Followers

దళిత సమైక్య సంఘాల ఆధ్వర్యంలో జగ్గంపేటలో బంద్ విజయవంతం

 దళిత సమైక్య సంఘాల ఆధ్వర్యంలో జగ్గంపేటలో బంద్  విజయవంతం



జగ్గంపేట,పెన్ పవర్

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా జగ్గంపేటలో  దళిత సమైక్య సంఘాల ఆధ్వర్యంలో బందు నిర్వహించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ సమితి పిలుపు మేరకు శుక్రవారం జగ్గంపేటలో  దళిత సమైక్య తరపున నిర్వహించిన బంద్ కార్యక్రమంలో జగ్గంపేట మెయిన్ రోడ్డు, పుర వీధుల్లో తిరిగి దుకాణాలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి వాటిని  మూసివేయించి బంద్ కు సహకరించాలని కోరారు. అదేవిధంగా జగ్గంపేట మెయిన్ రోడ్డు పై విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిద దళిత సంఘాల రాష్ట్ర నాయకులు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో   దళిత బహుజన ఐక్య పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడుపు గట్టి చిన్నబాబు, దళిత ప్రజాచైతన్యం పార్టీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బుంగ సతీష్ కుమార్, ఆర్ పి ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి ప్రసాద్, ఎం ఆర్ పి ఎస్ ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఆకుమర్తి గణేష్, దళిత ప్రజా చైతన్యం జిల్లా అధ్యక్షులు వల్లూరి సత్యానందం, ఏ ఎం డీ కే ఎస్ రాష్ట్ర అధ్యక్షులు దిరిశాల పండు, దళిత బహుజన ఐక్య పోరాట సమితి జిల్లా అధ్యక్షులు మోర్త తాతారావు, ఆర్ పి ఐ జిల్లా అధ్యక్షులు జుత్తుక నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు..

బి.సి.సంక్షేమశాఖ మంత్రివర్యులు శ్రీ వేణు ను కలిసిన గోదావరి లైబ్రేరియన్స్ అసోసియేషన్ సభ్యులు

బి.సి.సంక్షేమశాఖ మంత్రివర్యులు శ్రీ వేణు ను కలిసిన గోదావరి లైబ్రేరియన్స్ అసోసియేషన్ సభ్యులు



గండేపల్లి పెన్ పవర్

గండేపల్లి మండలం సూరంపాలెం గోదావరి  లైబ్రేరియన్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కె.అశోక్ కుమార్ ఆధ్వర్యంలో  అసోసియేషన్ సభ్యుల బృందం రాష్ట్ర బి.సి.సంక్షేమ శాఖామాత్యులు శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారి ని కలిసి తమ సమస్యలు విన్నవించారు.రాష్ట్రవ్యాప్తంగా గల వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో,జూనియర్, డిగ్రీ కళాశాలలకు చెందిన మరియు పబ్లిక్ గ్రంధాలయ సంస్థ లలో ఖాళీగా ఉన్న లైబ్రేరియన్ పోస్టులను భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడానికి కృషి చేయాలని కోరారు.దీనికి మంత్రి స్పందిస్తూ తాను సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తానని గౌరవ ముఖ్య మంత్రి వర్యులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టి కి సమస్య పరిష్కారం కొరకు తీసుకుని వెళ్లి తగు ఉత్తర్వులు జారీ చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపినట్లు అశోక్ కుమార్ తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి వర్యులు ను కలిసిన వారిలో సంఘం కార్యదర్శి కె.సాయిబాబు,ఎ.కె.వి.ఆచార్యులు,కె.శివప్రసాద్,పి.రవిశంకర్,సి.హెచ్.రామచంద్రారెడ్డి,డి.రవికిరణ్,వి.వి.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

కుటుంబ ఆరోగ్య వ్యవస్థలో పీఎంపీ ల పాత్ర కీలకం

 కుటుంబ ఆరోగ్య వ్యవస్థలో పీఎంపీ ల పాత్ర కీలకం



గోకవరం,పెన్ పవర్

  కుటుంబ ఆరోగ్య వ్యవస్థ లో పీఎంపీ ల పాత్ర కీలకమని మాజీ జెడ్పీటీసీ పాలూరి బోసు అన్నారు.గోకవరం మండలం బావాజీ పేట అష్టలక్ష్మీ గుడి దగ్గర లో శుక్రవారం ది పీఎంపీ అసోసియేషన్ గోకవరం, కోరుకొండ ఏజన్సీ మండలాల ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు పీ చిన్ని అధ్యక్షతన సర్వసభ్యసమావేశం జరిగింది. ఈ సమావేశంనకు రాజమండ్రి కి చెందిన తోలత్ మెమోరియల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ పి రాజేంద్రప్రసాద్ హాజరై మాట్లాడుతూ  అత్యవసర పరిస్థితి లలో పీఎంపీ లు చేయు ప్రాధమిక వైద్యం గురించి తెలిపారు. మాజీ జెడ్పీటీసీ బోస్ మాట్లాడుతూ గ్రామాల్లో కుటుంబం లో ఎవరి ఏవిధమైన అనారోగ్యం వచ్చిన ముందుగా స్పందించేది పీఎంపీ లేనని అన్నారు. ఈకార్యక్రమంలో పీఎంపీ జిల్లా కార్యదర్శి బళ్ళా శ్రీనివాసరావు, మండల కార్యదర్శి ఎమ్ నాగేశ్వరరావు,కోశాధికారి గున్నూరి లాజర్, ఉపాధ్యక్షులు  వై పవన్,ఎమ్ మల్లేష్,వెంకటేశ్వరరావు, సహాయకార్యదర్శి ఎస్ భాస్కర్, జి నానీ ,జి వెంకటేష్,పీఎమ్ దాస్,పీ లక్షణరావు, కణుపూర్ శ్రీనివాస్ లతో పాటు పీఎంపీ లు పాల్గొన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ న్యాయవాదుల నిరసన...

 విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ న్యాయవాదుల నిరసన...



 ప్రత్తిపాడు పెన్ పవర్ 

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రవేటీకరణ కు వ్యతిరేకిస్తూ  రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్ కు మద్దతుగా, ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి,  కోర్టు ఆవరణ నుండి మెయిన్ రోడ్ వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగాలని నినాదాలతో నిరసన ర్యాలీ నిర్వహించిన అనంతరం ప్రత్తిపాడు- సామర్లకోట రోడ్ లో రాస్తారోకో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బార్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి అడారి సుగుణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, అటువంటి పరిశ్రమను ప్రవేటపరం చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం శోచనీయమని అన్నారు. విశాఖ ఉక్కుని రక్షించకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదుల అందరూ ఈ ఆందోళనలు బాగస్వాములవుతారని, చెప్పారు.ఈ కార్యక్రమంలో బార్ ప్రెసిడెంట్ బుగత శివన్నారాయన, అడారి సుగుణ, వెంకటరావు, మధుబాబు, విజయ్ కుమార్, కాళీప్రసాద్, జాన్ బాబు, నర్సింగరావు, చలం, మల్లేశ్వరరావు, నాగేంద్ర, కె శ్రీనివాస్, చిట్టిబాబు, జోగేష్ మరియు రవికుమార్ లు పాల్గొన్నారు.

విశాఖ ఉక్కును రక్షించుకుంటాం

విశాఖ ఉక్కును రక్షించుకుంటాం



బంద్ కు సంఘీభావ సభలో.. వీరలక్ష్మీ

పెద్దాపురం,పెన్ పవర్

ఎన్నో త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును పరిరక్షణకు ఉద్యమిస్తామని సిఐటియు జిల్లా అధ్యక్షురాలు ఎమ్.వీరలక్ష్మీ అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో రాష్ట్ర బంద్ కు పిలుపుకు సంఘీభావంగా పెద్దాపురం మెయిన్ రోడ్ ఆంజనేయస్వామి గుడి సెంటర్ సిఐటియు మండల అధ్యక్షులు గడిగట్ల సత్తిబాబు అధ్యక్షతన సిఐటియు- ఎఐటియుసి- ఐఎఫ్ టియు ఆధ్వరంలో జరిగింది. ఈ సందర్బంగా వీరలక్ష్మీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజలపైన కక్షకట్టిందని అన్నారు. 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టడం అంటే ఆంద్రప్రజల గౌరవాన్ని వమ్ముచేయడమే అని అన్నారు. 2 లక్షల కోట్ల విలువైన ఆస్ధులు ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని కేవలం 5 వేల కోట్లుతో పోస్కో కంపెనీకి అమ్మడం చాలా దారుణమన్నారు. దీనిపైన పెద్దఉద్యమం నిర్వహించాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి దాడి బేబి, సిఐటియు నాయకులు మాగాపు నాగు, ఐ.ఎఫ్.టి.యు నాయకులు ఇ.చిట్టిబాబు, ఎఐటియుసి నాయకులు రామకృష్ణ, త్రిమూర్తులు, కన్నూరి ప్రసాద్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి కేదారి నాగు,  సిఐటియు నాయకులు ఎస్.శ్రీనివాస్, ఐద్వా నాయకులు కూనిరెడ్డి అరుణ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో దారపురెడ్డి కృష్ణ, జాగారపు సూర్యకుమారి, మామిడి సత్యవేణి, ఉమామహేశ్వరి, డి.సత్యనారాయణ, ఎమ్.రాంబాబు, తదితరులు పాల్గోన్నారు.

విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయొద్దు...

 విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయొద్దు...



ఎటపాక మండలంలో బంధు ప్రశాంత

ఎటపాక,పెన్ పవర్

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో  ఎటపాక మండలం లక్ష్మీపురం తోటపల్లి రహదారులపై  అఖిలపక్ష నాయకులతోసి  బంద్ ప్రశాంతంగా కొనసాగింది  ...ఈ బంద్ కార్యక్రమాన్ని ఉద్దేశించి అఖిలపక్ష నాయకులు  విషం పెళ్లి వెంకటేశ్వర్లు రంబాల నాగేశ్వరరావు మాట్లాడుతూ  ...కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం భావ్యం కాదని  విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చెయ్యడంతో ఆంధ్ర రాష్ట్రానికి  ఆర్థిక వనరులు వాటిల్లుతాయనే  అదేవిధంగా కార్మికులకు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని  అన్నారు,విశాఖ ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయొద్దని దానిని  ను  ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం రోడ్డు దిగ్బంధం కార్యక్రమాన్ని నిర్వహించామని  అన్నారు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక వనరుగా ఉన్నటువంటి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని  కేంద్రంలోని ఉన్నటువంటి బీజేపీ పార్టీ  పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికి పూనుకుందని అని అన్నారు,దీనిని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ  చెయ్యకుండా  ఉండేందుకు అందరం ఐక్యంగా పోరాటం చేద్దామని అన్నారు,విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాలతో  బంద్ ప్రశాంతంగా నిర్వహించారు  ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.

ఎన్నికల ప్రచార జాతా వాహనాలు ప్రారంభం

 ఎన్నికల ప్రచార జాతా వాహనాలు ప్రారంభం



పెద్దాపురం,పెన్ పవర్

ఎన్నికల ప్రచారజాతా కు సంబందించిన ప్రచార వాహనాలను రొంగల తాతారావు జెండా ఊపి ప్రారంభించారు. ఎన్నికల ప్రచారం కోసం 14,15,18,21 వార్డులోకి ప్రచార వాహనాలు యాసలపు సూర్యారావు భవనం నుండి  బయలుదేరాయి. నిరంతరం ప్రజల కోసం పని చేసే సిపిఎం అభ్యర్దులను గెలిపించాలని కోరారు. నిస్వార్దంగా కార్మికుల కోసం, రైతుల కోసం సిపిఎం మాత్రమే పోరాడుతుందని ఆయనన్నారు. ఈ కార్సక్రమంలో 14వ వార్డు సిపిఎం అభ్యర్ది రొంగల సుబ్బలక్ష్ణీ, 15వ వార్డు అభ్యర్ది యాసలపు అనంత లక్ష్మీ, 18వ వార్డు అభ్యర్ది కూనిరెడ్డి అరుణ, 21వ వార్డు అభ్యర్ది నీలపాల సూరిబాబు తదితరులు పాల్గోన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...