Followers

ఎట్టకేలకుసీటు దక్కించుకున్న "కెల్లా" విజయం సాధించేనా!

 ఎట్టకేలకుసీటు దక్కించుకున్న "కెల్లా" విజయం సాధించేనా!




 ఆరిలోవ, పెన్ పవర్

ఎట్టకేలకు 13వ వార్డు వైసిపి అభ్యర్థిని గా కెల్లా సునీత సత్యనారాయణ.పార్టీలో మొదటి నుండి కష్టపడి పనిచేసిన కెల్లా సునీత సత్యనారాయణ కాదని అప్పుడే పార్టీలోకి వచ్చిన అభ్యర్థికి వైసీపీ టిక్కెట్ కేటాయించడంపై మనస్తాపం చెందిన కెల్లా, తమ కష్టాన్ని గుర్తించి టికెట్ ఇచ్చిన పార్టీ అధిష్టానానికి నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని గెలిపించి పార్టీకి బహుమతిగా ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇంతవరకు తనపై నమ్మకం ఉంచి తనకి సహాయ సహకారాలు అందించిన వార్డు నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదిలా ఉండగా వైసిపి టికెట్ ఆశించి భంగపడ్డ సుశీల సుధాకర్ తన ప్రభావం పార్టీపై ఎంతవరకు ఉంటుందో,! పార్టీ విజయానికి ఎంతవరకు సహకరిస్తారో! రెబల్ గా వేస్తారో వేచి చూడాలి. వార్డులో అధిక సంఖ్యలో స్వతంత్రులు ఇతర పార్టీలు ఉండగా కెల్లా సునీత సత్యనారాయణ విజయం సాధించే నా!?

గండిగుండం లో ఓటర్లను సజీవ సమాధి చేస్తామంటూ బెదిరించారని ఎంపీ విజయసాయిరెడ్డి పై ఆరోపణ

గండిగుండం లో ఓటర్లను సజీవ సమాధి చేస్తామంటూ  బెదిరించారని ఎంపీ విజయసాయిరెడ్డి పై  ఆరోపణ

పెన్ పవర్, విశాఖపట్నం సీటీ

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ లో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి. రామ్ డిమాండ్ పేర్కొన్నారు. ఒకవేళ కేంద్రం తగిన విధంగా స్పందించకపోతే జై ఆంధ్ర ఉద్యమం మళ్ళీ  పురుడు పోసుకుంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో నెలకొన్న  పరిస్థితులను వివరిస్తూ శనివారం.. రాష్ట్రపతి, ప్రధాన  మంత్రి కార్యాలయాలకు  తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి. రామ్ స్వయంగా వినతిపత్రాలను  అందజేశారు. ఆ వినతి పత్రాలలో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి.విశాఖ జిల్లా  గండిగుండం గ్రామంలో ఓటర్లను సజీవ సమాధి చేస్తామని.. అధికార వైసీపీకి చెందిన నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. రాజ్యసభ సభ్యుడు  విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తం శెట్టి  శ్రీనివాసరావు, గండిగుండం లో స్థానిక నాయకుడు  గండ్రేడ్డి శ్రీనివాస్ ఓటర్లను బెదిరించిన వారిలో ఉన్నారని పేర్కొన్నారు.  ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ని సైతం చంపుతామని వైసిపి నాయకులు నేరుగా బెదిరిస్తున్నారని, మరోవైపు తనకు కూడా చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని రామ్ ఆందోళన వ్యక్తం చేశారు.   ఉత్తర కోస్తా ప్రజలు ఎవరూ  పరిపాలన రాజధానిని  కోరుకోక పోయినా.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల  ప్రతిపాదన తీసుకు వచ్చారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో  ఉన్నప్పుడు అందరి ఆమోదంతో అమరావతి రాజధానిగా ఆవిర్భవించిందన్నారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంతో అమరావతి ప్రాంత ప్రజలు, ముఖ్యంగా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్  ఏకైక రాజధాని అమరావతి నే  కొనసాగించాలంటూ 438 రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నార న్నారు.   ఈ క్రమంలో ఇప్పటివరకు 120 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను పరిశీలిస్తే  ఆంధ్ర ప్రదేశ్ అసలు భారత దేశంలో ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిస్థితులను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి న్యాయం చేయాలని తెలుగు శక్తి డిమాండ్ చేస్తోందన్నారు. మరోవైపు ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో తక్షణమే.. ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని కూడా డిమాండ్ చేశారు. మొత్తం మీద ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన లో ఉత్పన్నమైన  రాజకీయ సంక్షోభం నుంచి ఆంధ్ర ప్రదేశ్ ను, అమరావతిని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.డాక్టర్ జి.వి.ఆర్.శాస్త్రి తో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూడాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ కోరారు. గతంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎలాగైతే ప్రైవేటీకరణ కాకుండా చూసారో ఇప్పుడు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూడాలని త్వరలోనే విశాఖపట్నం వచ్చి ప్రజలకు ధైర్యం చెప్పాల్సిందిగా రామ్ కోరారు.

37వా వార్డు పర్యటనలో టి.డి.పి కార్పొరేటర్ అభ్యర్ధి... భంగారి రవి శంకర్

 37వా వార్డు పర్యటనలో టి.డి.పి కార్పొరేటర్  అభ్యర్ధి... భంగారి రవి శంకర్

 మహారాణి పేట, పెన్ పవర్

శనివారం జి.వి.ఎమ్.సి, దక్షిణ నియోజకవర్గం 37వ వార్డు టి.డి.పి అభ్యర్ధి అయిన బంగారి రవి శంకర్ వార్డు పర్యటనలో నిమిత్తం పెయిన్ దొర పేట, రెల్లి వీధి,జబ్బరి తోట, స్కీమ్ బిల్డింగ్స్, గొల్ల వీధి,తదితర ప్రాంతాల్లో పర్యటించి, వార్డు ప్రజలు యొక్క సమస్యలను తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించి ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఈకార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ కె.చిన్న,తెలుగు యువత అద్యక్షులు తాతాజీ,వార్డు వైస్ ప్రెసిడెంట్ హేమలత,గంగమ్మ, సీనియర్ నాయకులు కనక రాజు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

జోరుగా సాగుతున్న అలుపన కనకరెడ్డి ప్రచారం

 జోరుగా సాగుతున్న అలుపన కనకరెడ్డి ప్రచారం




మహారాణి పేట, పెన్ పవర్

శనివారం సాయంత్రం విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు లో శాసనసభ్యులు,వాసుపల్లి గణేష్ కుమార్ ఆదేశాల మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వార్డు కార్పొరేట్ అభ్యర్థి, అలుపన కనకరెడ్డి ప్రచారం జోరుగా సాగుతోంది, సాగుతున్న సమయంలో  ప్రజలను ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా ఆరా తీస్తున్న కనకరెడ్డి అంతేకాక నాకు ఒకసారి కార్పొరేటర్గా అవకాశం ఇవ్వండి ఫ్యాను గుర్తుకు ఓటు వేయండి  అడుగుతున్నా కనకరెడ్డి నేను నాయకుడుని కాదు మీ సేవకుడిని అంటూ ప్రచారంలో పాల్గొన్న అలుపన కనక రెడ్డీ.

వ్యవసాయ బావిలో పడి యువకుడు మృతి..

 వ్యవసాయ బావిలో పడి  యువకుడు మృతి..



వి.మాడుగుల,పెన్ పవర్

  మాడుగుల మండలం వీరనారాయణం గ్రామానికి చెందిన యువకుడు శనివారం ఉదయం వ్యవసాయ బావిలో పడి  మృతి చెందాడు. మాడుగుల పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్  రామారావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పర్రె అర్జున్ రావు( 30)కి  గత కొంతకాలంగా మతిస్తిమితం లేదని ఇల్లు విడిచి విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాడు. ఇందులో భాగంగా ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో  పొలాల వైపు పరిగెత్తుకుంటూ  వెళ్తుండగా  అదుపుతప్పి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి శవాన్ని వెలికి తీశారు. శవ పంచనామా జరిపించి పోస్టుమార్టం కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రామారావు తెలిపారు.

సత్యవేడులో మద్యం షాపుల వద్దే యదేచ్ఛగా బార్లు ..

 సత్యవేడులో  మద్యం షాపుల వద్దే యదేచ్ఛగా బార్లు 



 ప్రేక్షక పాత్ర వహిస్తున్న బేవరేజ్ కార్పొరేషన్ అధికారులు 

పెన్ పవర్ న్యూస్ సత్యవేడు

చిత్తూరు జిల్లా సత్యవేడు డివిజన్ పరిధిలో ప్రభుత్వ మద్యం షాపుల వద్ద యదేచ్చగా అక్రమ బార్లు నడుస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి .ఆంధ్ర ప్రదేశ్ ను మద్య రహిత రాష్ట్రం గా మార్చడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టగానే ప్రైవేటు గుప్పిట్లో ఉన్న మద్యం షాపులను సర్కారు స్వాధీనంలోకి తీసుకురావడం జరిగింది .ఇందుకు అనుగుణంగా ప్రతి ఏడాది 20 శాతం మేర మద్యం షాపులను కుదిస్తూ వీటి నిర్వహణ బాధ్యతలను బేవరేజ్ కార్పొరేషన్ సంస్థకు అప్పగించడం జరిగింది . దీంతోపాటు మద్యం షాపుల వద్ద మద్యం సేవించడాన్ని పూర్తిగా నిషేధించింది . అనధికార బార్లు మద్యం షాపుల వద్ద ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది .  సత్యవేడు డివిజన్ పరిధిలోని పలు సర్కారు మద్యం షాపుల వద్ద యదేచ్ఛగా అక్రమ బార్లు నడుస్తోంది .ఈ డివిజన్ పరిధిలోని సత్యవేడు ,వరదయ్యపాలెం ,నాగలాపురం , పిచ్చాటూరు మండలాలలో దాదాపు 24 మద్యం షాపులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి .ఇందులో భాగంగా సత్యవేడు పట్టణంలో ఐదు మద్యం షాపులు , దాసుకుప్పంలో నాలుగు మద్యం షాపులు , పెద్దఈటిపాకం ఎస్టి కాలనీ ,పాలగుంట , అప్పయ్యపాల్యం తదితర ప్రాంతాల్లో సర్కారు మద్యం షాపులు కొనసాగుతున్నాయి . అయితే సత్యవేడు పట్టణంలో రోడ్డు కు ముందు మద్యం షాపులు నడుస్తుండగా వెనుక వైపు బార్లు కొనసాగుతున్నాయి . టెంకాయ కీతుల షెడ్లలో కూర్చొని మద్యం ప్రియులు మద్యాన్ని సేవించడం సర్వసాధారణమైపోయింది .అలాగే దాసు కుప్పం ప్రాంతంలో రోడ్డు ముందు పలు టిఫిన్ సెంటర్లో మద్యం బార్లు నడుస్తుండగా వెనుక వైపు సర్కారు మద్యం షాపులు కొనసాగుతున్నాయి .మద్యం షాపుల వద్ద విచ్చలవిడిగా బార్లు కొనసాగుతున్న సంబంధిత బేవరేజెస్ కార్పొరేషన్ ఎక్సైజ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తోంది . పైగా చట్టానికి తూట్లు పొడిచే విధంగా మద్యం షాపుల వద్ద బార్లు కొనసాగుతున్న సంబంధిత సత్యవేడు డివిజన్ బేవరేజెస్ కార్పొరేషన్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర శెట్టితిరుపతయ్య  ప్రేక్షక పాత్ర వహించడం అనుమానాలకు తావిస్తోంది .మద్యం షాపుల వద్ద తాత్కాలిక మద్యం బార్లు నడిపిస్తున్న కొందరు వ్యాపారస్తులతో బేవరేజ్ ఎక్సైజ్ అధికారులు కుమ్మక్కు అయ్యారేమొన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి .ఇప్పటికైనా సంబంధిత బేవరేజెస్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు దీనిపై స్పందించి మద్యం షాపుల వద్ద అనధికారికంగా కొనసాగుతున్న మద్యం బార్లను నిర్మూలించడానికి అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది .

ఉత్తర నియోజకవర్గం ప్రచారం లో పాల్గొన్న.. వి.విజయసాయిరెడ్డి

ఉత్తర నియోజకవర్గం ప్రచారం లో పాల్గొన్న.. వి.విజయసాయిరెడ్డి 




విశాఖ ఉత్తరం, పెన్ పవర్

గ్రేటర్ విశాఖ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఉత్తర నియోజకవర్గం లో  53,54,55,42 వార్డులలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి,  ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె కె రాజు మరియు స్థానిక కార్పొరేటర్ అభ్యర్థులతో కలిసి ఎన్నిక ల ప్రచారం నిర్వహించారు. ముందుగా  మురళీనగర్ లో  ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు అనంతరం  ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు  దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేసిన అనంతరం ఆలయ ప్రాంగణంలో జీవీఎంసీ ఎన్నికల ప్రచార సీడీని ఆవిష్కరించారు  అనంతరం. 53 వార్డు శివనగర్, 54 వార్డు మర్రిపాలెం, జ్యోతి నగర, నలంద నగర్, గజపతినగర్, 55 వార్డు గాంధీనగర్, తిక్కవాని పాలెం, ధర్మానగర్, తాటిచెట్ల పాలెం, 42 వార్డు రైల్వే న్యూ కొలనీ, నందగిరి నగర్, రెల్లి వీధి ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు పర్యటించారు. ఈ పర్యటన లో ఆ యా ప్రాంతాల్లో స్థానిక సమస్యలు విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకురాగా వాటిని పరిశీలించారు.వాటిలో కొన్ని వెంటనే చేయుటకు హామీ ఇచ్చారు. కొన్ని సంబంధించిన శాఖ లతో మాట్లాడి పరిష్కరిస్థానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు, లోక్ సభ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ, కాయల వెంకటరెడ్డి, వరుదు కల్యాణి, మాధవి వర్మ, మాజీ వుడా చైర్మన్ రవి రాజు,  మిలినియం శ్రీధర్ రెడ్డి వార్డు సీనియర్ నాయకులు , మహిళలు, కార్యకర్తలు వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...