Followers

స్వామివారి కృపతో అందరూ బాగుండాలి

 స్వామివారి కృపతో అందరూ బాగుండాలి

కూకట్ పల్లి, పెన్ పవర్

మల్లిఖార్జున స్వామీ, ఎల్లమ్మ తల్లీ ఆశీస్సులు అందరిపై ఉండాలని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కౌన్సిల్ ప్రెసిడెంట్, పట్టభద్రుల జేఏసీ రాష్ట్ర సలహాదారులు గొట్టిముక్కుల పాండురంగారావు. మంగళవారం కూకట్ పల్లి మల్లిఖార్జున స్వామీ, రేణుక ఎల్లమ్మ  తల్లీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమానికి పాండురంగారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామీ, అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈసందర్భంగా పాండురంగారావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంకా కరోన భయాలు పోలేదని, ప్రజలందరూ బిక్కుబిక్కుమంటూ భయపడుతు బ్రతుకుతున్నారని, స్వామీ అమ్మవారల ఆశీర్వాదాలతో కరోన వైరస్ పోవాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. ఈకార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఫారెస్ట్ అధికారుల ట్రెంచ్ పనులను అడ్డుకున్న జిల్లా పరిషత్ చైర్పర్సన్

 ఫారెస్ట్ అధికారుల ట్రెంచ్ పనులను అడ్డుకున్న జిల్లా పరిషత్ చైర్పర్సన్...


పెన్ పవర్,  బయ్యారం

ఫారెస్ట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లాపరిషత్ చైర్మెన్..ఫోడుభూములకు ట్రెంచ్ పనులు నిలిపివేయాలని చైర్మెన్ అంగోత్ బిందు అధికారులను నిలదీశారు..మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం రమచంద్రాపురం గ్రామపంచాయతీ పందిపడే గ్రామంలో గిరిజనులు సాగు చేస్తున్న పట్టా భూముల్లో ఫారెస్ట్ అధికారులు మంగళవారం ట్రెంచ్ కొట్టి సాగు చేస్తున్న భూములను లాక్కోవడంపై గిరిజనులు ఆందోళన చేసి మహబూబాబాద్‌ జిల్లాపరిషత్ చైర్ పర్సన్ కు, పిర్యాదు చేయడంతో.. అంగోత్ బిందు చైర్ పర్సన్, వెంటనే పందిపడే గ్రామంలో జరుగుతున్న ట్రెంచ్ పనుల పరిశీలనకై వెళ్లి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. బానోత్ రంగమ్మ..జాటోత్ పూలమ్మ.., కమలమ్మలకు.. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన పట్టా పాస్ పుస్తకాలు ఉన్నప్పటికీ.. సాగుచేయనీయకుండా భూముల్లో ట్రెంచ్ ఎలా కొడుతున్నారని అంగోత్ బిందు ఫారెస్ట్ అధికారులను నిలదీశారు.. తాము జిల్లా ఫారెస్ట్ అధికారుల ఆదేశానుసారము పనులు చేస్తున్నామని అటవీశాఖ అధిజారులు తెలుపడంతో..జిల్లాపరిషత్ చైర్ పర్సన్ బిందు ఆగ్రహంతో జిల్లా ఫారెస్ట్ అధికారికి ఫోన్ చేసి పట్టాలు ఉన్న భూముల్లో ట్రెంచ్ పనులు ఎలా చేస్తున్నారని వెంటనే పనులు నిలిపివేయాలని ఆగ్రహించడంతో..అటవీశాఖ అధికారులు అంగీకరించి ట్రెంచ్ పనులు నిలిపివేశారు.. ఈ సందర్బంగా మహబూబాబాద్‌ జిల్లాపరిషత్ చైర్ పర్సన్ అంగోత్ బిందు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చిన మేరకు 2005 కు పూర్వము పోడు చేసిన సాగు భూముల, ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూముల సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారని.. వారి హామీ మేరకు పోడు పట్టాల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఫారెస్ట్ అధికారులు ఎవ్వరు కూడా సాగు భూముల్లో ట్రెంచ్ పనులను చేపట్టవద్దని ఫారెస్ట్ అధికారులకు సూచించారు.., ఈ విషయమై జిల్లా మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ ద్వారా సీఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తామని, త్వరలో అందరూ ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్, జిల్లా ఫారెస్ట్ అధికారులతో జాయింట్ కమిటీ ఏర్పాటు చేసి పొడు సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని,, పందిపడే గ్రామ గిరిజన పొడు రైతులకు చైర్మెన్ హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో బయ్యారం పిఏసిఎస్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, రమచంద్రాపురం సర్పంచ్ పోలెబోయిన వెంకటేశ్వర్లు, బయ్యారం మండల ఫారెస్ట్ అధికారులు, గిరిజన రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

అమ్మవారి పండుగల వల్ల గ్రామాలు సుభిక్షం..

 అమ్మవారి పండుగల వల్ల గ్రామాలు సుభిక్షం..

వి.మాడుగుల,పెన్ పవర్

 అమ్మవారి పండగలు చేయడంవల్ల గ్రామం సుభిక్షంగా ఉంటుందని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు అన్నారు. మంగళవారం మాడుగుల మొదమాంబ కాలనీ వాసులు చేసిన మోదకొండమ్మ పండగలో  ఆయన అమ్మవారి ఘట్టాలను మోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రతి గ్రామంలో అమ్మవారు కొలువై ఉండటం ఆనవాయితీగా వస్తుందని  గ్రామస్తులు ప్రతియేటా అమ్మవారికి  తీర్థ మహోత్సవాలు  పండగలు జాతరలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు బంధువులు స్నేహితులు ఇతరులను ఆహ్వానించడం వల్ల పల్లెల్లో సమైక్యతా భావం పెరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం సాహసోపేత పథకాలు అమలు చేస్తున్నారు. పేద ప్రజల వైద్యం కోసం  సీఎం సంక్షేమ నిధి నుంచి చెక్కుల ను అందజేయడం జరుగుతుందన్నారు. మాడుగుల కు చెందిన నలుగురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను ఆంద చేశారు. మొదమాంబ కాలనీలో  డ్రైనేజీ లను పరిశీలించారు. గ్రామంలో సిమెంట్ రోడ్ల నిర్మాణం జోరుగా సాగుతుందని   వాటిని నెలాఖరులోగా పూర్తి చేయాలని అన్నారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను కూడా మార్పులు చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రేణుక ఎల్లమ్మ కళ్యాణానికి రమ్మని మంత్రి కెటిఆర్ ను ఆహ్వానించి న నాయకులు

 రేణుక ఎల్లమ్మ కళ్యాణానికి రమ్మని మంత్రి కెటిఆర్ ను ఆహ్వానించి న నాయకులు


రాజన్న సిరిసిల్ల , పెన్ పవర్ 

 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో బొప్పాపూర్  గ్రామంలో ఈ నెల 24 న  నిర్వహించ తలపెట్టిన శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి రమ్మని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ను బొప్పాపూర్ గౌడ సంఘం ప్రతినిధులు మండల ప్రజా ప్రతినిధులు మంగళవారం ఆహ్వాన పత్రిక ను అందజేసి ఆహ్వానించారు .హైదరాబాద్   ఆసెంబ్లీ హాల్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా టిఆర్ఎస్ పార్టీ అదికార ప్రతినిధి తోట ఆగయ్య ఆద్వర్యంలో మంగళవారం వెళ్ళి   రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ను కలిశారు.  కలిసిన వారిలో ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ చీటీ లక్ష్మన్ రావు. రాచర్ల బొప్పాపూర్ మార్కేట్ కమీటి అద్యక్షులు కొండ రమేష్ గౌడ్ మాజీ జడ్పీటీసీ వడ్నాల నర్సయ్య .టిఆర్ఎస్ పార్టీ మండల అద్యక్షులు వరస కృష్ణహారి.  సర్పంచ్ ల పోరం మండల అద్యక్షులు కొండాపురం బాల్ రెడ్డి. గౌడ సంఘం ప్రతినిధి  చిదుగు గోవర్దన్ గౌడ్.  టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇల్లందుల శ్రీ నివాస్ రెడ్డి .నంది కిషన్ తదితరులు ఉన్నారు.  రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి రావడానికి మంత్రి కెటిఆర్. సానుకూలంగా స్పందించినట్టు కొండ రమేష్  గౌడ్  తెలిపారు.  బొప్పాపూర్ మార్కేట్ కమీటీ కీ నిధులు కేటాయించాలనీ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ కు రాచర్ల బొప్పాపూర్ మార్కేట్ కమీటీ చైర్మన్ కొండ రమేశ్ గౌడ్ వినతిపత్రాన్ని ఇచ్చి విజ్ఞప్తి చేయగా  ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నీ పురాతన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ నిర్మాణానికి నిధులు ఇప్పించాలనీ టిఆర్ఎస్ పార్టీ జిల్లా అదికార ప్రతినిధి తోట ఆగయ్య మాజీ జడ్పీటీసీ వడ్నాల నర్సయ్య.ఆలయ కమీటీ  చైర్మన్ నంది కిషన్ మంత్రి కెటిఆర్ కు వినతిపత్రాన్ని ఇచ్చి కోరారు.

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి

 వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి

మహారాణి పేట, పెన్ పవర్

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను మంగళవారం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాలలు వేసి  ఘనంగా నివాళులర్పించి,అల్లిపురం గాంధీ బొమ్మ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి, ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములని అన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఎంతగానో కృషి చేసారన్నారు. మహాత్మా గాంధీ భోదించిన సత్యం,అహింసా,హరిజనోద్ధరణకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు విఠల్ కుమార్,జనరల్ సెక్రటేరి డి.వి.యస్.యన్ రాజు,వైస్ ప్రెసిడెంట్ ఎస్. సుబ్రహ్మణ్యం,చైర్మన్ డి.వి.సత్యానంద్ గుప్త,వారిగల పండు తదితరులు పాల్గొన్నారు.

పొట్టి శ్రీరాములు కి పూలమాలలు వేసి నివాళులర్పించిన కార్పోరేటర్ గంటా అప్పలకొండ

 పొట్టి శ్రీరాములు కి పూలమాలలు వేసి నివాళులర్పించిన  కార్పోరేటర్ గంటా అప్పలకొండ

భీమిలి, పెన్ పవర్

అమరజీవి పొట్టి శ్రీరాములు 120వ జయంతిని పురస్కరించుకుని  భీమిలి బీచ్ లో ఉన్న పొట్టి శ్రీరాములు నిలువెత్తు విగ్రహానికి  జి.వి.ఎమ్.సి.3వ వార్డు కార్పోరేటర్ గంటా అప్పలకొండ,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భీమిలి డివిజన్ అధ్యక్షులు గంటా నూకరాజు సంయుక్తంగా పూలమాలలు వేసి నివాళులర్పించడమైనది. ఈ  సందర్భంగా 3వ వార్డు కార్పోరేటర్ గంటా అప్పలకొండ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధనకోసం,తెలుగువారికందరికీ ఒక రాష్ట్రం ఉండాలని 28 రోజులు నిర్విరామంగా ఆమరణ నిరాహారదీక్ష చేసి  ప్రాణాలర్పించిన మహానుభావుడు పొట్టి శ్రీరాములని అన్నారు. నేడు తెలుగు వారికి ఒక రాష్ట్రం ఏర్పడుటకు గాని, దేశంలో తెలుగు వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందంటే ఆనాడు మహానుభావులు  పొట్టి శ్రీరాములు నాటిన బీజమని అన్నారు.ఇలాంటి మహోన్నతమైన వ్యక్తి తెలుగువారిగా పుట్టడం, ఆయన జన్మించిన ఈనేలపై మనం జీవించడం మన అదృష్టమని గంటా అప్పలకొండ అన్నారు.తెలుగుదేశం పార్టీ  రాష్ట్ర కార్యదర్శి, భీమిలి డివిజన్ అధ్యక్షులు గంటా నూకరాజు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు1901 మార్చి'  16వ తేదీన మద్రాసులో  గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారని అన్నారు.అప్పటికి తెలుగువారు చెల్లాచెదురుగా ఇతర రాష్ట్రాల్లో ఉండటం,దేశంలో హిందీ భాష తరువాత ఎక్కువగా తెలుగు మాట్లాడేవారు ఉండటం వలన తెలుగువారికి ఒక ప్రత్యేకమైన రాష్ట్రము ఉండాలని కంకణం కట్టుకొని అలుపెరగని పోరాట యోధుడిలా నిర్విరామంగా 28రోజులు  కఠోరమైన ఆమరణ నిరాహారదీక్ష చేశారని అన్నారు.  అలాంటి మహానుబావులు ఈనేలమీద పూట్టారు కాబట్టి  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని అన్నారు. ఈ  కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మారోజు సత్యవరప్రసాద్, కాసరపు నాగరాజు, మారోజు సంజీవకుమార్,కనకల అప్పలనాయుడు, కాసరపు ఎల్లాజి, కొక్కిరి అప్పన్న,అప్పికొండ నూకరాజు, కంచెర్ల కామేష్, దాసరి వెంకటేష్,గండిబోయిన పోలిరాజు,  రాజగిరి రమణ,సత్తరపు చిన్న,కందుల సుందర్ రావు,  సత్తరపు శివ, వాడపల్లి వంశీ,చింతపల్లి నూకరాజు,  చింతపల్లి శ్రీను, బొడ్డు రమేష్, వియ్యపు పోతురాజు, అల్లిపిల్లి సతీష్, తెడ్డు రామదాసు  తదితరులు పాల్గొన్నారు.

గెలిచిన వార్డు మెంబర్లను అభినందించిన టిడిపి నాయకులు

 గెలిచిన వార్డు మెంబర్లను అభినందించిన టిడిపి నాయకులు]

పరవాడ,పెన్ పవర్

ఆదివారం వెలువడిన కార్పొరేటర్ ఎన్నికల ఫలితాల్లో టిడిపి నుంచి పోటీచేసి విజయం సాధించిన వార్డు మెంబర్లు రౌతు శ్రీను,మాదంశెట్టి చిన్నతల్లి(వైఫ్ ఆఫ్ నీలబాబు)లను స్థానిక తెలుగుదేశం నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పయిల జగన్నాధరావు,టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి అట్టా సన్యాసి అప్పారావు,ఈ బోనంగి సర్పంచు బొద్ధపు శ్రీనివాసరావు స్థానిక నాయకులు వున్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...