Followers

ఖురాన్ అల్లా యొక్క గ్రంథం దాన్ని ప్రళయం వరకు మార్చే శక్తి ఎవరికి లేదు

ఖురాన్ అల్లా యొక్క గ్రంథం దాన్ని ప్రళయం వరకు మార్చే శక్తి ఎవరికి  లేదు

గొల్లపల్లి  (పెన్ పవర్)

 విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ కు చెందిన మతిభ్రమించిన ఒక మంత్రి వసీం రీజ్వీ “సత్య గ్రంథమైన ఖురాన్” లోని 26 ఆయతులను తొలగించాలని సుప్రీంకోర్టులో ఫైల్ దాఖలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఖురాన్ సర్వ మానవాళి సన్మార్గం కోసం అల్లాహ్ పంపించిన ఆకాశ గ్రంథమని. అది మానవ రచన  ఎంతమాత్రం కాదని అందులో ఒక సూరా (అధ్యాయం)కాని , ఒక ఆయతే కానీ ఒక పదమే కానీ ఒక అక్షరమే కానీ ఒక పొల్లు కానీ మానవ కల్పితం కానే కాదని చెప్పారు. అందులోని ఒక చిన్న అక్షరాన్నైనా తొలగించే శక్తి  మానవమాత్రులకు లేదని, దీన్ని రక్షించే బాధ్యత స్వయంగా అల్లాహ్ యే తీసుకున్నాడని తెలియజేశారు.వారు మాట్లాడుతూ వసీం రిజ్వి ఏ ఆయతులు అయితే తొలగించమని అంటున్నాడొ అవి తీవ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా ఉన్నాయని బూటకపు ప్రచారం చేస్తున్నాడనీ అన్నారు. వాస్తవానికి ప్రతి దేశం యొక్క రక్షణకు డిఫెన్స్ సిస్టమ్, ఆదేశాలు ఎలా ఉంటాయో ఖుర్ఆన్ లోని జిహాద్ కు సంబంధించిన ఆయతులు అలాంటివేనని స్పష్టం చేశారు. ఖురాన్ అల్లా యొక్క గ్రంథమని దాన్ని ప్రళయం వరకు మార్చే శక్తి ఎవరికి కూడా లేదని దాని యొక్క బోధనలు సర్వమానవాళి శాంతి కోసమే ఉన్నాయని అందులో ఎలాంటి మార్పులు చేర్పులు చేసే అధికారం ప్రపంచంలోని ఏ కోర్టులకు, ప్రభుత్వాలకు కూడా లేదని తెలియజేశారు. గౌరవ కార్యదర్శి  మాట్లాడుతూ వసీం రిజ్వీ యొక్క రెచ్చగొట్టే మాటలకు కు రెచ్చిపోయి ముస్లిం సమాజం మరియు ప్రజలంతా కూడా శాంతి సహనాలు కోల్పోకూడదని, అందరూ ఖురాన్ గ్రంథాన్ని అర్థంతో చదివి వాస్తవాలను తెలుసుకోవాలని కోరారు.ఇంకా వసీం రిజ్వీ పై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకొని అతనిని కఠినంగా శిక్షించాలని ప్రజల మనోభావాలను కించపరిచేలా మాట్లాడుతూ ఐక్యమత్యంగా ఉండే సోదరుల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న ఇలాంటి చర్యలను అందరూ ఖండించాలని గౌరవనీయులు సుఫ్యాన్  కోరారు.ఈ సమావేశంలో  హఫీజ్ రఫిఖ్ అధ్యక్షులు తిరుమలాపూర్  సయ్యద్ అబ్దుల్లా జామిఈ ప్రధాన కార్యదర్శి మదర్సా సౌతుల్ ఖురాన్ యశ్వంతరావు పేట, టీఆర్ఎస్ అధ్యక్షులు అబ్దుల్ రహీం బుగ్గారం మండల మైనార్టీ ప్రెసిడెంట్ షబ్బీర్  తదితరులు పాల్గొన్నారు.

పని భారాన్ని తగ్గించాలని వినతి

 పని భారాన్ని తగ్గించాలని వినతి

గొల్లపల్లి, పెన్ పవర్

గ్రామ పంచాయతీ కార్యదర్శుల పైన ఉన్నటువంటి ఉపాధి హామీ పని భారాన్ని తగ్గించాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగ భద్రత ఆరోగ్య భద్రత కల్పించాలని మరియు ప్రో బిషన్ కాలాన్ని రెండు సంవత్సరాలు తగ్గించి రెగ్యులర్ చేయాలని  గొల్లపల్లి మండల పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవో జనార్ధన్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది సంగారెడ్డి జిల్లా లో పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న టువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శి జగన్నాథంకు నివాళులు అర్పించి పని ఒత్తిడి తగ్గించాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఎంపిడిఓ జనార్ధన్ ఎం పీ ఓ వెంకటేశ్వర్ రెడ్డి సూపరిండెంట్ రవీందర్రావు పంచాయతీ కార్యదర్శులు మరియు ఉపాధి హామీ అధికారులు పాల్గొనడం జరిగింది

ఆడారి కుమార్తె ప్రమాణ స్వీకారానికి తరలి వెళ్లిన మండల వైయస్ఆర్ సీపీ అగ్ర నాయకులు

 ఆడారి కుమార్తె ప్రమాణ స్వీకారానికి తరలి వెళ్లిన మండల వైయస్ఆర్ సీపీ అగ్ర నాయకులు

విశాఖపట్నం, పెన్ పవర్

విశాఖ డైరీ ఉత్తరాంధ్ర డైరెక్టర్ గేదెల సత్యనారాయణ ఆధ్వర్యంలో రోలుగుంట,రావికమతం,బుచ్చయ్యపేట, మండలాలకు సంబంధించిన పాల సొసైటీ అధ్యక్షులు, గ్రామ సర్పంచులు,ఆడారి తులసీరావు కుమార్తె రమా కుమారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి తరలి వెళ్లారు. ఆయన రాజాం పాల సొసైటీ ఆవరణలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ చోడవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ఆడారి తులసీరావు మరియు ఆనంద్ బాబు మరియు నాయకులు కరణం ధర్మశ్రీ  ఆశీస్సులతో ఈ ప్రాంతాన్ని ఎల్లవేళలా అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు.పెద్ద మనసుతో మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఆడారి కుటుంబానికి గుర్తింపు తీసుకురావడం వల్ల ఒక మంచి రాజకీయ వాతావరణంలో మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా రమాదేవి పేరు ప్రకటించడం వల్ల మేమందరం ఎమ్మెల్యే  ఆశీస్సులతో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్ మరిశా నాని, సర్పంచులు పడాల నాగభూషణం, ముచ్చర్ల శ్రీను, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ కర్రీ నాయుడు బాబు, స్థానిక పాల సంఘం అధ్యక్షులు యన్నంశెట్టిశెట్టి అప్పారావు, మాజీ సర్పంచ్లు, పాల సంఘం అధ్యక్షులు భారీ ర్యాలీగా తరలివెళ్లారు.

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా....ఏపీ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి

 రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా....ఏపీ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి


విశాఖపట్నం సిటీ, పెన్ పవర్

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా  (ఆంధ్రా యూనివర్శిటీ గోల్డ్ మెడలిస్ట్) ఏపీ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి నియమితులయ్యారు.రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి దండే సుబ్రహ్మణ్యం జ్యుడీషియరీ సభ్యునిగా, సీనియర్ అడ్వొకేట్ డాక్టర్ గోచిపాటా శ్రీనివాస రావు నాన్ జ్యుడీషియరీ సభ్యునిగా నియమితులయ్యారు.న్యాయవ్యవస్థలో అపార అనుభవం.. జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి స్వస్థలం కాకినాడ. 12 సంవత్సరాల పాటు న్యాయవాదిగా పనిచేశారు. 1996లో జిల్లా జూనియర్ గ్రేడ్-2 జడ్జిగా ఎంపికయ్యారు. ఏపీ జ్యుడీషియల్ అకాడమీలో ఫ్యాకల్టీగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఎస్పీఈ, ఏసీబీ కేసులను విచారించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానాల్లో జడ్జిగా పనిచేశారు. నెల్లూరులో జిల్లా రెండో అదనపు న్యాయస్థానం, కర్నూలులో మూడో అదనపు జిల్లా న్యాయస్థానాలు, ఫ్యామిలీ కోర్టుల్లో పనిచేశారు. సీబీఐ కేసుల ప్రత్యేక జడ్జిగా, విశాఖపట్నం మెట్రో పాలిటన్ సెషన్స్ న్యాయమూర్తిగా సేవలందించారు. హైదరాబాద్ జిల్లా సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.గోల్డ్ మెడలిస్ట్.. 2013 అక్టోబర్ 23వ తేదీన ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2016లో ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం పదవీ విరమణ చేశారు. ఆంధ్రా యూనివర్శిటీ నుంచి బీఎస్సీ, న్యాయవిద్యలో డిగ్రీ పూర్తి చేశారు. న్యాయవిద్యలో గోల్డ్ మెడల్ అందుకున్నారు. 1996-96 మధ్యకాలంలో జిల్లా న్యాయమూర్తిగా శిక్షణ పొందే సమయంలోనూ బంగారు పతకాన్ని సాధించారు.

మాలసింగారం లో మంచినీటి కష్టాలు తీర్చండి మహాప్రభో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మొస్య ప్రేమ్ కుమార్ డిమాండ్

 మాలసింగారం లో మంచినీటి కష్టాలు తీర్చండి మహాప్రభో  యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మొస్య ప్రేమ్ కుమార్ డిమాండ్

అరకు, పెన్ పవర్

ఆంధ్ర ఊటీ గా చెప్పుకుంటున్న అరకులోయ  పరిధిలో గల చినలబుడు గ్రామపంచాయతీకి చెందిన సుమారు150 గడపలు 700కి పైగా జనాభా గల మాలసింగారం గ్రామంలో మంచినీటి సమస్యను పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారని గురువారం, అరకువేలి యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ మొస్య ప్రేమ్ కుమార్ పాలకులపై మండిపడ్డారు, ఆయన ఆధ్వర్యంలో కాలిబిందెలు పట్టుకొని గ్రామస్తులు రోడ్ షో ద్వారా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచినీటి సమస్య అధికంగా ఉందన్నారు, వర్షాకాలంలో మంచినీళ్లు దొరక్క గ్రామస్తులు చాలా అవస్థలు పడుతున్నారని కలుషిత మురుగు నీళ్లు తాగడం వల్ల చిన్నపిల్లలు వృద్ధులు మహిళలు చాలా రకాలైన జబ్బులు విషజ్వరాల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారని. మంచి నీటి సమస్య పై ఎన్నో సార్లు అధికారులకు విన్నవించిన పెడచెవిన పెడుతు న్నారని మండిపడ్డారు.ఇప్పటికైన పాలకులు ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ గ్రామానికి చేరువలో ఉన్న చంప గడ్డ ఊట నీళ్లను శుద్ధిచేసి  కోళాయిల ద్వారా గ్రామంలో శుభ్రమైన మంచినీళ్లు అందించి మాలసింగారం లో ఉన్న మంచినీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మొస్య దేవదాసు, కిల్లో దుతి, బిసోయి సుశీల, కీల్లో లక్ష్మి, సుంకరి బృందా, గ్రామ పెద్దలు మహిళలు యువత తదితరులు పాల్గొన్నారు.

జీవీఎంసీ కొత్త పాలకవర్గం విశాఖ సమస్యలపై ద్రుష్టి సారించాలి

జీవీఎంసీ కొత్త పాలకవర్గం విశాఖ సమస్యలపై ద్రుష్టి సారించాలి

మహారాణి పేట, పెన్ పవర్

జీవీఎంసీ కొత్త పాలకవర్గం విశాఖ సమస్యలపై ద్రుష్టి సారించాలని విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సంకు వెంకటేశ్వర్రావు కోరారు.గురువారం మీడియా కు విడుదల చేసిన ప్రకటనలో మేయర్ గా ఎన్నికైన గోలగాని హరి వెంకట కుమారి,డిప్యూటీ మేయర్ గా  ఎన్నికైన జియ్యాని శ్రీధర్, ప్రమాణస్వీకారం చేసిన కార్పొరేటర్ లకు అభినందనలు తెలిపారు.విశాఖలో పేరుకుపోయిన ఎన్నో సమస్యలపై పాలక వర్గం దృష్టిసారించాలని కోరారు.విశాఖ ఉక్కు ప్రవేటీకరణకు వ్యతిరేకంగా మొదటి సమావేశంలోనే  తీర్మానం చెయ్యాలని  డిమాండ్ చేసారు.రాజకీయాలకతీతంగా విశాఖ ఉక్కు ప్రవేటీకరణకు వ్యతిరేకముగా అందరమూ కలిసి పోరాడదామని  సంకు పిలుపునిచ్చారు.

వేరుశనగ కాయలు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన

 వేరుశనగ కాయలు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన

వైఎస్సార్సీపీ మండల పార్టీ కన్వీనర్ కె టి హరిచంద్ర రెడ్డి

పెన్ పవర్, సత్యవేడు

చిత్తూరు జిల్లా పిచ్చా టూరు మండలం సిద్దిరాజుల కండ్రిగ రైతు భరోసా కేంద్రం నందు వేరుశనగ కాయలు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళారులు మధ్య వ్యాపారం విక్రయించడం వలన రైతులు నష్టపోతున్నారని గుర్తించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతి రైతు భరోసా కేంద్రం నందు కొనుగోలు కేంద్రాన్ని ప్రవేశపెట్టారని అన్నారు మండలంలోని రైతులు తమ వేరుశనగ కాయలను ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన కేంద్రంలో వేయాలని కోరారు.అనంతరం ఏ ఓ కోదండయ్య మాట్లాడుతూ రైతులు వేరుశనగ కాయలు దళారులు విక్రయించడం వలన రైతులు నష్టపోతున్నారు కాయలను విక్రయిం చదవలసిన రైతులు వెంటనే ఆర్ బి కె లో ఉన్న విస్తరణ అధికారిని సంప్రదించాలన్నారు రైతులు పత్రాలు పాసు పుస్తకం,ఆధార్ కార్డు,బ్యాంక్ పాస్ పుస్తకం తీసుకొని వచ్చి అగ్రిమెంట్ చేసుకొని గోనే సంచులు తీసుకోవాలని తెలిపారు.

వేరుశనగ కాయలు ఉండవలసిన నాణ్యత ప్రణాళిక

1. తేమశాతం 9./. తక్కువ

2. గింజ శాతం 74./. కన్న తక్కువ

3. వ్యర్థ పదార్థములు 4./. కన్న తక్కువ

4. ఫిసికల్ ప్యూరిటీ 96./.

ఈ కార్యక్రమంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పవిత్ర, ప్రశాంత్,గజలక్ష్మి,చంద్రశేఖర్,సిద్దిరాజుల కండ్రిగ సర్పంచ్ సుకేశ్ స్వప్న,రాజానగరం సర్పంచ్ భూపతి,వైఎస్సార్సీపీ నాయకులు పాండియన్,గోవిందన్,రైతులు జ్యోతిరాజు,బాబునాయుడు,సుధాక రాజు,గ్రామస్థులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...