Followers

ప్రజారోగ్య విభాగపు పనితీరు మరింత మెరుగుపర్చుకోవాలి

ప్రజారోగ్య విభాగపు పనితీరు మరింత మెరుగుపర్చుకోవాలి జి.వి.ఎం.సి. అధనపు కమీషనర్ డా. వి. సన్యాసి రావు


 


విశాఖపట్నం, 


 


ప్రజారోగా విభాగంలోని క్షేత్రస్థాయి అధికారులు ముఖ్యంగా, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్ స్పెక్టర్లు, మేస్త్రీలు వారి పనితీరును మరింత మెరుగు పరుచుకోవాలని జి.వి.ఎం.సి. అదనపు కమీషనర్ డా. వి. సన్యాసి రావు కోరారు. జి.వి.ఎం.సి. కమీషనర్ ఆదేశాల మేరకు, ఆయన ప్రధాన కార్యాలయపు సమావేశ మందిరంలో సి.ఎం.ఓ.హెచ్.తో కలసి సమావేశం నిర్వహించారు. ప్రజారోగ్య శాఖకు సంబందించి వివిధ అంశములపై కూలంకుశంగా చర్చించారు. ట్రేడ్ లైసెన్స్ ఆదాయాన్ని మరింత పెంచాలని, క్రొత్తగా ఏర్పడుచున్న చిల్లర, టోకు వ్యాపారాలను గుర్తించి, వెంటనే ట్రేడ్ లైసెన్స్ ఫీజు మధించాలన్నారు. వ్యాపారాలలో మార్పులు చేస్తే (under assessed) వాటిని సరి దిద్ది లైసెన్స్ ఫీజు పెంచాలన్నారు. ఇప్పటి వరకు బకాయి పడ్డ వ్యాపారస్తుల వద్ద నుండి బకాయిలు రాబట్టాలన్నారు. జి.వి.ఎం.సి. యు.సి.డి. విభాగంలోగల సుమారు 13000 వీధి విక్రయ దారుల జాబితాలను, జి.ఎస్.టి. చెల్లిస్తున్న వ్యాపార సంస్థల వివరాలను జోనల్ వారీగా సేకరించి ట్రేడ్ లైసెన్స్ ఫీజు మధించాలన్నారు. ప్రజారోగ్య విభాగంద్వారా ప్రజలకు అందించే సేవలుగాని, ప్రజా ఫిర్యాదులు గాని, వార్డు సచివాలయాలు ద్వారా స్వీకరించాలన్నారు. ఏ అధికారి కూడా వ్యక్తిగతంగా స్వీకరించ కూడదన్నారు. వాటిని పెండింగులో ఉంచకుండా త్వరిత గతిని పరిష్కరించాలన్నారు. విద్యుత్ శాఖ వారు కొట్టి పడేస్తున్న మొక్కల కొమ్మలను, ఆ శాఖ అధికార్లతో సమన్వయము చేసుకొని ఎత్తిపారవేయాలన్నారు. కాలువల్లో పూడికలను ఇంజినీరింగ్ శాఖ వారు తీయిస్తే, ఆ కాంట్రాక్టరు ద్వారా, శానిటరీ విభాగంవారు తీయిస్తే సిబ్బంది ద్వారా అదే రోజు ఎత్తి పారవేయాలన్నారు. బిల్డింగ్ మెటీరియల్ రోడ్ల ప్రక్కన కనబడితే, ప్రణాళిక విభాగానికి తెలియపర్చాలన్నారు. వర్షా కాలంలో వచ్చే, సీజన్ వ్యాధులు, స్వైన్ ఫ్ల్యూ, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటివి ప్రబల కుండా, తగు జాగ్రత్తలు పాటించాలని, వార్డుల్లో చెత్తను ప్రతీ రోజు ఎత్తివేసి, కాలువలు శుభ్రం చేస్తే, వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడవచ్చన్నారు. ప్రతీ ఇంటి దగ్గర చెత్తను వేరుచేసి, పారిశుద్య సిబ్బంది స్వీకరిస్తే, రోడ్లపై చెత్త కనపడదు. గావున , క్రమ తప్పకుండా, ఈ విధానాన్ని అందరూ ఆచరించాలన్నారు. ప్రజలకు కూడా అవగాహన కల్పించాలన్నారు. వార్డు ప్రత్యేకాధికారులతో కలసి, వీధుల్లో పర్యటించి ప్రజలకు అంటూ వ్యాధులపై, కరోనా మహమ్మారిపై అవగాహన కల్పించాలన్నరు


ఇళ్ల పట్టాలు పంపిణీ నూరుశాతం జరగాలి.


ఇళ్ల పట్టాలు పంపిణీ నూరుశాతం జరగాలి.

 

 విడియో కాన్పు రెన్స్ లో  సి.ఎం.జగన్ 

 

విశాఖ పట్నం_బ్యూరో చీఫ్ (పెన్ పవర్)

 

అర్హత కలిగిన ప్రతి లబ్దిదారునికి ఇళ్ల పట్టా ఇవ్వాలని, ఇళ్ల పట్టాల పంపిణీ నూటికి నూరు శాతం విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం నాడు ఆయన జిల్లా కలెక్టర్లతో ఇళ్ల స్థలాల పంపిణీ, ఇసుక, ఉపాధి హామీ పథకం పనులు, గ్రామ సచివాలయాలు భవనాలు, రైతు భరోసా కేంద్రాలు భవనాలు, నాడు - నేడు పథకంలో  అంగన్వాడీ భవనాల నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతుల కల్పన, వైయస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్ లు,  వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ ల కు భవనాల నిర్మాణం, జగనన్న పచ్చతోతత్రణం, ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు, రైతు భరోసా కేంద్రాలలో సర్వీస్ డెలివరీ, ఈ - క్రాప్, ఆరోగ్యశ్రీ కార్డులు, కోవిడ్-19, ఇరిగేషన్ ప్రాజెక్టులపై  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన జూలై 8న రాష్ట్రంలో 29 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. లబ్ధిదారులకు లాటరీ ద్వారా ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియ సత్వరమే పూర్తిచేయాలని కోరారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో సంబంధిత లబ్ధిదారుల జాబితాను తప్పనిసరిగా ప్రదర్శించాలని తెలిపారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాబోయే ఆగస్టు 9వ తేదీన అటవీ హక్కుల పట్టాలను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. విశాఖపట్నం నుంచి జిల్లా కలెక్టరు వి. వినయ్ చంద్ మాట్లాడుతూ ఇళ్ల స్థలాల పంపిణీకి జిల్లాలో మొత్తం 2, 98, 429 మంది అర్హులైన లబ్ధిదారుల ను గుర్తించామని అన్నారు. ఇందులో మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో 1,75,000 మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. భూములకు సంబంధించి దాఖలైన కోర్టు కేసులు   సత్వరమే పరిష్కరించడానికి కృషి చేస్తున్నామన్నారు.  గ్రామీణ ప్రాంతంలో 1,20,000 మంది లబ్ధిదారులు ఉన్నారని అన్నారు.

భూమిని పంపిణీ చేయడానికి అవసరమైన అన్ని  ఏర్పాట్లు జూలై 5వ తేదీలోగా పూర్తి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు ఎం. వేణుగోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబు, జీవీఎంసీ కమిషనర్ జి. సృజన, వీఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు డా. సునీల్ ఇస్క గారికి జన్మదిన శుభాకాంక్షలు

ఎస్సీ మోర్ఛా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీకి నివాళులు, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు డా. సునీల్ ఇస్క గారికి జన్మదిన శుభాకాంక్షలు


 

 

 పూర్ణ మార్కెట్, పెన్ పవర్.

 

 

బి. జె.పి. రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు డా. సునీల్ ఇస్క గారికి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ అతను  ఎన్నో ఉన్నతమైన పదవులు చేపట్టాలని విశాఖ జిల్లా ఎస్సీ మొర్చ అధ్యక్షులు చొక్కాకుల రాంబాబు ఆకాంక్షించారు, అలాగే డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 67వ వర్ధంతి కారణంగా బలిధాన్ ధివస్ కార్యక్రమాన్ని చేపట్టి నివాళులు అర్పించారు.శ్యామా ప్రసాద్ ముఖర్జీగొప్ప జాతీయవాది, మానవతావాది ఆధునిక హిందుత్వ మరియు హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించారని అన్నారు.ఈ కార్యక్రమానికి ఓ.ఆల్బర్ట్, ఈశ్వర్,జగదీష్ బి జే పి కార్యకర్తలు పాల్గొన్నారు.

రెవెన్యూ కార్యాలయానికి రావద్దు

రెవెన్యూ కార్యాలయానికి రావద్దు

చింతపల్లి జూన్ 23 పెన్ పవర్

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా  మండల వాసులు రెవెన్యూ పనులపై తమ కార్యాలయానికి రావద్దని తహసిల్దార్ వి.వి.వి గోపాలకృష్ణ మంగళవారం గోడ పత్రిక ద్వారా తెలిపారు. గ్రామ సచివాలయ సంస్థ, గ్రామ పంచాయతీ స్థాయిలో పని చేయుచున్నందున మండల వాసులు రెవెన్యూ కార్యాలయపు పనులు గ్రామ సచివాలయం ద్వారా చేయించుకో వాలన్నారు. ఈ విషయమై మండల వాసులు ప్రభుత్వానికి సహకరించాలని స్థానిక తాసిల్దార్ గోడపత్రిక ద్వారా కోరారు.


 

 

 అర్హులైన లబ్దిదారులకు ఎంపిక చేయాలి:దళిత నాయకులు


 అర్హులైన లబ్దిదారులకు ఎంపిక చేయాలి:దళిత నాయకులు


   పాయకరావుపేట,పెన్ పవర్


 

 అర్హులైన బడుగు,బలహీన వర్గాల లబ్దిదారులను  ప్రత్యేక అదికారులచే సర్వేచేయించి ఇళ్ళ స్థలాలను ఇప్పించాలని రాష్టృమాలమహానాడు అద్యక్షులు ధారా సురేష్ డిమాండ్ చేసారు. ఎమ్మార్వో కార్యాలయం వద్ద మంగళవారం ఆయన   ఇళ్ళ స్థల్లాల్లో  అనర్హులై స్థానికులతో వెళ్ళి ఎమ్మార్వో అంభేడ్కర్ కి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దళితులు,బడుగుబలహీన వర్గాల్లో ఇంకా పేదరికంలో బ్రతుకుతూ అర్హులైన  నిజమైన లబ్దిదారులు వున్నారని అన్నారు.కొంత మంది అదికారులు,రాజకీయ నాయకులు,దళారుల అండదండలు వున్నవారికి మాత్రమే ఇళ్ళ స్థలాకు ఎంపికచేయడం జరిగుతుంది అని ఆవేదనను వ్యక్తంచేసారు.ఇప్పటికైనా నిరుపేదలను గుర్తించి ఇళ్ళస్థలాలను ఇప్పించి న్యాయంచేయాలని కోరారు.ఈకార్యక్రమంలో షేక్  గౌషిమా,పెంటా కుమారి,అన్నామని,ఇంజరపు దనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు..

 4లక్షల ఖైనీ గుట్కా ల ధ్వంసం.




 4లక్షల ఖైనీ గుట్కా ల ధ్వంసం.


      విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్) 

 

నిషేధిత  ఖైదీ గుట్కా ప్యాకెట్లను  మంగళవారం  మారికవలస డంపింగ్ యార్డ్ లో ధ్వంసం చేశారు. నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే ఖైదీ గుట్కాలను అధికారులు సీజ్ చేశారు. వాటిని  ధ్వంసం చేయాలని జాయింట్ కలెక్టర్  మెజిస్ట్రేట్ ఆదేశించడంతో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్  నందాజీ  ఆధ్వర్యంలో 37 కిలోల ఖైదీ గుట్కాలను డంపింగ్ యార్డుకు తరలించి అక్కడ  తగులబెట్టారు. నిషేధిత ఖైనీ గుట్కా లను  దాడులు చేసి పట్టుకున్నామని ఫుడ్ కంట్రోలర్ నందాజీ తెలిపారు.

 

 



 

నేడు పరవాడ ప్రెస్ క్లబ్ కార్యవర్గ ఎన్నిక


నేడు పరవాడ ప్రెస్ క్లబ్ కార్యవర్గ ఎన్నిక

నేడు పరవాడ ప్రెస్ క్లబ్ కార్యవర్గ ఎన్నిక

 

            పరవాడ పెన్ పవర్

 

పరవాడ మండలం: ఏపీయూడబ్ల్యూజే అనుబంధంగా ఉన్న పరవాడ ప్రెస్ క్లబ్ కార్యవర్గ ఎన్నిక సమావేశాన్ని బుధవారం ఉదయం 9 గంటలకు మరిడిమాంబ ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నట్లు ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యులు రవి మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీయూడబ్ల్యూజే అనుబంధంగా ఉన్న పరవాడ ప్రెస్ క్లబ్ లో సభ్యత్వం ఉన్నవారు, నూతనంగా సభ్యత్వం పొందాలనుకునేవారు , ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన సభ్యులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొనవచ్చని తెలిపారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...