ఘనంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జన్మదిన వేడుకలు
లక్షెట్టిపెట్,పెన్ పవర్
పట్టణంలోని విశ్రాంతి భవనంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకని జాగృతి ఆద్వర్యంలో శనివారం ఘనంగా జరుపుకున్నారు.మున్సిపల్ చెర్మాన్ నల్మాస్ కాంతయ్య, వైస్ చెర్మాన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్ మార్కెట్ కమిటీ చెర్మాన్ సంధ్యారాణి జగన్మోహన్ రెడ్డి లు కేక్ కట్ చేసారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ పల్లె పండుగ బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయడంలో కల్వకుంట్ల కవిత కృషి ఎనలేనిది అని అన్నారు.తెలంగాణ సంస్కృతి సాంప్రదాయలపై ఎన్నో కార్యక్రమలు నిర్వహించి అవగహనలు కల్పించారని తెలిపారు.అనంతరం మిఠాయిలు పంచి పెట్టి సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా నాయకుడు బాణాలు రమేష్,విద్యార్థి విభాగం ఇంచార్జి మారుతి,టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య,కౌన్సలర్లు ఒరగంటి శ్రీకాంత్, చతరాజు రాజన్న,మెట్టు కళ్యాణిరాజు,నాయకులు అకంతి రమేష్,తిరుపతి తదితరులు పాల్గొన్నారు.









