Followers

క్రమశిక్షణతో చదివి పరీక్షల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవాలి

క్రమశిక్షణతో చదివి పరీక్షల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవాలి

విజయనగరం,పెన్ పవర్

విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల తుది పరీక్షలకు ఉపయోగపడే ఆల్-ఇన్-ఒన్ స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ బంగ్లాలో,బుధవారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టరు డా ఎం. హరిజవహర్‌లాల్ ముఖ్య అతిధిగా హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు డా ఎం. హరి జవహర్ లాల్ మాట్లాడుతూ - ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీగారు తమ శాఖ ద్వారా 41 ప్రభుత్వ పాఠశాలలను దత్తత స్వీకరించి, విద్యార్ధులలో శక్తి సామర్థ్యాలను పెంచి, వారిని ఉన్నతమైన స్థానాలకు తీసుకు వచ్చేందుకుగాను, స్టూడెంట్ పోలీసు క్యాడెట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. ఈ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులు మంచి ఫలితాలు సాధించేందుకు పట్టుదల, క్రమశిక్షణతో, చదువు పట్ల ఆసక్తితో చదవాలన్నారు.ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మంచి ఫలితాలు సాధించే విధంగా ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ప్రతీ ఉపాధ్యాయుడు శక్తి వంచన లేకుండా విద్యార్ధుల ఉన్నతికి కృషి చేయాలన్నారు. విద్య అన్నది ప్రతీ వ్యక్తికి అత్యంత గౌరవాన్ని తీసుకొస్తుందని, ఆగౌరవం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు, జన్మ స్థలం యొక్క ఉన్నతిని పెంచుతుందన్నారు. బాగా చదువుకోవడం వలన మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, విజయనగరం అంటే విద్యలనగరమని, ఆ పేరుకు సార్ధకత తీసుకువచ్చే విధంగా చదవాలన్నారు.పోలీసుశాఖ వలన క్రమశిక్షణ అలవడుతుందని, క్రమశిక్షణ ద్వారా పట్టుదలను పెంచుకొని, బాగా చదివి ఉన్నతమైన స్థానాలలోకి ఎదిగి, మీ తల్లిదండ్రులను, మంచి పేరు తీసుకువచ్చి, మీ ప్రాంతాలను అభివృద్ది చెయ్యాలని జిల్లా కలెక్టరు ఆకాంక్షించారు. విధ్యార్ధులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, ఉన్నత లక్ష్యాలను లక్ష్యంగా చేసుకొని, ఉన్నతమైన వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో ఉన్నత పౌరులుగా ఎదగాలన్నారు. 

స్టూండెంట్ పోలీసు క్యాడిట్ కార్యక్రమంలో విద్యార్ధులకు ఆల్-ఇన్-ఒన్ పుస్తకాలను జిల్లా ఎస్పీబి. రాజకుమారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం చాలా హర్షణీయమని, విధ్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమయాన్ని వృధా చేయకుండా బాగా చదివి 10వ తరగతి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టరు డా|| ఎం. హరిజవహర్లాల్ అన్నారు.విజయనగరం జిల్లా ఎస్పీ బి. రాజకుమారి మాట్లాడుతూ - విద్య ఉంటే ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చునని అన్నింటికీ మూల కారణం విద్యే అన్న సత్యాన్ని ప్రతీ విద్యార్థి గ్రహించాలన్నారు. విద్య ద్వారా వినయం, తద్వారా సమర్ధత, సంపద, ధర్మం, సంతోషం వస్తాయన్నారు. విద్యార్ధి దశలో వినయం, సమయపాలన, శ్రద్ధ, ఆసక్తి, సానుకూల దృక్పథం, నీతి, నియమాలు అలవరుచుకోవాలన్నారు. ఎపిసి పాఠశాలలకు ఆల్-ఇన్-ఒన్ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని విశాఖపట్నం రేంజ్ డి. ఐ. జి. ఎల్.కే.వి. రంగారావు విజయనగరం జిల్లా ఎస్పీగా పని చేసిన సమయంలో విద్యార్ధుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రారంభించారని, అప్పటినుండి ఎస్పీలుగా పనిచేస్తున్న వారంతా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారన్నారు. ఈ సంవత్సరం పోలీసు సంక్షేమ నిధి నుండి రూ. 4 లక్షల వ్యయంతో ఆల్-ఇన్-ఒన్ పుస్తకాలను ఎపిసి పాఠశాల విద్యార్ధులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, విద్యార్ధులు పట్టుదలతో చదివి జూన్ లో జరగనున్న 10వ తరగతి పరీక్షల్లో 10/10 గ్రేడు మార్కులు సాధించాలన్నారు.

విద్యార్థి దశలో 8, 9, 10 మరియు ఇంటర్మీడియట్ చాలా ముఖ్యమైనవని, ఈ దశలో విద్యార్ధులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. మనకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచన విద్యార్థులలో ఉండాలని, విద్యార్ధి దశ మళ్ళీ రాదని, తల్లిదండ్రులు మనికిచ్చిన అవకాశాన్ని, ఉపాధ్యాయులు మనకి నేర్పిస్తున్న జ్ఞానాన్ని సద్వినియోగపరుచుకొనిరాబోతున్న 10వ తరగతి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించి, మీపై మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెట్టుకొన్న నమ్మకాన్ని నిలపాలన్నారు. క్రమశిక్షణ, అంకితభావం, మంచి వ్యక్తిత్వం ద్వారా ఉన్నతమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యాన్ని చేరుకొనే వరకు విశ్రమించకూడదన్నారు. విద్యార్ధి దశలో 10వ తరగతి చాలా కీలకమైనదని, సమయం చాలా విలువైనదని, సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగపర్చుకొని, ఆల్-ఇన్-ఒన్ పుస్తకాలను చదివి, మంచి ఫలితాలు సాధించాలన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం ఎస్.పి.సి. కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మొదటి విడత 10పాఠశాలలను ఎంపిక చెయ్యగా, వాటికి అదనంగా మరో 31 పాఠశాలలను ఎంపిక చేసామన్నారు. ఈ కార్యక్రమాన్నిఅమలు చేసే క్రమంలో ప్రతీ విద్యార్ధితోనుపోలీసు అధికారులు కలిసి మాట్లాడి, వారిలో స్ఫూర్తి కలిగించడం వలన మంచి ఫలితాలు సాధిస్తున్నామన్నారు.
ఒఎస్టీ ఎన్.సూర్యచంద్రరావు మాట్లాడుతూ - విలువలతో కూడిన విద్య నేర్వాలని, దేవుడిచ్చిన సృజనాత్మకతను వెలికితీయాలన్నారు. విద్యను మన నుండి ఎవరూ తీసుకోలేరని, విద్య వలన కీర్తిని పొందవచ్చునన్నారు. ఆచార్యదేవోభవ అని,పిల్లల్ని తీర్చిదిద్దిన గురువులను అభినందించాలన్నారు. ఆల్-ఇన్-ఒన్ పుస్తకాలను సద్వినియోగం చేసుకొనిరాబోయే 10 వ తరగతి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించాలన్నారు.విజయనగరం జిల్లా విద్యాశాఖాధికారి జి. నాగమణి మాట్లాడుతూ - పోలీసు శాఖ తమ విధులలో బిజీగా ఉంటున్నా ఎస్పీ బి.రాజకుమారి ఆధ్వర్యంలో ఈ స్టూడెంట్ పోలీసు క్యాడిట్ కార్యమ్రాన్ని విజయవంతంగా అమలు చేసి,విద్యార్థులలో ఆత్మసైర్యాన్ని నింపుతున్నారని, గతంలో ఈ కార్యక్రమం ద్వారా అందించిన సహాయం వలన 10వ తరగతి పరీక్షలలో మంచి ఫలితాలు జిల్లాకు వచ్చాయని, మళ్ళీ మంచి ఫలితాలను సాధించి, రాష్ట్రంలో జిల్లాను ప్రధమస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు.అనంతరం, విజయనగరం విజయనగరం జిల్లా ఎస్పీ బి. రాజకుమారి చేతుల మీదుగా 14 ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు ఆల్-ఇన్-ఒన్ స్టడీ మెటీరియల్ ను అందజేసారు. 
విద్యార్థులతో కలిసి జిల్లా ఎస్పీ బి. రాజకుమారి,ఎస్ బి అదనపు ఎస్పీ ఎన్. శ్రీదేవీరావు, ఒఎడ్ జె.రామమోహనరావు, అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు,డి. ఇ. ఒ జి.నాగమణి మరియు ఇతర అధికారులు సహపంక్తి భోజనాలు చేసి, పరీక్షల గురించి, ప్రిపరేషను గురించిఆరా తీసి, వారిలో స్ఫూర్తి నింపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బి.రాజకుమారి, ఎస్ ఈబి అదనపు ఎస్పీ ఎన్.శ్రీదేవీరావు, ఒఎ. ఎన్. సూర్యచంద్రరావు, అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు, డిఈ ఒ జి. నాగమణి, ఎస్పీసి నోడల్ అధికారి ఎఆర్ డిఎస్పీఎల్. శేషాద్రి, విజయనగరం డి.ఎస్పీ పి.అనిల్ కుమార్, బొబ్బిలి డిఎస్పీ బి.మోహనరావు, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, డిఎస్పీ ఎస్ సి ఎస్ సెల్-1 మరియు 2 ఆర్. శ్రీనివాసరావు, రామారావు, సిఐలు బి.వెంకటరావు, ఎన్.శ్రీనివాసరావు, జి. రాంబాబు, రుద్రశేఖర్, జె. మురళి, సిహెచ్. శ్రీనివాసరావు, ఎర్రంనాయుడు, టి.ఎస్. మంగవేణి, శ్రీధర్, జి. గోవిందరావు, సింహాద్రినాయుడు, టి.వి. తిరుపతిరావు, సిహెచ్. లక్ష్మణరావు, సంజీవరావు, ఎల్.అప్పలనాయుడు, ఆలు చిరంజీవి, బి. నాగేశ్వరరావు, కుమార్, ఈశ్వరరావు, రమణమూర్తి, పి.ఎం. రాజు మరియు ఇతర పోలీసు అధికారులు, వివిధ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కరోనా తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

 కరోనా తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ... ఎస్సై సాయన్న

బేల, పెన్ పవర్ 

 కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్ఐ సాయన్న పేర్కొన్నారు. బుధవారం బేలా మార్కెట్ నందు కోవిడ్ - 19 అవగాహన కార్యక్రమంలో భాగంగా వ్యాపారులు, ప్రజలు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పకుండా మాస్క్ ధరించాలని, కరోనా విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని పేర్కొన్నారు. ప్రజలు మాస్క్ దరించని యెడల విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేసి, కోర్టుకు పంపటం జరుగుతుందని అన్నారు. వారి వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు.

మాస్కులు పంపిణి చేసిన ట్రాఫిక్ సిఐ సుదీర్ కృష్ణ

 మాస్కులు పంపిణి చేసిన ట్రాఫిక్ సిఐ సుదీర్ కృష్ణ

పెన్ పవర్, మల్కాజిగిరి

మల్కాజిగిరి చౌరస్తా లో మాస్కు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో వెళ్తున్న వాహనదారులు పాదచారులకు మాస్కులు పంపిణీ చేసిన మల్కాజిగిరి ట్రాఫిక్ సీఐ సుధీర్ కృష్ణ. ఈ సందర్బంగా సిఐ సుధీర్ కృష్ణ మాట్లాడుతూ సెకండ్ వేవ్ కోవిడ్ - 19, కరోనా విజృంభిస్తున్న నేఫధ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, బౌతిక దూరం పాటించి, శానిటైజర్ తో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొవాలని అవగాహన కల్పించారు, వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు రాష్ట్ర డిజిపి మరియు రాచకొండ కమిషనర్ సూచనలు మేరకు అవగాహన కల్పిస్తున్నట్లు సిఐ సుదీర్ కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఐ. తేజ, ఎ. ఎస్.ఐ.రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.

వైద్య సిబ్బంది అవగాహన కల్పించకపోవడమే లోపం

 వైద్య సిబ్బంది అవగాహన కల్పించకపోవడమే లోపం

 సంతబొమ్మాళి, పెన్ పవర్

మండల కేంద్రం సంతబొమ్మాళి లో గ్రామ సచివాలయ స్థాయిలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా నిర్వహించేందుకు సంతబొమ్మాళి పి హెచ్ సి, సచివాలయం-1  ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ఎంపిక చేశారని తహసిల్దార్ రాంబాబు తెలిపారు. కోవిద్ వ్యాక్సిన్ వేసే ప్రక్రియ పూర్తయిన తర్వాత నివేదికను జిల్లా కలెక్టర్ కు పంపుతామని తెలిపారు. దీని ఆధారంగా రాష్ట్రస్థాయిలో ఏప్రిల్ 2వ తేదీ నుంచి 45 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేసే కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రత్యేకంగా పరిశీలించేందుకు డాక్టర్ పి.అవని హాజరయ్యారు. మండలంలో 45  పైబడిన వారు చాలామంది ఉన్నప్పటికీ కేవలం 24 మంది వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. వైద్య సిబ్బంది అవగాహన లోపంతో వ్యాక్సినేషన్ కు వెనకంజ అయిందని వైద్యాధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎస్ కె ఎస్ ప్రసాద్, వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మాస్కు ధరించకుంటే జైలుకు

 మాస్కు ధరించకుంటే జైలుకు


పెన్ పవర్,  మల్కాజిగిరి 

రాష్ట వ్యాప్తంగా డిజిపి మరియు రాచకొండ పోలీస్ కమిషనరేట్ సూచనలు మేరకు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేతాజీనగర్ చౌరస్తాలో ఎస్.ఐ అనంత చారి ఆద్వర్యంలో సెకండ్ వేవ్ కోవిడ్- 19, కరోనా విజృంబిభిస్తున్న నేఫేద్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలంటు అవగాహన కల్పించారు. వ్యాపారస్తులు, వాహనదారులు, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించి, బౌతిక దూరం పటించి, శానిటైజర్ తో శుభ్రం చేసుకొవాలని అన్నారు. వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం, అయినా ప్రజలు నిర్లక్ష్యంగా వ్యహించి మాస్కులు ధరించకుండా ఉంటే వారిని జైలుకు తరలిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కానిష్టేబుల్ రమేష్, వీరా చారి, కృష్ణ, మహిళా కానిష్టేబుల్ మాధవి, సంధ్య, శ్రీదేవి పాల్గొన్నారు.

విధులలో నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని వీడాలి

విధులలో నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని వీడాలి

విజయనగరం,పెన్ పవర్

వివిధ సచివాలయాల్లో సమయపాలన పాటించని 8 మంది కార్యదర్శులకు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ మెమోలు జారీ చేశారు. సచివాలయాల ఆకస్మిక తనిఖీల్లో భాగంగా బుధవారం నగరంలోని 46, 47, 48 నెంబరు గల సచివాలయాలను కమిషనర్ పరిశీలించారు. నిర్ణీత సమయానికి విధులకు హాజరు కాని 8 మంది కార్యదర్శుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మెమోలు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కార్యదర్శులనుద్దేశించి కమిషనర్ మాట్లాడుతూ విధులలో నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని వీడాలని కార్యదర్శులకు ఆదేశించారు. లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రధానంగా సమయపాలన పాటించడం, రికార్డులు సక్రమంగా నిర్వహించడం, విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించడం తప్పనిసరి అన్నారు. ప్రభుత్వం ఎంతో సదుద్దేశంతో సచివాలయ వ్యవస్థ రూపొందించిందని, అటువంటి క్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి ప్రభుత్వానికి అధికారులకు మంచి పేరు తేవాలని చెప్పారు.

డస్ట్ బిన్ రహిత నగరం

 డస్ట్ బిన్ రహిత నగరం

విజయనగరం,పెన్ పవర్

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన క్లాప్ కార్యక్రమం విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ కోరారు. బుధవారం సాయంత్రం ఈ మేరకు పారిశుద్ధ్య అధికారులు, పర్యవేక్షకులు, కార్యదర్శులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరాలు, పట్టణాలు పరిశుభ్రత,పచ్చదనంతో పరిఢమిల్లాలని ప్రభుత్వం క్లాప్  కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు.

 ఈ కార్యక్రమం ద్వారా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో వార్డుల్లో పరిశుభ్రత కు అధిక ప్రాధాన్యత ఇచ్చి పచ్చదనంతో వెల్లి విరియాలని అన్నారు. వార్డులలో సమూల మార్పులు తీసుకొచ్చి పచ్చదనానికి, పర్యావరణానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. డస్ట్ బిన్ రహిత నగరంగా తీర్చిదిద్దడం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. సంపూర్ణ చైతన్యాన్ని ప్రజలలో తీసుకొచ్చి తద్వారా క్లాప్ కార్యక్రమ విశిష్టతను చాటి చెప్పాలన్నారు. ఈ సమావేశంలో ప్రజారోగ్య  అధికారి డాక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...