5వార్డు ప్రజలకు కృతజ్ఞతాభివందనాలు టిడిపి జిల్లాకార్యదర్శి మొల్లి లక్ష్మణరావు
పెన్ పవర్, మధురవాడ
జీవీఎంసీ 5వ వార్డ్ టిడిపి కార్పొరేటర్ అభ్యర్థిగా మొల్లి హేమలతను గెలిపించినందుకు ఆమె తండ్రి గారైన టిడిపి జిల్లా కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు 5వ వార్డు ప్రజలకు కృతజ్ఞతాభివందనాలు తెలిపారు.ఇందులో భాగంగా వార్డు పరిధిలోని మారికవలస గ్రామం,మారికవలసకాలనీ, బోరవానిపాలెం,డ్రైవర్స్ కాలనీ,పరదేశిపాలెం తదితర గ్రామాలప్రజలను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. వార్డ్ లో ప్రజలు,మహిళలు మంగళ హారతులు పడుతూ స్వాగతం పలికారు. కార్యక్రమంలో మోల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ.. ఈ విజయంలో తనవెన్నంటి ఉండి రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి పనిచేసిన పార్టీ పెద్దలు, యువత,కార్యకర్తలు అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు చేసుకుంటున్నానని తెలియజేశారు.
స్థానిక సమస్యలపై నిరంతరం కృషి చేస్తానని,వార్డులో ఎటువంటి సమస్యలుఉన్న వెంటనే పరిష్కరిస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.ఇది బాధ్యతగా భావించి ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరిని తలెత్తి తిరిగేట్టు చేయడం నాకర్తవ్యం అని అన్నారు. ఎల్లవేళలా ప్రజాసేవలో ఉంటానని ప్రజలకుహామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు వండ్రాశి అప్పలరాజు, వార్డు అధ్యక్షులు నాగోతి సత్యనారాయణ,వార్డు సెక్రటరీ ఈగలరవి,నమ్మి శ్రీను,బోయి శ్రీను,బోయిరమాదేవి,వార్డు మహిళాఅధ్యక్షురాలు బోర హేమలత తదితరులు పాల్గొన్నారు.








