Followers

అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణానికి నిధి సేకరణ

అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణానికి నిధి సేకరణ



తాళ్ళపూడి, పెన్ పవర్

శ్రీరామ జన్మ భూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీరామ మందిర నిర్మాణ సమర్పణ అభియాన్ లో జనవరి 16 నుండి ఫిబ్రవరి 28 వరకు నిధి సేకరణ కార్యక్రమం జరిగింది. ఆర్ యస్ యస్ మరియు సంఘ్ పరివార సంస్థల కార్యకర్తలు తాళ్ళపూడి, పోలవరం, గోపాలపురం  మండలాలలో గ్రామగ్రామానికి, ఇంటింటికి, వ్యక్తి వ్యక్తి ని కలిసి నిధి సేకరణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. తాళ్ళపూడి మండలం నుండి 9,53,000 రూపాయలు, పోలవరం మండలం నుండి 5,00,000 రూపాయలు, గోపాలపురం మండలం నుండి 3,20,000 రూపాయలు, మొత్తం కలిపి సుమారు 17,73,000 రూపాయల వరకు ఖండ స్థాయిలో నిధి సేకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఖండ కార్యవాహ్ బొర్రా చైతన్య మూర్తి, జిల్లా గోరక్ష ప్రముఖ్ శ్రీరామమూర్తి, నాళ్ళం గోపి, అడ్డా శ్రీరాoమోహన్, యలకల కనకం, చిరువూరి పోసిబాబు, వేగేశ్వరపురం నుండి ఇండుగుల రామకృష్ణ, సూలా తేజ, పెద్దేవం గ్రామం నుండి రాముడు, రాంబాబు, దూమవరపు సత్యనారాయణ, కొవ్వూరుపాడు నుండి సుబ్రహ్మణ్యం, వాదాలకుంట నుండి రాఘవులు, తదితరులు పాల్గొన్నారు. మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా భక్త సమాజానికి, భక్త బృందానికి పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు

 విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు



తాళ్ళపూడి, పెన్ పవర్

 విశాఖ ఉక్కు ప్రయివేటికరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక రాష్ట్ర వ్యాప్త బంద్ లో భాగంగా తాళ్ళపూడి మండలంలో  జేఏసి, సిఐటియు అనుబంధ సంస్ధలు అయిన  భవన నిర్మాణ కార్మిక సంఘాలు, అంగన్వాడీ టీచర్లు మరియు వర్కర్లు, ఆశావర్కర్లు, మిడ్ డే మీల్స్ వర్కర్లు, కార్మిక ఉద్యోగులు, ఉపాద్యాయులు, ర్యాలీలో పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, విశాఖ ఉక్కు  ప్రైవేటీకరణ చేయరాదు అనే నినాదంతో తాళ్ళపూడి బస్ స్టాండ్ సెంటర్ నుండి ప్రక్కిలంక సెంటర్ వరకు ర్యాలీ చేయడం జరిగింది. వాణిజ్య సముదాయాలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు మూసివేశారు. జేఏసి చైర్మైన్ జోడాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీరోచిత ఆందోళన ఫలితంగా 32 మంది తెలుగు వారి ప్రాణత్యాగాలతో నెలకొల్పబడిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవలసిన భాధ్యత తెలుగు వారందరి పైనా ఉంది అని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కారు చౌకగా  కార్పొరేట్  సంస్థలకు  కేంద్ర ప్రభుత్వం అప్పగిస్తూ  ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేస్తున్నారని, దాన్ని ప్రతిఘటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు.

ఎఎస్ఓ జోడాల వెంకటేశ్వరరావుకి కోవిడ్ సెకండ్ డోస్ వ్యాక్సిన్

 ఎఎస్ఓ జోడాల వెంకటేశ్వరరావుకి కోవిడ్ సెకండ్ డోస్ వ్యాక్సిన్

తాళ్ళపూడి, పెన్ పవర్

తాళ్ళపూడి పిహెచ్సి లో శుక్రవారం ఎఎస్ఒ జోడాల వెంకటేశ్వరరావు కోవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోస్ వేయించుకున్నారు. జోడాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఒక నెల క్రితం మొదటి డోస్ వేయించుకున్నానని, ఈ రోజు సెకండ్ డోస్ వేయించుకోవడం జరిగిందని అన్నారు. మొదటి డోస్ వేయించుకున్న తరువాత ఆరోగ్యపరంగా ఏ ఇబ్బందులు లేవని తెలిపారు.  అపోహలు పడకుండా అర్హత ఉన్న ప్రతీఒక్కరు వేయించుకోవచ్చునని తెలిపారు. అందరూ భయపడకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.

హక్కుల సాధనకోసం మార్చి 7న జర్నలిస్టుల మహాసభ.......

 హక్కుల సాధనకోసం మార్చి 7న జర్నలిస్టుల మహాసభ.......

 ఆదిలాబాద్ ,పెన్ పవర్ 

జర్నలిస్టులకు ఇండ్ల స్థలలతో పాటు ప్రధాన సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్ తో ఈ నెల 7న హైద్రాబాద్ జల విహార్ లో జరిగే జర్నలిస్టుల ప్రతినిధుల మహాసభను విజయవంతం చేయాలని  టి యూ డబ్ల్యూ జేయూ డబ్ల్యూ జే  ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు బేత రమేష్ అన్నారు.ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్షులు బేత రమేష్ మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల మృతి చెందిన   6గురు జర్నలిస్ట్ లకు మీడియా అకాడమీ తరపున ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం, ఫెన్షన్ మంజూరు చేయడం జరిగిందన్నారు.ఇప్పటి వరకు 26మంది మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు మీడియా అకాడమీ అండగనిలిచిందని తెలిపారు.జర్నలిస్టుల సంక్షేమం కోసం కొంత కాలంగా పెండింగ్ లో ఉన్న 17.5 కోట్ల రూపాయల విడుదలకు సంబంధించి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ లు కలిసి మంత్రి కేటీఆర్ తో చర్చించి 24 గంటలు గడవకముందే పదిహేడున్నర కోట్లు మీడియా అకాడమీ ఖాతాలో జమ చేయించినందుకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటికే 34.5  కోట్ల రూపాయలను జర్నలిస్ట్ సంక్షేమ నిధికి  తెలంగాణ ప్రభుత్వం అందజేసింది. మరో 17.5 కోట్ల రూపాయలను గురువారం విడుదల చేయడంతో మొత్తం సంక్షేమ నిధి 52 కోట్ల కు చేరడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ నిధితో జర్నలిస్టుల సంక్షేమానికి ఎన్నోకార్యక్రమాలు  చేపట్టాలని ఆకాంక్షిస్తూ, నిధి పెరుగుదలకు కృషి చేసిన అల్లం నారాయణకి, నిధుల విడుదలకు వెంటనే ఆదేశాలు జారీ చేసిన మంత్రి కేటీఆర్ కి, ఇంత వేగంగా రావడానికి సహకరించిన జర్నలిస్ట్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ లోని జలవిహార్ లో జరిగే జర్నలిస్ట్ ప్రతినిధుల మహాసభ కు జర్నలిస్ట్ మిత్రులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి లక్ష్మీపురం రాజు, ఉపాధ్యక్షులు అన్వర్, కోశాధికారి ప్రవీణ్,నాయకులు తేజ శంకర్ పాల్గొన్నారు.

హైద్రాబాద్ లో జుగ్ను సేవలు

 హైద్రాబాద్ లో జుగ్ను సేవలు

కూకట్ పల్లి,పెన్ పవర్


2014 సంవత్సరం నుండి ప్రపంచవ్యాప్తంగా తన సేవలను అందిస్తున్న జుగ్ను సంస్థ హైదరాబాద్ లో తన సేవలను ప్రారంభించింది. కూకట్ పల్లిలోని తబలా రెస్టారెంట్ లో బ్రోచర్ ఆవిష్కరణ, యాప్ ఆవిష్కరణలను నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రముఖ సినీ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ పండల సతీష్ గౌడ్ లు హాజరై బ్రోచర్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఉత్తర భారతదేశంలో నలభై ఐదుకు పైగా నగరాలలో జుగ్ను సంస్థ ద్వారా బైక్, కార్, ఆటోలను నడుపుతున్నామని, హైదరాబాదులో కూడా సేవలు అందించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. స్మార్ట్ క్లూస్ టెక్నాలజీ సంస్థ ఆధ్వర్యంలో జుగ్ను యాప్ ద్వారా సేవలు అందిస్తున్నామని, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న క్యాబ్ సర్వీస్ ధరలకంటే తక్కువ ధరకే జుగ్ను సంస్థ వాహనాలను నడపనునట్లు తెలిపారు. తమ సేవలను పొందడానికి వినియోగదారులు ప్లేస్టోర్, ఐస్టోర్ ల ద్వారా జుగ్ను యాప్ డౌన్లోడ్ చేసుకుని రైడ్ బుక్ చేసుకునే సమయంలో జుగ్ను50 అనే కోడ్ వాడటం ద్వారా యాభై శాతం డిస్కౌంట్ కూడా పొందవచ్చని తెలిపారు. అలాగే తమ సంస్థలో బైకులు, కార్లు, ఆటోలు అటాచ్ చేసుకొని డబ్బు సంపాదించాలి అనుకునేవారు జుగ్ను డ్రైవర్ యాప్ ద్వారా కేవలం ఐదు పత్రాలను సమర్పించి తమ సంస్థలో డ్రైవర్లుగా కొనసాగవచ్చని, మార్కెట్లో ఉన్న వివిధ సంస్థలు అందిస్తున్న దానికంటే రెట్టింపు లాభాలు తమ సంస్థ ద్వారా డ్రైవర్లు పొందగలరని తెలిపారు. ఈకార్యక్రమంలో హైదరాబాద్ మేనేజింగ్ పార్ట్ నర్స్ అశోక్, విష్ణు హైదరాబాద్ ఆపరేషన్ మేనేజర్ హర్షవర్ధన్ పాల్గొన్నారు.

అడిగే వారెవరు..? అంతా నా ఇష్టం..!

 అడిగే వారెవరు..? అంతా నా ఇష్టం..!

*చిన్నగూడూరు పంచాయతీ కార్యదర్శి నిర్వాకం

*విధుల్లో నిర్లక్ష్యం కానరాని చిత్తశుద్ధి

*ఉన్నతాధికారుల అండదండలు ఉన్నాయని ప్రజల అనుమానం

చిన్నగూడూరు, పెన్ పవర్

స్థానిక మండల కేంద్రము లో పనిచేస్తున్న పంచాయితీ కార్యదర్శి అజీమ్ రూటే సెపరేటు అన్నట్లు వ్యవహరిస్తుండటం పలు విమర్శలకు దారితీస్తుంది.అంతా నా ఇష్టం అడిగే వారెవరు అని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనీ వాపోతున్నారు.ఇతనికి ఉన్నతాధికారుల అండదండలు ఉన్నాయని మండల ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. లేదంటే ఇతనిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వాదన సర్వత్ర వ్యక్తమవుతోంది. దీని పై స్థానిక మండల ప్రజలు శుక్రవారం నాడు చిన్న గూడూరు మండల ఎంపిడివో సరస్వతి నీ కలిసి పంచాయితీ సెక్రటరీ పై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేశారు.మండల కేంద్రంలో రెండవ.మరియూ నాలుగవ వార్డు లలో మంచినీటి సరఫరా సరిగా చేయటం లేదనీ గ్రామంలో తమ వీధులలో స్వచ్ఛందంగా మొక్కలను తామే తెచ్చుకొని నాటుకున్నమని వాటికి కనీసం నీటి సరఫరా చేయకుండా వదిలేస్తున్నారు అని ఇంకా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో నాటిన చెట్లకు నీరు లేక ఎండిపోతున్నాయని పిర్యాదు లో పేర్కొన్నారు.ఇటీవల ప్రభుత్వం చేపట్టిన గ్రీన్ ఇండియా కార్యక్రమంలో ప్రతి గ్రామ పంచాయితీ పరిధిలో వెయ్యి మొక్కలు నాటాలని ప్రభుత్వ ఆదేశాలు జారీచేసింది ఉన్న మొక్కలకి ఆదరణ లేక కనుమరుగై పోయె పరిస్థితులు నెలకొన్నాయి ఇక కొత్తగా నాటిన మొక్క ల పరిస్థితి ఏమిటి అని పంచాయితీ కార్యదర్శి తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు .అదేవిధంగా గేట్ వాల్వ్ కోసం తవ్విన గుంటలు వేయకుండా అలాగే వదిలేయటం తో రహదారిపై వచ్చే వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.మురికి నీరు నిల్వ ఉంచే చోట గేట్ వల్వ్ కోసం గుంటలు తేయటంతో మురికి నీరు అంతా లేకైన పైపుల ద్వారా మంచి నీటిలో కలుస్తున్నాయి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామ పంచాయితీ అభివృద్ధికి సహకరించాల్సిన పంచాయితీ సెక్రటరీ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని అతనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.ఈ కార్యక్రమంలో సూడగని నాగేష్,బాలయ్య,కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.

మహిళ డిగ్రీ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన బి.జి.ఆర్...

 మహిళ డిగ్రీ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన బి.జి.ఆర్...

 ఆదిలాబాద్ , పెన్ పవర్ 

 ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం  మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేశారు.  ఇందులో భాగంగానే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన  ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు బాలూరి ఊరి గోవర్ధన్ రెడ్డి మధ్యాహ్న భోజన పథకాన్ని  శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో పాఠశాల లకే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకాన్ని కళాశాలలో సైతం ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. పేద విద్యార్థుల చదువుతో పాటు వారికి భోజనా సౌకర్యాన్ని ఏర్పాటు చేసి చదువుపై మరింత దృష్టి సారించేలా trs ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రతాప్ సింగ్,  కళాశాల ప్రిన్సిపాల్ అథిక్ బేగం, వైస్ ప్రిన్సిపాల్ అనిత,  తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...