Followers

పల్లెల్లో పారిశుద్ధ్య పనులు

పల్లెల్లో పారిశుద్ధ్య పనులు

మెంటాడ, పెన్ పవర్ 

పల్లెల్లో కరోనా కేసులు నమోదవుతున్న నేపద్యంలో మెంటాడ మండలం లోని అన్ని గ్రామాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. చింతలవలస, జక్కువ, మెంటాడ, మీసాల పేట, బడే వలస తదితర పల్లెల్లో ఆయా గ్రామాల సర్పంచులు గేదెల అన్నపూర్ణ, లచ్చి రెడ్డి సత్యవతి, మహంతి రామ్ నాయుడు, మీసాల పార్వతి ఆధ్వర్యంలో ముమ్మరంగా పారిశుద్ధ్య కార్మికులు మట్టిని తొలగించి శుభ్రం చేసే బాధ్యత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు.

కరోనా పట్ల నిర్లక్ష్యం వీడని గ్రామస్తులు

 కరోనా పట్ల నిర్లక్ష్యం వీడని గ్రామస్తులు

మెంటాడ, పెన్ పవర్ 

మెంటాడ మండలం లోని అతి పెద్ద గ్రామమైన పేద మేడపల్లి లో ప్రజలు కరోనా పట్ల నిర్లక్ష్యం పై వ్యవహరిస్తున్నారని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రాణాంతకమైన కరోనా పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బంది అవగాహన సదస్సులు నిర్వహించి చైతన్యవంతులను చేస్తున్నారు. అధికారులు అవగాహన కల్పిస్తున్నా ఇంకా పలువురు గ్రామస్తులు కరోనాపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పలువురు గ్రామస్తులు కనీసం మా స్కూలు ధరించకుండా ఇతర గ్రామాలకు ట్రాక్టర్లు ద్వారా  ప్రయాణాలు సాగిస్తున్నారు. గ్రామంలో కూడా చెత్తాచెదారం రాజ్యమేలుతుంది.

 పలువురు గ్రామస్తులు కరోన నిబంధనలు పాటించాలని , అవసరమైతే తప్ప వేరే ప్రాంతాలకు వెళ్లరాదని, ఇతర గ్రామాల నుంచి మన గ్రామానికి రానివ్వకుండా చేయాలని చెబుతున్న గ్రామస్తులు ఆ మాటలను పట్టించుకోవడం లేదని పలువురు గ్రామస్తులు వాపోతున్నారు. పెద్ద మేడపల్లి గ్రామం చాలా పెద్దది కావడంతో వద్ద వీధిలో ఏమి జరుగుతుందో, మరో వీధికి తెలియని పరిస్థితి ఎక్కడ ఉంది. సంబంధిత గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, వైద్య ఆరోగ్య సిబ్బంది తీవ్రంగా స్పందించి రాకపోకలకు అడ్డుకట్ట వేయాలని పలువురు గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామంలో పలువురు కరోనా లక్షణాలతో ఉన్నట్లు పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

పారిశుద్ధ్య కార్మికుల జీతాల బాకాయిలు వెంటనే చెల్లించాలి

పారిశుద్ధ్య  కార్మికుల జీతాల బాకాయిలు వెంటనే చెల్లించాలి

పరవాడ, పెన్ పవర్

పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు బకాయి పడ్డ 13 నెలలు జీతాలు చెల్లించాలని మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మండలంలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్మికుల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ గత సవచ్చరం కరోనా మొదలు అయిన దగ్గరనుండి గ్రామాల్లో కరోనా నివారణ కోసం అహర్నిశలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల ప్రాణాల కోసం పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు,వాటర్ పంప్ ఆపరేటర్లకు,ఎలక్ట్రికల్ వర్కర్స్ లకు ప్లంబర్ లకు మండలంలోని గ్రామపంచాయతీ లలో వారికి 13 నెలలుగా జీతాలు ఇవ్వకుండా బకాయి ఉంటే వారు ఎలా బతకాలని ఆవేదనతో ప్రశ్నించారు.కరోనా మొదలు దగ్గరనుంచి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి అని అలాంటి పరిసితుల్లో వారికి జీతాలు ఇవ్వకపోతే వారు ఎలా బ్రతుకుతారు అని ప్రశ్నించారు.అంతే కాకుండా వారికి రక్షణ కొరకు మాస్కులు, శానిటైజర్,బూట్లు, యూనిఫార్మ్,సబ్బులు లాంటి వేవి ఇవ్వడం లేదని గనిశెట్టి ఆవేదన వ్యక్తం చేశారు.కరోనాతో  మరణించిన వారి  ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికులు అక్కడ శుభ్రత పని చేస్తున్న సమయంలో వారికి మాస్క్ లు లేకపోతే ఏ రకంగా పనులు నిర్వహించగలరు అని ప్రశ్నించారు.వెంటనే బకాయి జీతాలు చెల్లించాలని పిఎఫ్, ఈ ఎస్ ఐ, ఐడి కార్డులు భద్రతా పరికరాలు పంచాయతీల్లో కార్మికులకు ఇవ్వాలని అని గనిశెట్టి డిమాండ్ చేశారు.అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఈవో.ఆర్ .డి పద్మ గారికి ఇవ్వడమైనది ఈ కార్యక్రమంలో పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు డి.విశాఖ,ఆర్.విజయ,పి. పారుపల్లి,ఎస్.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రకటించాలి

జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రకటించాలి 

శ్రీకాకుళం, పెన్ పవర్

 కరోనా సెకండ్ వేవ్ కు జర్నలిస్టులు పిట్టల్లా రాలిపోతున్నారని ఐజేయూ జాతీయ కార్యవర్గం ప్రత్యేక ఆహ్వానితులు నల్లి ధర్మారావు ఆవేదన వ్యక్తం చేశారు.మంగళ వారం ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో,ఫ్రంట్ లైన్ వారియర్స్ గా జర్నలిస్టులను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్ ,పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు తాజాగా ప్రకటించడాన్ని ఆయన గుర్తు చేశారు.ఒడిశా ప్రభుత్వం తొలి వేవ్ లోనే మరణించిన జర్నలిస్టు కుటుంబానికి 2.50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించిందని,రెండో వేవ్ మృతులకు రూ.10 లక్షలు ప్రకటించిందని తెలిపారు.తొలి వేవ్ లోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని ఉప ముఖ్య మంత్రులకు ,మంత్రులకు విన్నవించినా ఫలితం లేకపోవడం విచారకరమన్నారు.తమ జాతీయ నాయకులు శ్రీనివాసరెడ్డి,దేవులపల్లి అమర్ స్వయంగా ముఖ్య మంత్రి జగన్మోహనరెడ్డితో మాటాడిన తరువాత ,చనిపోయిన వారి కుటుంబానికి రూ.5 లక్షలు అందిస్తామని హామీ ఇచ్చినా,అది ఇంతవరకు అమలు కాలేదని ధర్మారావు ఆవేదన వ్యక్తం చేశారు.హెల్తు కార్డులు కూడా ,నూతన ప్రభుత్వం ఇంతవరకు మంజూరు చేయలేదన్నారు.రెండో వేవ్ లో జర్నలిస్టుల మరణాల సంఖ్య ఎక్కువగా వుందని ఆందోళన వ్యక్తం చేశారు.శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకూ ఆరుగురు  రెండో వేవ్ కు బలయినట్టు ధర్మారావు తెలిపారు.సోమవారం జరిగిన ,రాష్ట్ర యూనియన్ కార్యవర్గ సమావేశం ( జూమ్ ) ఇంతవరకూ చనిపోయిన వారి వివరాలతో ,రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇటీవల ఒకే రోజు ,ఇద్దరు ' సాక్షి ' కరోనాకు బలైన తరువాత ,రాష్ట్ర స్థాయిలో జర్నలిస్టులకు ప్రత్యేక బెడ్లను కేటాయిస్తూ,జిల్లాలకు సమాచార శాఖ అధికారులను నోడల్ అధికారులుగా నియమించినట్టు తెలిపారు.

శ్రీకాకుళం ' జెమ్స్ ' లో 15 బెడ్స్ 

శ్రీకాకుళం జిల్లా జర్నలిస్టుల కోసం జెమ్స్ లో 15 బెడ్స్ ను కేటాయిస్తూ కలెక్టరు నివాస్ ఆదేశాలు జారీ చేశారని ధర్మారావు వెల్లడించారు.కరోనా బాధితులైన జర్నలిస్టులు డీపీఆర్వో రమేష్ ను సంప్రదించాలని సూచించారు.ఈ సందర్భంగా కలెక్టరు నివాస్ కు ధర్మారావు కృతజ్ఞతలు తెలిపారు. ప్రెస్ క్లబ్ ను కోవిడ్ సెంటర్ గా వినియోగించండి. గత మూడేళ్ల నుంచి మూతపడిన గరిమెళ్ల ప్రెస్ క్లబ్ ను కోవిడ్ సెంటర్ గా వినియోగించుకునే విషయం ,కలెక్టరు పరిశీలించాలని ధర్మారావు కోరారు.విలువైన భవనాన్ని మూసేసి,టిడిపి ప్రభుత్వం అన్యాయం చేసిందని,కొత్త ప్రభుత్వం కూడా కొనసాగించడం మరింత అన్యామన్నారు.కరోనా బారినపడిన జర్నలిస్టుల కోసం ప్రెస్ క్లబ్ ను కోవిడ్ కేంద్రంగా మార్చాలని కోరారు.ఈ ప్రతిపాదన శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావుకు కూడా తెలిపామన్నారు.

ప్రజలంతా సిరక్షితంగా ఉండండి...

ప్రజలంతా సిరక్షితంగా ఉండండి...

 

అనకాపల్లి, పెన్ పవర్

కరోనా  రెండవ దశ ప్రభావం ప్రమాదకరంగా ఉన్నందున ప్రజలంతా భయపడకుండా ఎవరి ఇళ్లల్లో వాళ్ళు సురక్షితంగా ఉండాలి అని  విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మళ్ల సురేంద్ర పిలుపునిచ్చారు.ఉదయం లేస్తే ఏం వినాల్సి వస్తుందో ఏ ఆత్మీయుల్ని పోగొట్టుకోవాల్సి వస్తుందో అనే బాధ,ఆవేదనలతో ప్రజలు,నాయకులు,ప్రతి వక్కరు ఆందోళన చెందున్నారు అని ఆయన అన్నారు.కరోనా ముందు డబ్బు ,పలుకుబడి ఏవి కూడా పని చేసే పరిస్థితి లేదు అని కోవిడ్ బారినపడి ఎవరిని కోల్పోవాల్సి వస్తుందోనని మనసు కలిచివేస్తోంది అని ఆవేదనతో ఆయన అన్నారు.దయచేసి ప్రతి వక్కరు స్వచ్ఛందంగా స్వీయ లాక్ డవున్ విధించుకొని మీ ఇళ్లల్లో కొంతకాలం వుండక పోతే ఈ కరోనా ప్రభలడాన్ని అరికట్టలేము అని ప్రజలను కోరారు.అత్యవసరం వస్తేనే రోడ్డు మీదకు రావాలి అని అదికూడా కరోనా నుండి రక్షణ కొరకు మీకు మీరుగా భౌతిక దూరం పాటిస్తూ,ప్రత్యేక రక్షణ కొరకు రెండు మాస్కు లు ధరించి,ఎక్కువగా  శానిటేషన్ చేసుకోనుచు పని చూసుకొని ఇంటికి త్వరగా సురక్షితంగా చేరుకోవడం తప్ప వేరే మార్గం లేదు అని సురేంద్ర తెలియజేసారు. దయచేసి మీకు  మీరు  గా ఇంటిలో ఉండండి మీ ప్రాణాలే కాకుండా ఇంటిలో వారిని మీ ఇంటి చుట్టు ప్రక్కల వారిని కూడా రక్షించండి అని ఆయన కోరారు.ప్రతి వక్కరు గుర్తువుంచుకోవల్సిన  విషం ప్రాణం కన్నా విలువైనది ఏదీ లేదు ఈ ప్రపంచంలో మీ అందరిని చేతులెత్తి ప్రార్ధిస్తున్న ఇంటిలో ఉండండి సురక్షితంగా ఉండండి అని చేతులు జోడించి అందరిని ప్రార్ధించారు.

కోవిడ్ కష్ట కాలలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందిస్తున్నాం

 కోవిడ్ కష్ట కాలలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందిస్తున్నాం

మెంటాడ, పెన్ పవర్ 

ప్రాణాలకు తెగించి రేయింబవళ్ళు వైద్య సేవలు అందిస్తున్నామని, మాపై లేనిపోని ఆరోపణలు చేయడం విశాఖ ఎక్స్ప్రెస్ పత్రికల్లో డబ్బులు తీసుకున్నట్లు, కోవిడ్ టీకా డోసు తక్కువ చేసి ఇంజెక్షన్లు ఇస్తున్నట్లు వచ్చిన అవాస్త వార్తకు ఆమె స్పందించారు.   స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర లో కరోనా కష్ట కాలం లో అనేక సేవలు తనతో పాటు సిబ్బంది ఒకవైపు కోవిడ్ పరీక్షలు వాటి ఫలితాలు అందించడం,మరో వైపు వ్యాక్సినేషన్ చేయడం, అంతే కాకుండా ముఖ్యంగా అనేక సమస్యలు తో వచ్చే రోగులకు సేవలు అందించడం ,గర్భిణీ స్త్రీలు కు ప్రసవాలు జరపడం,కోవిడ్ లక్షణాలు ల తో టెస్ట్ లు చేసుకోకుండా వచ్చిన వారికి కూడా ప్రధమ చికిత్స అందించడం అనంతరం టెస్ట్ లు జరిపి పాజిటివ్  వస్తే రిఫర్ చేయడం లాంటి సేవలు అందిస్తున్నామని మాపై లేనిపోని ఆరోపణలు చేయడం వల్ల మెంటాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెడ్డ పేరు రావడంతో పాటు రోగులకు నమ్మకం పోతుందని ఆమె పేర్కొన్నారు. మాకు కుటుంబాలు ఉన్నాయి వారిని పక్కనబెట్టి ప్రజలకు సేవ చేయడానికి వైద్య వృత్తిని చేపట్టామని తెలిపారు. మీరు సహకరించక పోయినా పర్వాలేదు కానీ ప్రజల్లోకి తప్పుడు సమాచారం తీసుకెళ్తుందని ఆమె విజ్ఞప్తి చేశారు. ఏడాదిలో మెంటాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సేవలు గుర్తించి జిల్లా కలెక్టర్ చేతుల మీదగా ప్రశంస పత్రాలు, అవార్డులను అందుకున్న ఘనత మెంటాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఉందని ఆమె పేర్కొన్నారు.  తప్పు చేస్తే నిలదీయండి, అలాగే మేము తప్పు చేసినట్లు మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయో చూపించాలని ఆమె పేర్కొన్నారు. విశాఖ ఎక్స్ప్రెస్ పత్రిక రిపోర్టర్ ఎవరో కూడా నాకు గాని, మా సిబ్బందికి గాని తెలియదని అటువంటి వ్యక్తి ఏ ఆధారాలతో వార్త రాశారు అని ఆమె ప్రశ్నించారు.

నిజంగా తప్పు చేస్తే ఎవరైనా వార్త రాయవచ్చని ఆమె పేర్కొన్నారు. మాతోపాటు మీడియా మిత్రులు సహాయం కూడా అవసరం ఎంతో ఉందని వారు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తే కరోనా ను విజయవంతం ఎదుర్కోగల మని ఆమె పేర్కొన్నారు. అనుమానితులు, పాజిటివ్ కేసులు మధ్య లో ఉండి సేవలు అందిస్తున్న సిబ్బంది సేవలు మరిచిపోలేం అని గ్రామస్తులు, పలువురు రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు సహకారం అందిస్తే ఇంకా ఉత్తమ సేవలు అందిస్తాం అని తెలియచేశారు.  ఎవరికి వారే స్వచ్చంద లాక్ డౌన్ ఏర్పాటు చేసుకోవాలని ఆమె సూచించారు. ప్రజలు తీసుకున్న జాగ్రత్త లే వారి  కుటుంబాలకు శ్రీ రామ రక్ష అని అన్నారు. అందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎక్కువ శాతం బయటకు రాకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి అన్నారు. వైద్యాధికారులు, సిబ్బంది, గ్రామ ,మండల , జిల్లా అధికారులు విధులు ముగించుకొని ఇంటికి వెళ్లి కుటుంబాలు తో ఆనందంగా గడుపుతున్నారని అనుకుంటున్నా రేమో కానే కాదు. ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరు తమ ఇంటికి చేరి వేరేగానే ఉంటారు ఎందుకు అంటే తమకు కోవిడ్ సోకె ప్రమాదం ఎక్కువ కావున ఇంటికి వెళ్లి తమ బిడ్డలను కూడా ఎత్తుకునే పరిస్థితి లేదు అని ఆమె పేర్కొన్నారు. పక్క ఇంటిలో కోవిడ్ పేషంట్ ఉంటేనే మనం తట్టుకోలేని పరిస్థితి లో ఉన్నాం అని అన్నారు. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న మా మీద లేనిపోని ఆరోపణలు చేయడం ఎంత వరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. కరోనా రెండో దశలో ఉన్నందున ప్రజలు అందరు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సహకారం అందిస్తారని ఆమె విజ్ఞప్తి చేశారు.

అనాధల పాలిట ఆత్మీయుడు....

అనాధల పాలిట ఆత్మీయుడు...

మహారాణి పేట, పెన్ పవర్

అనాధ వృద్ధులు కరోనా బారిన  పడకుండా ఉండేందుకు మాస్కులు, పండ్లు పంపిణీ మధ్యాహ్నం అన్నదానం ఏసీబీ డీఎస్పీ రంగరాజు అనాధల పాలిట ఆత్మీయుడిగా నిలిచారు. అనాధల కోసం తరచూ అన్నదానం, వస్త్ర దానం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.విశాఖ వన్టౌన్లో ఉన్న వివేకానంద అనాధ ఆశ్రమంలో ప్రముఖ సంఘ సేవకులు అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ రంగరాజు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అనాధ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులు కరోనా బారిన పడకుండా  ఉండేందుకు పండ్లు,మాస్కులు అందజేశారు..మధ్యాహ్నం అన్నదానం చేశారు.అనాధ ఆశ్రయంలో ఆశ్రయం పొందుతున్న అనాధల కోసం ఆయన తరచూ ఇక్కడ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.అనాధలను తన కుటుంబ సభ్యులుగానే భావిస్తూ కాసేపు వారితో సంతోషంగా గడుపుతారు అనాధలంతా ఆయనను  ఆత్మీయుడుగా భావిస్తూ ఆయన రాకకోసం ఎదురు చూస్తూ ఉంటారు.ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడా ఈ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని,భౌతిక దూరం పాటించాలని పలు సూచనలు తెలిపారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...