Followers

ముందుగానే రాష్ట్రంలోవైఎస్ఆర్ రైతు భరోసా - పియం కిసాన్ పథకం

వైఎస్ఆర్ రైతు భరోసా - పియం కిసాన్ పథకం ద్వారా ఖరీఫ్ సీజన్ ముందుగానే రాష్ట్రంలో 49 లక్షల 43 వేల కుటుంబాలకు 7500 రూపాయలు చొప్పున మొత్తం 3707 కోట్ల 69 లక్షల రూపాయలు ఈ నెల 15వ తేది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేయనున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. గురువారం మంత్రి రమణయ్య పేట ఆయన క్యాంప్ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కన్న బాబు మాట్లాడుతూ గత సంవత్సరం రైతు భరోసా పథకాన్ని ప్రారంబించి అర్హులైన ఒక్కోక్క రైతు ఖాతాలో నేరుగా 13500 రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. అదే విధంగా ఈ నెల 15 వ తేదిన రెండోవ విడుత విడుదల చేయడం జరిగిందన్నారు. రైతు భరోసా - పియం కిసాన్ పథకం ద్వారా జిల్లా గత సంవత్సరం 4 లక్ష 12 వేల రైతు కుటుంబాలకు 311.52 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం 4 లక్షల 29 వేల కుటుంబాలకు 322 ల కోట్ల 25 లక్షల రూపాయలు జమ చేయడం జరుతుందని మంత్రి తెలిపారు. జిల్లాలో ఈ సంవత్సరం 17391 కుటుంబాలకు రైతు భరోసా లబ్ధి చేకుర్చేల చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఆర్థికంగా రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యం తోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశ పెట్టామన్నారు. గత సంవత్సరం మాదిరి గానే ఈ సంవత్సరం కూడ కౌలు రైతులకు రైతు భరోసా అందుతుందని మంత్రి కన్న బాబు తెలిపారు.


విజయనగరం సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ స్పెషల్ ఆఫీసర్ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయి కీనోట్

విజయనగరం,


ఆదికవి నన్నయ యూనివర్సిటీరాజమండ్రి  ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మరియు ముంబయిలోని యంగ్ రీసెర్చ్ ఫోరమ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12 మే నుంచి 15 మే వరకు నిర్వహిస్తున్న వెబినార్ లో ఈ రోజు కరోనా నేపథ్యంలో 'ఇన్నోవేటివ్   స్ట్రేటిజీస్  అండ్  మెథడాలజీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్అనే అంశంపై ముఖ ప్రసంగం డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి మరియు విజయనగరం సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ స్పెషల్ ఆఫీసర్ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయి కీనోట్ ప్రసంగం చేశారు. ప్రొఫెసర్ రాయి ప్రసంగిస్తూ మారుతున్న పరిస్థితులకం అనుగుణంగా మన విద్యాభోదన  అందుబాటులో ఉన్న సాంకేతికతనుపయోగించుకొని మా అనైపుణ్యాలకు మరింత పదును పెట్టి కరోనాలాంటి పరిస్తితుల్లో  విద్యా సంవత్సరం నష్టపోకుండా ఆన్ లైన్ విధానంద్వారా ఇప్పటికీ పూర్తికాని సిలబస్సును పూర్తి చేయాలనితద్వారా విద్యార్థులు విజ్ఞాన సముపార్జనలో నష్టపోకుండా అంకితభావంతో కృషిచేయాలనిపిలుపిచ్చారు. విధ్యార్ధులకో స మే అధ్యాపకులున్నామనే భావన ఈ కరోనా పరిస్థితుల్లో వారిలో కలిగించాలని అన్నారు. అభివృద్ది చెందుతున్న భారత్ లాంటి దేశాలు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో మరింత వనరుల లేమి ఎదుర్కుంటాయనిఅయినప్పటికీ నాలెడ్జి బదిలీసంపద సృష్టి విషయాల్లో విద్యావేత్తలు తీవ్రంగా కృషి చేయాలని అన్నారు. అనేక కార్పొరేట్ సంస్థలు ఇప్పటికే ఉద్యోగాల నిమిత్తం  ఆఫర్ లెటర్లు ఇచ్చున్నాయనిఆన్లైన్ విధానంలో త్వరితగతిన సిలబస్ పూర్తిచేసి పరీక్షలు నిర్వహిoచాలని అన్నారు. ఆన్లైన్ విద్యలో లెర్నింగ్ సామర్ధ్యం తక్కువ ఉన్న విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు.వీడియో మాధ్యమంలో జరిగిన ఈ కార్యక్రమంలో 22 రాష్ట్రాలకు చెందిన వివిధ సబ్జెక్టుల అధ్యాపకులునన్నయ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుబ్బారావు పాల్గొనగా కార్యక్రమానికి విజయనగరం ట్రైబల్ యూనివర్సిటీ అడ్మిన్ ఆఫీసర్ డాక్టర్ సూర్యనారాయణ ఆర్గనైజింగ్  సెక్రటరీ గా వ్యవహరించారు


ఇంటింటికీ మాస్కులు పంపిణీ


ఇంటింటికీ మాస్కులు పంపిణీ


పోలవరం పెన్ పవర్

పోలవరం మండలం స్థానిక పంచాయతీ పరిధిలో గల కొత్తపేట ఏరియాలో ఇంటింటికీ మాస్క్ లు పంపిణీ కార్యక్రమం గ్రామ వాలంటీర్లు నిర్వహిస్తున్నారు. కరోనా నిర్మూలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న మాస్క్ లను ఎంపీడీవో జె మన్మధరావు ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా పంపిణీ చేస్తున్నామని అయితే గురువారం కొత్తపేట ఏరియాలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి   ఇంటిలో ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి మూడు మాస్కులు చొప్పున అందజేస్తున్నామని ఆ ఏరియా వాలంటీర్ నాగమణి అన్నారు. కొత్తపేట ఏరియాలో తన పరిధిలో ఉన్న 53 కుటుంబాలకు గాను 378 మందికి మా స్కూలు అందించినట్లు తెలిపారు. కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి అని ప్రతి ఒక్కరికి వివరిస్తూ వాలంటీర్ నాగమణి మాస్కులు పంపిణీ చేస్తున్నారు. 


65 కుటుంబాలకు ధోమతెరలు పంపిణీ  .


65 కుటుంబాలకు ధోమతెరలు పంపిణీ  .

   

వి.ఆర్.పురం, పెన్ పవర్ .

 

వి.ఆర్.పురం మండలం ఇప్పురు గ్రామంలో 65 కుటుంబాలకు ధోమతెరలు పంపిణీ చేయటం జరిగింది. ఈ సందర్బంగా జిడిగుప్ప పి.హెచ్.సి డాక్టర్ సుందర్ ప్రసాద్ మాట్లాడుతూ కరోనా వ్యాధి దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు మస్కులు ధరించాలి. పరిశుభ్రత పాటించాలి. మీ గ్రామంలో ఎవరికైనా జ్వరం దగ్గు వచ్చినట్లు ఐతే వెంటనే ఆశ వర్కర్కి గాని ప్రభుత్వ వైద్య శాలకు తీసుకొని వెళ్లవలెను. మీ గ్రామంలోకి క్రొత్తవారు వచ్చినట్లైతే ఆశ వర్కర్  డాక్టర్ కి తెలియపరచవలెను .మీ గ్రామంలో ఎవరైన గర్భిణి స్త్రీలు  ఉన్నట్లయితే జిదిగుప్ప పి.హెచ్.సి లో పిడర్ అబులెన్స్ ఉన్నది. వారికి సమాచారం ఇచినట్లైతే వెంటనే వారు వచ్చి వైద్య శాలకు తీసుకొని వెళ్తారు. జిడిగుప్ప పంచాయతీలో గలా కొండ రెడ్ల గ్రామాలకు అందుబాటులో ఉంటూ ఉదయం రాత్రి అని తేడా లేకుండా వైద్యం అందించటానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు .ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ సోఢీ బజారు ఆశ వర్కర్ ఎం.మహాలక్ష్మీ స్.శైలేంద్ర గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

 

ఇళ్లస్థలాలు పంపిణీకి ఏర్పాట్లు.


ఇళ్లస్థలాలు పంపిణీకి ఏర్పాట్లు.- .......తహశీల్దార్ కె.పోసిబాబు

    

 గోకవరం, పెన్ పవర్

 

 

 గోకవరం మండలం లో సుమారు 40వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని తహశీల్దార్ కె.పోసి బాబు తెలిపారు. గురువారం స్థానిక ది గోకవరం ప్రెస్ క్లబ్ నందు పాత్రికేయులతో ఇష్టాగోష్టి లో తహశీల్దార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా గోకవరం మండలం లో ఉన్న ప్రభుత్వ భూములను మే నెలాఖరుకు ప్యురిఫికేషన్ ఆఫ్ లాండ్ రికార్డ్స్ పనిని పూర్తి చేస్తామని అన్నారు. మండలంలో సుమారు 13 వేల మంది పట్టాడారులు ఉన్నారని, వారందరి ఖాతాలు ఆధార్ కు అనుసంధానం చేస్తున్నామని అన్నారు. విదేశాల్లో ఉన్న వారి పట్టాదారు ల ఖాతాలను కూడా త్వరలో ఆధార్ తో అనుసంధానం చేయుటకు చర్యలు తీసుకుంటున్నాం. మండలంలో ఉన్న మీసేవ కేంద్రాల్లో సర్వీసులను నిత్యం తమ సిబ్బంది  పర్యవేక్షిస్తున్నారు  అని తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో మండలంలో ఉన్న ప్రతీ రేషన్ కార్డు దారునికి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పంపిణీ కార్యక్రమం 100 శాతం  అందిస్తున్నామన్నారు.  మండలంలో 23 లే అవుట్ లు లో పూర్తి స్థాయిలో పనులు జరుగుతున్నాయని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇళ్ళ స్థలాల పంపిణీ కార్యక్రమం కొరకు అర్హులను గుర్తింపు జరుగుతుందన్నారు. మండలంలో 3023 మంది ఇళ్ళ స్థలాలు కు అర్హులను గుర్తించామని అన్నారు. మే 25 వరుకు ఇళ్ళ స్థలాల కు  దరఖాస్తు కు అవకాశం ఉందని తహశీల్దార్  అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జాయింట్ రిజిస్ట్రార్ హోదాలో అర్హులైన వారందరికీ రిజిస్ట్రేషన్ చేసి, ఇళ్ళ స్థలాల పంపిణీ చేయనున్నామని తెలిపారు. మే నెలాఖరు లోగా లబ్దిదారులు జాబితా మరొకసారి ప్రకటిస్తామన్నారు. తొలి జాబితాలో అర్హులుగా ఉన్నవారు వివరాలను రెండోసారి క్షుణ్ణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకే పరిశీలించాక కొందరిని అనర్హులుగా ప్రకటించామని తహశీల్దార్ అన్నారు. అలాగే మండలంలో ఉన్న  రెవెన్యూ సంబంధిత సమస్యల్ని  తమ దృష్టికి తీసుకు రావాలని పాత్రికేయులకు సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, ది గోకవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రౌతు పండు, ఉపాధ్యక్షులు  కరాసు శివ రామకృష్ణ, కార్యదర్శి కర్రి శివ తదితరులు పాల్గొన్నారు.

నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన దొంతు మంగేశ్వరరావు


600.కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన దొంతు మంగేశ్వరరావు

ఎటపాక,


 


-ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో ప్రజలకు ఏర్పడిన విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విలీన మండలాల బిజెపి అధ్యక్షులు దొంతు మంగేశ్వరరావు ఆధ్వర్యంలో 600 కుటుంబాలకు నిత్యవసర సరుకులను ఇంటింటికి వెళ్లి గురువారం పంపిణీ చేశారు,వివరాలోకివెళ్తే ..ఎటపాకమండల పరిధిలోని గౌరీదేవిపేట పంచాయతీ పేద ప్రజలకు 8 రకాల నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు,అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు కరోన వైరస్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,కనీస జాగ్రత్తలు పాటించాలని సూచించారు,ఈకార్యక్రమంలో వసంతాల.రమేష్,సుకురామ్, వెంకట్,రమేష్,నాయకులు,బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.


అమ్మ చారిటబుల్ ట్రస్ట్ మండలంలో పేదలకు భోజనం ప్యాకెట్ లు పంపిణి.


అమ్మ చారిటబుల్ ట్రస్ట్ మండలంలో పేదలకు భోజనం ప్యాకెట్ లు పంపిణి.

 

ఏలేశ్వరం, 

 

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలం లో పేదలకు భోజనం ప్యాకెట్ల పంపిణి గురువారం జరిగింది. రాష్ట్రంలో లాక్డౌన్ ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటివరకు అనగా 54 రోజుల నుండి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సుదూర ప్రాంతాలకు వెళ్లే బాటసారులకు నేషనల్ హైవే-16 పై కాలి నడకన వెళ్లే కూలీలకు ప్రతిరోజు ఆహార పొట్లాలు, మంచినీళ్లు వితరణ గావించి వారి దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఈరోజు మండల పరిధిలోని లింగంపర్తి, భద్ర వరం, పేరవరం, ఏలేశ్వరం లో ఉన్న యాచకులకు, నిరుపేదలకు సుమారు 150 మందికి భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు. అలాగే ఏలేశ్వరం క్వారీ పేట కు చెందిన దివ్యాంగులకు  15 కేజీల బియ్యం, కూరగాయలు వితరణ చేశారు . ఈ కార్యక్రమంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మాసరి మృత్యుంజయ శర్మ, నూకల సుబ్రమణ్యం, బండి నరసింహ మూర్తి, చాగంటి నరసింహారావు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...