Followers

నిరసన వ్యక్తం చేసిన బి.జె.పి, ఓ.బి.సి, మోర్చా

 నిరసన వ్యక్తం చేసిన బి.జె.పి, ఓ.బి.సి, మోర్చా


                                                                   మహారాణి పేట ,పెన్ పవర్


పశ్చిమ బెంగాల్ లో తృనమూలు కాంగ్రెస్ బీజేపీ పార్టీ కార్యకర్తలు, ఆఫీస్ ల పైన జరుపుతున్న దాడులు, మహిళలపైన చేస్తున్న  అరాచకాలను ప్రజాస్వామ్య వాదులు ముక్త కంఠంతో ఖండించాలని, ఇదే విధంగా మేము కూడా దాడులకు తెగబడితే మమతా బెనర్జీ పార్టీ ఈ రోజు విజయం సాధించి ఉండేదా అని బీజేపీ జాతీయ అధ్యక్షులు ఏ.పి.నడ్డా అన్నారు. ఈ అరాచకాలను ప్రజాస్వామ్య వాదులంతా వ్యతిరేకించాలని, దీనిలో భాగంగా బీజేపీ కార్యకర్తలంతా తమ ఇండ్లలోనే కోవిడ్ కారణంగా ఈ రోజు ఉదయం 11గంటల నుండి 12 గంటల వరకు నిరసన కార్యక్రమం చేయాలనీ జాతీయ అధ్యక్షులు పిలుపు మేరకు, రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మమతా బెనర్జీ ఇది వరకు కమ్యూనిస్ట్ పార్టీ లను భయ, భ్రాంతులకు గురి చేసి నిర్ములించారని, బీజేపీ ని కూడా అదేవిదంగా చేద్దామనుకోవడం అవివేకం అని అన్నారు. బీజేపీ కార్యకర్తలు దేశభక్తి తో కూడిన త్యాగమయులని ఎట్టి పరిస్థితులు లోను తృణముల్ ఆటలు సాగవని అన్నారు. ఇటువంటి దురాగతాలను ప్రజాస్వామ్యవాదులంతా ముక్త కంఠంతో ఖండించాలని అన్నారు. దేశావ్యాప్తంగా ఈ రోజు ఉదయం 11 గంటలనుండి 12 గంటలవరకు ఈ నిరసన కార్యక్రమం లో పాల్గొన్న బీజేపీ కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదములు, అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో తమ ఇంటి వద్దనే ఓబీసీ మోర్చా పార్లమెంట్ అధ్యక్షులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఆయన మాట్లాడుతూ వెస్ట్ బెంగాల్ లో బిజెపి కార్యకర్తలకు బిజెపి నాయకులకు కేంద్ర ప్రభుత్వం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం నుంచి రక్షణ కల్పించాలి అని కోరుతూ  తృణమూల్ కాంగ్రెసు కార్యకర్తలు నాయకులు చేసిన దుశ్చర్యలను బిజెపి ఓబీసీ మోర్చా తీవ్రంగా ఖండిస్తోంది ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి ఓబీసీ  రాష్ట్ర కోశాధికారి శ్రీకంఠ భక్త శ్రీనివాస్ రావు, బిజెపి ఓబిసి సెక్రెటరీస్ ఎడ్ల రమణ రాజు,  ఎల్లాజీ యాదవ్, ట్రెజరర్ శ్రీనివాస్ రెడ్డి మరియు ఇతర నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఇట్లు బేసి బిజెపి విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు  పల్లి శ్రీనివాసులు నాయుడు అన్నారు

వాలంటీర్లకు వందనం

  వాలంటీర్లకు వందనం


కరోనా సేవలలో మేము సైతం అంటున్న వాలంటీర్లు

కోవిడ్ సేవలలో మహిళా వాలంటీర్లు ముందంజ

మగవారికి దీటుగా సేవలకు సిద్ధం

ప్రజల మన్ననలు పొందుతున్న గ్రామ వాలంటీర్లు

గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్,


గుమ్మలక్ష్మీపురం పంచాయతీలో గ్రామ వాలంటీర్లు కోవిడ్ సేవల్లో నిమగ్నమయ్యారు. కోవిడ్ రెండవ దశ ప్రజల జీవితంపై తన పంజా విసురుతున్నప్పటికి వాలంటీర్లు మాత్రం కోవిడ్ కు భయపడకుండా వారి సేవలను ముమ్మరం చేసారు.గుమ్మలక్ష్మీపురం పంచాయతీ లోని పలువీధుల్లో కోవిడ్ బారిన పడిన బాధితులకు మేమున్నమే భరోసా కల్పిస్తూ ఆ బాధితుల నుండి వైరస్ వ్యాప్తి ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు పాటిస్తు పారిశుద్యం పై దృష్టి సారిస్తున్నారు. కోవిడ్ బాధితుల పరిసర ప్రాంతాల్లో హైపో క్లోరైడ్ ద్రావనాలను పిచికారీ చేయడంతో పాటు డిస్ ఇన్ఫెక్షన్ పౌడర్లను జల్లుతున్నారు. గుమ్మలక్ష్మీపురం సచివాలయంలో  గ్రామ వాలంటీర్లు 25మంది తో పాటుగా 10మంది సచివాలయ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ 35మందిలో 19మంది మహిళలు 16మంది పురుషులు కోవిడ్ విధుల్లో పాల్గొంటున్నారు. ఈ పంచాయతీలోని మగవారితో సమానంగా మహిళ వాలంటీర్లు,ఉద్యోగులు కోవిడ్ సేవల్లో ఎండనక వాననక ముందంజలో ఉంటూ గ్రామ ప్రజల మన్ననలు పొందుతున్నారు.గ్రామంలో ఎక్కడ పాజిటివ్ కేసులు నమోదైన తక్షణమే అక్కడకు చేరుకుని పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతూ హైపో క్లోరైడ్ ద్రావనాలను పిచికారీ చేస్తూ కోవిడ్ వ్యాప్తిని అరికట్టే చర్యలను చేపడుతున్నారు.గుమ్మలక్ష్మీపురం గ్రామ సచివాలయంలో వాలంటీర్లతో పాటుగా సచివాలయ సిబ్బంది కూడా వారి విధులను ముగించుకుని వాలంటీర్లతో పాటుగా పారిశుధ్య కార్యక్రమాల్లో పాల్గొవడంతో గ్రామ ప్రజలు వారి యొక్క విధినిర్వహనలను కొనియాడుతున్నారు.గుమ్మలక్ష్మీపురం గ్రామ సర్పంచ్ బొత్తాడ. గౌరీశంకర్ సూచనల మేరకు మేమందరం మా విధులను నిర్వహించడానికి  సిద్ధంగా ఉన్నామని కరోనా కష్టకాలంలో మేము ఎంత సేవచేయడానికైన వెనుకాడమని కానీ గ్రామంలో ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులను ధరించి కరోనా వ్యాప్తిని అరికట్టడానికి సహకరించాలని కోరారు.

సర్పంచులు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు

 సర్పంచులు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు

మెంటాడ, పెన్ పవర్,

 మెంటాడ మండలం లోని మీసాల పేట, కుంతిని వలస గ్రామంలో సర్పంచులు మహంతి రామునాయుడు, పెద్ది రెడ్ల రమేష్ నాయుడు ఆధ్వర్యంలో బుధవారము పారిశుద్ధ్య పనులు చేపట్టారు. సీసీ కాలువల్లో పేరుకుపోయిన మట్టిని తొలగించి గ్రామాలను శుభ్రం చేయడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా రెండవ దశలో ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతము చిన్న చిన్న వర్షాలు కురవడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రము నిర్లక్ష్యం చేసిన కరోనా మహమ్మారి మనపై దాడి చేస్తుందని తెలిపారు.

సర్పంచ్ ఆహ్వానించకుండా నే వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన చైర్మన్ కిషన్ రా

సర్పంచ్ ఆహ్వానించకుండానే వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన చైర్మన్ కిషన్ రావు

బెల్లంపల్లి, పెన్ పవర్

మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం లింగాల గ్రామపంచాయతీ లో ఈరోజు వడ్ల కొనుగోలు  కేంద్రంను చైర్మన్ కిషన్ రావు మాజీ సర్పంచ్ సత్తయ్య సీ.ఈ.వో మధుకర్ సెంటర్ ఇన్ ఛార్జ్ ఓడల హనుమంతు కలసి గ్రామ అ శివార్లలో అనగా రైతులకు అనుకూలంగా కాకుండా రెండు కిలోమీటర్ల దూరంలో  వడ్ల కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు మంగళవారం రోజున సిపల్లి లక్ష్మి పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా లింగాల గ్రామ సర్పంచ్ మాట్లాడుతు నన్ను పిలువకుండా ప్రోటోకాల్ పాటించ కుండా నే వడ్ల కొనుగోలు కేంద్రమును  ప్రారంభించారు లింగాల సర్పంచ్ దళిత మహిళా కావడంతో నే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించలేదని . ఈ పరిణామం మనోభావనీ కించపరిచే చేశారని వాపోయారు ఈ కార్యక్రమం దళితుల ను  కించపరిచే విధంగా ఉందని వారి మనోభావాలు దెబ్బతినేలా నడుచుకునేల  ఉన్నాయని వారు వాపోయారు. వారిపై పరువు నష్టం దావా వేస్తానని అన్నారు .అలాగే వారిపై ఎస్సీ. ఎస్టీ. అట్రాసిటీ కేసు నమోదుచేసి దర్యాప్తు చేయాలని. రేపు అధికారుల కు కు వినతి పత్రం అందజేస్తారని ని అధికారులకు కలెక్టర్ కి ఎమ్మార్వో కు వారిపై తగిన చర్యలు తీసుకోవాలని . ఫిర్యాదు చేస్తానని.లింగాల సర్పంచ్ లక్ష్మి కోరారు.

మాస్క్ ధరించని వారిపై కొరడా

 మాస్క్ ధరించని వారిపై కొరడా

చట్ట ప్రకారం 46 కేసులు నమోదు

పెన్ పవర్, మల్కాజిగిరి

నేరేడ్మట్ పోలీస్ స్టేషన్ సిఐ నర్సింహ్మ స్వామి ఆద్వర్యంలో రచకొండ సిపి మహేష్ భగవత్ ఆదేశల మేరకు మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యంగా రోడ్డు పై తిరుగుతున్న వారిపై కేసు నమోదు చేసి రూ1000 జరిమానా విధించారు. నేరేడ్మట్, వినాయక్ నగర్ ప్రాంతల్లో 46 కేసులు నమోదు చేశామని సిఐ తెలిపారు. ఈ సందర్బంగా సిఐ నర్సింహ్మ స్వామి మాట్లాడుతూ కరోనా రక్కసిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ, మాస్కులు, బౌతిక దూరం పాటిస్తూ వ్యక్తిగత శుభ్రతతో పాటు భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉందని నేరెడ్ మెట్ సిఐ నరసింహ స్వామి అన్నారు. కరోనా నిబంధనలు నిర్లక్ష్యం వ్యహిస్తే వారిపై నేరేడ్మెట్ పోలీసులు కొరడా చూపిస్తున్నారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆదేశల మేరకు ప్రతిరోజు ప్రధాన చౌరస్తాలో, వినాయక్ నగర్ లో మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యం వ్యహిస్తు నిబంధనలను పాటించని వారికి అవగాహన కల్పిస్తూ పెట్టి కేసు నమోదు చేస్తున్నామని సిఐ నరసింహ స్వామి తెలిపారు. మాస్కులు లేకుండా తిరుగుతున్న 46 కేసులు నమోదు చేశామని తెలిపారు. కరోనా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా రోడ్లపైకి వస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన కోవిడ్ నియమాలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మానవత్వం చాటుకున్న తొర్రూరు పోలీసులు

 మానవత్వం చాటుకున్న తొర్రూరు పోలీసులు.

తొర్రూరు, పెన్ పవర్

తేదీ 21.04.2021న మహబూబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని శ్రీకృష్ణ హాస్పిటల్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైన గుర్తుతెలియని వృద్ధురాలు చికిత్స పొందుతూ... మంగళవారం మృతి చెందింది.గుర్తుతెలియని వృద్ధురాలికి చెందిన వారు ఎవరూ రాకపోవడంతో మానవతా దృక్పథంతో  తొర్రూరు పోలీసులు,మున్సిపల్ సిబ్బంది సహాయ సహకారాలతో అనాధ వృద్ధురాలికి అంత్య క్రియలు నిర్వహించినట్లు తొర్రూరు ఎస్ఐ సిహెచ్ నగేష్ తెలిపారు. ఎవరూ లేని అనాధ వృద్ధురాలికి రెండవ ఎస్ఐ మునిరుల్లా, కానిస్టేబుల్ సర్వార్ పాషా, హోంగార్డ్ రఫీయా లతో కలిసి పూలమాలవేసి, అంత్యక్రియలు నిర్వహించారు.

తెలంగాణ ద్రోహి కేసిఆర్

 తెలంగాణ ద్రోహి కేసిఆర్

 పీసీసీ సభ్యులు దసురు నాయక్

కేసముద్రం, పెన్ పవర్ 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు చేసి అనేక విధాలుగా నష్ట పోయిన వారికి ద్రోహం చేస్తూవారిని పక్కనపెట్టి తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకులైన సమైక్యవాదులను తన చుట్టూ పెట్టుకొని బంగారు తెలంగాణ పేరుతో తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయుటకు ప్రయత్నం చేస్తున్నాడు అని టిపిసిసి సభ్యులు దసురునాయక్ పేర్కొన్నారు. అందులో భాగంగానే ఈటెల రాజేందర్ ను భూకబ్జా పేరుతో మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేశాడని కావాలనే ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడిని ఒక తెలంగాణ ఉద్యమ కారుడిని ఇలా చేయడం చాలా బాధాకరమని మాట్లాడారు. కానీ అవినీతి భూ కబ్జాలు చేసిన వారిపై చర్యలలో భాగంగా ఈటెల పై చర్యలు తీసుకున్నారనుకుంటే  మరి సీఎం కేసీఆర్ చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు చాలామంది భూకబ్జాలు అవినీతి చేశారని ఆరోపణలు ఉన్నాయి. మరివారి మీద ఎందుకు తీసుకోవడం లేదు అంతేగాక ఇలాంటి ఆరోపణలు తన కొడుకు కేటీఆర్ పై కూడా ఉన్నవి కెసిఆర్  కి నీతి నిజాయితీ పై నమ్మకం ఉంటే వారు అందరిపై కూడా ఉన్నత అధికారులతో కమిటీలు వేసి వెంటనే మంత్రి పదవి నుండి తొలగించి విచారణ చేయించినట్లయితే పారదర్శకతను పాటించినట్లు అవుతుంది. లేనిచో  కేవలం 24 గంటలలోపే విచారణ పూర్తి కావాలని ప్రభుత్వం కుట్రపూరితంగా నే ఈటెల పై కెసిఆర్ దాడి చేసినట్లే అవుతుంది అని అన్నారు. అంతేగాని ఈటల రాజేందర్ పైనే కాకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరిపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...