Followers

మోడీ విధానాలు ఇప్పటికైనా మానుకోవాలి...సిఐటియు

మోడీ విధానాలు ఇప్పటికైనా మానుకోవాలి  సిఐటియు 

       

మహారాణి పేట, పెన్ పవర్

బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తామనుకున్న నరేంద్ర మోడీకి ఆ రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని, బిజెపి ఓట్లు తగ్గడానికి కారణం వినాశకరమైన విధానాలే కారణమని సిఐటియు నగర అధ్యక్షులు ఆర్ కే ఎస్ వి కుమార్ తెలిపారు. ఈ విధానాలు నిలుపుదల చేయకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 32వ రోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న దీక్ష ను ఆయన ప్రారంభించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోవిడ్ రోగులకు ఆక్సిజన్ను అందించడం, అలాగే ప్రభుత్వ హాస్పిటల్ లో బెడ్స్ కొరతగా ఉండటంతో 1000 బెడ్స్ తయారుచేసి పంపిణీ చేసిందని పేర్కొన్నారు.  స్టీల్ ప్లాంట్ ప్రభుత్వరంగ సంస్థలు ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచాయని ఎంతోమందికి అసంఘటిత రంగ కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాయని అన్నారు. ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థల ని అమ్ముతామంటే విశాఖ ప్రజలు చూస్తూ ఊరుకోరని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. తక్షణమే ఈ విధానాలు మానుకొని ప్రజల ఆరోగ్యం, ఉపాధిని కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిఐటియు మద్దిలపాలెం జోన్ అధ్యక్షులు వి.కృష్ణారావు,నాయకులు అనపర్తి అప్పారావు,కె.కుమారి, ఎం.చంటి, శ్రీనివాస రాజు, పి.దేముడు, యన్.అది తదితరులు పాల్గొన్నారు.

ఆంక్షలు కఠినం ... అవసరమైతే లోకల్ లాక్ డౌన్

 ఆంక్షలు కఠినం ... అవసరమైతే లోకల్ లాక్ డౌన్

కోవిడ్ నియంత్రణలో రాజీపడేది లేదు
జిల్లా కలెక్టర్ కు డిప్యూటీ సీఎం కృష్ణదాస్ ఆదేశాలు

శ్రీకాకుళం, పెన్ పవర్

కోవిడ్ కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నందున ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయాలని, జిల్లాలో అవసరమైన చోట్ల లోకల్ లాక్ డౌన్ విధించేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ జిల్లా కలెక్టర్ జె.నివాస్ ను ఆదేశించారు. ఆయన సోమవారం ఉదయం కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ కేసుల పరిస్థితిపై సమీక్షించారు. ఈ వారంలో ప్రతిరోజూ రెండు వేలకు మించి పాజిటివ్ కేసులు నమోదవుతుండడం ఎంతో ఆందోళన కలిగిస్తున్న విషయమని అన్నారు. ఇంకా కోవిడ్ పరీక్షల సంఖ్యను బాగా పెంచాలని సూచించారు. కోవిడ్ రోగులకు సత్వర వైద్యాన్ని అందించే విషయంలో ఎంతమాత్రం అలక్ష్యం పనికిరాదని, ప్రతి పాజిటివ్ కేసుకీ వెంటనే తగిన వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. ఫోన్ చేసిన మూడు గంటల్లో కోవిడ్ రోగికి పడక ఏర్పాటు చేయడమే లక్ష్యంగా సీఎం జగన్ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని అన్నారు. 

 ఐదువేల పడకలు సిద్దం చేయాలి : 

జిల్లాలో కనీసం ఐదు వేల పడకలు త్వరితగతిన ఏర్పాటు చేయాలని మంత్రి  పేర్కొన్నారు. హెూమ్ ఐసోలేషన్ లో ఉన్న వారిపై మరింత ప్రత్యేక దృష్టి సారించాలని,  అందరికీ కిట్స్ అందాలని సూచించారు. ఏ.ఎన్.ఎం ఇళ్లను సందర్శించడం లేదనే ఆరోపణలు రాకూడదని, వాటిని సరిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ఆక్సిజన్, రేమిడిసివర్ ఇంజెక్షన్ సరఫరాలో ఇబ్బందులు ఉండకూడదన్నారు. ప్రతి పడకపై ఉన్న బాధితులకు మంచి మెరుగైన వైద్య సేవలు అందాలని ఆయన ఆదేశించారు. కోవిడ్ బాధితులకు మందులు, ఆహారం సకాలంలో అందాలని,  వెంటిలేటర్, ఆక్సిజన్ పడకలపై ఉన్న క్రిటికల్ కేసుల పరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారించాలని, వాటి సంఖ్య తక్కువగా ఉన్నందున వాటిని పెంచే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు.

 ఆహారం, శానిటేషన్ పై ఫిర్యాదులు ఉండరాదు : 

104 కాల్ సెంటర్ అత్యంత కీలకమైన వ్యవస్థగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి భావిస్తున్నారని చెప్పారు. సాధ్యమైనంత మేర ఏ వ్యక్తి మరణించకుండా శాయశక్తుల కృషి చేయాలని ఆయన తెలిపారు. వైద్యులు, వైద్య సిబ్బంది మానవతాధృక్పధంతో సేవలను అందించి బాధితుల కుటుంబాల్లో ఆనందం నింపుతున్నారని అభినందించారు. కోవిడ్ వైద్యం కోసం వచ్చే వారికి తక్షణం పడకలు అందాలని ఆ మేరకు ఏర్పాట్లు ఉండాలని అన్నారు. ఆక్సీజన్ వినియోగించడంలో వృధా ఉండరాదని సూచించారు. ప్రతి ఒక్కరి ప్రాణాలు కాపాడటమే ధ్యేయంగా పనిచేయాలని ఆదేశించారు. కొవిడ్ సెంటర్లలో ఆహారం, శానిటేషన్ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని చోట్ల సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే మాట వినిపించుకూడదని ఫిర్యాదులు వస్తే వాటిపై దృష్టి పెట్టాలని చెప్పారు. 

ఆక్సిజన్ పడకల కొరత లేదు  కలెక్టర్ నివాస్ :

 దీనిపై జిల్లా కలెక్టర్ కె నివాస్ స్పందిస్తూ రెండవ విడత కరోనా వ్యాప్తి సందర్భంగా జిల్లాలో వైద్య సదుపాయాలను బాగా మెరుగుపరచడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. కొద్ది రోజుల్లో అదనంగా మరిన్ని పడకలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ప్రస్తుతం 17 వందలు ఉన్నాయని అందులో దాదాపు 13 వందల బెడ్లలో కోవిడ్ బాధితులు ఉన్నారని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్న ఆక్సిజన్ బెడ్లు అన్నిటినీ కోవిడ్ కోసం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. రాజాం, పాలకొండ, ఇచ్చాపురం, మందన వంటి ప్రాంతాల్లో సైతం ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేయుటకు సన్నాహాలు చేస్తున్నామని కలెక్టర్ నివాస్ తెలిపారు. జెమ్స్ లో ఆక్సిజన్ పడకలు పెంచుతున్నామని, రిమ్స్ లో అదనంగా వంద పడకలను రెండు రోజుల్లో ఏర్పాటు చేశామని వివరించారు. రాజాం ఏరియా ఆస్పత్రి, జిఎంఆర్ ఆస్పత్రిని కోవిడ్ ఆస్పత్రులుగా మార్చామని, పాలకొండ ఆసుపత్రిని కూడా మార్చుతున్నామని ఆయన చెప్పారు. జిల్లాలో కోవిడ్ కేర్ కేంద్రాలను ఏర్పాటు చేశామని అందులోనూ మంచి వైద్య సదుపాయాలు అందిస్తున్నామని, హెూమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి కూడా వైద్య సదుపాయాలు అందిస్తున్నట్లు చెప్పారు. కంటైన్మెంట్ ఆపరేషన్లను పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు వివరించారు.  పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు 24 గంటల్లో ఫలితాలను తెలియజేస్తున్నామని చెప్పారు. జిల్లాలో రోజుకు 48 వేల లీటర్ల ఆక్సిజన్ అవసరమని, ప్రస్తుతానికి ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావడం లేదని ఆక్సిజన్ సరఫరా పెంచుటకు విశాఖపట్నం జిల్లా యంత్రాంగంతో సైతం సంప్రదింపులు జరిపామని కలెక్టర్ తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రేమిడీస్వీర్ ఇంజక్షన్ అవసరం మేరకు అందిస్తున్నామని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కు కలెక్టర్ నివాస్ వివరించారు.


ముమ్మరంగా శానిటేషన్ పనులు

ముమ్మరంగా శానిటేషన్ పనులు

అమలాపురం, పెన్ పవర్

అమలాపురం రూరల్ మండల  గున్నేపల్లి అగ్రహారంలో కరోనా మరణమన జరిగిన ఏరియా సోమవారం శానిటేషన్ పనులను  ఈఓపిఆర్ఢీ  మల్లికార్జున్ పరిశీలించారు. అలాగే ఇందుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ చొల్లంగి అప్పాజీ శివాలిని  కొత్త వీధి,  బొంతు వారిపేటతో పాటు తదితర ప్రాంతాల్లో బ్లీచింగ్ పనులను అయన పరిశీలించారు.  పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావు  రమా శైలజ, అభిలాష్ , సిబ్బంది పాల్గొన్నారు.

పరిశ్రమలు ఆపి ఆక్సిజన్ కొరత తీర్చే దమ్ము లేదా !

 పరిశ్రమలు ఆపి ఆక్సిజన్ కొరత తీర్చే దమ్ము లేదా !

కరోనా వ్యాప్తికి ప్రధాని, కేంద్ర ఎన్నికల సంఘం భాద్యత వహించాలి
కోవిడ్ భాదితులకు ధైర్యం కల్పించటంలోను, అండగా నిలవటంలోను నేతలు గైరుహాజరు

రాజమహేంద్రవరం, పెన్ పవర్

రాజమహేంద్రవరంలో గల  పేపర్ మిల్స్, హార్లిక్స్ ఫ్యాక్టరీల ఆక్సిజన్ కరోనా భాదితులకు సరఫరా చేయాలి. నగదు రహిత కోవిడ్ వైద్య సేవలకు ప్రభుత్వం తక్షణ ఆదేశాలు జారి చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు.  కరోనా మొదటి సారి వచ్చి నప్పుడు ఎదురైన అనుభవాలను గమనించి కూడా మోది సర్కార్ భద్రతా చర్యలు చేపట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని, రెండో దఫా అది కూడా మే నెలలో కరోనా వైరస్ ప్రమాదం ముంచుకొస్తుంది అని నిఘా వర్గాలు కచ్చితమైన అంచనాలతో కేంద్ర ప్రభుత్వానికి ముందస్తు సమాచారం  తెలిపినా ప్రజలకు  ఆరోగ్య భద్రత కల్పించటంలో  మోది సర్కార్  నిర్లక్ష్యం వహించిందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు .  ఇంత ప్రమాదకర స్థాయిలో కోవిడ్ వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నప్పటికి కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యతారాహిత్యంగా దేశ వ్యాప్తంగా ఎన్నికలు, ఉప ఎన్నికలు నిర్వహించి కరోనా మరణాలకు కారకులుగా నిలిచారని,రాజకీయ ఒత్తిడిలకు తలొగ్గి నిబంధనలు విశ్మరించి భౌతికదూరం పెడచెవిన పెట్టి నిర్లక్ష్యంగా ఎన్నికల నిర్వహణ జరిపించారని, పోలింగ్ బూత్ లలో కనీసం శానిటేజర్స్, మాస్క్ లు కూడా సరఫరా చేయలేదని, మద్యం ఏరులై పారిందని, కరోనా జాగ్రత్తలు మత్తు బాబులు గాలికి ఒదిలి ఓటు వినియోగించుకున్నారని, కనీసం బ్రీత్ ఎనలైజర్స్ ఏర్పాటు చేసి ఓటింగ్ ప్రాగణానికి భద్రత కల్పించలేకపోయారని ఆయన తీవ్ర మనస్తాపానికి గురైయ్యారు. మరో సారి కోవిడ్ వైరస్ ప్రమాదం ముంచుకొస్తుందని భారత నిఘా వర్గాలు హెచ్చిరికలు చేసినప్పటికి మోది సర్కార్ నిర్లక్ష్యంగా లక్షల మంది హాజరయ్యే కుంభమేళాకు, సినిమాలకు,సినిమా హాల్స్ కు, మాల్స్, పబ్ లకు, బార్ లకు, విద్యా సంస్థలకు, మార్కెట్టు లకు, ఇతర బజార్లకు, అధికార పక్ష రాజకీయ సభలు, సమావేశాలకు కనీస నిబంధనలు కూడా పాటించని విధంగా అనుమతులు జారీచేయటం అన్యాయం అని ఆయన పేర్కొన్నారు.  కరోనా భాదితులను అడ్డగోలుగా కొన్ని కార్పొరేట్, ప్రయివేట్ ఆసుపత్రులు ఆర్దికంగా దోచుకుంటున్నా ప్రభుత్వ యంత్రాంగం చోద్యం చూస్తుందని,ఆక్సిజన్ సరఫరా చేయటం లో ఘోరంగా ప్రభుత్వ యంత్రాంగం  వైఫల్యం చెందుతుందని , కరోనా బాధితులకు సరఫరా చేసే వ్యేక్సింన్లు దళారుల చేతుల్లోకి ఎలా వెళుతున్నాయనే అంశం పై ప్రభుత్వ యంత్రాంగం సమాధానం చెప్పాలని, కొన్ని కొన్ని మందులు షాపుల్లో దొరక్కుండా కృత్రిమ కొరత సృష్టిస్తున్నా సంబంధిత శాఖలు గుడ్డి వాని పాత్ర పోషిస్తు అక్రమాలను ప్రోత్సహిస్తున్నాయని  ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆక్సిజన్ కొరత నివారించటానికి ప్రభుత్వం దేశ వ్యాప్తంగా వున్న పరిశ్రమలను తాత్కాలికంగా  నిలిపివేసి  ఆ పరిశ్రమల నుండి ఆక్సిజన్ సరఫరా జరిపించే చర్యలు ఎందుకు చేపట్టలేక పోతున్నారని, ఆక్సిజన్ లేక వేల మంది చనిపోతున్నా ప్రభుత్వాలు పరిశ్రమల యాజమాన్యం తో ఆక్సిజన్ సరఫరా ఎందుకు జరిపించలేక పోతున్నారని, సామాన్య ప్రజల ప్రాణాల కన్నా కార్పొరేట్, ప్రయివేట్ సంస్థలకు మేలు చేయటమే మోది సర్కార్ ప్రధాన లక్ష్యంగా కనబడుతుందని ఆయన అసహనం వ్యక్తం చేసారు. ప్రస్తుత కరోనా కష్ట కాలములో ఓట్లు వేయించుకున్న నేతలు అజ్ఞాతంలో వుంటు కరోనా భాదితుల దోపిడిని ప్రశ్నించడం లేదని, మొక్కుబడిగా ప్రకటనలుకు పరిమితం అయ్యి దొడ్డి దారిన అక్రమ వసూళ్లు లో వాటాలు తీసుకుంటున్నారని, కరోనా బాధితులకు అధికారిక సేవలు అందించటంలో గోదాముల్లో  దాంకుంటున్నారని,  ఈ కష్ట కాలంలో కరోనా భాదితులకు అండగా నిలవకుండా భాదితులను దోచుకుంటున్నారని,  అనాదిగా ఓటర్లు ఒక రకమైన కుత్రిమ బలహీనతలుకు బానిసలుగా మారి ఈ తరహా నేతలకు జె జె లు కొట్టడం మనుకోలేక పోతున్నారని ఆయన ఆందోళన చెందారు. కార్పొరేట్, ప్రయివేట్ ఆసుపత్రుల్లో  ఆరోగ్య శ్రీ కార్డులపై జరిగే వైద్య సేవల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని,నగదు రూపంలో లక్షలు చెల్లించటానికి సిద్దపడే కొరోనా బాధితులను మాత్రమే ఆసుపత్రిలో జాయిన్ చేసుకుంటున్నారని, ఆరోగ్య శ్రీ పై తూ తూ మంత్రం గా కరోనా వైద్యం చేస్తు పంపించేస్తున్నారని, కరోనా  పేరుతొ వైద్య సేవలు చేస్తున్నట్టు రికార్డుల్లో పేర్కొని ప్రభుత్వం నుండి పెద్ద  మొత్తంలో నిధులు దోచుకుంటున్నారని, కరోనా పేరుతొ మరణించిన ఘటనలపై విచారణ కు ఆదేశిస్తే అనేక నిజాలు బహిర్గతం అయితాయని ఆయన తెలిపారు. ఏపిలో గల స్థానిక పరిశ్రమల నుండి ఆక్సిజన్ సరఫరా ను కరోనా భాదితులకు మాత్రమే వినియోగించు విధంగా తక్షణమే ప్రభుత్వ ఆదేశాలు జారి చేయాలని, ఇదే విధంగా భారత్ లో గల పరిశ్రమల నుండి ఆక్సిజన్ సరఫరా కరోనా భాదితులకు మాత్రమే సరఫరా జరిగే విధంగా అత్యవసర ఆదేశాలు విడుదల చేయాలని తూ గో జిల్లాలో గల పరిశ్రమల నుండి తక్షణమే మొత్తం ఆక్సిజన్ కరోనా భాదితులకు సరఫరా జరిగే విధంగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయాలని, రాజమండ్రి లో గల అతిపెద్ద పరిశ్రమలైన పేపర్ మిల్స్, హార్లిక్స్ ఫ్యాక్టరి ఇతర పరిశ్రమ ల నుండి ఆక్సిజన్ సరఫరా జరిగే విధంగా తక్షణ  ఏర్పాట్లు చేయాలని, ఇప్పుడైనా నేతలు దాగుడు మూతలు ఆపి కరోనా వైరస్ భాదితులకు రక్షణగా నిలవాలని, నగదు రహిత వైద్య సేవలు అమలు జరిపే చర్యలకు తగు ఆదేశాలు జారి చేయాలని  ఆయన కోరారు.  భారతదేశం లో కరోనా వైరస్ బారిన పడి మరణించిన ప్రతి మరణం కు ప్రధాని మోది, కేంద్ర ఎన్నికల సంఘం నిర్లక్ష్యం వుందని, మోది కి ప్రజల ప్రాణాల కన్నా కార్పొరేట్, ప్రయివేట్ సంస్థల పైనే మక్కువ అని, కరోనా ముసుగులో ప్రజల నుండి దోచుకున్న సొమ్మునే కార్పొరేట్ ప్రయివేట్ దిగ్గజాలు మోదీ ఎన్నికలకు పెట్టుబడి దారులుగా నిలుస్తారని , ప్రతి మారణానికి  మోది సర్కార్ సమాధానం చెప్పాలని, కేంద్ర ఎన్నికల సంఘం పై భారత అత్యున్నత న్యాయస్థానం విచారణ కు ఆదేశించాలని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ డిమాండ్ చేసారు.  సభకు అర్పిసి సీనియర్ సెక్యులర్ డివిఆర్ మూర్తి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో అర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ లంక దుర్గాప్రసాద్, దోషినిషాంత్, పి ప్రసాద్, వల్లి శ్రీనివాసరావు, వల్లి వెంకటేష్, ఖండవల్లి భాస్కర్, తమ్మన సతీష్, బర్ల సతీష్, తదితరులు పాల్గొనియున్నారు.

బొలేరో వాహనం ఢీ కొనడంతో వ్యవసాయ కూలీలు ఇద్దరు మృతి

 బొలేరో వాహనం ఢీ కొనడంతో వ్యవసాయ కూలీలు ఇద్దరు మృతి

 సీతానగరం, పెన్ పవర్ 

 సీతానగరం మండలం వంగలపూడి గ్రామానికి చెందిన దారా కాంతారావు,కొండేపూడి.నాగరాజు అను వారు పని నిమిత్తం కాలినడకన వెళ్లుచుండగా పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం ప్రగడపల్లి గ్రామ సమీపంలో మితిమీరిన వేగంతో బొలేరో ఢీ కొనడంతో కాంతారావు,నాగరాజు ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లుగా పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పంచనామా జరిపి మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లుగా తెలియజేశారు.

నిజాంపేట్ కార్పొరేషన్ లో త్రాగునీటి సమస్యలు తీర్చండి

 నిజాంపేట్ కార్పొరేషన్ లో త్రాగునీటి సమస్యలు తీర్చండి.. 


కుత్బుల్లాపూర్, పెన్ పవర్ 

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో త్రాగు నీటి వసతి కోసం కోటి లీటర్ల సామర్థ్యం గల నాలుగు వాటర్ ట్యాంకర్లు ప్రారంభోత్సవానికి నోచుకోక ప్రజల తాగునీటి సమస్య పరిష్కారం కోసం బిజెపి నాయకులు ప్రారంభం లోనే ట్యాంకర్లను సందర్శించి త్రాగు నీటి సమస్యలు పరిష్కరించాలని పర్యటన.. కార్పొరేషన్లో తాగునీరు రోజువారీగా అధికారికంగా అనుమతి ప్రకారం 1.5 కోట్ల లీటర్లు వస్తుంది. కానీ మూడు కోట్ల లీటర్ల త్రాగునీరు నీరు సాధిస్తేనే కానీ కార్పొరేషన్ త్రాగునీటి సమస్య పరిష్కారం కాదు. ఇప్పటి కూడా 6 బలహీనవర్గాల కాలనీలకు పూర్తిస్థాయిలో మంచినీటి సౌకర్యం కల్పించలేని  పరిస్థితి . పైగా ఈ సంవత్సరన్నర కాలంలోనే దాదాపు 1500 అపార్ట్మెంట్ల నిర్మాణం జరిగింది . కార్పొరేషన్ పరిధిలో కోట్లాది రూపాయలు వెచ్చించి మరో   కోటి లీటర్ల సామర్థ్యం గల మూడు మంచినీటి ట్యాంకులను నిర్మించి, సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు ప్రారంభించక పోవడానికి కారణం ఏమిటో మున్సిపల్ , వాటర్ వర్క్స్ అధికారులు సమాధానం చెప్పాలని,నిజాంపేట్ కు 2 కోట్ల లీటర్ల త్రాగునీరు అధికారికంగా  ఉత్తర్వులు లేకపోవడమేనని, తక్షణమే మున్సిపల్,  వాటర్ వర్క్స్ అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని, నూతనంగా నిర్మించిన కోటి లీటర్ల సామర్థ్యం గల వివిధ మంచినీటి ట్యాంకులను తక్షణమే ప్రారంభించాలని ,6ఎంజిడి లీటర్ల త్రాగునీరు అధికారికంగా మంజూరు చేయించి, త్రాగునీరు ప్రజలందరికీ సప్లై చేయాలనీ, శనివారం.. ప్రారంభం నోచుకోని వాటర్ ట్యాంక్ ను సందర్శించడమే గాక, ఈ సమస్యపై కలెక్టర్ మరియు వాటర్ వర్క్స్, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడమేగాక సమస్య పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట కార్పొరేషన్ అధ్యక్షులు ఆకుల సతీష్ ముదిరాజ్, కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి నరేంద్ర చౌదరి, వైస్ ప్రెసిడెంట్ శివ కోటేశ్వరరావు, బీజేవైఎం అధ్యక్షులు రవీంద్ర, సీనియర్ నాయకులు కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీరామ పాధక్షేత్ర గుట్ట పై శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం

 శ్రీరామ పాధక్షేత్ర గుట్ట పై శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం

12 కోట్లతో ఆలయ నిర్మాణానికి సన్నాహలు..

ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అంకుటిత దీక్ష

7వ, వారాల పాటు స్వామి వారికి తలనీలాలు సమర్పణ

శ్రీ వేంకటేశ్వర నిర్మాణ ట్రస్ట్ ఏర్పాటు

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్


రామగుండం, పెన్ పవర్

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం వేళ రామగుండం నియోజవర్గంలోని ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని శ్రీరామ పాదక్షేత్రమైన రాముని గుండాల కొండ పై స్వయంబుగా వెలసిన శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని నిర్మించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సంకల్పించారు. సిఎం కేసీఆర్ జన్మదిన సంకల్పం ఫలించేలా అభినవ తిరుమల మాదిరిగా ఆలయ నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అకుంటిత దీక్ష చేపట్టారు. ఆలయ నిర్మాణ సంకల్పానికి మరింత బలం చేకురాలని ఎమ్మెల్యే తలనీలాలు స్వామి వారికి సమర్పించారు. మరో ఏడు వారాల పాటు తమ తలనీలాలు స్వామి వారికి సమర్పించేందుకు ఎమ్మెల్యే సంకల్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో 12 కోట్ల వ్యయంతో శ్రీ పాదక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సన్నాహలు మొదలు పెట్టారు. శనివారం శ్రీ పాదక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి తమ తలనీలాలను ఎమ్మెల్యే సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ పాదక్షేతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంతో ఈ ప్రాంతం వైభవంగా అభివృద్ది చెందుతుందన్నారు. ఆలయ నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారికి 7వారాలు తమ తలనీలాలు సమర్పించ నున్నానని తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం శ్రీ వేంకటేశ్వర ఆలయ ట్రస్టు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆలయ నిర్మాణంతో వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రామగుండం నియోజవర్గంలోని ప్రజలంతా సుఖసంతోషాలతో సుభిక్షంగా వర్ధిలేలా స్వామి వారు దివించాలని వేడుకున్నారు. 85 లక్షలతో కొండ పై రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని ఆలయ నిర్మాణానికి స్వామివారి భక్తులు, ప్రజలు భాగస్వామ్యులు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి ఆముల నారాయణ, నగర మేయర్ డాక్టర్ బంగీ అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పోరేటర్లు ఎన్.వి.రమణరెడ్డి, కుమ్మరి శ్రీనివాస్, నాయకులు బద్రి రాజన్న, ఆలయ కమిటీ సభ్యులు మేడి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...