Followers

కోవిడ్ వైద్య సేవలు మెరుగు





కోవిడ్ వైద్య సేవలు మెరుగు పర్చాలంటూ సి పి ఎం ధర్నా


 


సామర్లకోట, ,పెన్ పవర్


 


 

కరోన పాజిటివ్ కేసులు విపరీతంగా రాష్ట్రంలోను,జిల్లాలోనూ పెరిగిపోతున్నoదున పాజిటివ్ వచ్చిన ప్రజలకు,కోవిడ్ విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి అందించే సౌకర్యాలు మెరుగు పరచాలని సి పి ఎం పట్టణ కార్య దర్శి బలం శ్రీనివాసు డిమాండ్ చేశారు.ఈ అంశం పై సోమవారం గాంధీనగర్ సచివాలయం వద్ద సి పి ఎం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా కేసులు లక్ష దాటి దేశంలోనే నాల్గవ స్థానంలో ఉన్నట్టు చెప్పారు.అలాగే తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రంలో ప్రధమ స్థానంలో ఉందన్నారు. కరోనా కట్టడికి విధులు వైద్యులు,సిబ్బందికి సరిపడా సౌకర్యాలు కల్పించాలని,పాజిటివ్ తో చికిత్స పొందుతున్న ప్రజలకు మెరుగైన సదుపాయాలు నాణ్యమైన పోషకాహారం, వేడినిళ్లు, నిమ్మరసం వంటి సేవలను అందించాలి అన్నారు.కోవిడ్ విధుల్లో ఉన్న సిబ్బందికి 50 లక్షల బీమా సదుపాయాన్ని కొనసాగించాలి అన్నారు.అలాగే అన్ని ప్రాంతాల్లోనూ కేసులు అధికామవుతున్న నేపధ్యంలో ప్రతిరోజు కోవిడ్ పరీక్షలు చేపట్టాలన్నారు.చేపట్టిన పరీక్షలకు సంబంధించి రిపోర్టులను వెంటనే విడుదల చేసి ప్రజల్లో ఉన్న మానసిక వత్తిడిని పరిష్కరించాలి అన్నారు.అలాగే కరోనా వ్యాప్తికి కరణమవుతున్న మద్యం దుకాణాలను నిలిపి వేయాలన్నారు.ఏ సందర్భంగా సచివాలయ అధికారికి వినతి పత్రాన్ని వారు అందజేశారు.ఈ ధర్నాలో సి పి ఎం నాయకులు కోనా శివకుమార్, బలం సత్తిబాబు,బంటు రవేంద్ర,దొర రమణ,తదితరులు పాల్గొన్నారు.


 

 




కరోనా పట్లప్రజలు మరింతఅప్రమత్తం


కరోనా పట్లప్రజలు మరింతఅప్రమత్తంగా ఉండాలి


సొంత నిధులతో గ్రామ ప్రజలకు మాస్కులు శానిటైజర్లు. పి.పి.ఈ కిట్టు పంపిణీ


పంచాయతీ సెక్రటరీ పద్మరాజ


 


పెద్దాపురం,పెన్ పవర్


 

పెద్దాపురం మండలం రాయభూపాల పట్నం గ్రామంలో కరోనా పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని రానున్న రోజుల్లో కేసులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని ప్రతి ఒక్కరూ మాస్కులు విధిగా ధరించాలనీ మాస్క్ లేనిది బయట తిరిగి రాదని మీ రక్షణ కోసమే మేమందరం పనిచేస్తున్నామని కరోనా పట్ల ఎటువంటి అవసరం వచ్చినా వాలంటీర్స్ ని గాని పంచాయతీ గాని సంప్రదించాలని 

పంచాయతీ సెక్రటరీ జె.పద్మరాజు కోరారు  అలాగే నా వంతు కృషిగా గ్రామ ప్రజలకు మాస్కులు శానిటైజర్లు పి పి ఈ డ్రెస్లు పారిశుద్ధ్య కార్మికులకు షూలు అందించడం జరిగిందని.ఆయన తెలిపారు.నా ముఖ్య ఉద్దేశం కరోనా బారిన ఎవరు పడకుండా ఉండేందుకే ఇవన్నీ అందించడంజరిగిందని. గ్రామ రక్షణనే మా బాధ్యతగా పంచాయతీ ఎల్లవేళలా సేవలందించడానికి ముందుందని ఆయనతెలిపారు. *గ్రామస్తులుహర్షం*. కల్లు సారాయి నిర్మూలనరహితంగా. తీర్చిదిద్దేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు ఇటువంటి  సెక్రెటరీ  మా గ్రామానికిఉండడం గ్రామ ప్రజల అదృష్టంగా భావించాలని గ్రామ పెద్దలు గ్రామస్తులు తెలిపారు. అలాగే గ్రామ అభివృద్ధికి వాలంటీర్స్ వ్యవస్థ  కీలకంగా పని చేస్తుందని గ్రామస్తులు అభినందించారు, ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్స్ ఎం.సుభాష్ వి.సాయికృష్ణ,ఎన్.స్వామి,యూ. వీరేంద్ర,దివాకర్,రవి, మణి, వీరకుమార్,పంచాయతీ గుమస్తా శ్రీను మరియు తదితరులు పాల్గొన్నారు.

సంజీవని కోవిడ్ పరీక్షల రిపోర్టులు ఎక్కడా


సంజీవని కోవిడ్ పరీక్షల రిపోర్టులు ఎక్కడా


 


వారం రోజులు దాటినా విడుదల కాని రిపోర్టులు పరీక్షలు చేయించుకున్న వారిలో తీవ్ర ఆందోళన...


 


సామర్లకోట,,పెన్ పవర్


 

ఈ నెల  సామర్లకోట పట్టణంలో సంజీవిని సంచార వాహనం ద్వారా నిర్వహించిన కోవిడ్ పరీక్షల రిపోర్టు ఏమయ్యాయో అర్థం కాని పరిస్థితి స్థానికంగానెలకొంది స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ లో ఈ నే 20 వ తేదీన మూడు వందలకు పైబడి ప్రైమరి ,సెకండరీ కంటాక్టులకు సంబంధించిన మూడు వందలకు పై బడి కోవిడ్ పరీక్షలను పూల్ పద్దతి లో నిర్వహించారు అలా రాత్రి సుమారు తొమ్మిది గంటల వరకు నిర్వహించి సేకరించిన సెంపిల్  కిట్టులను కాకినాడ తరలించారు. ఐతే దానికి ముందు కొద్దీ రోజుల పాటు పట్టణ పరిధిలో భారీగానే పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కోవిడ్ లక్షణాలు ఉన్న వారు అనుమానం ఉన్నవారందరికి ఈ పరీక్షలు నిర్వహించిన వాటికి సంబంధించిన రిపోర్టులు ఇప్పటివరకు విడుదల కాకపోవడం ఆశ్చర్యనికి గురి చేస్తుంది.సంజీవి వాహనం ద్వారా చేపట్టిన పరీక్షలు ఏమయ్యాయో స్థానిక వైద్య అధికారులకు సహితం అర్థం కాకపోవడం మరింత ఆశ్చర్యనికి గురి చేస్తుంది.పరీక్షలు చేయించుకుని 8 రోజులు గడిచిన రిపోర్టులు రకవడంతో పరీక్షలు చేయించుకున్న ప్రజలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. తమకు పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా అనే విషయం తెలియక అయోమయానికి గురవుతున్నామని దానితో తాము ఎక్కడికి వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇది ఇలా ఉండగా ఒక వేళ పరీక్షలు చేయించుకొన్నవారిలో ఉన్న వయస్కులకు పాజిటివ్ లక్షణాలు ఉంటే వారి పరిస్థితి ఏమిటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాగా పరీక్షలు చేయించుకున్న వారిలో పలువురు పలు ప్రయివేటు పరిశ్రమలలో పని చేస్తున్నo దున పరీక్షల రిపోర్టులు వస్తే తప్ప తమను విదులులోకి తీసుకోమని యాజమాన్యం చెబుతున్నారు అని దానితో ఉపాధిని కోల్పోయి తీవ్రంగా నష్టపోతున్నాము అని పలువురు కార్మికులు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు ఈ విషయం పై స్థానిక అర్బన్ హెల్త్ సెంటర్ల వైద్యులను ప్రశ్నిస్తే ఆ రిపోర్టుల కోసమే తాము చూస్తున్నాము అని ఆలస్యానికి కారణం తమకు తెలియడం లేదు అంటున్నారు.దాని పై జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా మల్లిక్ ను వివరణ కోరగా జిల్లా  వ్యాప్తంగా సుమారు 7 వేలకు పై బడి రిపోర్టులు పెండింగులో ఉన్నాయి అన్నారు.కాకినాడ లొ కోవిడ్ పరీక్షలు నిర్వహించే టెక్నీషియన్ ల కొరత ఉన్నందున ఉన్న ఒక్క టెక్నీషియన్ రాత్రి పగలు పనిచేస్తున్న తరగడం లేదు అన్నారు.అయితే స్థానికంగా ఉన్న వైద్య అధికారుల సూచనల ప్రకారం రెడ్ లేబుల్ అతికించిన సెంఫుల్స్ సంబంధించి రిపోర్టులు తొలుత నిర్వహించి వారికి రిపోర్టులను తక్షణం విడుదల చేస్తున్నట్టు చెప్పారు.నెగిటివ్ వచ్చిన రిపోర్టుల విషయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా రిపోర్టుల కోసం సమయం పాటించాలన్నారు.అన్ని రిపోర్టులు ప్రకటిస్తామని, ఉన్న పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలి అని డి ఎం హెచ్ ఓ స్పష్టం చేశారు.ఏదేమైనా 20 వ తేదీనాటి రిపోర్టులు ఇప్పటి వరకు రాకపోవడం పట్ల ప్రజలు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు అని చెప్పక తప్పడం లేదు.

సోడియం హైపోక్లోరైట్ ద్రావకం పిచికారి







ప్రభుత్వ కార్యాలయాల వద్ద సోడియం హైపోక్లోరైట్ ద్రావకం పిచికారి.


 


గోకవరం పెన్ పవర్


 


 

మండల కేంద్రమైన గోకవరం లో రోజురోజుకు కరోనా వైరస్ ఉదృతంగా వ్యాప్తి చెందడంతో గోకవరం పంచాయతీ సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టారు. కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తిని నిరోధించడం కోసం వ్యాధి సోకిన వ్యక్తులు ఇళ్ళ వద్ద మరియు ప్రజలు ఎక్కువగా సంచరించే గోకవరం లోని మండల రెవెన్యూ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం, మండల ఉపాధిహామీ కేంద్రం, మరియు గోకవరం లోని అన్ని బ్యాంకుల వద్ద ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద, మరియు గ్రామం లోని ఆలయాలు, మసీదులు, చర్చిలో వద్ద సోడియం హైపోక్లోరైట్ ద్రావకాన్ని పిచికారీ చేయడం జరిగింది అని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా గోకవరం గ్రామ పంచాయతీ కార్యదర్శి టి. శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ముందు జాగ్రత్త చర్యగా అన్ని రకాల నివారణ చర్యలు చేపట్టడం జరిగింది. గ్రామములోని అన్ని విధులను పరిశుభ్ర పరచడంతో పాటు బ్లీచింగ్ కూడా జలటమం చేయడం జరిగిందన్నారు. ముఖ్యమైన ప్రదేశాల వద్ద సోడియం హైపోక్లోరైట్, కాల్షియం హైపోక్లోరైట్ ద్రవాన్ని పిచికారి చేయడం జరిగింది అన్నారు. గ్రామస్తులు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు మాస్కులు ధరించి మాత్రమే నిత్యవసర వస్తువులు కొనుగోలు చేయడానికి బయటికి రావాలని అని తెలియజేశారు.


 

 




కరోనా ను జయప్రదం సి డి ఆవిష్కరణ


కరోనా ను జయప్రదం సి డి ఆవిష్కరణ



ఆత్రేయపురం,పెన్ పవర్


ఆత్రేయపురం మండలం ర్యాలీ లో నిర్వహించిన ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి నుండి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని స్థానిక  మ్యాజిక్ ఫ్యామిలీ శ్యామ్ జాదూగర్ కరోనా పై రూపొందించిన కరోనా ను జయుద్దాం అనే వీడియో సిడీని విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్యామ్ జాదూగర్ మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న వేళ మనం కరోనా తో సహజీవనం చేయవలసి ఉన్నకారణంగా దీని బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరిలోనూ మనో బలం, శారీరక బలం, వినోద బలం లను ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఈ సీడీలో వివరించడం జరిగిందని వీటిని సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేసి ప్రజలలో అవగాహన పెంచనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మ్యాజిక్ ఫ్యామిలీ సభ్యులు మోహిత్, అన్నపూర్ణ, రుషిత్ లు పాల్గొన్నారు.


డా. ఏ.పి.జె అబ్దుల్ కలం కు ఘన నివాళి


డా. ఏ.పి.జె అబ్దుల్ కలం కు ఘన నివాళి


ఆత్రేయపురం,పెన్ పవర్


 


ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన అబ్దుల్ కలాం నివాళి కలలు కనండి_ వాటిని సాకారం చేసుకోండి అనే మాటను పది మందికి చెప్పడమే కాదు తాను కూడా ఆచరించి,  జీవితాన్ని చరితార్థం చేసుకున్న మహనీయుడు.. భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం అనీ, ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఒదిగే ఉండాలన్న సందేశాన్ని చేతల్లో చూపిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ తరం గొప్ప వ్యక్తి  మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం  అంటూ ఆత్రేయపురం ఎంపీడీఒ నాతి బుజ్జి  కొనియాడారు.  జూలై-27 సోమవారం డా.అబ్దుల్  కలాం వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో  అబ్దుల్ కలాం చిత్రపటానికి పులమాల వేసి మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి వరప్రసాద రావు, పంచాయతీ విస్తరణాదికారి శ్రీనివాస్, మండల పరిషత్ కార్యాలయ పరిపాలనాధికారిణి సుగుణ, కార్యదర్శి గంగూలీ, సమీర్ , ఏపీఎం సునీత తదితరులు పాల్గొన్నారు.


చేసిన వారిపై చర్య







దళిత యువకునికి శిరోముండనం చేసిన వారిపై చర్య తీసుకోండి


 


గోకవరం పెన్ పవర్


 

సీతానగరం పోలీసు స్టేషను లో దళిత యువకునికి శిరోమండం చేసి దాడి చేసి అవమానించిన సంఘటనను ఆంద్రప్రదేశ్ రైతు- కూలి సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి బి.రమేష్ తీవ్రంగా ఖండించారు.సోమవారం నాడు ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు.దళిత,మైనారిటీ, వెనకబడిన వర్గాలపై దాడులను అరికట్టడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విపలమవుతున్నాయని ఆయన విమర్శించారు. ఈ ఘటనకు మూల కారుకుడైనా ఇసుక మాఫియా స్ధానిక అధికార పార్టీ నేత కవల క్రిష్ణ మూర్తిని కేసు నుండి తప్పించే ప్రయత్నాలను ప్రజా ఉద్యమంతో ఎదుర్కొని కవల క్రిష్ణ మూర్తిని అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసేవరకు ప్రజా ఉద్యమం ఆగదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.అలాగే చీరాలలో లాక్ డౌన్ పేరుతో దళిత యవకున్ని గాయపర్చి మృతికి కారణమైన స్ధానిక పోలీసు అధికారులపై హత్య కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసి శిక్షించాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు


 

 




 

 



 



 



Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...