Followers

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

 ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

పెన్ పవర్,ఆలమూరు 

   ఆదివారం జరుగు ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అనుపమ అంజలి  వెల్లడించారు. మండల కేంద్రమైన ఆలమూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ఉదయం  8 గంటల నుండి  సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది అని  ఓటుహక్కు ను వినియోగించుకునే  ప్రతి ఒక్కరు ఎదో ఒక గుర్తింపు కార్డు ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఫోటో ఉన్న ఏటీఎం కార్డు కానీ తీసుకుని రావాలి అని  మండలంలో 71 ఓట్లకుగాను మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అమె తెలిపారు. ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను వెలుతురు, గాలి వంటివి ఉండేటట్లు చర్యలు తీసుకున్నారు. సబ్ కలెక్టర్ వెంట ఎంపీడీవో జేఏ ఝాన్సీ, తాసిల్దార్ లక్ష్మీపతి, మండల ప్రజాపరిషత్ పరిపాలన అధికారి టీవీ సురేందర్రెడ్డి, ఆర్ఐ జానకి  రాఘవ, డిప్యూటీ తహశీల్దార్ జానకీ రామయ్య తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు

 ఘనంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత  జన్మదిన వేడుకలు ..

జగిత్యాల,పెన్ పవర్



తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ,నిజాంబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత అక్కగారి జన్మదిన సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కను నాటిన జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ గారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సభ్యులందరికీ మొక్కలు సవాల్ విసిరారు.అందరూ భాగస్వాములై మొక్కలు నాటి కవితక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాట్లు

కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తి

విజయనగరం,పెన్ పవర్

 నగరపాలక సంస్థ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రేపు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్ ఎస్ ఎస్ వర్మ వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం నమూనా కౌంటింగ్ ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా కౌంటింగ్ సిబ్బందికి విధి విధానాలను విశదపరిచారు. మొదటిగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించాలని, ఆ తర్వాత రెండు విడతలుగా కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని చెప్పారు. బ్యాలెట్ బాక్స్ నుండి  ఓట్లు లెక్కించే విధానం తదితర అంశాలపై సోదాహరణగా వివరించారు. 

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రేపు ఉదయం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఏడు గంటలకు ప్రారంభమవుతుందని, ఆ సమయానికి ఎన్నికల సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులు రాజీవ్ క్రీడా మైదానానికి చేరుకోవాలని చెప్పారు. మొత్తం 25 కౌంటర్లు అమర్చామన్నారు. రెండు రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు చెప్పారు. 25 వార్డులకు తొలి కౌంటింగ్, మరో 25 వార్టులకు మలి కౌంటంగ్ చేపట్టేందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ఏ ఒక్కరూ లెక్కింపు కేంద్రానికి సెల్ఫోన్లు, వాటర్ బాటిల్స్, ఇతర ఏ వస్తువులు తీసుకుని రాకూడదని చెప్పారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ ప్రసాద్ రావు, తహసిల్దార్ ప్రభాకర్ రావు, రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

శారీరక,మానసిక దృఢత్వానికీ జ్ఞాన దీక్షలు ఉపయోగకరం

 శారీరక,మానసిక దృఢత్వానికీ జ్ఞాన దీక్షలు ఉపయోగకరం

పట్టణ ఎస్ఐ లింగంపల్లి భూమేష్

మందమర్రి,.పెన్ పవర్


మనిషి శారీరక,మానసిక దృఢత్వానికీ జ్ఞాన దీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయని మందమర్రి పట్టణ ఎస్ఐ లింగంపల్లి భూమేష్ పేర్కొన్నారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో స్వేరోస్, స్వేరో అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కాన్షీరాం జయంతిని పురస్కరించుకొని మార్చి 15న పెద్దపెల్లి జిల్లా దూళీకట్ట బౌద్ధారామం వద్ద  నిర్వహించు జ్ఞానం కోసం భీమ్ దీక్ష కార్యక్రమం వాల్ పోస్టర్ లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జ్ఞాన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ జ్ఞాన దీక్ష చేపట్టాలన్నారు. తెలంగాణ స్కూల్స్, పేరెంట్స్ అసోసియేషన్(టీఎస్పిఎ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి నరేష్ మాట్లాడుతూ, ఈ దీక్షా కార్యక్రమానికి తెలంగాణ ఎస్సీ,ఎస్టీ గురుకులాల కార్యదర్శి స్వేరోస్ నెట్వర్క్ ఫౌండర్, చైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(ఐపీఎస్, అడిషనల్ డిజిపి) హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలోనే స్వేరోస్,స్వేరో అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్పిఎ జిల్లా కార్యదర్శి తోకలు నిరోష,మండల అధ్యక్షులు పులిపాక శ్రీనివాస్, సభ్యులు దుర్గ భవాని, నాగమ్మ, వజ్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

కువేట్లో చికుక్కున్న బాధితులను ఆదుకున్న ఎం.పి,రామ్మోహన్ నాయుడు

 కువేట్లో చికుక్కున్న బాధితులను ఆదుకున్న ఎం.పి,రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం, పెన్ పవర్

శ్రీకాకుళం కు చెందిన బాబు రావు సారా, గుంటూ పూర్ణచందన్  రావు, లోకనందం భీమా రావు అనే ముగ్గురు యువకులతో పాటు, వైజాగ్ కు చెందిన నాగూర్ మీరా, మరియు మిగితా రాష్ట్రాలకు చెందిన మరో నలుగురు యువకులుమర్చంట్ నేవీ లో ఉపాధి కోసం కువైట్ కు వెళ్లి, ఆ దేశపు కోవిడ్ లొక్డౌన్ వల్ల దాదాపు 10 నెలల పాటు అక్కడే చిక్కుకుపోయారు. 2020 నవంబర్ నెల నించి కువైట్లోని భారత రాయిబారి కార్యాలయానికి దరకాస్తులు అందిస్తూ, ఫోన్లు చేస్తూ వున్నా, ఆశించిన ఫలితం దొరక్క, వారి జిల్లా అయిన శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు కి బాధితులు తమను ఆదుకోమని 2021 ఫిబ్రవరి లో ఇమెయిల్ పంపారు. ఎం.పి, ఆ ఇమెయిల్ కు వెంటనే స్పందించి, తిరిగి క్షేమంగా భారత దేశానికి రావడానికి బాధితులకు సహాయం చేయమని కోరుతూ విదేశీ వ్యవహారాల మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ కి వెంటనే లేఖ రాశారు. వారికి కువైట్ లో వున్న భారతీయ రాయబార కార్యాలయం సహాయం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆ లేఖను ట్విట్టర్ లో కూడా పెట్టారు.అంతటితో వదిలేయకుండా, ఎం.పి, ఈ యువకులతో వీడియో కాల్ లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. కువైట్ లో ఉన్న తెలుగు సంఘాల ఐక్య వేదిక ప్రతినిధి నరసింహ నాయుడుని సంప్రదించి, అక్కడ చిక్కుకున్న వారి యోగక్షేమాల కనుక్కోని వారికి కావలసిన సహాయ సహకారాలు అందించమని కోరారు. రామ్మోహన్ నాయుడు  కువైట్లోని భారత రాయిబారి కార్యాలయం అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదించడం వలన, సంభందిత అధికారులు వీరిని భారత దేశానికి పంపించే ప్రక్రియను వేగవంతం చేసారు. ఎం.పి, ని ఇమెయిల్ ద్వారా సంప్రదించి నెల రోజులు తిరక్కుండానే బాధితులు అందరు మార్చ్ 5వ తేదీన భారత దేశం చేరుకున్నారు. స్వదేశానికి చేరుకున్న వెంటనే బాధితులు మాట్లాడుతూ, స్వదేశానికి తిరిగి వస్తామున్న నమ్మకం అప్పుడు లేదని, ఎం.పి,చొరవ వలనే మేము క్షేమంగా మా స్వగ్రామాలకు చేరుకున్నామని, జీవితాంతం ఎం.పి, చేసిన సహాయం మరువమని కుటుంబ సభ్యులతో వొచ్చి ఎం.పి, కి కృతజ్ఞతలు తెలియజేశారు.

రామనవమి ఉత్సవ కమిటీ ఏర్పాటు

 రామనవమి ఉత్సవ కమిటీ ఏర్పాటు

కేషపట్నం , పెన్ పవర్

శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం ఎరడపల్లి  తాత్కాలిక కమిటీ(శ్రీ రామనవమి ఉత్సవ కమిటీ ) ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో కొంత మంది సభ్యులను కమిటీ గౌరవఅధ్యక్షులుగా ముఖ్యసలహాదారులుగా అధ్యక్షులు ఉపాధ్యక్షులుగా జనరల్ సెక్రటరీ గా నియమించడం జరిగింది గౌరవఅద్యక్షులుగా ముఖ్యసలహాదారులుగా కలకుంట్ల లక్షమన్ రావు, మొగురం శంకర్.పంజాల సురేష్ అధ్యక్షుడు రంగు  శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు కసివోజ్జుల రాజేష్ జనరల్ సెక్రెటరీ పంజాల శ్రీధర్, జాయింట్ సెక్రటరీ.ముత్యాల శ్రవణ్  ఆర్గనైజర్ సెక్రటరీ జంగిలి తిరుపతి   కాటం మహేందర్, క్యాషియర్ రంగు  ప్రదీప్ లను మరియు కార్యవర్గసభ్యులుగా భూస కుమార్, మేర్గు సత్తయ్య  యాదవ్, ధుడూరి రాములు,పోతునూరి రాజు, జినుక కుమార్, ఎనగందుల రాజేష్,  ఉప్పరి రాజ్ కుమార్, తాళ్లపెల్లి నారాయణ, నేదురు సాగర్, రెడ్డి శ్రీనివాస్,లను  ఎన్నుకోవడం  జరిగింది.అలాగే ఆలయ సభ్యత్వం కోసం వెయ్యి రూపాయల సభ్యత్వం నమోదు చేయడం జరిగింది. కావున గ్రామ ప్రజలకు  తెలియజేయునది ఏమనగా మీరు అందరు సభ్యులుగా చేరవలసినదిగా కోరుచున్నాము.ఆసక్తి ఉన్నవాళ్ళు  గుడి సభ్యత్వం నమోదు చేసుకోవాలని కోరారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి వేరొకరికి తీవ్రగాయం

 రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి వేరొకరికి తీవ్రగాయం

పెన్ పవర్,ఆలమూరు

     ఆలమూరు మండలం మూలస్థానం అగ్రహారం వద్ద జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలైనట్లు హైవే పెట్రోలింగ్, పోలీస్ పెట్రోలింగ్ అధికారులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం రావులపాలెం వైపు నుండి రాజమహేంద్రవరం వైపుకు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దర్నీ  అదే మార్గంలో వెళ్తున్న లారీ వెనుక నుండి ఢీ కొనడంతో అంబాజీపేట మండలం నందంపూడి గ్రామానికి చెందిన కందాల శ్రీనివాస్ (45) సంఘటనా స్థలంలోనే మృతిచెందగా అంబాజీపేట మండలం పోతాయిలంకకు చెందిన ముాలపర్తి సూర్య నారాయణమూర్తికి తీవ్ర గాయాలు అయినట్లు వారు తెలిపారు. విషయం తెలుసుకున్న ఆలమూరు ఏఎస్సై సూర్యచంద్రరావు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని తీవ్ర గాయాలైన సూర్యనారాయణ మూర్తిని హైవే అంబులెన్స్పై రాజమహేంద్రవరం తరలించారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా హైవే పెట్రోలింగ్, పోలీసులు పెట్రోలింగ్ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు ఆలమూరు ఏఎస్సై తెలిపారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...