Followers

సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించిన సుజాత ముత్యాలు

 సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించిన సుజాత ముత్యాలు

పరవాడ,పెన్ పవర్

స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో ముత్యాలమ్మ పాలెం సర్పంచ్ గా ఎన్నిక అయిన చింతకాయల సుజాత ముత్యాలు విజయం సాధించిన విషయం పాఠకులకు విదితమే.సోమవారం నాడు గ్రామ సచివాలయంలో వార్డు సభ్యులు, సిబ్బంది,స్థానిక నాయకులు,కార్యకర్తల ఆధ్వర్యంలో సుజాత ముత్యాలు గ్రామ నూతన సర్పంచ్ గా ప్రమాణస్వీకారం చేశారు.అనంతరం సుజాత ముత్యాలు మాట్లాడుతూ తనమీద నమ్మకం ఉంచి ఈ విజయం అందించిన గ్రామ ప్రజల రుణాన్ని తాను నిస్వార్థంగా సేవచేసి తీర్చుకుంటాను అని అన్నారు.ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పధకం రాజకీయాలకు అతీతంగా అర్హులకు అందరికి అందే చూస్తాను అని తెలిపారు.అంతే కాకుండా  గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి అభివృద్ధి పధంలో నడిపిస్తాను అని తెలియ జేశారు.ఈ సందర్భంగా నా విజయానికి కష్టపడిని నాయకులకు,కార్యకర్తలకు,ప్రజలకు ప్రతి వక్కరకి  హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో చింతకాయల ముత్యాలు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ కు నూతనంగా ఎన్నికైన పాలకవర్గం సబ్యులకు(కార్పొరేటర్లు) లకు శుభాకాంక్షలు -సీపీఐ

 గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ కు నూతనంగా ఎన్నికైన పాలకవర్గం సబ్యులకు(కార్పొరేటర్లు) లకు శుభాకాంక్షలు -సీపీఐ

విశాఖపట్నం సిటీ, పెన్ పవర్

నగర పేద మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలు పరిస్కారానికి కృషి చేయాలి.విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొదటి సమావేశంలో తీర్మానం చెయ్యాలి.విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో వంద శాతం పెట్టుబడులు ఉపసంహరణ చేసి తీరుతామని,ఇందులో ఎలాంటి సందేహం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనను ఖండిస్తూ జీవీఎంసీ కి ఎన్నికైన నూతన పాలకవర్గం ప్రమాణం చేసిన వెంటనే తీర్మాణం చెయ్యాలని సీపీఐ విజ్ఞప్తి చేసింది.సీపీఐ నగర కార్యదర్శి ఎం పైడిరాజు మంగళవారం సీపీఐ తరుపున పత్రికా ప్రకటనవిడుదల చేశారు.ఎన్నో పోరాటాలు, ప్రాణత్యాగల ఫలితంగా సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ను నేడు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేయడానికి సన్నాహాలు చేస్తూనే తాజాగా వంద శాతం పెట్టుబడులు ఉపసంహరణ చేసి తీరుతామని కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటించడం చూస్తే బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడమే లక్ష్యంగా వ్యవహారిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ నిర్ణయాన్ని ఆడ్డుకోవాల్సిన రాష్ట్ర అధికార పక్షం వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రెండు గోరంగా వైఫల్యం చెందాయని ఆరోపిస్తూ మరో పక్క జనసేన పార్టీ నాయకత్వం కూడా బీజేపీ నిర్ణయాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని మంటగలుపుతున్నారని విమర్శించారు. గురువారం గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ కు నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రమాణం, ప్రధమ పౌరుడు, ఉప ప్రధమ పౌరుడు ఎంపికైన వెంటనే మొదటి పాలకవర్గ సమావేశంలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.

చందుర్తి కోనరావుపేట నాయకులు అక్రమ అరెస్టును ఖండిస్తున్నాo

 చందుర్తి కోనరావుపేట నాయకులు అక్రమ అరెస్టును ఖండిస్తున్నాo



రాజన్న సిరిసిల్ల,  పెన్ పవర్

వేములవాడ ఎమ్మెల్యే గత సంవత్సరం పాటు అందుబాటులో లేక పోవడాన్ని ప్రశ్నించడం తప్పా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్న సమయంలో వేములవాడ నియోజకవర్గంలోని ప్రజల కష్టసుఖాలు వివరించడానికి స్థానిక ఎమ్మెల్యే  సంవత్సర కాలం నుండి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా మరియు ప్రజల కష్టసుఖాల్లో ప్రభుత్వానికి ప్రజల సమస్యలను వివరించడానికి ప్రజల సమస్యలు తెలుసుకోకుండా ప్రజల ద్వారా ప్రజల కొరకు ప్రజా సమస్యలు తీర్చడానికి ఎన్నుకోబడిన ఎమ్మెల్యే సంవత్సరకాలం అందుబాటులో లేకుండా ఉండడం వేములవాడ ప్రజల దౌర్భాగ్య పరిస్థితి ఒక రజాకార్ల పాలన  నిర్వచనం ఎందుకంటే ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సమయంలో వేములవాడ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు రైతులు    కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అసలు తెలంగాణవాదుల వీలు  లేక వేరే రాష్ట్రం నుంచి వచ్చి నిరసన చేస్తూ రా అనే విధంగా పోలీసులు ఈ దొరల ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తూ వారి కనుసన్నల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తూ చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకంటే ప్రజలకు సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం ఏర్పడాలని ప్రజల సమస్యలు తీర్చే విధంగా ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఈ విధంగా వ్యవహరించలేదు కాబట్టి ఇప్పుడు ఉన్న సందర్భంలో రైతుల పంటలు ఎండిపోతున్నాయి ఆరు కాలం కష్టపడి పంట చేతికొచ్చే సమయంలో నీళ్లు లేని పరిస్థితి ఏర్పడింది ఏదో పేపర్లకు ప్రకటనలకు మరియు వాట్సాప్ ఫేస్బుక్ లకు పరిమితం తప్ప రైతుల గోడు విన విధంగా ఈ ప్రభుత్వం లేదు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీ సేనలను అరెస్టు చేయడం అన్యాయమని కాంగ్రెస్  నాయకులు మండిపడ్డారు

వేతనాలు పెంచాలని నిరసన వ్యక్తం చేస్తున్న లారీ డ్రైవర్లు

 వేతనాలు పెంచాలని నిరసన వ్యక్తం చేస్తున్న లారీ డ్రైవర్లు

తాళ్ళపూడి, పెన్ పవర్

ఐ యన్ టి యు సి అనుబంధ సంస్థలైన ప్రక్కిలంక, పైడి మెట్ట, తాళ్ళపూడి, గజ్జరం, వేగేశ్వరపురం గ్రామాలకు చెందిన, ది నేషనల్ మోటార్ అండ్ లారీ ట్రాన్స్పోర్ట్ క్వారీ వర్కర్స్ యూనియన్ సభ్యులైన లారీ డ్రైవర్స్ మరియు వర్కర్స్ గత కొన్ని రోజుల నుంచి లారీ ఓనర్స్ జీతాలు పెంచాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నిరసన కార్యక్రమంలో కొడమంచిలి నాగరాజు, కొప్పాక శ్రీను, జొన్నకూటి శ్యామ్ సన్, బత్తుల రమణ, కొప్పాక వెంకట్రావు, కొప్పాక ఆనందబాబు, కొడమంచిలి సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

11వ వేతన ఒప్పంద కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి

 11వ వేతన ఒప్పంద కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి

మంచిర్యాల , పెన్ పవర్ 

సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్(బిఎంఎస్ )ఆధ్వర్యంలో  మందమర్రి ఏరియా కేకే ఓసిలో ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా  యాదగిరి సత్తయ్య అధ్యక్షులు గ పాల్గొని కార్మికులనుద్దేశించి మాట్లాడారు. ఈ సంవత్సరం జూన్ 30న 10వ వేతన ఒప్పందం ముగియనున్న నందున జులై 1న 11వ వేతన ఒప్పందం అమలులోకి రావలిసి ఉన్నందున  11వ వేతన ఒప్పంద కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు ట్రాన్స్ కో జెన్ కో నుండి 15 వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గత ఆరు సంవత్సరాల నుండి పన్నుల రూపేణా రాష్ట్ర ప్రభుత్వానికి  15011 కోట్ల రూపాయలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సీఎస్ఆర్ నిధుల కింద రూపాయలు 230 కోట్ల రూపాయలు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్ కొరకు 2739 కోట్ల రూపాయలు మొత్తంగా 17980 కోట్ల రూపాయలు పన్నుల రూపేణా వసూలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికుల అలవెన్సులు పై ఆదాయపన్ను రియంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతియేటా ఆదాయపన్ను 250 కోట్ల రూపాయలు పన్నుల నుండి  రాష్ట్ర ప్రభుత్వం  సింగరేణి యాజమాన్యానికి తద్వారా సింగరేణి కార్మికులకు  రియంబర్స్మెంట్ ఇవ్వాలని కోరారు. ఆరు జిల్లాల లో 120 గ్రామాలు , పదిహేను పట్టణాలు అభివృద్ధికి సంక్షేమా  కార్యక్రమాలకు ఖర్చు చేయాలని నిధుల దుర్వినియోగం వెంటనే నిలిపివేయాలని సంబంధిత గ్రామాలకు పట్టణాలకు కార్మికుల సంక్షేమానికి గ్రామాల అభివృద్ధికి పట్టణ అభివృద్ధికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు.బిఎమ్మెస్ కేంద్ర ఉపాధ్యక్షులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న నాయకులు  డొనికెల రమేష్ గౌడ్, మొట పోతుల శ్రీనివాస్, పెండం సత్యనారాయణ, మండల రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి కార్మికుని ఆత్మహత్య

 సింగరేణి కార్మికుని ఆత్మహత్య

మందమర్రి , పెన్ పవర్ 

మందమర్రి పట్టణంలోని 3వ జోన్ కు చెందిన సింగరేణి కార్మికుడు తైదల ప్రసాద్ సోమవారం ఉదయం తన నివాసంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మందమర్రి ఏరియాలోని కేకే 1 గనిలో విధులు నిర్వహిస్తున్న ప్రసాద్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతునికి తల్లి, బార్య, కుమారుడు కలరు.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ లింగంపల్లి భూమేష్ పేర్కొన్నారు.

ఆయుర్వేద వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి

 ఆయుర్వేద వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి

మందమర్రి , పెన్ పవర్ 

సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మార్చి 17న మందమర్రి ఏరియాలోని సిఈఆర్ క్లబ్ లో నిర్వహించు ఆయుర్వేద వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏరియా ఇంచార్జ్ పర్సనల్ మేనేజర్ సోమవారం ప్రకటనలో కోరారు. హైదరాబాద్ కు చెందిన మాతా రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద్ వైద్యుడు విశ్వనాథ మహర్షి ఆద్వర్యంలో  అన్ని రకాల వ్యాధులకు వైద్య శిబిరంలో చికిత్స చేయబడునని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఉదయం10గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు వైద్య శిబిరానికి గతంలో హాజరు అయిన వారు, క్రొత్తగా వైద్యం కోసం వచ్చే వారు, అందరూ ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...