్రకారం సాక్ష్యాధారాలను సేకరించారు. చివరికి ఫిర్యాది తనకు తెలిసిన స్నేహితుడిని కలిసేందుకుగాను ఫిబ్రవరి 27న హాస్టల్ నుండి బాబాయ్ దగ్గరకు వెళతానని పెర్మిషను తీసుకొని బయటకు వెళ్ళినట్లుగా చెప్పారు. ఇదే సమయంలో హాస్టల్ లో తన గురించి తన అన్నయ్య వాకబు చేసినట్లుగా విషయం తెలుసుకున్న అమ్మాయి, తన స్నేహితుడిని కలిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఒక ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన పాలకొల్లు-పాలకొండ బస్సు ఎక్కింది. గుర్ల దాటిన తరువాత బస్సు దిగిన ఆమె గుర్ల రోడ్డు ప్రక్కన ఉన్న తుప్పల్లోకి వెళ్ళి తన కుటుంబ సభ్యులు, స్నేహితులను నమ్మించేందుకుగాను తనకు తానే కాళ్ళు, చేతులను చున్నీతో కట్టుకొని, అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లుగా నటించినట్లు ఆమె అంగీకరించినట్లుగా తెలిపారు. తాను హాస్టల్ నుండి బయటకు వెళ్ళిన విషయంలో కుటుంబ సభ్యులను, స్నేహితులను నమ్మించేందుకే తనను గుర్తు తెలియని వ్యక్తులు కాళ్ళు, చేతులు కట్టేసినట్లు కట్టు కథ చెప్పినట్లుగా వెల్లడైందని, ఈ విషయం సిసీ ఫుటేజిల పరిశీలన ద్వారా నిర్ధారణ అయ్యిందని జిల్లా ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు.ఈ కేసు విచారణలో విజయనగరం డిఎస్పీ పి. అనిల్ కుమార్, దిశ మహిళా పిఎస్ డిఎస్పీ టి.త్రినాధ్, విజయనగరం రూరల్ సీఐ టి.ఎస్.మంగవేణి, గుర్ల ఎస్ఐ నీలావతి, విజయనగరం రూరల్ ఎస్ఐ పి. నారాయణరావులుసమర్ధవంతంగా పనిచేసి, 48 గంటల్లో కేసును ఛేదించి, వాస్తవాలను వెలికితీసారని, వారిని అభినందిస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ బి. రాజకుమారి తెలిపారు.


హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్న ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్

 హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్న ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్  రంగినేని మనీషా- పవన్ రావు దంపతులు...

 


ఆదిలాబాద్, పెన్ పవర్ 

 ఆదిలాబాద్ మండలంలోని  జామున్ దరి గ్రామంలోని స్థానిక హనుమాన్ ఆలయంలో బుధవారం ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీషా దంపతులు మండల టిఆర్ఎస్ నాయకులతో,గ్రామస్తులతో  కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు  గ్రామస్తులు మాజీ మున్సిపల్ చైర్మన్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ లక్ష్మీ బాయి  ఆదిలాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ రంగినేని మనీషా పవన్ రావు  లకు శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయ, లేదా అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. కెసిఆర్ ప్రభుత్వంతోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రం లేనటువంటి పథకాలతో తెలంగాణ రాష్ట్రం ఈరోజు నెంబర్ వన్ లో ఉంది అంటే అది కేసీఆర్  పుణ్యమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు వెంకన్న, అయ్యుబ్, గంగారెడ్డి, క్రాంతి, నర్సారెడ్డి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా హనుమాన్ ఆలయం గోపురం పూజ

 ఘనంగా హనుమాన్ ఆలయం గోపురం పూజ

అదిలాబాద్, పెన్ పవర్

మండలంలోని మాల్కు గూడా గ్రామంలోని  స్థానిక హనుమాన్ ఆలయంలో బుధవారం గోపురం పూజ ఘనంగా నిర్వహించారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు తనయుడు ఆత్రం వినోద్ మండల టిఆర్ఎస్ నాయకులతో కలిసి  ఆలయ గోపురం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం ఆలయంలో  హోమం పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. చంద్రబాబు ఆయన మాట్లాడుతూ అందరూ సుఖసంతోషాలతో ఉండాలని మొక్కులు మోక్కడం జరిగిందని  పేర్కొన్నాడు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పరమేశ్వర్ రాథోడ్, ఎంపిటిసి రేణుక దిలీప్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మెస్రం హనుమంతురావు, టిఆర్ఎస్ నాయకులు  గోవింద్, శ్రీరామ్,గ్రామ పటేల్ ఆనంద్ రావు, కారోబారి గోపాల్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

విశాఖలో వేడెక్కిన రాజకీయాలు

 విశాఖలో వేడెక్కిన రాజకీయాలు 

విశాఖ తూర్పు,పెన్ పవర్

సొంత నియోజకవర్గంలో వైసీపీ జాయినింగ్స్‌కు మంత్రి అవంతి శ్రీనివాస్ హాజరుకాకపోవడం చర్చనీయాంశమయ్యింది.విశాఖలో రాజకీయాలు వేడెక్కాయి. సొంత నియోజకవర్గంలో వైసీపీ జాయినింగ్స్‌కు మంత్రి అవంతి శ్రీనివాస్ హాజరుకాకపోవడం చర్చనీయాంశమయ్యింది.   బుదవారం  ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా అనుచరుడు కాశీవిశ్వనాథం వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంఛార్జ్ మంత్రి కురసాల కన్నబాబు హాజరయ్యారు కానీ మంత్రి అవంతి హాజరుకాకపోవడంపై వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. కాశీ విశ్వనాథం జాయినింగ్‌ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తుల నిర్ణయం ముఖ్యం కాదని.. పార్టీ బలోపేతమే ము‌ఖ్యమని వ్యాఖ్యానించారు. అయితే గంటా అనుచరుడు విశ్వనాథం వైసీపీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలను మంత్రి అవంతి శ్రీనివాస్‌ తీవ్రంగా వ్యతిరే కించారు.

వాసవి సేవాదళ్ టీమ్ ను అభనందించిన ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి

వాసవి సేవాదళ్ టీమ్ ను అభనందించిన ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి      

 పెన్  పవర్, కందుకూరు

   కందుకూరు వాసవి సేవాదళ్ టీం కరోనా సమయంలో తమ  ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పేదవారికి ఆహరం, నిత్యావసర సరుకులు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేసినందుకు గత ఆదివారం విజయవాడ లో డాక్టర్ అక్కినేని నాగేశ్వరావు కళానికేతన్ లో ఆదరణ చారిటీస్ సమర్పణలో వేదిక క్రియేటివిటి,కల్చరల్ టాలెంట్  అండ్ వెరియస్ కిల్స్ సొసైటీ,24క్రాఫ్ట్స్, విశ్వంబర చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వేదిక తెలుగు నంది జాతీయ పురస్కారం వాసవి సేవాదళ్ టీం తరుపున ప్రకాశం జిల్లా వాసవి సేవాదళ్ ప్రధాన కార్యదర్శి చక్కా వెంకట కేశవరావు నంది అవార్డు తీసుకొన్నారు. ఈసందర్బంగా కందుకూరు శాసన సభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి ని కందుకూరు వైస్సార్సీపీ క్యాంప్ కార్యాలయం లో మహీధర్ రెడ్డిని కలసిన వాసవి సేవాదళ్ టీం సభ్యులు ఈ సందర్బంగా శాసన సభ్యులు  మహీధర్ రెడ్డి మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో వాసవి సేవాదళ్ టీమ్ సభ్యులు నిరంతరం  కరోనాను సైతం లెక్కచేయకుండా సేవాకార్యక్రమం చేశారు.వారికి ఈ నంది పురస్కారం రావడం చాలా సంతోషదాయాకమని, భవిష్యత్ లో ఇలాగే సేవలో ముందుకు కొనసాగాలని ఆశీస్సులు, అభినందనలు తెలియజేశారు.చక్కా వెంకట కేశవరావు మాట్లాడుతూ కరోనా సమయం లో కందుకూరు నియోజకవర్గ ప్రజలకు సేవలు చేస్తూ,మనోధైర్యాన్ని కాల్పించిన ఎమ్మెల్యే మహీధర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఈ సేవా కార్యక్రమాలు చేశామని,రాబోయే రోజుల్లో మరిన్ని సేవాకార్యక్రమాలు మా టీమ్ ఆధ్వర్యంలో కొనసాగిస్తామని, ఈ నంది  పురస్కారం మా దాతలకు అంకితం అన్నారు.  ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి ఆర్యవైశ్య నాయకులు పబ్బిశెట్టి శివ,చలంచర్ల సుబ్బారావు,ఇస్కాల మధు, శ్రీ రామసాయి సేవా సమితి అధ్యక్షులు రవ్వా శ్రీనివాసులు, ఇన్నమూరి శ్రీను, మానేపల్లి బుచ్చయ్య గుప్తా, సోమిశెట్టి శశాంక్, పాదర్తి వెంకట అమరనాధ్ తదితరులు పాల్గొన్నారు.

కృత్రిమ గర్భధారణ ద్వారా మేలుజాత పశువుల అభివృద్ధి

 కృత్రిమ గర్భధారణ ద్వారా మేలుజాత పశువుల అభివృద్ధి


పెద్దాపురం,పెన్ పవర్

  పెద్దాపురం మండలం, సిరివాడ గ్రామంలో రైతు భరోసాకేంద్రం నందు ఆత్మ మరియు ఎస్ఎఐపి ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరమునిర్వహించి గుడివాడ సిరివాడ రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు
చేయడం జరిగింది. ఈ యొక్క రైతుల అవగాహన సదస్సుకు డి.ఎల్.డి.ఎ. ఇ.ఒ.డా॥ ఆర్.వెంకటేశ్వరరావు, ఆర్ఎహెచీసి అసిస్టెంట్ డైరెక్టర్ పి.వి.వరప్రసాద్,ఏరియా ప్రభుత్వ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డా॥ వై.శ్రీనివాసరావు, పశువైద్యులు.డాక్టర్ చిక్కం బాలచంద్రయోగేశ్వర్ హాజరై వీరు  మాట్లాడుతూ. కృత్రిమ గర్భదారణ ద్వారా మేలుజాతి పశువుల అభివృద్ధి, ఏడాదికి ఒక దూడ యాజమాన్య పద్ధతులు, అధిక పాలదిగుబడికి పశుగ్రాసాలు, చూడి పశువుల సంరక్షణ వంటి విషయములపై రైతులకుఅవగాహన కల్పించుట జరిగింది. ఈ పశువైద్యశిబిరాన్ని సిరివాడ గ్రామ సర్పంచి.ఇనకొండ కృష్ణకుమారి వీరవిష్ణు చక్రం ప్రారంభించి గుడివాడ సిరివాడగ్రామాల పరిధిలో150 పశువులకు వైద్య పరీక్షలుదూడలకు ఏటిక మందులు,చూడి పరీక్షలు, చూడి కట్టని పశువులను పరీక్షించి వాటికి సరియైన చికిత్స అందించి ఉచితంగా మందుల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుడివాడఉపసర్పంచ్ శ్రీమతి రేలంగి వరలక్ష్మి అప్పారావుకాండ్రకోట పశువైద్యులుడా॥ తోట నవీన్, ఆర్.బి.పట్నం పశువైద్యులు డా॥ కె.రాకేష్ , కాండ్రకోట వెటర్నరీఅసిస్టెంట్ కాశీరాజు,గోపాలమిత్ర సతీష్, ఎహెచ్ఎలు ప్రతాప్,పూర్ణ, షేక్ దర్గలుపాల్గొన్నారు.


బేల మండల విద్యాశాఖ అధికారి గా శ్రీనివాస్

 బేల మండల విద్యాశాఖ అధికారి గా శ్రీనివాస్

అదిలాబాద్,పెన్ పవర్


 జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు బుధవారం బేలా మండల విద్యాశాఖ అధికారి గా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఉట్నూర్ మండలం లో మండల విద్యాశాఖ అధికారి గా ఉన్న అతను బేల మండల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో బాధ్యతలు స్వీకరించి సంతకాలు చేశారు.  నూతన మండల విద్యాశాఖ అధికారి కి ఎం ఆర్ సి సిబ్బంది స్వాగతం పలికి మర్యాదపూర్వకంగా పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బేలా జడ్.పి.హెచ్.ఎస్ ఇంచార్జి హెడ్ మాస్టర్ రాహుత్ రాజ్ కుమార్, ధోప్టలా హెడ్ మాస్టర్ చొప్డే రాజు, పీడీ దర్శనలా దేవేందర్, మండల వనరుల శాఖ సి ఆర్ పి లు రాకొండే వెంకన్న,విజయ్,రేణుకా, సిబ్బంది అతుల్, మిథున్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...