జిల్లా పరిషత్,మండల పరిషత్ లకు నిధులు కేటాయించటం పై హర్షం వ్యక్తం
చేశారు
జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంతసురేష్
పెన్పవర్, జగిత్యాల
తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మండల పరిషత్, జిల్లా పరిషత్ స్థానిక సంస్థలను బలోపేతం కావాలని ఆకాంక్షిస్తూ మండల, జిల్లా పరిషత్ లను క్రియాశీలక చేసే దిశగా ప్రభుత్వ కార్యాచరణ ఉంటుందని గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం పెంచే విధంగా తీసుకున్న నిర్ణయం లో భాగంగా 2021-22 వార్షిక బడ్జెట్ నందు జిల్లా ప్రజా పరిషత్ లకు రూ.లు. 252.00 కోట్లు మరియు మండల ప్రజా పరిషత్ లకు రూ.లు.248.00 కోట్లు కేటాయించడం పట్ల జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్. శ్రీమతి దావ వసంతసురేష్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసినారు. అదేవిధంగా ఇట్టి కేటాయింపులు చేయుటలో కృషి చేసిన గౌరవ పంచాయతి రాజ్ శాఖామాత్యులు గారికి, గౌరవ సంక్షేమ శాఖామాత్యులు గారికి, శ్రీమతి కల్వకుంట్ల కవిత అక్క ఎమ్మెల్సీ గారికి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గారికి మరియు జగిత్యాల జిల్లా శాసనసభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసినారు.







