Followers

అధికారం చేపట్టి అతి స్వల్ప కాలంలోనే ప్రజల మన్నలను పొందాం

 అధికారం చేపట్టి అతి స్వల్ప కాలంలోనే ప్రజల మన్నలను పొందాం

పెన్ పవర్,ఆలమూరు 

    వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పది వసంతాలు పూర్తిచేసుకుని ఈ రోజు (మార్చి 12వ తేదీ)న 11వ సంవత్సరంలోకి అడుగు పెట్టి అతి స్వల్ప కాలంలోనే ప్రజల మన్నలను పొందామని  కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తమ్మన శ్రీనివాస్ అన్నారు. మండల పరిధి లో చెముడులంక, ఆలమూరు, మడికి  గ్రామాల్లో గల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం  పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తమ్మన మాట్లాడుతూ జననేత  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో మన పార్టీ గడచిన పదేళ్ళలో ఎన్నో సవాళ్ళను అధిగమించి సంపూర్ణ ప్రజా బలంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, అధికారం చేపట్టిన 20 నెలల అతి స్వల్ప కాలంలోనే పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల్లో 90 శాతాన్ని మన పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్  జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసి దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా నిలిచారన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన వాటినే కాకుండా చెప్పని వాటిని కూడా  ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ అమలు పరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో మరింత గౌరవాన్ని పెంచుతూ నాయకులు కార్యకర్తలు గర్వంగా తలెత్తుకు తిరిగేలా తిరుగులేని పాలన అందిస్తున్నారని అన్నారు. అందుకు తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలే తగిన ఉదాహరణ అని  మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం పునరావృతం అవుతుందన్న వాస్తవం మీ అందరికీ తెలిసిందేనని హర్షం వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండలంలోని అన్ని గ్రామాల  ప్రజలంతా కలిసి ఒక పండుగలా జరుపుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అనంతరం  వృద్ధులకు నూతన వస్త్రాలతో పాటు పండ్లును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పడమటి రాంబాబు, మల్లెమొగ్గలు చిన్న, రావుల దుర్గాప్రసాద్, కంచుమర్తి బాబులు, పాల్గొన్నారు.   అలాగే చొప్పెల్ల గ్రామంలో తోరాటి లక్ష్మణ్రావు ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

రాష్ట్ర చరిత్రకు శ్రీకారం చుట్టిన రోజు

 రాష్ట్ర చరిత్రకు శ్రీకారం చుట్టిన రోజు

పెన్ పవర్,తాడేపల్లిగూడెం

రాష్ట్ర చరిత్రకు,రాష్ట్ర అభివృద్ధికి శ్రీకారం చుట్టిన రోజని స్థానిక శాసన సభ్యులు ప్రభుత్వ పథకాల హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ అన్నారు.తాడేపల్లిగూడెంలోని  వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి జెండాను ఎగురవేసి,వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రని మలుపుతిప్పిన సుదినం ఈ రోజు అని, పార్టీ స్థాపించి 10 వసంతాలు పూర్తిచేసుకున్న ఈ రోజు పార్టీ శ్రేణులకు పండుగరోజు అని అన్నారు.రాష్ట్ర ప్రజల అసలు,ఆశయాలకు జీవం పోసేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేసి పార్టీని ప్రజల మనస్సుల్లో నిలబెట్టారని అన్నారు.

ప్రజాసంక్షేమం కోసం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఏర్పడిన పార్టీ వైయస్సార్ పార్టీ అన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఇంటికి తీసుకొచ్చి అందిస్తున్నామని అన్నారు.యువనేత కొట్టు విశాల్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా యువతకు ఉద్యోగాలు కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు.11వసంతంలోకి అడుగుపెడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో మరిన్ని పథకాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు.స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమమంలో వైస్సార్సీపీ యువనేత కొట్టు విశాల్,కర్రీ భాస్కరరావు,గుండుబోగుల నాగు,ముప్పిడి సంపత్ కుమార్,తెన్నేటి జగజీవన్,సింగం సుబ్బారావు,గుండెమొగుల బలుసులు,మండా  పద్మావతి,బొలెం రామలక్ష్మి,శెట్టి రమాదేవి,ముద్రగడ లలిత,నీలం నాగ భూషనం,బొడ్డు సాయిబాబా,నలిమిల్లి అంజిరెడ్డి,కాకర్ల శ్రీనివాస్,తాళ్లూరి మురళి,పత్సమట్ల సావిత్రి,కొవ్వూరి భాస్కర్ రెడ్డి చింతా శ్రీనివాస్,గురజాడ బ్రహ్మాజీ,కట్టుబోయిన కృష్ణ ప్రసాద్,పాలకోడేటి సురేష్,సిర్రాపు శాంత కుమార్,వీర్ల గోవింద్,చింతకాయల సత్యనారాయణ,కొలుకులూరి ధర్మరాజు,శిరిగినీడి విజయకృష్ణ,వట్టి బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

రావులపాలెంలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవం

 రావులపాలెంలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవం

పెన్ పవర్,రావులపాలెం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం రావులపాలెంలో కొత్తపేట ఎమ్మెల్యే, ఏపి పియూసి ఛైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పార్టీ శ్రేణులతో కలిసి ఊబలంక ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న కోవిడ్ వాక్సినేషన్ వేస్తున్న తీరును పరిశీలించారు. అనంతరం రావులపాలెం వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ శ్రేణులకు స్వీట్స్ పంచి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు,రావులపాలెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కర్రి నాగిరెడ్డి, రావులపాలెం ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి, జడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ సాకా ప్రసన్నకుమార్, రావులపాలెం సర్పంచ్ తాడేపల్లి నాగమణి, ముసునూరి వెంకటేశ్వరరావు, దేవరపల్లి సర్పంచ్ దొమ్మేటి అర్జునరావు, పితాని రాంబాబు, మాజీ ఎంపీటీసీ కొండేపూడి రామకృష్ణ, దేవరపల్లి మాజీ సర్పంచ్ గన్నవరపు వెంకటరావు, మాజీ వైస్ ఎంపీపీ దండు వెంకట సుబ్రహ్మణ్యవర్మ, రావులపాలెం వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అక్రమ లేఅవుట్ ను స్వాధీనం చేసుకున్న మునిసిపాలిటీ అధికారులు

 అక్రమ లేఅవుట్ ను స్వాధీనం చేసుకున్న మునిసిపాలిటీ అధికారులు                   

  పెన్ పవర్, కందుకూరు

 పట్టణంలోని ఆనందపురం రోడ్డు, దూబగుంట, విక్కిరాలపేట రోడ్డు, పామూరు రోడ్డు నందలి రెండు అక్రమ లేఅవుట్లు గుర్తించినట్లు మునిసిపాలిటీ అధికారులు తెలిపారు. అయితే వీటిలో దూబగుంట పెట్రోల్ బంక్ తూర్పువైపున అనధికార లే అవుట్ ఇటీవల మునిసిపాలిటీ అధికారులు హద్దు రాళ్లను తొలగించినప్పటికీ లే అవుట్ యజమాని హద్దు రాళ్లను మరల ఏర్పాటు చేయడంతో మున్సిపాలిటీ అధికారులు శుక్రవారం తొలగించి అక్రమ లేఅవుట్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో ఉన్న అనధికార లేఅవుట్ గుర్తించి తొలగిస్తున్నామని నూతనంగా ఎవరు అనధికార లే ఔట్ లను  వేయరాదని మున్సిపల్ కమిషనర్ మనోహర్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. పట్టణ ప్రజలు ఎవరైనా అనధికార లే అవుట్ నందు ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి బిల్డింగ్ నిర్మాణ అనుమతులు కానీ, మున్సిపాలిటీ కల్పించే మౌలిక సదుపాయాలు కానీ కల్పించబడవు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రణాళిక అధికారి వేణు, టౌన్ సర్వేయర్ శ్రీధర్, సచివాలయ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రెవిన్యూ సిబ్బంది పై ఆగ్రహించిన ఎమ్మెల్యే మానుగుంట

 రెవిన్యూ సిబ్బంది పై ఆగ్రహించిన ఎమ్మెల్యే మానుగుంట

పెన్ పవర్,వలేటివారిపాలెం

మండలంలోని చుండి,  అమ్మ పాలెం గ్రామాల్లో రెవిన్యూ భూముల పరిస్థితి సొమ్మోకడిది సోకోకడిది అన్నట్టు ఉంది.  సాధారణంగా తమ భూములను ఆన్ లైన్ చేయించు కోవాలంటే రెవిన్యూ ఆఫీసుల చుట్టూ నెలలు తరబడి తిరిగినా ప్రయోజనం కనిపించదు.  అయితే వలేటివారిపాలెం మండలం లోని చుండి , అమ్మ పాలెం పంచాయితీల్లో మాత్రం సొమ్మోకడిది సోకోకడిది అన్నట్టు కనిపిస్తుంది. భూ యజమానికి తెలియకుండానే ఆన్ లైన్ లో ఎంచక్కా ఎక్కించుకున్నారు.  వివరాల్లోకి వెళితే కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి శుక్రవారం తహశీల్దార్ కార్యాలయంలో ప్రజాసమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా తమ భూములను తమ పేర్లమీద కాకుండా మరొకరి పేరు మీద ఆన్ లైన్ చేసి ఉందని చుండి, అమ్మ పాలెం పంచాయితీల్లో ని పలువురు రైతులు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే  రైతు సమస్యలపై  అధికారులను ఆరా తీశారు. చుండి గ్రామంలో 630 ఆఖరి సర్వే నెంబరైతే, 718-1 సర్వే నెంబర్ ఎలా వచ్చిందని కంప్యూటర్ ఆపరేటర్ పై ఆంగ్రహం వ్యక్తం చేశారు. ఈవిధంగా ఆన్లైన్ ఎలా జరిగిందని ప్రశ్నించారు.  దీంతో  కంప్యూటర్ ఆపరేటర్ నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఎమ్మెల్యే అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు‌.   తహశీల్దార్ సంతకం లేకుండా ఆన్లైన్లో భూములు ఎలా చేస్తున్నారని అన్నారు. రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండా తల్లి, తండ్రి బతికుండగానే పార్టిషన్ లేకుండా మరొక పేరు పై ఎలా ఆన్లైన్ చేస్తారన్నారు. ఒకరి భూమి మరోకరిపై అనువంశికం ఎలా మారుతుందో చెప్పాలన్నారు.   చుండి పంచాయతీ లో  90 ఎకరాల భూమిని ఇతర గ్రామాల్లో ని వ్యక్తులకు ఆన్ లైన్ చేసినట్లు అమ్మ పాలెం వైసీపీ పార్టీ నాయకులు వరికూటి సంజీవరెడ్డి ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి దృష్టికి తెచ్చారు.  నలదలపూరు గ్రామం లో ఎఫ్ ఎల్ ఆర్ రికార్డు ఎందుకు కనబడకుండా పోయిందని ఆ గ్రామ విఆర్ఓ వి ఆర్ ఓ ని ఆరాతీశారు.  పూర్తిస్థాయిలో వివరాలు సేకరించి నలదల పూరు గ్రామ విఆర్ఓ ని  సస్పెండ్ చేయమని తహశీల్దార్ కి చెప్పారు.  లింగసముద్రం మండలం కంటే వలేటివారిపాలెం మండలంలో భారీ స్థాయిలో భూ కుంభకోణం జరిగినట్లు తెలుస్తోందన్నారు.  భూ యజమాని ఒకరైతే ఆన్లైన్లో మరొకరు ఎలా ఉంటున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ తన తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకోక తప్పదని అన్నారు. మండలంలో వందల ఎకరాలు ప్రభుత్వ భూములన తమ ఇష్టం వచ్చినట్లు ఆన్ లైన్ చేసి చాలా రికార్డులు తారు మారు చేశారన్నారు. ఇంత జరుగుతున్నా రెవిన్యూ సిబ్బంది ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కాకుండా చేశారని తెలిపారు.  ప్రభుత్వ భూములను ఆక్రమించి ఆన్లైన్ లోకి ఎక్కించుకున్న వారిపై కేసులు నమోదు చేయాలని తెలిపారు. సోమవారం నాటికి  వచ్చిన ఆన్ లైన్ ఫిర్యాదలకీ సంబంధించిన ఆధారాలను తహశీల్దార్ గారికి అందజేయాలని కంప్యూటర్ ఆపరేటర్ ని చెప్పారు.

నాడు-నేడు నిధులు దుర్వినియోగం చేస్తే క్రిమినల్ కేసులు. ఐటిడిఏ పీఓ వెంకటేశ్వర్

 నాడు-నేడు నిధులు దుర్వినియోగం చేస్తే క్రిమినల్ కేసులు. ఐటిడిఏ పీఓ వెంకటేశ్వర్

పెన్ పవర్,విశాఖపట్నం

 నాడు నేడు నిధులు దుర్వినియోగం చేస్తే క్రిమినల్ కేసులు తప్పవని పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ( ఐ టి డి ఏ) ప్రాజెక్ట్ అధికారి వెంకటేశ్వర్ సలిజామల  హెచ్చరించారు. శుక్రవారం  తమ కార్యాలయంలో ఇంజనీరింగ్  విద్యాశాఖ  ప్రధానోపాధ్యాయులతో సమావేశం  జరిగింది. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో  మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతానికి 105 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని ఆయన తెలిపారు. ఏజెన్సీ 11 మండలాల్లో  మనబడి  నాడు నేడు కార్యక్రమాలు నడుస్తున్నాయి అన్నారు. ప్రభుత్వ  పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు తీసిపోని విధంగా మౌలిక వసతులు  కల్పించనున్నారు. నాడు నేడు పనులు ఏజెన్సీ ప్రాంతంలో నత్తనడక నడుస్తున్నాయి. పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని  ఎన్ని మార్లు హెచ్చరించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిమ్మకు నీరెత్తినట్లు లేదన్నారు. ప్రభుత్వం కేటాయించిన నిధులు సరిపోవని  వాదనలు వినిపిస్తున్నారు అని ప్రభుత్వం అంచనాల మేరకే నిధులు మంజూరు చేశారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో  నాడు నేడు మనబడి కార్యక్రమాలు  త్వరిత గతిన పూర్తి చేయాలని ఆయన కోరారు. నాడు నేడు నిధులు పరిపూర్ణంగా పనులు కేటాయించాలని  లేనిపక్షంలో క్రిమినల్ కేసులకు గురవుతారని ఆయన అన్నారు. గడువు నాటికి నాడు నేడు పనులు పూర్తిచేయాలని పి ఓ ఆదేశించారు.

శివాలయంలో పోటెత్తిన భక్తులు

 శివాలయంలో పోటెత్తిన భక్తులు

 గూడెంకోత్తవీధి,పెన్ పవర్
   మండలంలోని జికేవీధి,ఆర్వీనగర్,మంగళపాలెం శివాలయలలో గురువారం మహాశివరాత్రి సంధర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆర్వీనగర్ లో ఉదయం కందిరీగలు భక్తులకు దాడిచేయడం తో  చింతపల్లి మండలంలోని అంతర్ల శివాలయనికి వెళ్లారు.దేవరాపల్లి పంచాయితీ  మంగళపాలెం గ్రామంలో ఉదయం నుండి భక్తులు పోటెత్తారు .ఆ గ్రామంశివలయనికి వచ్చిన భక్తులకు అన్నసంతర్పణ ప్రసాదం అందించారు. దేవరాపల్లి సర్పంచ్ సిరిబాలబుజ్జిబాబు దంపతులు, గిరిజన సంఘం మండల కార్యదర్శి గడుతూరి సత్యనారాయణ కుటుంబ సభ్యులు శివలింగాన్ని ధశించుకున్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...