Followers

నూతన రామాలయం లో విగ్రహ పునఃప్రతిష్ట చేసిన బీజేపి నేత కరణంరెడ్డి దంపతులు

 నూతన రామాలయం లో  విగ్రహ పునఃప్రతిష్ట చేసిన బీజేపి నేత కరణంరెడ్డి దంపతులు 

గాజువాక, పెన్ పవర్

గాజువాక పాత కర్నవానిపాలెం లో శ్రీ సీతారామాలయ సమేత శ్రీ లక్ష్మీ గణపతి సహిత శ్రీ కళ్యాణ సుబ్రమణ్యేశ్వర దేవాలయం విగ్రహ పుణః ప్రతిష్ట చివరి రోజు పూజలో బీజేపి గాజువాక నియోజకవర్గ కోఆర్డినేటర్ కరణంరెడ్డి. నరసింగరావు జ్యోతి దంపతులు పాల్గొని పూర్ణాహుతి హోమం మరియు నూతన యంత్ర చక్రం పూజలు అనంతరం వేదపండితులు ఉదయ బాస్కర్ శర్మ,రవిరుమార్ శర్మ ఆద్వర్యంలో యంత్ర మూర్తి శిఖర నాగబంధ ధ్వజ స్థంబ నూతన విగ్రహ పునఃప్రతిష్ట నిరాడంబరముగా జరుగాయని తొలి పూజలో కే.ఎన్.ఆర్  జ్యోతి దంపతులు పాల్గొన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు గొంతిన.దేముడు, కార్యదర్శి మడగల.కన్నయ్య,సంయుక్త కార్యదర్శి జనపరెడ్డి .మణి,దుర్గానగర్ శ్రీ దుర్గాదేవి ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల.అప్పలసూరి ,జనపరెడ్డి. సురేష్,సాలాపు.నూకరాజు,సాలాపు.గోవింద, కోశాదికారి కరణం.రామకృష్ణ,సిరసపల్లి ఈశ్వరరావు, గంతకోరు.నారాయణ, ఇందల.వెంకటేష్ , సుదమల్ల. కిరణ్,కరణం.ప్రసాద్,జనపరెడ్డి రామకృష్ణ , వరహాలరావు, గొంతిన శ్రీను తదితరులు పాల్గొన్నారు.

కరోనా రోగులకు నాణ్యమైన వైద్యం అందించుటలో విఫలమైన అధికార యంత్రాంగం

 కరోనా రోగులకు నాణ్యమైన వైద్యం అందించుటలో విఫలమైన అధికార యంత్రాంగం

మహారాణి పేట, పెన్ పవర్

విశాఖలో క్షణక్షణానికి పెరుగుతున్న కరోనా రోగులకు కనీసము ఆక్సిజన్ కూడా అందించలేని దురదృష్టకర పరిస్థితుల్లో ప్రభుత్వ ,కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి.ఆక్సిజన్ అందక పిట్టలు లాగా రాలిపోతున్న  ప్రజలు.పారిశుధ్యం లోపించి దుర్గంధ భరితమైన ఐ.సి.యు, మరియు వార్డులు.చనిపోయిన రోగి దగ్గర మాయమవుతున్న విలువైన బంగారు ఆభరణాలు సెల్ ఫోన్లు,పార్ధివ దేహం అప్పగింత ఆలస్యం అవుతుందని అంటున్నబాధిత బంధువులు మూగబోయిన 104 మరియు నోడల్ అధికారుల సెల్ ఫోనులు,వార్డులలో లోపించిన వైద్యుల ఉన్నతఅధికారుల,పర్యవేక్షణ, అంకిత భావము లేని యంత్రాంగం.జిల్లా కలెక్టర్ కు సహకరించని సహూద్యోగులు.ప్రభుత్వాలు ప్రజా ఆకర్షణ పథకాలకు ఖర్చుపెడుతున్న డబ్బుతో 18 సంవత్సరాల పైబడిన వారికి  వ్యాక్సిన్ వేయించాలి. కేంద్ర ప్రభుత్వము ఎనిమిది వేల కోట్లకు పైగా నిధులు వ్యాక్సిన్ కోసం అందజేశారని అన్నారు.పెరుగుతున్న కరోనా రోగులను దృష్టిలో ఉంచుకొని తాత్కాలిక  ఆక్సిజన్ పడకలను వెంటనే ఏర్పాటు చేయాలి.బయట ఎండవేడికి ఇమ్యూనిటీ లోపించి  ఆక్సిజన్ లెవల్స్ తగ్గి ప్రతి వారు ఆక్సిజన్ కోసం ఇబ్బందులు పడుతున్నారని ఇంటి వద్దనే ఉండాలి అని ప్రజల సహకారంతోనే  కరోనా ను కట్టడి చేయవచ్చునని  రూపాకుల రవి కుమార్ బి.జె.పి, మెడికల్ కన్వీనర్ సూచించారు.

దివీస్ ల్యాబ్ నుండిఆక్సిజన్ సిలిండర్లు సహాయం

 దివీస్ ల్యాబ్ నుండి ఆక్సిజన్ సిలిండర్లు సహాయం

విశాఖపట్నం, పెన్ పవర్

జిల్లాలో కోవిడ్ ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కొనేందుకు చేపడుతున్న వివిధ జాగ్రత్తలలో భాగంగా దివీస్ ల్యాబ్ నుండి వివిధ ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా నిమిత్తం జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ కు,దివీస్ ల్యాబ్, జనరల్ మేనేజర్ కోటీశ్వరరావు సుమారు 80 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.సోమవారం కలెక్టరేట్ లోని ఆయన చాంబర్ లో అందించి,విశాఖ ఇండస్టియల్ గ్యాసెస్ నుండి వివిధ ఆసుపత్రులకు ఇప్పటికే 350 సిలిండర్లు సరఫరా చేసినట్లు తెలిపారు.  కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బలిటీ కింద ఈ ఆక్సిజన్ సిలిండర్లు ను సరఫరా చేస్తున్నట్లు వివరించారు.దివీస్ ల్యాబ్ లేటరీ నుండి సి.ఎస్.ఆర్. మేనేజర్ డి. సురేష్ కుమార్, పి.అశోక్ మరియు సీనియర్ లైజన్ కన్సల్టెంట్  వరహాలరెడ్డి పాల్గొన్నారు.

కరోనా పై గిరిజనులకు కళజాత మైకుల ద్వారా అవగాహన

 కరోనా పై గిరిజనులకు కళజాత మైకుల ద్వారా అవగాహన

పెన్ పవర్, విశాఖపట్నం

 విశాఖ ఏజెన్సీలో విజృంభిస్తున్న రెండో విడత  కరోనా  తీవ్రతపై  గిరిజనులకు కళాజాత  మైకుల ద్వారా అవగాహన  కల్పిస్తామని  పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ( ఐ టి డి ఎ) ప్రాజెక్ట్ అధికారి వెంకటేశ్వర్ సలిజామల  అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ సెకెండ్ వేవ్  కరోనా మహమ్మారి గిరిజన ప్రాంతంలో  విలయ తాండవం ఆడుతుందని  దీనిని నియంత్రించేందుకు ప్రజా సహకారం అవసరం అన్నారు. ప్రజలు అధికారులు సమిష్టిగా కరోనా వైరస్ ని ఎదుర్కోవలసి ఉందన్నారు. గిరిజన ప్రాంతాల్లో కరోనా మహమ్మారి పై అవగాహన కల్పించేందుకు 11 మండలాల్లో కళాజాత లు  మైకులు ద్వారా ప్రచారం చేస్తామని గిరిజనులు  అవగాహనతో ఉండాలన్నారు. మాస్కులు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని కోరారు. మండల కేంద్రాలకు శివారు గ్రామాలు మైళ్ల దూరంలో ఉండటం వల్ల వైద్య సేవలు సకాలంలో అందుకో లేరని గిరిజనులు కారోనా ఆ నిబంధనలు  తప్పక పాటించాలన్నారు. ఎవరికైనా అనారోగ్యం వస్తే ఆశ కార్యకర్త ఏఎన్ఎం లకు సమాచారం ఇవ్వాలని కోరారు.  ఏజెన్సీలో కొన్ని మండలాలు కర్ఫ్యూ అమలు చేస్తున్నారని  రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 5వ తేదీ నుండి రెండు వారాల పాటు అమలు  చేయమన్నా  లాక్ డౌన్ ను  పాటించాలన్నారు. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు  మాత్రమే దుకాణాలు తెరుచుకుంటాయి అని  ఆ సమయంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది అన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి తెల్లవారు ఐదు గంటల వరకు లాక్ డౌన్ కర్ఫ్యూ అమలు జరుగుతుందన్నారు. ప్రభుత్వం విధించిన నిబంధనలను అందరూ తప్పకుండా పాటించాలని ఎవరు ఉల్లంఘించిన చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారని  పీవో హెచ్చరించారు. వ్యాపారులు వర్తక సంఘాలు నిబంధనలకు సహకరించాలని వెంకటేశ్వర్ అన్నారు.

ఏజెన్సీలో 15 లోగా ఉచిత బియ్యం పంపిణీ చేయాలి

 ఏజెన్సీలో 15 లోగా ఉచిత బియ్యం పంపిణీ చేయాలి

పెన్ పవర్, విశాఖపట్నం

  విశాఖ ఏజెన్సీలో ఈనెల 15లోగా ఉచిత బియ్యం పంపిణీ పూర్తిచేయాలని పాడేరు రెవెన్యూ డివిజనల్ అధికారిణి  లక్ష్మీ శివ జ్యోతి అన్నారు. సోమవారం పాడేరు ఆర్డిఓ కార్యాలయం నుంచి  పాడేరు జి.మాడుగుల  పెదబయలు   ముంచంగిపుట్టు  హుకుంపేట  డుంబ్రిగూడ  అనంతగిరి  అరకు  జీకే వీధి  చింతపల్లి మండలాల తహసిల్దార్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  రెండవ విడత కరోనా మహమ్మారి ఉధృతమవుతున్న దృశ్య ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ చేపట్టిందన్నారు. గిరిజనులకు 15వ తేదీలోగా ఉచిత బియ్యం అందించాలని కోరారు. క్షేత్ర స్థాయిలో కి బియ్యం వాహనాలు వెళ్లి గ్రామాల్లో గిరిజనులకు ఉచిత బియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీ లో ఎటువంటి అవకతవకలు జరిగిన  సహించేది లేదని ఆమె హెచ్చరించారు.  ఆయా మండలాల తహసీల్దార్లు  శివారు గ్రామాలకు సైతం ఉచిత బియ్యం అందాలని దీనికోసం  తహసీల్దార్లు తగిన చర్యలు తీసుకోవాలని  ఆర్ డి ఓ లక్ష్మీ శివ జ్యోతి కోరారు.

ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవా శుభాకాంక్షలు

 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవా శుభాకాంక్షలు

పెన్ పవర్,విశాఖపట్నం

పత్రికా స్వేచ్ఛ పట్ల ప్రభుత్వాల నిబద్ధతను గౌరవించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ ప్రతి సంవత్సరం మే 3 న ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని జరుపుకుంటారు  అని తెలంగాణ హోటల్స్ అండ్ రిసార్ట్స్ సేల్స్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెస్. రవి కుమార్ గుర్తు్చేశారు. పత్రికా స్వేచ్ఛను నిగ్రహించడం లేదా రద్దు చేయడం లక్ష్యంగా ఉన్న మీడియాకు మద్దతు చూపించడానికి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని జరుపుకుంటారు. కలం కత్తి కన్నాశక్తివంతమైనది అన్యన వాపోయారు. సామాజిక సమస్యలకు వ్యతిరేకంగా బిగ్గరగా మాట్లాడండి కలిసి నిలబడండి సాధ్యమైతే వ్యతిరేకించండి పిలుపునిచ్చారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా పాత్రికేయ మిత్రులకు శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఏజెన్సీలో కరోనా నియంత్రణకు వర్తక వ్యాపార సంఘాలు సహకరించాలి

 ఏజెన్సీలో కరోనా నియంత్రణకు వర్తక వ్యాపార సంఘాలు సహకరించాలి

పెన్ పవర్, విశాఖపట్నం

 విశాఖ ఏజెన్సీలో విలయ తాండవం చేస్తున్న రెండో దశ కరోనా నియంత్రణకు వర్తక వ్యాపార సంఘాలు సహక రించాలని మానవ హక్కుల సంఘం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుభా(చిన్ని) అన్నారు. సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా వ్యాపారులు వర్తక సంఘాలు నిర్లక్ష్యం వహిస్తే గిరిజనులు ప్రాణాలు కోల్పోతారని కరోనా ఉధృతి ఉన్న ప్రాంతాల్లో దుకాణాలు మూసివేసి కర్ఫ్యూ పాటించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. వ్యాపారులు  లాభాపేక్షతో  కరోనా ఉన్న  దుకాణాలు యధావిధిగా  తెరుస్తున్నారు అని ఆమె మండిపడ్డారు. పాడేరు గోల్డ్ షాపుల పరిధిలో   నూకరాజు  కరోనాతో మృతి చెందారు. అదే లైన్ లో మరో ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయినా గోల్డ్ షాపులు యధావిధిగా తేరి చేస్తున్నారని  ఆమె విచారం వ్యక్తం చేశారు. ఏజెన్సీ డివిజన్  కేంద్రం సెక్స్ కావడంతో ఇతర మండలాల గిరిజనులు ఏ అవసరానికి అయినా పాడేరు వచ్చి తీరాల్సిందే.  గిరిజన ప్రాంతంలో పెళ్లిళ్లు శుభకార్యాల సీజన్ కావడంతో గిరిజనులు బంగారం బట్టలు కిరాణా సామాన్లు కొనుక్కునేందుకు మండల కేంద్రాలకు వచ్చేస్తున్నారు. కరోనా కేసులు మరణాలు ఉన్న వ్యాపారులు  నిబంధనలకు విరుద్ధంగా  వ్యాపారాలు సాగిస్తున్నారని   అందువల్ల గిరిజనులు కరోనా కి గురికాక తప్పడంలేదు అన్నారు. బంగారం షాపులు 20 రోజులు స్వచ్ఛందంగా మూసివేయాలని  లేనిపక్షంలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో అధికారుల దృష్టికి తీసుకువెళతామని ఆమె హెచ్చరించారు.  షాపులు వద్ద కోవిడ్ 19 నిబంధనలు పాటించడం లేదని గిరిజనులు అవగాహన లేక షాపులో దుకాణాల్లో కలియతిరుగుతూ సరుకులు కొనుగోలు చేస్తున్నారని ఆమె విచారం వ్యక్తం చేశారు. అరకు పాడేరు చింతపల్లి ప్రధాన కేంద్రాల్లో వ్యాపారులు దుకాణాలు మూసివేయాలని చిన్ని  కోరుతున్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...