Followers

జెడ్పిటిసి, ఎంపీటీసీ అభ్యర్థులకు సమావేశం ఏర్పాటు

 జెడ్పిటిసి, ఎంపీటీసీ అభ్యర్థులకు సమావేశం ఏర్పాటు

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడి ఎంపిడిఓ కార్యాలయంలో శనివారం ఎంపిడిఓ ఎం.రాజశేఖర్, తహశీల్దార్ ఎం.నరసింహమూర్తి అధ్యక్షత న  8 వ తారీఖు న జరగబోయే జెడ్పిటిసి మరియు ఎంపీటీసీ అభ్యర్థులకు ఎన్నికల నియమావళి గురించి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల నియమనిబంధనలు తదితర విషయాలను వివరించడం జరిగింది. తహసీల్దార్ నరసింహమూర్తి మాట్లాడుతూ కేన్వాసింగ్ నిమిత్తం మైక్ పర్మిషన్ ఎంపిడిఓ వారి వద్ద, వెహికిల్ పర్మిషన్ ఆర్డీవో వారి వద్ద తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏయస్ఓ జోడాల వెంకటేశ్వరరావు, మండల పరిషత్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రామారావు, జూనియర్ అసిస్టెంట్ రవి, తదితరులు పాల్గొన్నారు.

పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే

 పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే.. 

శివారు ప్రాంతాల అభివృద్ధికి 3వేల కోట్లు కేసిఆర్ ప్రకటన..ఎమ్మెల్యే.. 

భవిష్యత్‌లో ఎలాంటి వరద విపత్తులు తలెత్తకుండా పనులు చేపట్టేందుకు.. 

ప్రగతినగర్ కమాన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే.. 



కుత్బుల్లాపూర్, పెన్ పవర్ 

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ వార్డులో రూ.1.57 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శనివారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక మేయర్ కొలన్ నీలాగోపాల్ రెడ్డి, కమిషనర్ గోపి ఐఎఎస్, డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. ముందుగా ప్రగతి నగర్ కమాన్ వద్ద .40 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్, ప్రగతి నగర్ నుండి బాచుపల్లి వెళ్లే మెయిన్ రోడ్డులో రూ.48 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించారు. అనంతరం ప్రగతి నగర్ ఎన్ఆర్ఐ కాలనీలో రూ.23.28 లక్షలతో బీటీ రోడ్డు, రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసి రోడ్లను ప్రారంభించారు. తదనంతరం అపురూప -2 కాలనీలో .20 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన పంచతత్వ పార్క్ ను ప్రారంభించారు. అనంతరం చందు లే-అవుట్ లో చలి వేంద్రం మరియు ఎన్ఆర్ఐ కాలనీలో స్థానిక కార్పొరేటర్ చిట్ల దివాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. చివరగా 11వ వార్డు వీకర్ సెక్షన్ లో రూ.13 లక్షలతో నూతనంగా చేపడుతున్న మంజీర నీటి పైపు లైన్ పనులకు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మాట్లాడుతూ గ్రేటర్‌ హైదరాబాద్ శివారు ప్రాంతాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ముందుచూపు‌ బ్రహ్మండమైనదని కొనియాడారు.. శివారు ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటైన కాలనీలతో పాటు నలువైపులా మిగిలి ఉన్న కాలనీలకు మంచినీరు, సివరేజీ పైపులైన్‌ వసతులు కల్పించేందుకు ప్రత్యేకంగా రూ.3 వేల కోట్లు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం సంతోషకరమని అందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. భారీ వర్షాలకు అన్ని ప్రాంతాలు జలమయమై ఇబ్బందులు కలిగిన దృష్ట్యా భవిష్యత్‌లో ఎలాంటి వరద విపత్తు రాకుండా పనులు చేపట్టేందుకు సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకోవడంతో ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ నిధుల ద్వారా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మంచినీరు, సివరేజీ పైపులైన్‌ వంటి అభివృద్ధి పనులు పూర్తికానున్నట్లు పేర్కొన్నారు.  నిత్యం ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వివిధ కాలనీల సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

బాలికలు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి

 బాలికలు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి


మందమర్రి,  పెన్ పవర్

బాలికలు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని మందమర్రి పట్టణ ఎస్ఐ లింగంపల్లి భూమేష్ పేర్కొన్నారు. అంతర్జాతీయ పోటీలు బంగారు పథకాలు సాధించిన పట్టణ విద్యార్థులను శుక్రవారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో అభినందించి‌, సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫునకోషి శోతోకొన్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో కరాటే ఇండియా నిర్వహించిన ఏషియన్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలు గోవాలో మార్చి 28,29 నిర్వహించబడ్డాయని, ఈపోటిలలో 800 మంది విద్యార్థులు పాల్గొనగా మందమర్రి పట్టణానికి చెందిన డ్రాగన్ కరాటే కుంగ్ ఫూ అకాడమీ విద్యార్థినిలు జి శివాని,డి హర్షిత శర్మలు చక్కటి ప్రతిభ కనబరచి పతకాలు సాధించారని ఆయన తెలిపారు. అండర్ 14 విభాగంలో జి శివాని కుమిటి,కటాస్ లో బంగారు,వెండి పతకాలు సాధించగా, అండర్ 17 విభాగంలో డి హర్షిత శర్మ కటాస్,కుమిటి లో బంగారు, వెండి పతకాలు సాధించారన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన సూచించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని, వాటిని సాధించే దిశగా పట్టుదలతో కృషి చేయాలని పేర్కొన్నారు. శివాని, హర్షిత లు భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రాజా గౌడ్, కరాటే మాస్టర్ వెంకటేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఈపీ ఆపరేటర్ల ఎంపిక పరీక్షకు అన్ని ఏర్పాట్లు

 ఈపీ ఆపరేటర్ల ఎంపిక పరీక్షకు అన్ని ఏర్పాట్లు

కళ్యాణి ఖని,  పెన్ పవర్ 

సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న ఈపి ఆపరేటర్ ల ఎంపిక పరీక్షకు మందమర్రి ఏరియాల్లో అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిఎం కార్యాలయంలో ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ ఆద్వర్యంలో ఎంపిక కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల నుండి 206 మంది ఉద్యోగులు ఈపి ఆపరేటర్ ఉద్యోగం కొరకు దరఖాస్తు చేసుకున్నారని, సింగరేణి యాజమాన్యం ఉత్తర్వుల ప్రకారం వీరందరికీ ఏరియాలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో ఏప్రిల్ 5,6,7 తేదీలలో ఉదయం 5 గంటల నుండి ఎంపిక పరీక్ష నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. దీంతో ఏప్రిల్ 3 నుండి 7వ తేదీ వరకు మైదానం మూసివేయడం జరుగుతుందని,ప్రజలు సహకరించగలరని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జిఎం రామ్మోహన్, ఏరియా ఇంజనీర్ ఏజిఎం జగన్మోహన్ రావు, ఏరియా పర్సనల్ మేనేజర్ వరప్రసాద్,ఏరియా వర్క్ షాప్ డిజిఎం నరసింహరాజు, డివైపిఎం శ్యాంసుందర్, సివిల్ ఈఈ జయప్రకాష్, సీనియర్ పిఓ సత్యబోస్, వర్క్ షాప్ ఎస్ఈ ప్రభాకర్, ఎస్ అండ్ పిసి  ఎస్ఎస్ఓ రవి తదితరులు పాల్గొన్నారు.

నెల్లికుదురు మండలగౌడ సంఘం అధ్యక్షుడిగాసతీష్ గౌడ్

 నెల్లికుదురు మండలగౌడ సంఘం  అధ్యక్షుడిగాసతీష్ గౌడ్



నెల్లికుదురు, పెన్ పవర్

గౌడ సంక్షేమ సంఘం  మండల అధ్యక్షులుగా  మండలంలోని వావిలాల గ్రామానికి చెందిన బోల్లేపెల్లి సతీష్ గౌడ్ ను,గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ జనగాం శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు,నియమిస్తూ,నియమకపత్రాన్ని శుక్రవారం మండల కేంద్రములో గౌడ సంక్షేమ సంఘం మహబూబాద్ జిల్లా కన్వీనర్ బూరుగు శ్రీకాంత్ గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గౌడ కులస్తుల సమస్యల కోసం నిరంతరం కృషి చేస్తున్న అతని సేవలను గుర్తించి,ఈ పదవి అప్పగించినట్లు తెలిపారు.అనంతరం సతీష్ గౌడ్ మాట్లాడుతూ...నాకు సహకరించి, నాపై నమ్మకంతో ఈ పదవి అప్పగించిన గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర,జిల్లా నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ, గౌడ సంక్షేమ సంఘం బలోపేతం కోసం, సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళల కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమములో తూళ్ళ ప్రణయ్, నందా, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.

నాలాలో వ్యర్థాలను పూడిక తీసే పనులను పరుశీలించిన ఎమ్మెల్యే

 నాలాలో వ్యర్థాలను పూడిక తీసే పనులను పరుశీలించిన ఎమ్మెల్యే

పెన్ పవర్,  మల్కాజిగిరి

ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ ప్రాంతల్లో పివిఎన్ కాలనీలో సెంట్అన్స్ స్కూల్ వద్ద నాలాలో ఉన్న వ్యర్థాలను పూడిక తీసే  పనులను ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాలా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ శ్రీకాంత్ నాయకులు మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, జిఎన్.వి. సతీష్ కుమార్, బాబు, సత్యనారాయణ, శంకర్ రావు,ఎస్ ఆర్ ప్రసాద్, సంతోష్ రాందాస్, రవి, అశోక్, కిషోర్, మబ్బు, శ్రీధర్ లు తదితరులు పాల్గొన్నారు.

కోవిడ్ నిబంధనలు పాటించాలి

 కోవిడ్  నిబంధనలు పాటించాలి..

పట్టణ సీఐ వెంకటేష్..


వేములవాడ, పెన్ పవర్

ఆటో డ్రైవర్ లు కోవిడ్ 19 నిబంధనలు పాటించాలని వేములవాడ పట్టణ సీఐ వెంకటేశ్ తెలిపారు. శుక్రవారం పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో స్థానిక తిప్పాపూర్ బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్ లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ  కరోనా సెకండ్ వేవ్ పెరుగుతున్న క్రమంలో ఆటో డ్రైవర్లు ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని  ఆటో లో ఎక్కే ప్రయాణికులు ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించి, దూరం పాటించే విధంగా చూసుకోవానే   బాధ్యత డ్రైవర్ దేనని గుర్తు చేశారు. ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ కోవిడ్ నియంత్రణ కు సహకరించాలని లేనిచో విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తప్పవని, ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...