Followers

  స్వర్గీయ శ్యాం ప్రసాద్ ముఖర్జీకి ఘననివాళులు




  స్వర్గీయ శ్యాం ప్రసాద్ ముఖర్జీకి ఘననివాళులు

 


       పాయకరావుపేట,పెన్ పవర్ 

 

భారతీయ జనసంఘ్ వ్వవస్థాపకులు జాతీయనాయకులు స్వర్గీయ శ్యాంప్రసాద్ ముఖర్జీ 68వ వర్దంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా గ్రందాలయ మాజీ చైర్మెను,బిజేపి సీనియర్ నాయకులు తోట నగేష్ ఆద్వర్యంలో స్థానిక ఆయన స్వగృహంనందు మంగళవారం  బిజేపి నాయకులు,కార్యకర్తలతో కలిసి ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు మరియు ఇప్పటి భారతీయ జనతా పార్టీ కి మూలపురుషుడు శ్యాంప్రసాద్ ముఖర్జీనని అన్నారు.ఏక్ దేశ్ మే ధో విదాన్,ధో ప్రధాన్ ,ధో నిషాన్ నహీ ఛలేంగే ,ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు,ఇద్దరు ప్రధానులు,రెండు జాతీయపథాకాలు వుండటాన్ని సహించలేమని ముఖర్జీ నినాదించేవారని,హిందూ, ముస్లీంలకువేరుగా గాక దేశమంతటకి ఒకే చట్టం వుండాలని పోరాడిన గొప్పదేశభక్తిగల నాయకుడని అన్నారు.ఈ కార్యక్రమంలో  నాయకులు రవిరాజు,కార్యకర్తలు పాల్గొన్నారు.


 

 



 

79,85 వార్డుల్లో ని జివిఎంసి త్రాగునీటి సిబ్బందికి శానిటైజర్లు,మాస్కులు అందించిన కింతాడా


79,85 వార్డుల్లో ని జివిఎంసి త్రాగునీటి సిబ్బందికి శానిటైజర్లు,మాస్కులు అందించిన కింతాడా


             పరవాడ పెన్ పవర్

పరవాడ మండలం:అగనంపూడి జివిఎంసి పరిధిలో 79,85 వ వార్డుల్లో పనిచేస్తున్న త్రాగునీటి సిబ్బందికి మరియు పంపు ఆపరేటర్ల కు 79 వ వార్డ్ జనసేన అభ్యర్థి కింతాడ ఈశ్వరరావు(అడ్వకేట్)ఆధ్వర్యంలో శానిటైజర్లు,మాస్కులు అందించడం జరిగింది.అనంతరం కింతాడ మాట్లాడుతూ ప్రతిరోజు తమ విధులు నిర్వహిస్తున్న త్రాగునీరు సరఫరా చేస్తున్న సిబ్బంది కరోనా భారిన పడకుండా తమని తాము రక్షించు కోవడానికి వారికి శానిటైజర్లు,మాస్కులు అందించినట్లు చెప్పారు.వీరందరూ జాగ్రత్తగా ఉంటే ప్రజలందరూ ఆరోగ్యంగా వుంటారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో దుల్ల రామునాయుడు,బుద్దిరెడ్డి అప్పారావు,బిసి సంఘం అధ్యక్షుడు తోకాడ రాము,కర్రి వరప్రసాథ్,గుర్రాల చిన్న రాజు,నక్క దేముడు,జన సైనికులు పాల్గొన్నారు.

అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట


అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట

చింతపల్లి  జూన్ 23  పెన్ పవర్

తాను బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి నేటి వరకు మండలంలో పట్టుబడిన వివిధ అక్రమ కేసుల వివరాలు ఇలా ఉన్నాయని స్థానిక ఎక్సైజ్ సీఐ సింహాద్రి అన్నారు. మంగళవారం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ తాను 2019 డిసెంబర్ నెలలో చింతపల్లి ఎక్సైజ్ సీఐ గా       పదోన్నతి పై వచ్చానన్నారు. నాటి నుండి నేటి వరకు 116 కేసులు నమోదయ్యా యన్నారు. 93 మందిని వివిధ అక్రమ రవాణా కేసుల్లో అరెస్టు చేశామన్నారు.వివిధ వాహనాలు 12 సీజ్ చేశామన్నారు. గంజాయి, నాటుసారా, పులిసిన బెల్లం ఊట,మద్యం,  పట్టుబడిన వాహనాల వివరాలను ఆయన తెలిపారు. గడచిన ఆరు నెలల కాలవ్యవధిలో 3,862 కిలోల ఎండు గంజాయి, 41 కిలోల గంజాయి ద్రావణం స్వాధీనం చేసుకున్నామన్నారు. 781 లీటర్ల నాటుసారా, 11,900 లీటర్ల పులిసిన బెల్లం ఊట,180 మిల్లీ  కలిగిన (12 లీటర్ల,600 మిల్లీ) 70 మద్యం క్వార్టర్  సీసాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.అలాగే  ఆటో, ట్రాక్టర్, లారీ,వ్యాన్ ఒక్కొక్కటి చొప్పున బోలోరోపికప్ వ్యాన్లు 2, ద్విచక్ర వాహనాలు 2, కార్లు 4  స్వాధీనం చేసుకున్నమన్నారు. అక్రమ వ్యాపారాలు, రవాణాను అడ్డుకునేందుకు తమ శక్తి వంచన లేకుండా పని చేస్తున్నామన్నారు. అక్రమ వ్యాపారాలకు పాల్పడేవారు  ఎంతటివారైనా శిక్షార్హులే అని తెలిపారు. గ్రామాలలో నాటు సారా,గొలుసు మద్యం దుకాణాల వ్యాపారాలు విరమించుకోవాలని ఆయన హెచ్చరించారు.


 

 

శ్యామ్ ప్రసాద్ సేవలు ఎనలేనివి


 


శ్యామ్ ప్రసాద్ సేవలు ఎనలేనివి

 

అనకాపల్లి , పెన్ పవర్

 

దేశానికి డాక్టర్ శ్యాంప్రసాద్ చేసిన సేవలు మరువలేనివని అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. శ్యాంప్రసాద్   వర్థంతి కార్యక్రమం మంగళవారం పార్టీ కార్యాలయంలో జరిగింది.  ఈ సందర్భంగా మాట్లాడుతూ   శ్యాంప్రసాద్ ముఖర్జీ  దేశానికి చేసిన సేవలను కొనియాడారు‌ 370  ఆర్టికల్ రద్దు చేయమని ఆయన  ఆనాడే పోరాటం  చేశారు అన్నారు. ఆయన కలల కన్నా కలని  ప్రధానిగా మోదీ  ఆర్టికల్ 370 ను రద్దు చేశారనారు.  ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రెటరీ ద్వారపురెడ్డి పరమేశ్వర రావు, దళిత మోర్చ జిల్లా అధ్యక్షులు ఏ. కొండబాబు మాస్టారు ,మాజీ ఎంపిటిసి చదరం నాగేశ్వరరావు, అనకాపల్లి భారతీయ జనతా పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి  కర్రి రామకృష్ణ  , భారతీయ జనతా యువమోర్చ జిల్లా గల్లా రాజు, దూలం బూసిరాజు  తదితరులు పాల్గొన్నారు.

నలందా కిషోర్ ని అరెస్టు చేసిన సిఐడి


నలందా కిషోర్ ని అరెస్టు చేసిన సిఐడి.

      విశాఖపట్నం_ బ్యూరో చీఫ్(పెన్ పవర్)


 


టిడిపి సానుభూతి పరుడు నలందా కిషోర్ మంగళవారం తెల్లవారుజామున సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో ఉంటున్న నలంద కిషోర్ ఇంటికి తెల్లవారుజామున సిఐడి పోలీసులు చేరుకొని అరెస్టు చేసి తరలించగా వెళ్లారు. రాష్ట్ర  పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మరియు విజయసాయిరెడ్డి లపై వీడియో హల్చల్ అవుతున్న విషయం తెలిసిందే.  ఈ వీడియోను  నలందా కిషోర్ ఫార్వర్డ్ చేసినట్లు  అతనికి సీఐడీ నోటీసు ఇచ్చారు.  ఇందులో భాగంగా  కిషోర్  సిఐడి అరెస్ట్ చేయడం జరిగింది.


కృష్ణ నగర్ లోని 31,32 వార్డులలో శానిటేషన్





కృష్ణ నగర్ లోని 31,32 వార్డులలో శానిటేషన్ చేయించిన బి. జె పి సభ్యులు.

 

 పూర్ణ మార్కెట్, పెన్ పవర్

 

 కృష్ణ నగర్ లోని 31 మరియు 32 వ వార్డుల పరిధులలో కరోనా కేసులు రావడం తో  మంగళవారం ఆ ప్రాంతం లో శానిటేషన్ చేయించారు ,ప్రజలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో  వార్డు కార్పొరేటర్ అభ్యర్థి దామోదర్ యాదవ్, వార్డు  అధ్యక్షులు మాడేం విశ్వేశ్వర రావు,  ప్రధాన కార్యదర్శి నడుపూరు కళ్యాణ్, వార్డు నాయకులు అజయ్, విస్సు, సురేష్, సన్నీ  మరియు  జనసేన కార్యకర్తలు సునీల్  మొదలగువారు పాల్గొన్నారు.


 

 



 

విశాఖ మన్యంలో పడగ విప్పిన కరోనా మహమ్మారి.

 



 


     విశాఖ మన్యంలో పడగ విప్పిన కరోనా మహమ్మారి.



     రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు.



     ఉలిక్కిపడిన  ఏజెన్సీ.ఆందోళన చెందుతున్న గిరిజనం.



     అంగళ్ళు వారపు సంతలు బహిష్కరిస్తున్న  గిరిజన  సంఘాలు.

        
            విశాఖపట్నం_బ్యూరోఛీప్(పెన్ పవర్)



విశాఖ మన్యంలో కరోనా మహమ్మారి పడగవిప్పంది. రెండు చోట్ల పాజిటివ్ కేసులు నమోదు కావడంతో  ఏజెన్సీ ఉలిక్కిపడింది. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో కరోనా  వైరస్ సోకడంతో అధికార యంత్రాంగం  గిరిజనులు  ఆందోళన చెందుతున్నారు. ముంచంగిపుట్టు మండలం జోలాపుట్టు పంచాయితీ  జఫ్ఫా ర్ కి  చెందిన యువకుడికి కరోనా పాజిటివ్  నిర్ధారణ కావడంతో  విశాఖ కి తరలించారు. గ్రామంలో బంధువు  దహన సంస్కార ణలకు  తిరుపతి నుంచి వచ్చిన యువకుడిని క్వారంటైన్ లో పరీక్షలు చేయగా  వైరస్ బయటపడింది. 4 రోజుల క్రితం  చింతపల్లిలో  మహిళ హోంగార్డుకు  కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు ప్రదేశాల నుంచి పలువురిని క్వారంటైన్ కి తరలించారు. ఈ పరిస్థితులు దృశ్య  కరోనా వైరస్ మన్యంలో నివురుగప్పిన నిప్పులా  మారింది. ఎక్కడ ఎంతమందికి  కరోనా వైరస్  సోకింది  అన్న అనుమానాలు వ్యక్త మవు తున్నాయి.  మార్చి 21 నుంచి మొదలైన  కరోనా లాక్  డౌన్  మే నెల వరకు ఏజెన్సీలో కట్టుదిట్టంగా అమలు జరిగింది. గ్రామాలకు గ్రామాలు  దిగ్బంధం చేశారు. స్థానికులు మినహ  ఇతరులను గ్రామాల్లోకి అనుమతించలేదు. ఇతర ప్రాంతాల నుంచి బంధువులు వచ్చిన  ససేమిరా పొమ్మన్నారు. ఫైనాన్స్ వ్యాపారులను సైతం  దరిచేరనివ్వలేదు. ఈ వారపు సంతలు దుకాణాలు బహిష్కరించారు. సామాజిక దూరం తూచా పాటిస్తూ వచ్చారు.  లాక్ డౌన్  సడలింపు లతో   దుకాణాలు  అంగళ్ళు  తెరుచుకున్నాయి. దీంతో  స్థానికేతరుల రాకపోకలు కూడా మొదలయ్యాయి. మైదాన ప్రాంతాల్లో కరోనా మహమ్మారి విలయ తాండవం ఆడుతున్న దృశ్య గిరిజన ప్రాంతాల్లో వారపు సంతలు  మరికొంత కాలం నిషేధించాలని గిరిజన సంఘాలు  గొంతెత్తి కూస్తున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణంతో  కరోనా చిచ్చు రాకుండా పటిష్టమైన  జాగ్రత్తలు పాటిస్తున్న తరుణంలో కరోనా  వైరస్  చింతపల్లి  ముంచంగిపుట్టు మండలాల్లో  వెలుగు చూసింది. ఇతర ప్రాంతాల నుంచి  వచ్చి పోతున్న  వారి వల్ల కరోనా   విజృంభించే   అవకాశం లేకపోలేదని  గిరిజన నేతలు  భావిస్తున్నారు.  వర్షాకాలం కావడంతో  గిరిజన గ్రామాలు  అస్తవ్యస్తంగా  ఉంటాయని  కరోనా వైరస్ ప్రబలే అవకాశం అధికంగా ఉంటుందని  అధికారులు  హైరానా పడుతున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం తాగునీరు  వ్యక్తిగత శుభ్రత పాటించాలని  అవగాహన చర్యలు మొదలయ్యాయి. ఎప్పటికైనా  కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని  గిరిజనులు  భావిస్తున్నారు. దుకాణాలు ఉదయం 7 నుంచి ఒంటి గంట వరకు  మాత్రమే తెరవాలని  వ్యాపారులతో తీర్మానించారు. ఎవరైనా దుకాణాలు తెరిస్తే మూడు వేలు జరిమానా  మాస్కు ధరించకపోతే  500 ఫైన్  విధించాలని  తీర్మానించారు. జీకే వీధి  అరకు  జి.మాడుగుల  పెదబయలు వారపు సంతలు  ఇప్పట్లో తెరవకూడదు అని  గిరిజన సంఘాలు కోరుతున్నారు. ముంచంగిపుట్టు మండలం  దుకాణాలు మూసివేశారు. తరచూ కుంభవృష్టి వర్షాలు  పారిశుద్ధ్యం  దృశ్య  అధికారులు  అలర్ట్ ప్రకటించారు.


 

 

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...