Followers

ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ

 ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ

పెద్దాపురం,పెన్ పవర్

 ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పెద్దాపురం రెవిన్యూ డివిజనల్ అధికారి ఎస్ మల్లి బాబు తెలిపారు. శనివారం పెద్దాపురం డివిజన్లకు సంబంధించి  స్థానిక ఆర్ డి ఓ  కార్యాలయంలో 14వ తేదీ జరగబోవు ఎమ్మెల్సీ పోలింగ్ కు సంబంధించి 12 మండలాలకు, పోలింగ్ సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఆర్ డి ఓ ఎస్ మల్లి బాబు విలేకరులతో మాట్లాడుతూ 14వ తేదీ ఆదివారం డివిజన్లోని 11 మండలాల్లో ఎంపీడీవో కార్యాలయంలోను, రంగంపేటలో తాసిల్దారు కార్యాలయంలో ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు 1,039 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కును నమోదు చేసుకున్నారని తెలిపారు ఈరోజు ప్రత్యేకమైన బస్సులలో పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి అందజేసి వారిని పోలింగ్ కేంద్రాలకు తరలించామని చెప్పారు పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించామని, ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు పోలింగ్ ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రారంభమై 4గంటలకు ముగుస్తుందని, ఎమ్మెల్సీ కౌంటింగ్ సంబంధించి ఈనెల 17వ తేదీన  కాకినాడ జేఎన్టీయూలో కౌంటింగ్ పక్రియ ప్రారంభం అవుతుందని ఆర్డిఓ తెలిపారు.

పనులు నాణ్యత ప్రమాణాలతో చేయాలి

పనులు నాణ్యత ప్రమాణాలతో చేయాలి

పెన్ పవర్,కరప

 గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులు నాణ్యతా ప్రమాణాలతో చేయాలని ఆ డబ్యూఎస్ ఏఈ పి.ప్రసాద్ అన్నారు. సీసీ డ్రెయిన్ల నిర్మాణపనులను శనివారం ఆయన వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించి సూచనలు చేశారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ 10 లక్షలు ఉపాధిహామీ పధకం నిధులు రూ 60 లక్షలు వెరశి రూ 70 లక్షలతో కొత్తపేట, మెరకవీది, బీనీ. ఎస్పీ వీధులలో నాలుగు సీసీ డ్రెయిన్ల నిర్మాణపనులు జరుగుతున్నాయన్నారు. మిగిలిన వీధులలో కూడా సీసీ డ్రెయిన్లు నిర్మించేందుకు నిధులు మంజూరుచేస్తామని రాష్ట్ర వ్యవసాయ. సహకారశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపినట్టు వైఎస్సార్ సీపీ గ్రామకమిటీ అధ్యక్షుడు మేడికెట్టి సత్తిబాబు చెప్పారు వైఎస్సార్ సీపీ నాయకులు యాళ్ల సుబ్బారావు, సాదే లోహిదాస్కుమార్, నక్కా సత్తిబాబు, పాట్నీడి భీమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

నేడు కొత్తపల్లి లో ఉచిత వైద్య శిబిరం..

 నేడు కొత్తపల్లి లో ఉచిత వైద్య శిబిరం..

గోకవరం,పెన్ పవర్

గోకవరం మండలం జి కొత్తపల్లి గ్రామంలో ఆదివారం నాడు కొత్తపల్లి గ్రామం మెయిన్ రోడ్డు నందుగల రైటర్ ఇంటి ఆవరణలో శ్రీరామ సత్య క్లినిక్ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆ క్లినిక్ వైద్యులు డాక్టర్ శ్రీ కృష్ణ చైతన్య తెలిపారు. ఈ వైద్య శిబిరంలో అన్ని రకాల వ్యాధులకు డాక్టర్ శ్రీ కృష్ణ చైతన్య  వైద్య సేవలు అందిస్తారని క్లినిక్ యాజమాన్యం తెలిపింది. అంతేకాకుండా రోగులకు అవసరమైన మందులను పూర్తిగా ఉచితంగా అందజేస్తామని, రోగికి అవసరమైన రక్త పరీక్షలు సగం రేట్లకే చేస్తామని, రోగికి అవసరమైన ఏ రకమైన వైద్య సేవలైన పూర్తిగా ఉచితంగా చేస్తామని తెలిపారు. కాబట్టి కొత్తపల్లి చుట్టుపక్క గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శ్రీ కృష్ణ చైతన్య తెలిపారు.

విశాఖ ఏజెన్సీలో ఆహార శుద్ధి యంత్రాలు ఏర్పాటు చేస్తాం

 విశాఖ ఏజెన్సీలో ఆహార శుద్ధి యంత్రాలు ఏర్పాటు చేస్తాం

పెన్ పవర్,విశాఖపట్నం

విశాఖ ఏజెన్సీలో ఆహారశుద్ధి యంత్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం  చేయాలని  పాడేరు సముగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ( ఐ టి డి ఎ)  ప్రాజెక్ట్ అధికారి  వెంకటేశ్వర సలిజామల  అన్నారు. శనివారం తన కార్యాలయంలో  సంబంధిత అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపార విపణిలో  ఆర్గానిక్ వస్తువులకు  చాలా డిమాండ్ ఉందని. ఆ దిశలో ప్రయోగాత్మకంగా  గిరిజనులు పండించే తృణ ధాన్యాలను  మెరుగుపరిచి మార్కెట్ చేయడంవల్ల గిరిజనులకు ఆదాయ వనరులు చేకూరుతాయి అన్నారు. గిరిజనులు సేంద్రీయ పద్ధతిలో సాగుచేస్తున్న కాపీ పసుపు చింతపండు  మిరియాలు సొల్లు సామలు  కొర్రలు  అల్లం పాల పిండి వంటి పదార్థాలను మెరుగుపరిచి మార్కెట్ చేసే సౌకర్యం కల్పిస్తామన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన  ఉత్పత్తులతో ఆహార యూనిట్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. గిరిజనులు సేంద్రీయ విధానంలో  పండిస్తున్న  తృణధాన్యాలు  ఇతరత్రా వ్యవసాయ ఉత్పత్తులను వారపు సంతల్లో విక్రయిస్తున్నారని  అందువల్ల దళారిల దోపిడీలకు గురవుతున్నారని అన్నారు. ఈ మేరకు గిరిజనులకు తగిన ఆదాయం  సమకూరే లా ఐ టి డి ఎ ద్వారా ఆహార యూనిట్లు నెల్ల కల్పిస్తామన్నారు. దేనికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పీవో వెంకటేశ్వర్ ఆదేశించారు.

ప్రశాంతంగా ముగిసిన సి ఓ ఈ ప్రవేశ పరీక్ష

 ప్రశాంతంగా ముగిసిన సి ఓ ఈ ప్రవేశ పరీక్ష

పర్యవేక్షించిన ఆర్సీఓ కొప్పుల స్వరూపారాణి.

బెల్లంపల్లి , పెన్ పవర్

ఉదయం 8గం.ల కే  సెంటర్ల కు చేరుకున్న విద్యార్థులు. ఉదయం 10గo.లకు ప్రారంభమై  1గం.కు ముగిసింది.తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విధ్యాలయాల సంస్థ  ఆద్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న సి ఓ ఈ (సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ) ల్లో వచ్చే విద్యా సంవత్సరానికిగాను ఇంటర్ మీడియట్ ప్రధమ సంవత్సరంలో అడ్మిషన్ కోసంనిర్వహించిన సిఓఈ ప్రధమ స్క్రీనింగ్ టెస్ట్  శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఆదిలాబాద్ రీజియన్ వ్యాప్తంగా ఏర్పాటుచేసిన  10 పరీక్షా కేంద్రాలకు సంబంధించిన సౌకర్యాల విషయమై ఆర్సీఓ ఎప్పటికప్పుడు ఆడిగితెలుసుకుంటు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంతంగా పరీక్ష వ్రాసేలా సమన్వయంచేశారు.  రీజియన్ వ్యాప్తంగా 10 సెంటర్లలో 2694మందికి గాను 2385 మంది పరీక్ష వ్రాయగా 309 మంది గైర్ హాజరయ్యారు.  88.53 శాతం  హాజరైనట్లు ఆర్సీఓ కే.స్వరూపారాణి తెలిపారు. సంక్షేమ గురుకులాల ఆదిలాబాద్ ప్రాంతీయ సమన్వయాధికారిని (ఆర్సీఓ) కొప్పుల స్వరూపరాణి బెల్లంపల్లి లోని బాలుర,బాలికల  సెంటర్లతోపాటు చెన్నూర్, జైపూర్* సెంటర్లను సందర్శించారు. రూట్ ఆఫీసర్ గా ఏఆర్సీఓ కోటిచింతల మహేశ్వర రావు, చీఫ్ సూపరింటెండెంట్స్ గా సంబంధిత ప్రిన్సిపాల్స్ ఐనాల సైదులు, యస్.స్వరూప, ఆర్ బాలభాస్కర్, రాజమణి, లలితకుమారి, స్వర్ణలత, శ్రీనివాస్ రావు, ప్రవీణ్ కుమార్, శ్రీధర్,సంగీత లు వ్యవహరించారు. బెల్లంపల్లి లోని బాలుర మరియు బాలికల సెంటర్ల వద్ద తాళ్ళ గురజాల పోలీస్ స్టేషన్ ఎస్సై సమ్మయ్య ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటుచేశారు.

బెల్లంపల్లి లేబర్ యూనియన్ కి ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నికైన కాసర్ల యాదగిరి

 బెల్లంపల్లి లేబర్ యూనియన్ కి ఏకగ్రీవంగా అధ్యక్షునిగా  ఎన్నికైన కాసర్ల యాదగిరి 

బెల్లంపల్లి,పెన్ పవర్

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లోని రోజువారి కూలి సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా కాసర్ల యాదగిరి ని ఎన్నుకోవడం జరిగింది.యాదగిరి మాట్లాడుతూ ప్రతి ఒక్క లేబర్ యూనియన్ కార్డు కలిగి ఉండాలని కొంతమంది పనికి కార్మికులను తీసుకెళ్తూ యజమాని వద్ద ఆరు వందల రూపాయలకు అగ్రిమెంట్ కుదుర్చుకుని కూలీలకు 400. 500. ఇస్తూ వారి యొక్క రెక్కల కష్టాన్ని దోచుకుంటున్నారు అలాంటి వ్యక్తులు మళ్లీ ఇలాంటి సమస్య పునరావృతం కాకూడదని కోరుతూ ఈ యొక్క సంఘం ఆకలితో ఏర్పడ్డ సంఘం అని హక్కులు సాధించుకునేందుకు నిరంతరంగా కృషి చేస్తామని బెల్లంపల్లి చుట్టుపక్కల ఫ్లై ఓవర్ నిర్మాణాలు రైల్వే పనులు హైవే పనులు బెల్లంపల్లి భవన కార్మికుల ను 30 శాతం వరకు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మా యొక్క సంఘం ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు ఇది హక్కుల కోసం ఏర్పడ్డ సంఘం అని గుర్తించాలని అదే విధంగా అన్ని పార్టీలు అన్ని సంఘాలు మాకు మద్దతుగా ఉండాలని కొంతమంది కాంట్రాక్టర్లు ఇతర రాష్ట్రాల నుండి కూలీలను తీసుకు రావడం వల్ల బెల్లంపల్లి కార్మికులు తిరని అన్యాయం జరుగుతుందని  అని అన్నారు  రోజుకు కార్మికులు  సుమారుగా  500 మంది వస్తూ 300 మంది  పని దొరకకా వెనుకకు పోతున్నారు కాబట్టి బెల్లంపల్లి కార్మికులకు పని కల్పించాలని అన్నారు ఒక సంఘం నిర్మాణానికి నా మీద నమ్మకంతో అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ చేపడతామని అన్నారు

ఘనంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు

 ఘనంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత  జన్మదిన వేడుకలు ..

బెల్లంపల్లి ,పెన్ పవర్


బెల్లంపల్లి లో గల  2- గ్రౌండ్ నందు ఘనంగా కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు నిర్వహించి మొక్కలు నాటి, జాగృతి నాయకుల ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల కోసం రక్త దాన కార్యక్రమం మరియు చలివేంద్రం ఏర్పాటు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన  మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత శ్రీధర్  వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కళ్యాణి భీమా గౌడ్ వైస్ చైర్మన్ సుదర్శన్  ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిల్ & కో ఆప్షన్ సభ్యులు , తెలంగాణ జాగృతి నాయకులు,తెరాస యువ నాయకులు,తెరాస కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...