Followers

సూడో పోలీసుల అరెస్టు రిమాండ్.

 సూడో పోలీసుల అరెస్టు రిమాండ్.. పేకాట వ్యసనం..కటకటాల పాలు చేసింది..

మేడ్చల్ పట్టణంలో సూడో పోలీసుల హల్ చల్..డమ్మీ తుపాకీతో బెదిరించి నగదు దోచుకెళ్ళిన 6 గురు సూడో పోలీసులు..

ఈనెల 14వ తేదీన ఆర్ ఆర్ ఓలాడ్జ్ లో డమ్మీ గన్ తో బెదిరింపులు..డిసిపి పద్మజ.. ఒక డమ్మి రివాల్వర్, ఫైబర్ లాఠీ, జంగిల్ ష్యూస్,పోలీస్ క్యాప్,2,22,000 నగదు స్వాదీనం..








పెన్పవర్,

మేడ్చల్

మేడ్చల్ పోలిస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 14వ తేదీన పోలీసులమని చెప్పి లాడ్జీలో పేకాట ఆడుతున్న ఇందుగల మణికంఠ, శ్రీహరి, సాయి సాంగ్ అనే ముగ్గురు వ్యక్తుల పై పోలీసులమని ఆరుగురు దుండగులు బెదిరించి దాడి చేశారు. మణికంఠ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మేడ్చల్ పోలీసులు. గురువారం డిసిపి పద్మజ, ఏసీపీ రామ లింగరాజు, సీఐ ప్రవీణ్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో వివారాలు వెల్లడించారు.. ఫేక్ పోలీసులమని చెప్పిన ఆరుగురు దుండగులను పోలీసులు కేసున ఛేదించి పట్టుకున్నారు. లాడ్జీలో పేకాట ఆడుతున్న ముగ్గురిపై తుపాకీతో బెదిరించి వారి వద్ద నుండి దాదాపు 2,20,000 రూపాయలను అపహరించిన డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఆరుగురి సూడోపోలీసుల వివరాలు అకీల్, అహ్మద్, షేక్ మహమ్మద్, అక్సర్, కైజర్, మహమ్మద్ ల ను మేడ్చల్ సీఐ ప్రవీణ్ రెడ్డి, క్రైమ్ టీమ్ సహాయంతో వారిని పట్టుకున్నారని డిసిపి పద్మజ పత్రిక సమావేశంలో పేర్కొన్నారు.. డీసీపీ పద్మజ మాట్లాడుతూ లాడ్జీలను అద్దెకు ఇచ్చేటప్పుడు పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని లాడ్జీ యాజమాన్యాలకు సూచించారు. ఇంత త్వరగా కేసును ఛేధించినందుకు పోలీసులను డిసిపి పద్మజ అభినందించారు.  పేకాట వ్యసనమే..క్రిమినల్ ఆలోచనకు దారితీసింది.. పిర్యాదు దారులు మణికంఠ,శ్రీహరి, సామ్ సంగ్ లు తరచు నిజామాబాదుకు చెందిన అఖిల్ అహ్మద్, అహ్మద్ అజిమ్, షేక్ అహ్మద్ లతో అందర్,బాహర్ అనే పేకాట ఆడేవారు.. ప్రతిసారీ మణికంఠ అతని స్నేహితులే డబ్బులు గెలుచుకుంటున్నారనే అక్కసుతో , వారి దగ్గర నుండి ఎలాగైనా డబ్బులు కాజేయాలని నిందితుడు ఏ1 అఖిల్ అహ్మద్ పథకం ప్రకారం పేకాట ఆడుదామని వారిని మేడ్చల్ పట్టణంలోని ఆర్ఆర్ లాడ్జ్ కు పిలిపించాడు,అఖిల్ అహ్మద్ ముందుగా వేసిన ప్లాన్ ప్రకారం షేక్ అక్బర్, గణేశ్, ఖైసర్ లతో కలిసి ముఠాగా ఏర్పడి వీరు ఆడేరూమ్ సమీపంలోనే మరో రూమును తీసుకున్నాడు. పేకాడ ఆడే సమయంలో సదరు రూము తలుపులు కొట్టగా..లోపల వ్యక్తులు తలుపులు తీయగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఖైసర్ ,గణేష్ లు డమ్మి తుపాకీ తో బెదిరించి ,లాఠీలతో కొడుతుండగా వారి దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చి వదలమని ప్రాదేయ పడ్డారు. ఆ డబ్బులు ఖైసర్ తలదిండు కవర్ లో వేసుకొని కింద తమ సి.ఐ సార్ ఉన్నాడని కదలకుండా ఇక్కడే ఉండాలని హెచ్చరించి వెళ్ళిపోయారు..,, ఎంతకూ రాకపోవడంతో అనుమానం వచ్చి చూడగా అక్కడ ఎవరూ లేని విషయం గమనించిన బాదితులు.. వారు సూడోపోలీసులుగా గుర్తించి వెంటనే మణికంఠ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. మేడ్చల్ పోలీసులు మూడు స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి వెతకగా తూప్రాన్ వద్ద పోలీసులు వీరిని అఖిల్ అహ్మద్, షేక్ అహ్మద్, షేక్ ఆజమ్,షేక్ అక్బర్,గణేష్ మరియు షేక్ ఖైసర్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించామని డి.సి.పి తెలిపారు. వారి వద్ద నుండి ఒక డమ్మి గన్,ఫైబర్ లాఠీ, జంగిల్ షూస్, పోలీస్ క్యాప్ మరియు 2,22,000/- రెండు లక్షల ఇరవై రెండు వేల నగదు స్వాధీనం చేసుకున్నారు..

జడ్పీ ఎస్ ఎస్ పాఠశాలలో కరోనా కలకలం

 జడ్పీ ఎస్ ఎస్  పాఠశాలలో కరోనా కలకలం

గుడిహత్నూర్,  పెన్ పవర్ 

 ఆదిలాబాద్ జిల్లాలోని  ఇచ్చోడ మండల కేంద్రంలోని జడ్పీఎస్ ఎస్ పాఠశాలలో కరోనా కలకలం రేపుతోంది. పాఠశాలలోని 8 మంది ఉపాద్యాయులకు పాజిటివ్ రావడంతో మండలం మొత్తం ఉలిక్కిపడుతోంది. బుధవారం ఒక ఉపాధ్యాయునికి పాజిటివ్ రావడం తో ఈ రోజు పాఠశాలలోని 70 మంది బోధన, బోధనేతర సిబ్బంది మరియు 40 మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా 7 గురు ఉపాధ్యాయులకు పాజిటివ్ అని తేలింది.దీనితో నేటి నుండి సోమవారం వరకు 5 రోజుల పాటు సెలవు ప్రకటించిన మండల విద్యాధికారి తెలిపారు.

సెల్ టవర్ తొలగించాలంటు నిరసన

 సెల్ టవర్ తొలగించాలంటు నిరసన

పెన్ పవర్,  మల్కాజిగిరి

 గౌతంనగర్ డివిజన్ లోని జనావాసాల మధ్య సెల్ ఫోన్ టవర్ ఏర్పాటు చేస్తున్నా వాటిని తొలగించాలంటు  గురువారం మల్లికార్జున నగర్ లో కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. రేడియేషం తో ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదురుకొవలసిన పరిస్దితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక టిఆర్ఎస్ నేత మేకల రాము యాదవ్ కు ఫిర్యాదు చేయడంతో మల్కాజిగిరి శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చరు. ప్రస్తుతం సెల్ టవర్ పనులు ఆగిపోవడంతో కాలనీవాసులు నిరసనను విరమించారు.

ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా బిజెపి నాయకులు.

 ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా బిజెపి నాయకులు..


వేములవాడ, పెన్ పవర్

భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార ప్రతినిధి సార్ల చారి,యువమోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఈర్లపల్లి హరీష్,రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్,బిజెపి నాయకులు ముప్పిడి శ్రీనివాస్ లు  గురువారం  కరీంనగర్ ఎంపి,తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు సంజయ్ కుమార్ ను పార్టీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలుసుకొని స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నూతనంగా నియమించబడిన నాయకులకు ఎంపి శుభాకాంక్షలు తెలిపారు.

రెండో రోజు కొనసాగిన అరెస్టుల పర్వం..

 రెండో రోజు కొనసాగిన అరెస్టుల పర్వం..



 
వేములవాడ,పెన్ పవర్

నియోజకవర్గ అభివృద్ధి గాలికొదిలి సంవత్సరం కాలంగా జర్మనీలో ఉంటున్న వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు రాజీనామా చేయాలంటూ రెండో రోజు అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న   వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులను గురువారం ఉదయం  పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ .. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని .. ఇలా ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామికం అని,టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీల నాయకుల చూస్తే  భయం మొదలైందని, ఆ భయంతోనే  ప్రజాస్వామ్య విరుద్ధంగా అరెస్టులు చేయిస్తున్నారని పేర్కొన్నారు. అరెస్టయినవారిలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సాగర్ వెంకటస్వామి, మోడీ కే చంద్రశేఖర్, చిలక రమేష్, మధు, ఎంపిటిసి రాజశేఖర్, నాగుల విష్ణు, సర్పంచ్ రాజ ప్రకాష్, ప్రశాంత్, ఎర్ర మామయ్య, రాజేష్, రాము,రాజు  ఉన్నారు

చర్లపల్లి డివిజన్ లో వీధి కుక్కలు రెచ్చిపోయి కాటేస్తున్నాయి

 చర్లపల్లి డివిజన్ లో వీధి కుక్కలు రెచ్చిపోయి కాటేస్తున్నాయి...




పెన్ పవర్,  మల్కాజిగిరి

 కుషాయిగూడలో ఒకే రోజు ఓ మహిళ సహా పదవ తరగతి విద్యార్థిని కాటేసిన వీధి కుక్కలు. భయం గుప్పిట డివిజన్ ప్రజలు చర్యలు తీసుకోవడంలో ఉదాసీనత కనబరుస్తున్న వన్యప్రాణి విభాగం అధికారులు. ప్రజాప్రతినిధులు అధికారులు దయచూపండి అన్ని వేడుకున్న వారు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడ పసిపిల్లలపై వీధి కుక్కలు కాటేసిన ఘటనలు మరవక ముందే మారోసారి జరిగింది. కుషాయిగూడ బస్టాండ్ లో పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణను చూసుకునే గజ్వేల్ నరసమ్మ రోజు మాదిరిగానే గురువారం ఉదయం వచ్చి టాయిలెట్స్ దగ్గర పనులు చూసుకుంటుండగా వీధి కుక్క రెచ్చిపోయి దారుణంగా కరిచింది. శివ సాయి నగర్ కు చెందిన కాసుల సురేష్ కుమారుడు ఈసీఐఎల్ నారాయణ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న కాసుల సృజన్ కుమార్, ఉదయం స్కూల్ కు నడుచుకుంటూ వెళ్తుండగా పోచమ్మ గుడి వద్ద మరో వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఒకే రోజు వీధి కుక్కలు ఇద్దరిపై  దారుణంగా దాడి చేసిన సంఘటనతో స్థానికులు భయాందోళనలకులో నవుతున్నారు. నెల రోజుల వ్యవధిలో శివ సాయి నగర్ కు చెందిన మోక్ష అనే నాలుగేళ్ల చిన్నారి వెంకన్న అనే వ్యక్తిని సోనియా గాంధీ నగర్ చెందిన మహిత అనే పదకొండేళ్ల బాలికను అదేవిధంగా చర్లపల్లి భరత్ నగర్ కు చెందిన నుంజున్ అనే చిన్నారిపై వీధికుక్కలు తెగబడి కాటేసాయి. అయినా  వన్యప్రాణి విభాగం అధికారులు తమకేమి పట్టనట్టుగా చూస్తూ వ్యవహరించడం పట్ల చర్లపల్లి డివిజన్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్ స్పందించి చర్లపల్లి డివిజన్ లో వీధికుక్కల స్వైర విహారం పై దృష్టి సారించి భయాందోళనకు లోనవుతున్న ప్రజలకు అండగా నిలవాలని చర్లపల్లి కాలనీ వాసులు కొరుతున్నారు.

కన్నెపల్లి లోని దాంపూర్ లో వేటగాళ్ల ఉచ్చులో పడి రైతు మృతి

 కన్నెపల్లి లోని దాంపూర్ లో వేటగాళ్ల ఉచ్చులో పడి రైతు మృతి

కన్నెపల్లి, పెన్ పవర్

మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని దాంపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని పొలాల్లో అటవీ జంతువుల కోసం వేటగాళ్లు వేసిన ఉచ్చుకు ఓ రైతు ప్రాణాలు గాల్లో కలిసాయి.కుటుంబసభ్యులు,పోలీసులు సమాచారం ప్రకారం బుధవారం రాత్రి గ్రామానికి చెందిన రైతులు మేకల శంకర్, నారాయణ ఇద్దరూ కలిసి కట్టెలు అమ్మడానికి ఎడ్లబండిలో విగాం గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో వారు దారి తప్పడంతో,ఎడ్ల బండి దిగి దారి వెతుకుతుండగా పత్తి చేను వద్ద వేటగాళ్ళు అమర్చిన కరెంట్ తీగలకు తగిలి శంకర్  అక్కడికక్కడే మృతి చెందాడు.వెంటనే తేరుకున్న నారాయణ గ్రామానికి వెళ్లి గ్రామస్థులకు సమాచారం అందించాడు. తాండూరు సీఐ బాబూరావు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.అనంతరం శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఉచ్చు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...