Followers

Showing posts with label ANDHRA PRADESH. Show all posts
Showing posts with label ANDHRA PRADESH. Show all posts

గజ గజ లాడిస్తున్న గజ రాజులు

 గజ గజ లాడిస్తున్న గజ రాజులు 

కూరగాయలు కోత కు వెళ్లిన మహిళ మృతి
పొలాల్లో కి వెళ్ళడానికి భయపడుతున్న రైతులు
నేటి కి ఆరుగురు మృతి 
ప్రభుత్వం రెండు కోట్లు కు పైగా నష్టపరిహారం చెల్లింపు
పదుల సంఖ్యలో ఫారెస్ట్ సిబ్బంది కి గాయాలు, వాహనాలు ధ్వంసం
మూడు ఏళ్లుగా ఇదే తంతు దొరకని  శాశ్విత పరిష్కారం

కురుపాం, పెన్ పవర్

కురుపాం నియోజకవర్గంలో లో ఏనుగులు ప్రవేశించి మూడు ఏళ్ళు పైగా అవుతుంది,కానీ నేటికీ శాశ్విత పరిష్కారం దొరకలేదు,గురువారం తెల్లవారుజామున కోమరడా మండలం పాత కల్లికోట గ్రామానికి చెందిన అల్లాడా అప్పమ్మా అనే మహిళ కూరగాయలు కోయడానికి వెళ్ళేరు,ఇమే పై ఒక ఏనుగు దాడి చేయడం తో ఆమె అక్కడ కు అక్కడే మృతి చెందింది, ఇమే మృతి తో మృతుల సంఖ్య ఆరు కు చేరింది,ఒక వైపు కరోనో మరో వైపు ఏనుగుల దాడులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు,నాగావళి నది తీరం ఉండటం తో  పుష్కలంగా నీరు,జియ్యమ్మవలస కోమరడా మండలలో అరటి , చెరకు ,లాంటి పంటలు ఉండటం తో వాటికి ఆహారం కూడా ఇబ్బంది లేకుండా ఉండటం తో ఈ ప్రాంతం విడి పోవటం లేదు,గతం లో ఎలిఫెంట్ జోన్ ఏర్పాటు కు ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పుడుకు అది కార్యరూపం దాల్చలేదు,ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు,గాయాలు పాల అయిన వారికి,ప్రాణ నష్టం జరిగిన వారికి కలిపి సుమారు రెండు కోట్ల రూపాయలు వరకు నష్ట పరిహారం చెల్లించింది, ఒక వైపు ఫారెస్ట్ అధికారులు కష్టం మరో వైపు ప్రభుత్వం నష్ట పరిహారం రూపం లో చెల్లిస్తున్న కోట్ల రూపాయలు  వృధా అవుతున్నా శాశ్విత పరిష్కారం చుపలేకపోతున్నారు.

కురుపాం, పార్వతీపురం ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అధికారులు కు నిరంతరం ఏనుగులు ను ట్రాక్ చేస్తున్న ఎలిఫెంట్ ట్రాకర్ లు కు కూడా చేతిలో బాంబులు పేలి గాయాలు పాల అయ్యారు,ఎవరో చనిపోతే ఆస్తి నష్టం జరిగి రైతులు రోడ్ ఎక్కితేనే ఈ విషయం పై ఒకరోజు చర్చ జరిగి తరవుతా వదిలేయడం కారణంగా ఇన్ని ఏళ్లుగా ఈ సమస్య కు పరిష్కారం కాలేదు,ఇప్పటికి అయిన ఫారెస్ట్ అధికారులు ,నాయకులు,శాశ్విత పరిష్కారం చూపాలని ప్రజలు,రైతులు కోటుతున్నారు.

 మూడు ఏనుగులు మృతి..

మనుషులు ప్రాణాలు, ఆస్తి నష్టం ఎంత ముఖ్యమో ముగ జీవులు ప్రాణాలు కాపాడటం కూడా మనకు అంతే ముఖ్యం,గతం లో ఒక ఏనుగు విద్యుత్ షాక్ తో మరో ఏనుగు నాగావళి నదిలో చిక్కుకొని మృతి ఛేధింది.మూడవ ఏనుగు అనారోగ్యంతో మృతి చెందింది.. దీనితో జంతు ప్రేమికులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు,ముగ జీవులు కు ప్రజలు కు ఇరువులు కు ఇబ్బంది లేని ప్రదేశానికి వాటిని తరలించాలని కోరుతున్నారు.

గన్నెలకోట సర్పంచ్ అనారోగ్యంతో మృతి

గన్నెలకోట సర్పంచ్ అనారోగ్యంతో మృతి

పెదబయలు  పెన్ పవర్

మండలంలోని, గన్నెలకోట పంచాయతీ సర్పంచ్ లకే దేవకుమారి(36)_అనారోగ్యంతో బుధవారం సాయంత్రం చామగడ్డ గ్రామంలో మృతి చెందారు. రెండు రోజులగాా ఆమె అనారోగ్యంతో బాధ పడుతూ ఆమె మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలియజేసారు. మృతురాలు దేవకుమారి గిన్నెెల కోోట సర్పంచ్ గా రెండు దఫాలు ఏక గ్రీవంగా ఎన్నిక య్యారు. వైసిపి పార్టీ ఆవిర్భావం నుంచి ఆమె తన  భర్త చిన్నారావు తో కలిసి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేస్తూ  పంచాయతీ ప్రజలకు  విశేష సేవలు  అందించారు. ఆమె  మాట అంటే పంచాయతి ప్రజలకు  శిలా సాసనం.




త్రాగునీటికి కటకట లాడుతున్న గిరిజన గ్రామాలు

 త్రాగునీటికి కటకట లాడుతున్న గిరిజన గ్రామాలు

మంచినీటి పథకాలు పుష్కలం ఫలితం మాత్రం శూన్యం
 ఏజెన్సీలో తూతూ మంత్రంగా తాగునీటి నిర్మాణాలు
 జేబులు నింపుకుంటున్న అధికార్లు కాంట్రాక్టర్లు
ఆర్డబ్ల్యూఎస్ అధికారుల పనితీరుపై గిరిజన సంఘం ఆగ్రహం

పెన్ పవర్ , విశాఖపట్నం

 విశాఖ ఏజెన్సీలో తాగు నీరు సదుపాయం లేక ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీరు కోసం ఊటలు గెడ్డలను ఆశ్రయిస్తున్నారు. గిరిజనుల తాగు నీటి పధకాల పేరుతో కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికి వీసమెత్తు ఫలితం ఇవ్వడం లేదు.తూతూ మంత్రంగా నిర్మణాలు చేసి కాంట్రాక్టర్లు జేబులు నింపుకుంటున్నారని గిరిజన సంఘం గిరిజన సమైక్య ఆరోపిస్తున్నారు. దీనికి పెదబయలు మచ్చుతునకగా చెప్పవచ్చు. పెదబయలు మండలం 23 పంచాయతీల పరిధిలో నూటికి 80%  గ్రామాలలో సురక్షిత మంచినీరు అందుబాటులో లేదని 48% శాతం పైగా గ్రామాలు గ్రావిటీ ద్వారా ఆధారపడి బతుకుతున్నాయని 30% శాతం గ్రామాల్లో నేటికీ ఊట గడ్డ మీద ఆధారపడి ఉన్నదని కేవలం 28% గ్రామాల్లో మాత్రమే బోర్ పంపులు సోలార్ ద్వారా మంచినీళ్లు తాగుతున్నారని  2014 -2018 మధ్యకాలంలో ప్రతి గ్రామానికి బోర్ పంపుల ద్వారా ఇంటింటికి సురక్షిత మంచినీరు అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినప్పటికీ  ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నిర్లక్ష్యం, పనిలో నాణ్యత లేకపోవడం వల్ల కోట్ల రూపాయలు డబ్బులు వృధా అవడంతో పాటు, సొమ్ము చేసుకున్నారు దీనిపై ఉన్నతాధికారులు సరి అయిన దర్యాప్తు చేసి గిరిజనులకు నీళ్లు అందించే విషయంలో పూర్తి వైఫల్యం చెందారని  విమర్శించారు. గత మూడేళ్ల క్రితం  గోమంగి  పంచాయితీ సరియపల్లి గ్రామంలో  12 లక్షల రూపాయలు వెచ్చించి బోరు తీసి ఒక మంచినీటి ట్యాంక్ నిర్మించారు కానీ ట్యాంకులో ఒక్క బొట్టు మంచినీరు పడలేదు 12 లక్షలు అప్పనంగా కాంట్రాక్టు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మింగేశారు. 

ఈ విషయంపై ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారి అయిన జగదీష్ గారిని వివరణ కోరితే సంబంధంలేని కారణాలు చెప్పి తప్పించుకున్నారు మిగిలిన గ్రామాలలో కూడా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ఉన్నత అధికారులు జోక్యం చేసుకోకపోవడం వల్ల ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఆగడాలకు అంతులేకుండా పోయిందనీ అన్నారు. మంచి నీటి సమస్యపై పంచాయతీ కార్యదర్శులకు సర్పంచులకు రిపోర్టు చేస్తే తము పంచాయతీ తీర్మానాలు పెట్టిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులను నుండి సరైన స్పందన ఉండదని  ఎస్టిమేషన్ వేసే విషయంలో అలాగే చేసిన పనికి నిధులు  మంజూరు చేసే విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతుంది. గోమంగి గ్రామంలో 100 నుండి 150 గిరిజన కుటుంబాలకు  గ్రావిటీ నీళ్లే గతి గ్రావిటీ  ద్వారా వస్తున్న చుక్క చుక్క నీళ్ల కోసం గంటల తరబడి వేచి చూడాలి అది కూడా ఏ సమయంలో వస్తుందో తెలియని పరిస్థితి నీళ్లు రాకపోతే  ప్రతిసారి స్థానిక గ్రామస్తులే వెళ్లి చిన్నచిన్న మరమత్తులు చేసుకుని జీవిస్తున్నారు గ్రావిటీ నుండి నీళ్లు రాకపోతే ప్రత్యామ్నాయంగా మంచినీటి బావి గాని ఊట గడ్డ లు గాని బోర్వెల్ గాని అందుబాటులో లేకపోవడం వల్ల  గత్యంతరం లేక  గడ్డ నుండి కలుషితమైన బురద నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని దీని ఫలితంగా ప్రస్తుతానికి ప్రతి ఒక్క ఇంట్లో సీజనల్ వాంతులు విరోచనాలు చలి జ్వరం తలనొప్పి అనేక వైరస్ లకు గురవుతున్నారని మండిపడ్డారు.  ఇప్పటికైనా నిధులు దుర్వినియోగం చేయకుండా ఆయా గ్రామ పంచాయతీల ప్రజలకు ఉపయోగపడే విధంగా నిధులు ఖర్చు పెట్టి త్రాగు నీటిని అందించాలని  గోమంగి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇంటింటికి వెళ్లి వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, సురక్షిత మంచినీరు గ్రామంలో ఉన్న ప్రజలందరికీ పుష్కలంగా అందే విధంగా చర్యలు తీసుకోవాలని మంచినీళ్లు  అందిస్తున్నామనే ఉద్దేశంతో నిధులను దుర్వినియోగంపరుస్తూ జేబులు నింపుకుంటున్నా సంబంధిత అధికారులపై చర్యలు తక్షణమే తీసుకోవాలని. మంచినీళ్ల సమస్య వెంటనే పరిష్కారం చేయకుండా అలసత్వం చేస్తున్న సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులను విధుల నుండి వెంటనే తొలగించాలని లేనిపక్షంలో అధికారులు ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ పెద్ద ఎత్తున పోరాటం చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి  కొమ్మ పృథ్వీరాజు గిరిజన సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి కూడా రాధాకృష్ణ గోమంగి   శేఖర్ రుంజాల జయ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

ఏజెన్సీలో మొక్కుబడిగా నడుస్తున్న అంగన్ వాడి కేంద్రాలు.

ఏజెన్సీలో  మొక్కుబడిగా నడుస్తున్న అంగన్ వాడి కేంద్రాలు.


గిరిజన పిల్లలకు  కల్లిపోయిన గుడ్లు పంపిణీ. 

అంగన్వాడి కేంద్రాలపై  కొరవడిన పర్యవేక్షణ.

విశాఖపట్నం, పెన్ పవర్ 

 విశాఖ ఏజెన్సీలో అంగన్ వాడి కేంద్రాలు మొక్కుబడిగా నడుస్తున్నాయి. కేంద్రాల ద్వారా గిరిజన పిల్లలకు అందించాల్సిన పౌష్టికాహారం సక్రమంగా అందడం లేదని తల్లిదండ్రులు  ఆరోపిస్తున్నారు. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో అంగన్ వాడి కేంద్రాలు తూతూ మంత్రంగా నడుస్తున్నాయి. గిరిజనులకు అందాల్సిన పౌష్టిక ఆహార పదార్థాలు  మొక్కుబడిగ  ఇస్తున్నారని ఆరోపణలు బాహటంగా వినిపిస్తున్నాయి.  గిరిజన చిన్నారులకు  గర్భిణీలు బాలింతలకు  నిబంధనల ప్రకారం అందించాల్సిన  కోడిగుడ్లు పాలు  గోధుమపిండి  చెనగ చెక్కులు  ఎండు ఖర్జూరం   బియ్యం నూనె పప్పులు పంపిణీ  సక్రమంగా లేదని  గిరిజన మహిళలు  గిరిజన సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీలోని 11 మండలాల్లో ఐసిడిఎస్ ప్రాజెక్టు కేంద్రాలు ఉన్నప్పటికీ ప్రాజెక్ట్ అధికారులు మాత్రం పట్టణాలనుంచి అడపాదడపా వచ్చి పోతున్నట్లు సమాచారం. అధికారి రాలేదని ఎవరైనా ప్రశ్నిస్తే మీటింగ్ కు వెళ్లారన్న  సమాధానం కార్యాలయ సిబ్బంది నుంచి వస్తున్నది.  ఇక  సిబ్బంది  విధులు చెప్పనవసరం లేదు.పర్యాటక కేంద్రం ఐన అరకు ఐసిడిఎస్ ప్రాజెక్టు ప్రత్యేక నిదర్శనం. అంగన్ వాడీ కేంద్రాల పనితీరు వర్ణనాతీతం. వర్రా గ్రామ అంగన్ వాడీ కేంద్రం లో గిరిజన చిన్నారులకు కుల్లిన కోడి గుడ్లుని కార్యకర్త పంపిణీ  చేసిందని తల్లులు ఆరోపించారు. పీఓ పట్టించుకోక పోవడం వలన కార్యకర్త లు ఇష్టానుసారం గా తెరుస్తున్నరని మండి పడుతున్నారు. కుల్లిన గుడ్లు పంపిణీ పై అరకు ఐసిడిఎస్ పీఓని వివరణ  కోరేందుకు ప్రయత్నించగా ఆమే అందుబాటులో లేరు.

విశాఖ కెజిహెచ్ క్యాంటీన్ వద్ద కానరాని కోవిడ్ నిబంధనలు.

 విశాఖ కెజిహెచ్ క్యాంటీన్ వద్ద కానరాని కోవిడ్ నిబంధనలు.

                                                                                      నగరంలో పిట్టల్లా రాలిపోతున్న కరోనా రోగులు

 పట్టించుకోని కేజిహెచ్ యాజమాన్యం.

విశాఖపట్నం,పెన్ పవర్,

విశాఖ నగరంలో పెద్దాస్పత్రి కేజీహెచ్ క్యాంటీన్ వద్ద కరోనా నిబంధనలు పాటించడంలేదు. క్యాంటీన్లో  భోజనం టీ టిఫిన్ కోసం ప్రజలు ఎగబడుతున్నారు. కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తూ ప్రాణాలను హరించి వేస్తుంటే  ప్రజలకు చీమ కుట్టినట్లయినా లేదని    ఆక్షేపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే బుధవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత క్యాంటీన్ వద్ద జనం రద్దీ ఎక్కువయింది. తోపులాటలు ఒకరిపై ఒకరు ఢీ కొంటూ  ఆహార పదార్థాలకు ఎగబడ్డారు. జనం గుంపుగా  కుమ్ము లాడు  కుంటున్న   క్యాంటీన్ నిర్వాహకులు గాని  ఆస్పత్రి యాజమాన్యం గానీ  పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉంది. నగరంలో కరోనా కేసులు గంట గంటకు పెరిగిపోతున్నాయి మరోపక్క మరణాల సంఖ్య విస్మయాన్ని కలిగిస్తోంది. ఇంత జరుగుతున్నా  జనంలో మాత్రం చలనం లేదు. భయం కనిపించలేదు. కాంటీన్ లో  ఆసుపత్రికి వచ్చిన జనం కిక్కిరిసి పోవడం చూస్తుంటే  కరోనా మహమ్మారి  కోరలు చాస్తుందని  అంటున్నారు.


కేసులు పెరుగుతున్న దృష్ట్యా  ప్రభుత్వం మధ్యాహ్నం పన్నెండు తర్వాత  తెల్లవారు 6  వరకు  బుధవారం నుంచి కర్ఫ్యూ విధించినా విషయం తెలిసిందే. ఒకపక్క కర్ఫ్యూ అమలులో ఉన్నా కేజీహెచ్ ఆస్పత్రి వద్ద  మరియు క్యాంటీన్ లో  జనాలు నిబంధనలకు విరుద్ధంగా ఎగబడటం పై  ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండో దశ కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో  క్యాంటీన్ వద్ద జనం తోపులాటలు  అవసరమా అని ప్రత్యక్షంగా  సాక్షి అరకు వైయస్సార్ సిపి నాయకుడు   జీవన్ కుమార్   ఆగ్రహం వ్యక్తం చేశారు.  కేజీహెచ్ అధికారులు పోలీసులు చొరవ తీసుకోవాలని లేనిపక్షంలో భోజనం క్యాంటీన్   కరోనా క్యాంటీన్ గా  పోతుందని జీవన్ కుమార్ అన్నారు.

సింహాచల ఉద్యోగులకు వ్యాక్సినేషన్

 సింహాచల ఉద్యోగులకు వ్యాక్సినేషన్

విశాఖపట్నం సింహాచలం 


శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి ఆలయ ధర్మకర్త సంచయిత గజపతి సహా ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్. ఆలయ ధర్మకర్త సంచయిత గజపతి సలహామేరకు ఈ ఓ సూర్యకళ ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ వేయించాలని ఆదేశించారు. దీంతో తొలిరోజు 150 మందికి వ్యాక్సినేషన్ వేయించారు ఆలయ ఉద్యోగులందర్నీ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టారు.

మే 6 సమ్మె వాయిదా

 మే 6 సమ్మె వాయిదా 


విశాఖపట్నం, పెన్ పవర్

స్టీల్ కార్మికులకు వేతన ఒప్పందం కోసం మే 6 న తలపెట్టిన సమ్మెను వాయిదా వేస్తున్నామని స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాలు తెలియజేశాయి ఈరోజు స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ పర్సనల్ కె.సి.దాస్ కలిసి ఆయన కార్యాలయంలో సమ్మె వాయిదా వేస్తున్న వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాలు ప్రతినిధులు మాట్లాడుతూ దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రజలకు ఆక్సిజన్ అందిస్తున్న మహోన్నత కార్యక్రమాల్లో స్టీల్ కార్మికవర్గం ఉందని వారన్నారు. నూతన వేతన ఒప్పందం కోసం సమ్మె చేయవలసిన పరిస్థితులు ఉన్నప్పటికీ  ప్రజలను కాపాడాలన్న ఆశయానికి కట్టుబడి సమ్మెను వాయిదా వేస్తున్నామని వారు వివరించారు. ఇప్పటికైనా స్టీల్ యాజమాన్యం కార్మికులకు న్యాయంగా సంక్రమించాల్సిన వేతన ఒప్పందాన్ని చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో స్టీల్ గుర్తింపు యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు,అయోధ్య రామ్,వైటి దాస్, స్టీల్ ఎన్.జె.సి.ఏస్,సభ్యులు డి.ఆదినారాయణ,నాయకులు కె.సత్యనారాయణ, దొమ్మేటి అప్పారావు,పిట్ట రెడ్డి,కె.సత్య రావు,డి.సురేష్ బాబు,వి.రామ్ మోహన్ కుమార్,ఎన్.కృష్ణా రావు, వి.శ్రీనివాస్,వి.రామ్ కుమార్, మహాలక్ష్మి నాయుడు, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.

వాలంటీర్లకు వందనం

  వాలంటీర్లకు వందనం


కరోనా సేవలలో మేము సైతం అంటున్న వాలంటీర్లు

కోవిడ్ సేవలలో మహిళా వాలంటీర్లు ముందంజ

మగవారికి దీటుగా సేవలకు సిద్ధం

ప్రజల మన్ననలు పొందుతున్న గ్రామ వాలంటీర్లు

గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్,


గుమ్మలక్ష్మీపురం పంచాయతీలో గ్రామ వాలంటీర్లు కోవిడ్ సేవల్లో నిమగ్నమయ్యారు. కోవిడ్ రెండవ దశ ప్రజల జీవితంపై తన పంజా విసురుతున్నప్పటికి వాలంటీర్లు మాత్రం కోవిడ్ కు భయపడకుండా వారి సేవలను ముమ్మరం చేసారు.గుమ్మలక్ష్మీపురం పంచాయతీ లోని పలువీధుల్లో కోవిడ్ బారిన పడిన బాధితులకు మేమున్నమే భరోసా కల్పిస్తూ ఆ బాధితుల నుండి వైరస్ వ్యాప్తి ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు పాటిస్తు పారిశుద్యం పై దృష్టి సారిస్తున్నారు. కోవిడ్ బాధితుల పరిసర ప్రాంతాల్లో హైపో క్లోరైడ్ ద్రావనాలను పిచికారీ చేయడంతో పాటు డిస్ ఇన్ఫెక్షన్ పౌడర్లను జల్లుతున్నారు. గుమ్మలక్ష్మీపురం సచివాలయంలో  గ్రామ వాలంటీర్లు 25మంది తో పాటుగా 10మంది సచివాలయ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ 35మందిలో 19మంది మహిళలు 16మంది పురుషులు కోవిడ్ విధుల్లో పాల్గొంటున్నారు. ఈ పంచాయతీలోని మగవారితో సమానంగా మహిళ వాలంటీర్లు,ఉద్యోగులు కోవిడ్ సేవల్లో ఎండనక వాననక ముందంజలో ఉంటూ గ్రామ ప్రజల మన్ననలు పొందుతున్నారు.గ్రామంలో ఎక్కడ పాజిటివ్ కేసులు నమోదైన తక్షణమే అక్కడకు చేరుకుని పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతూ హైపో క్లోరైడ్ ద్రావనాలను పిచికారీ చేస్తూ కోవిడ్ వ్యాప్తిని అరికట్టే చర్యలను చేపడుతున్నారు.గుమ్మలక్ష్మీపురం గ్రామ సచివాలయంలో వాలంటీర్లతో పాటుగా సచివాలయ సిబ్బంది కూడా వారి విధులను ముగించుకుని వాలంటీర్లతో పాటుగా పారిశుధ్య కార్యక్రమాల్లో పాల్గొవడంతో గ్రామ ప్రజలు వారి యొక్క విధినిర్వహనలను కొనియాడుతున్నారు.గుమ్మలక్ష్మీపురం గ్రామ సర్పంచ్ బొత్తాడ. గౌరీశంకర్ సూచనల మేరకు మేమందరం మా విధులను నిర్వహించడానికి  సిద్ధంగా ఉన్నామని కరోనా కష్టకాలంలో మేము ఎంత సేవచేయడానికైన వెనుకాడమని కానీ గ్రామంలో ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులను ధరించి కరోనా వ్యాప్తిని అరికట్టడానికి సహకరించాలని కోరారు.

కరోనా తో వార్డు కౌన్సిలర్ మృతి

 కరోనా తో  వార్డు కౌన్సిలర్ మృతి

పెన్ పవర్, కొవ్వూరు

కొవ్వూరు మున్సిపల్ కార్పొరేషన్ 23 వ వార్డు కౌన్సిలర్  మురికొండ రమేష్ కరోనాతో మృతిచెందారు. రమేష్ మృతికి మన గౌరవ మంత్రివర్యులు తానేటి వనిత తన ప్రగాఢ సంతాపం తెలియచేసారు. కొవ్వూరు మున్సిపాలిటీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని  ఏర్పరచుకుని ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ తనదైన శైలిలో సేవ చేస్తూ ఎంతో పేరు తెచ్చుకున్నారు. మున్సిపల్ కార్పోరేషన్ వార్డు కౌన్సిలర్ మృతికి చైర్మన్ భావనా రత్నకుమారి తో పాటు కౌన్సిలర్లు కూడా తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.

పోచవరంలో సేంద్రియ ఎరువుల తయారీ

పోచవరంలో సేంద్రియ ఎరువుల తయారీ

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడి మండలం పోచవరం పంచాయతీ పరిధిలో యస్డబ్ల్యుపిసి నందు సచివాలయ కార్యదర్శి యస్.ఎం.రఫీ వూల్లా ఆధ్వర్యంలో పేడ నుంచి వానపాములనుపయోగించి సేంద్రియ ఎరువుల తయారీ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విఏఏ భార్గవ్ సాయి, ఏహెచ్ఏ వి.సాయిరామ్ పాల్గొన్నారు.

కరోనా తో పోరాడి ఓడిన మీ సేవ సత్యనారాయణ

 కరోనా తో పోరాడి ఓడిన మీ సేవ సత్యనారాయణ

 పెన్ పవర్, ఆత్రేయపురం 

 ఆత్రేయపురం గ్రామంలో కరోనా  మహమ్మారి మరణ మృదంగం గంటలు మోగుతున్నాయి  ఒకపక్క కరోనాబారిన పడిన వారు కోరుకుంటుంటే మరోపక్క కరోనా బారిన పడిన  తట్టుకోలేక మృతి చెందుతున్నారు ఈరోజు ఆత్రేయపురం మీసేవ కేంద్రం నిర్వహిస్తున్న కాజులూరు రమా సత్యనారాయణ (42)  కరోనా పాజిటివ్ వచ్చినది ఆయన కొద్ది రోజులుగా రాజమహేంద్రవరం ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు  ఆయన మృతి పట్ల ఆత్రేయపురం మండలం మీ సేవ కేంద్రాల నిర్వాహకులు సంతాపం వ్యక్తం చేశారు.

అక్రమంగా మద్యం అమ్మినా, తయారుచేసిన కఠిన చర్యలు

అక్రమంగా మద్యం అమ్మినా, తయారుచేసిన కఠిన చర్యలు

పోలవరం, పెన్ పవర్

పోలవరం ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ మరియు తమ సిబ్బంది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏలూరు వారి అదేశాలమేరకు తనిఖీల్లో భాగంగా మంగళవారం ఎర్లీ మార్నింగ్ గోపాలపురం మండలం వెంకటాయపాలెంలో 35 లీటర్ల నాటుసారా పట్టుకోవడం జరిగింది. సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ రైడింగ్ లో భాగంగా ఒక గ్లామర్ బైక్ పట్టుబడినట్లు, మరియు ఒక వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇతను దేవరపల్లి మండలం కృష్ణంపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి గా గుర్తించడం జరిగిందని అన్నారు. మరియు కృష్ణంపాలెం నుండి వెంకటాయపాలెం కు నాటుసారా తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలియజేశారు.

అను అక్షయ కార్యక్రమాన్ని స్థాపించి నేటి రెండు సంవత్సరాలు

 అను అక్షయ కార్యక్రమాన్ని స్థాపించి నేటి రెండు సంవత్సరాలు

పెన్ పవర్, ఆత్రేయపురం 

 ర్యాలీ  గ్రామంలో  అనుష్  స్వచ్ఛంద  సంస్థ ఆధ్వర్యంలో పేదవారి ఆకలి తీర్చాలని ఉద్దేశంతో       అను అక్షయ కార్యక్రమాన్ని  ప్రారంభించి నేటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు మోహిత్ మాట్లాడుతూ  కరోనా అరికట్టాలంటే అందరూ దూరం పాటించాలని ఇది సులువుగా పాటించాలంటే గొడుగులు ఉపయోగించడం ద్వారా  సాధ్యమవుతుందని కాబట్టి హరీష్ జీవన్ లక్ష్మి ల  సమకూర్చిన గొడుగులు చాపలు పేదలకు పారిశుద్ధ్య కార్మికులకు పంపిణీ చేశామని అలాగే అరుణ్ కుమార్ సమకూర్చిన భోజనం పొట్లాలు ఎనర్జీ డ్రింకులను కరోనా ప్రజలకు సోకాకుండా నిత్యం పోరాడుతున్న ర్యాలీ  16 మంది పారిశుద్ధ్య కార్మికులకు 30మంది పేద ప్రజలకు ప్రభుత్వ ఆదేశాలను కరోనా  నిబంధనలు పాటిస్తూ పంపిణీ చేశారు.

సెక్రెటరీ రఫీ ఆధ్వర్యంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం

 సెక్రెటరీ రఫీ ఆధ్వర్యంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడి మండలం పోచవరం పంచాయతీ పరిధిలో జగనన్న స్వచ్ఛ సంకల్పం 100 రోజుల సన్నాహక కార్యక్రమాలలో భాగంగా సచివాలయ కార్యదర్శి ఎస్. ఎం.రఫీ వూల్లా ఆధ్వర్యంలో మే 1 నుండి 14 వరకు గ్రామంలో పారిశుద్ధ్యం పై ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు చేపట్టారు. దానితోపాటు కోవిడ్ 19 భద్రత, నివారణ అవగాహనా కార్యక్రమాలు జరిపిస్తున్నారు. నీటి సరఫరా, పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పోచవరం పంచాయతీ కార్యదర్శి రఫీ కోవిడ్ నియంత్రణ నిబంధనలు అన్ని విధాలుగా అమలు చేయడం జరుగుతుంది.

తాడిపూడిలో కోవిడ్ దృష్ట్యా పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం

 తాడిపూడిలో కోవిడ్ దృష్ట్యా పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామంలో సర్పంచ్ నామా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కోవిడ్  దృష్ట్యా గత నెల రోజుల నుండి గ్రామంలో అనేక పనులు చేపట్టారు. గ్రామములో బ్లీచింగ్ చల్లించడం, ఇంటింటికి హైపో క్లోరైడ్ స్ప్రే చేయించడం జరిగింది. మంగళవారం నాడు గ్రామమంతా మరోసారి హైపో క్లోరైడ్ స్ప్రే చేయించారు. మరియు మంచినీటి ట్యాoకులను శుభ్రం చేయించడం, డ్రైనేజీల్లో పూడికతీత  వంటి పనులు ముమ్మరం చేశారు. ఎప్పటికప్పుడు కోవిడ్ పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  పంచాయతీ సెక్రెటరీలు దగ్గు చంద్రశేఖర్, బదిరెడ్డి భీమేశ్వరరావు, విఆర్వో ఎం.ప్రకాష్ ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

సర్పంచ్ గారికి గ్రామ ప్రజల మనవి..

 సర్పంచ్ గారికి గ్రామ ప్రజల మనవి..

గతం లో మాజీ సర్పంచ్ లు చేసిన పొరపాట్లు మీరు చెయ్యద్దు
మీ పై పెట్టుకున్న ఆశలు నిజం చేయండి,
పంచాయితి ని అబివృద్ది పదం లో నడిపించండి
కురుపాం,  పెన్ పవర్ 

మండలం లోని అన్ని పంచాయితి లలో పెద్ద పంచాయితి కురుపాం పేరుకే మేజర్ పంచాయితి అబివృద్ది లో మాత్రం చిన్న పంచాయితి,అయితే  జరిగిన పంచాయితి ఎన్నికల్లో సర్పంచ్ గా డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి బలపరిచిన అబ్యర్ది గార్ల సుజాత గెలుపొందారు, ఆమె చదువుకున్న వ్యక్తి యువ వయస్సు కలవారు కావడం తో పంచాయితి ప్రజలు ఆమె పై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు, కాగా గతం లో కురుపాం మేజర్ పంచాయితి మాజీ సర్పంచ్ లు తీవ్ర నిరాశ కు గురిచేశారు,దీనితో అభిమానులు కార్యకర్తలు ఇమే పై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు,గెలిచిన తరవాత ఇమే ఇంత వరుకు ప్రజల్లోకి కానీ కోవిడ్ కష్టకాలం లో పంచాయితి పారిశుద్ధ్య పనులు పర్యవేక్షన గాని , లాక్ డౌన్ లాంటి నిర్ణయాల్లో భాగస్వామ్యం కానీ లేదు,ఎలాంటి కారణాలతో ఆమె చురుగ్గా లేరో తెలియదు కాని ఇక ముందు చురుగ్గా ఉండాలని ఆమె పంచాయితి కి ఫలానా సమస్య లేదా ఫలానా నిధులు కావాలి అంటే క్షణాల్లో తగిన చర్యలు తీసుకునే డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ఉన్నారు కావున, వినియోగించుకోవాలని పంచాయితి అబివృద్ది తమతోనే సాధ్యం అయ్యేలా చూడాలని పంచాయితి ప్రజలు కోరుతున్నారు,గ్రామానికి ప్రధమ  పౌరరాలు కావున కోవిడ్ కష్ట కాలం లో పక్కా ప్రణాళిక ఏర్పరచుకొని అధికారులు తో కలిసి చురుగ్గా పంచాయితి లో కోవిడ్ కేసులు పెరగకుండా చర్యలు ప్రారంభించాలని ,హైపోక్లోరైట్  లాంటివి గ్రామంలో పిచికారీ చేయించి పారాశుద్య పనులు చురుగ్గా సాగెలా ఆదేశాలు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు.

డుంబ్రిగుడ మండల జెడ్పీటీసీ అభ్యర్థి ఆకస్మిక మృతి

 డుంబ్రిగుడ మండల జెడ్పీటీసీ అభ్యర్థి ఆకస్మిక మృతి 

అరకు, పెన్ పవర్

అరకు వేలి నియోజకవర్గం డుంబ్రిగుడ మండలం కాంగ్రెస్ పార్టీ జెడ్.పి.టి.సి,అభ్యర్థి కొర్ర రుక్మిణి గుండెపోటు తో మంగళవారం అకస్మాత్తుగ మృతి చెందారు ఆమె భౌతిక కాయాన్ని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అరకు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పాచిపెంట శాంతకుమారి సందర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు పార్టీ నుండి వారికి ఎటువంటి సాయం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటామని తెలియజేశారు.అరకు వేలి మండలం ప్రెసిడెంట్ సోమెలి సన్యాసిరావు మండల నాయకుడు పాచిపెంట చిన్నస్వామి హుకుంపేట జెడ్పిటిసి అభ్యర్థి,గలుగు బోయిన కోటేశ్వరరావు, డుంబ్రిగుడ మండల కార్యదర్శి బిమరావు,కె హరిష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఆమెతో ఉన్నారు.

మంత్రి వనిత కు కృతజ్ఞతలు తెలిపిన వైసిపి పెద్దేవం

 మంత్రి వనిత కు కృతజ్ఞతలు తెలిపిన వైసిపి పెద్దేవం 

తాళ్లపూడి, పెన్ పవర్

వైయస్సార్సీపీ పెద్దేవం బూత్ కన్వీనర్ వేము రామారావు కరోనా తో బాధపడుతున్నప్పుడు విషయం తెలుసుకున్న  వైయస్సార్సీపీ జిల్లా కార్యదర్శి తోట రామకృష్ణ   రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత కు ఈ విషయం తెలియజేశారు. వెంటనే మంత్రి వనిత  స్పందించి రాజమండ్రి గవర్నమెంట్  హాస్పిటల్ లో బెడ్ ఇప్పించి సకాలంలో వైద్యం అందేలా  చూసారు. వేము రామారావు మాట్లాడుతూ మంత్రి వనిత ఆదేశాలమేరకు హాస్పిటల్ సూపరింటెండెంట్ తో అనుక్షణం ఫోన్ మాట్లాడుతూ, నాకు ఇంజెక్షన్లు కోర్స్ పూర్తి అయ్యేలాగా డాక్టర్ల తో మంత్రి వారి అడిషనల్ పియస్ మహాలక్ష్మి కుమార్   మాట్లాడారు. అలాగే మన ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోన పట్ల చేస్తున్న కృషి గవర్నమెంట్ హాస్పిటల్ లో చాలా బాగుంది అని అన్నారు. ఎవరు అపోహలు నమ్మవద్దు అని,హాస్పిటల్ లో ఇంజక్షన్ ల కొరత లేదు అని, అన్ని సదుపాయాలు చాలా బాగున్నాయి అని, అందుకు గాను నేను  సోమవారం నాడు కరోనా నుంచి కోలుకుని  ఇంటికి చేరుకున్నాను అని అన్నారు. నా వైద్యానికి సహాయం అందించిన  మంత్రి తానేటి వనిత కి, మంత్రి వారి అడిషనల్ పియస్ మహాలక్ష్మి కుమార్ కి,  వైయస్సార్సీపీ జిల్లా కార్యదర్శి  తోట రామకృష్ణ కి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అని తెలియజేశారు. అలాగే గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,14 రోజులు నా దగ్గర కి రావద్దు అని, నా  ఆరోగ్యం బాగుంది అని తెలియచేశారు.

కరోనా రోగుల పట్ల అమానుషం

 కరోనా రోగుల పట్ల అమానుషం

రాజమహేంద్రవరం, పెన్ పవర్

రాజమహేంద్రవరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో, ప్రైవేటు ఆసుపత్రులలో కరోనా మృతుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్న వారిపై తక్షణం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సిపిఐ నగర కార్యదర్శి నల్లా రామారావు డిమాండ్ చేశారు.ఈ మేరకు సోమవారం సాయంత్రం ఆయన ఒక ప్రకటనలో కరోనా రోగుల పట్ల ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని,కనీసం ప్రజలకు పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ చేయించ లేకపోవడం విచారకరమని, కరోనా రెండవ దశలో కరోనా సోకిన వారికి సరైన వైద్య సదుపాయాలు అందడం లేదని, కరోనా మెడిసిన్ కిట్లు కూడా ఎక్కడా ఎవరికీ ఇవ్వడం లేదన్నారు. ప్రజల ప్రాణాలను గాలికి వదిలేశారని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాల వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థల ఉనికి కూడా ప్రస్తుతం కనబడటం లేదన్నారు.ఆశా వర్కర్లు, ప్రభుత్వ వ్యవస్థను, యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించి ప్రజలకు సేవలు సకాలంలో అందేలా చూడాలని, వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదని, అందుకే రోగులను అరబయటే వదిలేస్తున్నారని, అదేవిధంగా మృత దేహాలను సైతం ఎటువంటి ప్రోటోకాల్ అనుసరించకూడా ఎక్కడ పడితే అక్కడ ఉంచేయడం సమంజసం కాదన్నారు. డాక్టర్లు కొరత ఉన్నందున తక్షణం యుద్ధ ప్రాతిపదికన డాక్టర్లను, సిబ్బందిని నియమించాలని, అదేవిధంగా ప్రైవేటు ఆసుపత్రులలో కరోనా వైద్యానికి చార్జీలను నిర్ణయించి వాటిని అమలయ్యే విధంగా చూడాలని డిమాండ్ చేశారు.

ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ ని అరికట్టండి

ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ ని అరికట్టండి

రాజమహేంద్రవరం, పెన్ పవర్

రాజమహేంద్రవరం నగరంలో కోవిడ్ వ్యాధి అత్యవసర పరిస్థితిని ఆసరా చేసుకుని ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా ప్రజలను దోచుకుంటున్నాయని సి.పి.ఎం జిల్లా కమిటీ విమర్శించింది. ఈ మేరకు సి.పి.ఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ ఒక ప్రకటన ద్వారా జిల్లా అధికార యంత్రాంగాన్ని ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీని అరికట్టాలని కోరారు.ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కాకుండా లక్షల్లో దండుకుంటున్నారని, పైగా రెమిడేసిఫర్ ఇంజెక్షన్ రోగులు తెచ్చుకోవాలని తమకు సంబంధం లేదని తిప్పడం ఆ తరువాత బ్లాక్ లో లక్షలు గుంజటం ప్రైవేట్ ఆస్పత్రుల వ్యాపారంగా మారిందని మండిపడ్డారు.ప్రజలను ఆదుకోవాల్సిన ప్రైవేట్ వైద్యరంగం ఇలాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి ని సొమ్ము చేసుకోవడం దుర్మార్గమని నగరంలో ఉన్న ప్రజా ప్రతినిధులు,అన్ని రాజకీయ పార్టీల నాయకులు దీనిపై స్పందించాలని అరుణ్ కోరారు.అఖిల పక్ష పార్టీలు,సంస్థల సమావేశం జరిపి ఈ పరిస్థితి ని అధిగమించడానికి చర్యలు చేపట్టాలని కోరారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...