భీమేశ్వరాలయంలో హైకోర్టు జడ్జి దంపతుల ప్రత్యేక పూజలు
సామర్లకోట,పెన్ పవర్పంచారామా క్షేత్రమైన సామర్లకోట శ్రీ కుమార రామ భీమేశ్వరాలయంలో శనివారం ఉదయం హైకోర్టు జడ్జి కె సురేష్ రెడ్డి దంపతులు ఆ ప్రత్యేక పూజలు చేపట్టారు. మహా శివరాత్రి పర్వదినాలను పురష్కరించుకుని పంచారామాల సందర్శనలో బాగంగా జడ్జి దంపతులు ఆలయానికి విచ్చేయగా వారికి ఆలయ మర్యాదల చొప్పున ఆలయ కార్యనిర్వహణాధికారి పులి నారాయణ మూర్తి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు ఉపాలయాల్లో దైవతా మూర్తులను దర్శించుకుని భీమేశ్వరుని మూల విరాట్ నందు, స్వామివారీ, అమ్మవారల గర్భాలయాల్లోనూ ప్రత్యేక పూజలను చేపట్టారు. అనంతరం జడ్జి దంపతులను ఆలయ నంది మండపంలో పండితాశీర్వచన కార్యక్రమాలను నిర్వహించి ఘనంగా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి సురేష్ రెడ్డి మాట్లాడుతూ మహా శివరాత్రి పర్వదినాలు సందర్భంగా వంచారామాలతో పాటు పిఠాపురం పాదగయను సందర్శించి సామర్లకోట భీమేశ్వరాలయానికి విచ్చేసినట్టు చెప్పారు. తదుపరి ద్రాక్షారామా దర్శించుకుని తిరిగి తమ గృహానికి బయలుదేరుతున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో వారి వెంట జిల్లాకు చెందిన పలువురు జడ్జిలు, ఆలయ అధికారులు, పోలీసు అధికారులు, పండితులు ఉన్నారు.








